ఆదివారం రాహుల్‌ గాంధీ.. | Sakshi
Sakshi News home page

ఆదివారం రాహుల్‌ గాంధీ..

Published Sat, May 4 2024 1:00 AM

-

నాగర్‌కర్నూల్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లురవి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఎరవ్రల్లి చౌరస్తాలో సాయంత్రం జరిగే బహిరంగసభలో పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. రాహుల్‌ గాంధీ ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లాకు రావడం ఇది ఐదోసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కోస్గిలో రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభతో పాటు మహబూబ్‌నగర్‌, గద్వాల, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు.

Advertisement
Advertisement