బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి | Sakshi
Sakshi News home page

బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి

Published Sat, May 4 2024 5:10 AM

బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి

భూపాలపల్లి రూరల్‌: ప్రభుత్వ రంగ సంస్థలను ని ర్వీర్యం చేస్తున్న మోదీ పాలనకు పార్లమెంట్‌ ఎన్నికల్లో చరమగీతం పాడి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కొరిమిరాజ్‌ కుమార్‌ అధ్యక్షతన వరంగల్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య గెలుపును కోరుతూ నిర్వహించిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమవేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావుతో కలిసి సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ద్వంసంచేస్తూ, అదానీ, అంబానికి కొమ్ముకాస్తున్న మోదీ మరోసారి అధికా రంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మారుస్తాడని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న పేదలు వేసుకున్న గుడిసెలకు ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. కడియం కావ్యను గెలిపించాలని కోరారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ.. మోదీ నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని దక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ వారికి ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌ రెడ్డి, నాయకులు రమేష్‌, సుగుణ, రమేష్‌, విజయసారథి, నమ్మరెడ్డి, ప్రవీణ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement
Advertisement