వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు

Published Sat, May 4 2024 5:25 AM

వైఎస్

గంగవరం : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు భారీగా వైఎస్సార్‌సీపీలో చేరారు. అందులో భాగంగా శుక్రవారం గంగవరం మండలం గండ్రాజుపల్లె పంచాయతీ మార్లపల్లెలో ముస్లిం మైనారిటీకి చెందిన 6 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఎమ్మెల్యే వెంకటేగౌడ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జహంగీర్‌, దస్తగిరి, ఉజీవుల్లా, హస్సాన్‌, ఎగ్బాల్‌, ముబారక్‌ తదితరులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ముస్లిం మైనారిటీలకు న్యాయం జరిగిందని, చంద్రబాబు ఏనాడూ ముస్లింలను పట్టించుకోలేదని తెలిపారు. అందుకే టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు వెల్లడించారు.

కుప్పంలో..

కుప్పం : శాంతిపురం మండలం కొలమడుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో ముని వెంకటప్ప , సుబ్రమణ్యం, బాలాజీ ఉన్నారు. కార్యక్రమంలో వాల్మీక కార్పోరేషన్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మునిరత్నంగౌడ, శ్రీరాములు, మణి పాల్గొన్నారు.

రొంపిచెర్లలో..

రొంపిచెర్ల: మండలంలోని బోడిపాటివారిపల్లె పంచాయతీ కేఎన్‌ దళితవాడకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పుంగనూరు టీడీపీ నేత చల్లా సుప్రియా రెడ్డి బలవంతంగా గురువారం టీడీపీ కండువాలు వేశారు. అయితే మాకు టీడీపీ కండువాలు వేసుకోవడం ఇష్టం లేదంటే సదరు నేతలు గిరి, శేఖర్‌, చంటి, కవిత, సుకన్య, రాజు, ప్రసాద్‌, నిర్మల తెలిపారు. ఈమేరకు శుక్రవారం మళ్లీ జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రకాష్‌ రెడ్డి, చిరంజీవి, ద్వారకనాథరెడ్డి, మునస్వామి నాయుడు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు
1/1

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement