బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, May 4 2024 9:50 AM

-

విశాఖ విద్య: జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ గొండు సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్ల లోపు వయసు గల బాలలు ఈ పురస్కారాలకు అర్హులని పేర్కొన్నారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం తదితర అంశాల్లో ప్రతిభావంతులకు ఇదో అరుదైన అవకాశమని తెలియజేశారు. 2025 జనవరిలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవచ్చన్నారు. అర్హత, ఆసక్తి గల బాలలు జూలై 31 లోపు http:/awards.gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement