ఏలూరు (మెట్రో): పోలింగ్ రోజు, పోలింగ్కు ముందు రోజు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ సూచించారు. అనుమతులు లేకుండా ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించరాదన్నారు. ఎన్నికల సందర్భంగా ఆవేశపూరితమైన, తప్పుదోవ పట్టించే లేదా ద్వేషపూరిత ప్రకటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వార్తాపత్రికలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రకటనల విషయంలో ఎలక్షన్ కమిషన్కు సహకరించాలని కోరారు.