నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ

Published Fri, May 3 2024 3:32 PM

Stock Market nifty on today closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 191 పాయింట్లు నష్టపోయి 22,456 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 732 పాయింట్లు దిగజారి 73,878 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, భారతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement