బ్యాలెట్‌ యూనిట్ల ర్యాండమైజేషన్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ యూనిట్ల ర్యాండమైజేషన్‌ పూర్తి

Published Sat, May 4 2024 1:00 AM

బ్యాలెట్‌ యూనిట్ల ర్యాండమైజేషన్‌ పూర్తి

గద్వాల రూరల్‌: గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాలకు సంబందించిన అదనపు బ్యాలెట్‌ యూనిట్ల సప్లమెంటరీ ర్యాండమైజేషన్‌ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సంతోష్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్‌ యూనిట్ల సప్లమెంటరీ ర్యాండమైజేషన్‌ నిర్వహించడం జరిగిందని అన్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 20 మంది ఉన్నందున అదనంగా 888 బ్యాలెట్‌ యూనిట్ల అవసరం మేరకు సప్లమెంటరీ ర్యాండమోజషన్‌ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని 378 బ్యాలెట్‌ యూనిట్లు, కేటాయించినట్లు మిగిలిన బ్యాలెట్‌ యూనిట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆధీనంలో రిజర్వ్‌ చేయడం జరి గిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముసి ని వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రాంచందర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement