ఫార్మాసిటీలో ఐదుగురు కార్మికులకు అస్వస్థత | Sakshi
Sakshi News home page

ఫార్మాసిటీలో ఐదుగురు కార్మికులకు అస్వస్థత

Published Sat, May 4 2024 10:10 AM

-

పరవాడ : స్థానిక ఫార్మాసిటీలోని అజినోమోటొ పరిశ్రమలో గురువారం విష వాయువుల లీకై న ఘటనలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా బాధిత కార్మికులను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. శుక్రవారం ఉదయం పరవాడ పోలీసులకు సమాచారం అందడంతో ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన కార్మికుల వివరాలను సేకరించారు.

ఈ విషయాన్ని పరవాడ సీఐ ఎస్‌.బాలసూర్యారావు వద్ద ప్రస్తావించగా.. పరిశ్రమలో విషవాయువులు ఏ విధంగా బయటకు వచ్చాయన్న విషయంపై వివరాలు సేకరిస్తున్నామని, అస్వస్థతకు గురైన కార్మికులు సుధాకర్‌, సతీష్‌, వర్మ, రామునాయుడు, ఎస్‌.సాయిల పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. బాధిత కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

Advertisement
 
Advertisement