వసతులు కల్పించాలని కలెక్టర్‌కు వినతి | Sakshi
Sakshi News home page

వసతులు కల్పించాలని కలెక్టర్‌కు వినతి

Published Sat, May 4 2024 10:15 AM

వసతులు కల్పించాలని కలెక్టర్‌కు వినతి

కై లాస్‌నగర్‌: పార్లమెంట్‌ ఎన్నికల విధులు ని ర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా తగు వసతులు కల్పించాల ని రాష్ట్ర గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫ ర్‌ హుస్సేన్‌, సూర్యకాంత్‌లు శుక్రవారం కలెక్టర్‌ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున మే 13న ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నా రు. డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల్లో కూల ర్లు, చల్లని తాగునీరు, ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement