ప్రధాని బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు | Sakshi
Sakshi News home page

ప్రధాని బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు

Published Sat, May 4 2024 9:35 AM

ప్రధాని బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు

కలికిరి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 8న కలికిరికి రానున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్‌ డీఐజీ సీహెచ్‌ విజయరావు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావుతో కలిసి శుక్రవారం కలికిరిలో పర్యటించారు. ప్రధానమంత్రి పర్యటనకు ఎంపిక చేసిన హెలిప్యాడ్‌, అక్కడి నుంచి సభాస్థలం వరకు రోడ్డు మార్గం, బహిరంగ స్థలం ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, బందోబస్తుకు హాజరయ్యే సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. హెలిప్యాడ్‌, సభా స్థలం ఎక్కడా కూడా అనధికారికంగా డ్రోన్‌లు ఎగురవేయకూడదన్నారు. అలాగే ప్రధానమంత్రి హెలిప్యాడ్‌, రోడ్డుమార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు తగినన్ని మందులు అందుబాటులో ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్‌, డీఎస్పీ మహబూబ్‌ బాషా, సీఐలు, ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement