-
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
మభ్యపెట్టి సైకిల్, కమలానికి ఓట్లేశారు
ద్వారకాతిరుమల : నల్లజర్ల మండలం సుభద్రపాలెం, తెలికిచర్లలో సోమవారం జరిగిన పోలింగ్లో ఇద్దరు ఉద్యోగులు ఓటర్లు వేయమన్న సింబల్కు కాకుండా సైకిల్, కమలంపై ఓట్లు వేసి తమ ప్రేమను చాటారు. ఆ ఇద్దరు ఉద్యోగుల్లో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ ఉన్నారు. స్థానికుల కథనం ప్రకారం.. బిరుదుగడ్డ నందెమ్మ అనే దివ్యాంగురాలు సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు వెళ్లింది.అక్కడ ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ లక్ష్మి సహాయం కోరింది. అయితే ఆ టీచర్ నందెమ్మ చెప్పిన గుర్తుకు కాకుండా కమలం, సైకిల్కు ఓటు వేసింది. దీన్ని గుర్తించిన బాధిత నందెమ్మ ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని అధికారులకు, బయట ఉన్న స్థానికులకు తెలిపింది. దీంతో అసలు విషయం బయటపడటంతో అధికారులు ఆమెను బయట కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే సదరు అంగన్వాడీ టీచర్ భర్త టీడీపీలో కీలక పదవిలో ఉన్నాడని, ఆమె కుమార్తెను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకరరావు బంధువుకిచ్చి వివాహం చేసినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీపై ఆమెకున్న ప్రేమను ఇలా ఓట్లు వేసి చూపిందని అంటున్నారు.అదే విధంగా తెలికిచెర్లలోని 166 వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు అక్కడ పీఓగా విధులు నిర్వర్తిస్తున్న జానకి సహాయాన్ని కోరారు. అయితే వారు చెప్పిన సింబల్స్కు కాకుండా సైకిల్, కమలం గుర్తులకు ఆమె ఓట్లు వేయడాన్ని ఆ బూత్ ఏజెంట్లు, బాదిత ఓటర్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో జానకి స్ధానంలో సెక్టోరియల్ అధికారిగా వై.సత్యనారాయణను నియమించారు. అలాగే పీఓ జానకిని పోలీసుల సెక్యూరిటితో ఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళారు. పీఓ జానకి ఉదయం నుంచి ఇదేవిధంగా ఓట్లు వేసిందని అక్కడివారు చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులు వీరిపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. -
సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వేశారు
-
ఉత్సాహంతో ఓటేశాం.. మీరూ కదలండి (ఫొటోలు)
-
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
-
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ అర్హులు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు కోరుతున్నారు. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.సార్వత్రిక ఎన్నికలు ఫేజ్ 4మొత్తం లోక్సభ సీట్లు: 96రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు: 10పోటీలోని మొత్తం: 1,717మొత్తం పోలింగ్ స్టేషన్లు: 1,81,196పోటీలో ఉన్న మహిళలు: 170గ్రాడ్యుయేట్లు: 1,010కోటీశ్వరులు: 476అభ్యర్థులపై ఉన్న కేసుల సంఖ్య: 360 -
మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)
-
సెలబ్రిటీల ఓటు ఇక్కడే..
బంజారాహిల్స్: పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో చాలామంది ప్రముఖులు ఓటు వేయనుండగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా మరికొంతమంది తారలు ఓటు వేయనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు వేసి తమ బాధ్యతను చాటిచెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రజలపై సినీతారల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఎన్నికల్లో ఓటర్లు కూడా భారీగా తరలివచ్చి తాము సైతం అంటూ ఓటు వేశారు. సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సైతం అటు సినీ ప్రముఖులు, ఇటు ఓటర్లు అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. 👉 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా బంజారాహిల్స్లోని నందినగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 జూనియర్ ఎన్టీఆర్ బంజారాహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో, కల్యాణ్రామ్ ఎమ్మార్వో ఆఫీసు పోలింగ్ బూత్లలో ఓటు వేస్తారు. 👉 సినీ ప్రముఖుల్లో చిరంజీవి, సురేఖ, రామ్చరణ్, ఉపాసన, నితిన్లు జూబ్లీహిల్స్ క్లబ్ బూత్ నెంబర్–149లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 హీరో రవితేజ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, సెంట్రల్ నర్సరీ బూత్ నెంబర్ 157లో, అక్కినేని నాగార్జున, అమల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో, మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేస్తారు. 👉 విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బ్రహ్మజీ, జీవిత, రాజశేఖర్లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో మోహన్బాబు, మంచు విష్ణు, రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, విశ్వక్సేన్, రాణా, సురేష్బాబు ఓటు వేస్తారు. 👉 అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్లు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–69 బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఓటేస్తారు. 👉 హీరో వెంకటే‹Ù, బ్రహా్మనందం మణికొండ హైస్కూల్లో, రాజమౌళి, రమ షేక్పేట ఇంటర్నేషనల్ హైస్కూల్లో, సుధీర్ బాబు దర్గా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, అల్లరి నరేష్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లోని మహిళా ఆర్థిక సహకార సంస్థలో, తనికెళ్ల భరణి యూసుఫ్గూడ చెక్పోస్టు హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాలులో ఓటు వేస్తారు. -
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
ఓటరా..! ఓటు వేయడం మీ బాధ్యత! అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రజలను చైతన్యపరుస్తుంది. పైగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే యత్నం కూడా చేస్తోంది.. అంతేగాక టీవీ, సామాజిక మాధ్యమాలతో సహా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే "దేవుడు హుండీలో డబ్బులు వేయడం కాదు! దేశం కోసం ఓటు వేయడం నేర్చుకో!, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం వంటి మాటలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంతలా చేసినా చాలా వరకు ముఖ్యంగా విద్యావంతులే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది కూడా. అయితే ఇలా ఓటు హక్కుని వినియోగించకపోతే కొన్ని దేశాల్లో అధికారులు అస్సలు ఊరుకోరట. చాలా దారుణమైన శిక్షలు విధిస్తారట. అవేంటో తెలుసుకుందామా.!బెల్జియంఇక్కడ వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఆస్ట్రేలియాఇక్కడ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.సింగపూర్ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఆ వ్యక్తుల ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుందిగ్రీస్ఇక్కడ ఏకంగా ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది..(చదవండి: పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!) -
ఓటు ఎలా వేయాలి ?..ట్రైనింగ్ వీడియో మీకోసం
-
AP Elections 2024 Polling: పులివెందులకు సీఎం జగన్
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి స్వస్థలం పులివెందులకు చేరుకుంటారు. రేపు.. సోమవారం ఉదయం పులివెందుల భాకరాపురంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్ 90,543ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.క్లిక్ చేయండి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 -
ఇంటింటి అభివృద్ధి కొనసాగిద్దాం..
ఈ మంచిని కొనసాగిద్దాం..మీ బిడ్డ ఐదేళ్ల పాలనలో కేలండర్ ఇచ్చి మరీ ఏ నెలలో ఏ పథకాన్ని అందిస్తామో మీకు ముందుగానే చెప్పాడు. రైతుభరోసా, అమ్మఒడి, చేయూత.. ఇలా ఫలానా పథకాన్ని ఫలానా నెలలో ఇస్తామని చెప్పి ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లలో మీ అందరికీ మేలు చేశాడు. ప్రతి ఇంటికి మంచి చేశాడు.మన ఇంటికి జరుగుతున్న ఈ మంచిని పొరపాటున చంద్రబాబు ప్రలోభాలతో మోసపోయి పోగొట్టుకోవద్దని ప్రతి ఒక్కరికీ విన్నవించుకుంటున్నా. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో మీరంతా చూశారు – సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: మీ జగన్కు మీరు వేసే ఓటు.. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు విన్నవించారు. మీ అందరికీ మంచి చేస్తూ, సంతోషాలను పంచుతూ 130 సార్లు బటన్లు నొక్కి రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా నేరుగా మీ చేతికే అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గత ఐదేళ్లుగా చేసినమంచిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. నిర్ణయాత్మక ఎన్నికలివి..మరో 36గంటల్లో ఎన్నికల సమరం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలివి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. ఆయన్ను నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకి అర్థం ఇదే. గత 59 నెలలుగా మీ బిడ్డ ఎప్పుడూ చూడని విధంగా పాలనలో మార్పులు తెచ్చాడు. 130సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశాడు. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కి మంచి చేసిన ప్రభుత్వాలు ఉన్నాయా? 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా? రాష్ట్రంలో గతంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా ఇచ్చాడు.నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే 1.35 లక్షల మంది మన సచివాలయాల్లోనే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి విశ్వసనీయతను చాటుకున్నాం. గడప గడపకూ మన మేనిఫెస్టోను పంపించి మీరే టిక్ పెట్టాలని అక్కచెల్లెమ్మలను కోరాం. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను మచ్చుకు కొన్ని గడగడా చెబుతా.విద్యా విప్లవాలు..నాడు–నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లతో పాటు సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి, ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజుల చెల్లింపు, అంతర్జాతీయ యూనివర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు, తప్పనిసరి ఇంటర్న్షిప్ లాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అక్కచెల్లెమ్మలకు అండగా..అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వారి పేరిటే 31లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, రేషన్, పథకాలు, రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, నష్టపోతే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు లాంటి విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను గతంలో ఎప్పుడైనా చూశారా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా? వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. కోలుకునే సమయంలో ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, టెస్టులు చేసి మందులు కూడా ఇచ్చేలా ఆరోగ్య సురక్ష తెచ్చాం. ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాలను గతంలో చూశారా?గ్రామ స్వరాజ్యం..ఏ గ్రామాన్ని చూసినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయాలు, ప్రతి 60 – 70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వలంటీర్లు, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం మహిళా పోలీసులు, ఆపదలో ఆదుకునే దిశ యాప్ లాంటివి మీ బిడ్డ పాలనలో సాకారం చేశాడు. మళ్లీ ఇంటికే అన్నీ రావాలంటే..పేదల తలరాతలు మారాలంటే ఫ్యాను గుర్తుకే ఓటేయాలి. వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్లీ నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆసుపత్రులు మెరుగుపడాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి.చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి.2014 బాబు విఫల హామీలు» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి ఇచ్చాడా?» ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ లెక్కన ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? » అర్హులందరికీ 3సెంట్లు స్థలం, పక్కా ఇళ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ హామీ అమలైందా?» ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా?» సింగపూర్ని మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురంలో ఎవరికై నా కనిపిస్తున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. »అదే ముగ్గురు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ నమ్మబలుకుతున్నారు.దీవించండి..నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.కొల్లేరు మిగులు భూముల పంపిణీ..!కొల్లేరు సమస్య పరిష్కారం కావాలంటే మళ్లీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను ఇచ్చిన మాట ప్రకారం జయమంగళ వెంకటరమణ అన్నను ఎమ్మెల్సీగా చేశా. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైంది. రిపోర్టు కూడా సిద్ధమైన వెంటనే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తాం. మీ బిడ్డే మీ దగ్గరకు వచ్చి ఆ పంపిణీ కార్యక్రమం చేస్తాడు. -
Telangana: ఓటేద్దాం.. రండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్థారణైతే చాలని, ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును గుర్తింపునకు ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. ఓటరు గుర్తింపు నిర్థారణకు ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.ఎపిక్లో లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి..ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.ప్రవాస భారత ఓటర్లు తమ పాస్పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు.. ఓటరు గుర్తింపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో.. ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది.» ఆధార్ కార్డు» ఉపాధి హామీ జాబ్కార్డు, బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్,» కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు» రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రర్ (ఎన్పీఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు » భారతీయ పాస్పోర్టు» ఫొటో గల పెన్షన్ పత్రాలు » కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు»ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు» కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)చాలెంజ్ ఓటు అంటే?ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్థారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్థారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్థారణ అయితే సదురు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.ఓటర్ హెల్ప్ లైన్ యాప్తో ఎన్నో సదుపాయాలు..ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్లకు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు.పోలింగ్ సమయం ముగిసినా లైన్లో ఉంటే ఓటేయవచ్చురాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. పోలింగ్ కేంద్రంలో సెల్ఫోన్లపై నిషేధం!పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోన్లు, వైర్ లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదు. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లవచ్చు. అయితే వాటిని సైలెంట్ మోడ్లో ఉంచాల్సిందే.మీ ఓటును వేరే వాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు! ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవాళ్లు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెíషీన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని 5వ కాలమ్లో ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటేయదల్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటెవరికి వేశారో బయటికి కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు.జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?» ఎన్నికల సంఘం వెబ్సైట్https://electoralsearch.eci. gov. in కి లాగిన్ కావాలి. » మీ వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)/ మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులు వు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేసేందుకు వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయస్సు ఇతర వివరాలను కీ వర్డ్స్గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు.» ఓటర్ హెల్ప్ లైన్ 1950కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.(మీ ఏరియా ఎస్టీడీ కోడ్ ముందు యాడ్ చేయాలి). » 1950 నంబర్కి మీ ఎపిక్ నంబర్ను ఎస్ఎంఎస్ చేసి తెలుసు కోవచ్చు. (ఎస్ఎంఎస్ ఫార్మాట్: ‘ఉఇఐ ఎపిక్ నంబర్’. ఈసీఐ, ఎపిక్ నంబర్ మధ్య స్పేస్ ఉండాలి).పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో..ఎలా తెలుసుకోవాలి?రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేసింది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్ బూత్ నుంచి గెంటివేతేపోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు..అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్(ఏఎస్డీ) ఓటర్ల జాబితాను రూపొందించి సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకుంటే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాల్సి ఉంటుంది. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్థారించుకుంటారు. అనంతరం ఈ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర సైతం తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ సైతం తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో సైతం తీసుకుంటారు. అనంతరం ఆ వ్యక్తికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న వేతనంతో కూడిన సెలవుసెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలకు ఈసీ ఆదేశంరాష్ట్రంలోని 17లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 13న పోలింగ్ జరగనుండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్–1974 కింద ఫ్యాక్టరీలు, షాపులు, ఇండస్ట్రియల్ అండర్ టేకింగ్స్, ఎస్లాబ్లిష్మెంట్స్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ మార్చి 22న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్రాజ్ శనివారం మీడియాకు వెల్లడించారు. -
Lok Sabha Election 2024: పెరిగేదే లే!
ఓటెయ్యండి బాబూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండమ్మా.. ఓటు విలువ తెలుసుకో యువతా అంటూ ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు చెవిలో ‘ఈవీఎం’ కట్టుకుని పోరుతున్నా ఓటర్లలో మాత్రం ఉత్సాహం పెద్దగా కనిపించడం లేదు! ఇప్పటిదాకా జరిగిన మూడు విడతల పోలింగ్లో ఓటింగ్ మందకొడిగానే నమోదైంది. 2019తో పోలిస్తే తగ్గింది కూడా. సుదీర్ఘ షెడ్యూల్, మండుటెండలతో పాటు పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణాలుగా కని్పస్తున్నాయి. తక్కువ ఓటింగ్ మన దేశంలో కొత్తేమీ కాదు. ఈ పరిణామంతో అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి నష్టం, ఎవరికి లాభమన్న చర్చ ఊపందుకుంది...ఈసారి సుదీర్ఘ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో మూడు అంకాలు ముగిశాయి. మే 7న మూడో విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ స్థానాల్లో 2019లో నమోదైన 67.33 శాతంతో పోలిస్తే 1.65 శాతం తగ్గినట్లు ఈసీ డేటా చెబుతోంది. తొలి రెండు విడతల్లోనూ ఇదే తంతు. 102 లోక్సభ స్థానాల్లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం ఓట్లు పడ్డాయి. 2019లో ఈ స్థానాల్లో 69.4 శాతం ఓటింగ్ నమోదైంది. 88 సీట్లకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్లో 66.71 శాతం ఓటింగే నమోదైంది. 2019లో ఆ స్థానాల్లో వీటికి 69.2 శాతం ఓటింగ్ జరిగింది. మరో నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో మే 13న జరిగే నాలుగో దశలో అత్యధికంగా 96 సీట్లున్నాయి. చివరి మూడింట్లో పోలింగ్ జరగాల్సిన స్థానాలు 164 మాత్రమే. 2019లో రికార్డు ఓటింగ్... 2019లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటిదాకా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రికార్డు. 1951–52 తొలి లోక్సభ ఎన్నికల్లో నమోదైన 45.67 శాతం ఓటింగ్తో పోలిస్తే ఓటర్లలో చైతన్యం పెరుగుతూ వస్తోందనే చెప్పాలి. అయినా ఇప్పటికీ కనీసం 70 శాతాన్ని కూడా చేరకపోవడం మాత్రం ఆందోళనకరమే. రికార్డు పోలింగ్ నమోదైన గత ఎన్నికలనే తీసుకుంటే జనాభా భారీగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఓటింగ్ నమోదవడం గమనార్హం. బిహార్ (57.33%), ఉత్తరప్రదేశ్ (59.21), ఢిల్లీ (60.6%), మహారాష్ట్ర (61.02), ఉత్తరాఖండ్ (61.88%), తెలంగాణ (62.77%), గుజరాత్ (64.51%), పంజాబ్ (65.94%), రాజస్థాన్ (66.34%), జమ్మూ కశీ్మర్ (44.97%), జార్ఖండ్ (66.8%) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. 2014లో 66.44 శాతం ఓటింగ్ నమోదైంది. 2009లో నమోదైన 58.21 శాతంతో పోలిస్తే ఏకంగా 8.23 శాతం పెరిగింది! మన దేశంలో ఓటింగ్ ఒకేసారి అంతలా ఎగబాకడం కూడా రికార్డే.ఎందుకు తగ్గుతోంది...! ఈ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికైతే ఓటింగ్ సరళి నిరాసక్తంగానే ఉంది. మిగతా నాలుగు విడతల్లో ఓటర్లు భారీగా బాగా బారులు తీరితేనే కనీసం 2019 స్థాయిలోనైనా ఓటింగ్ నమోదయ్యే అవకాశముంటుంది. లేదంటే భారీగా తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి... ⇒ పట్టణ ఓటర్లు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఓటింగ్ శాతం పడిపోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మూడు విడతల్లో పట్టణ నియోజకవర్గాల్లో పేలవ ఓటింగే ఇందుకు నిదర్శనం. ⇒ యూపీలోని గాజియాబాద్లో 2019లో 55.88 శాతం ఓట్లు పడగా ఈసారి 49.88 శాతానికి దిగజారింది. కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్లో 54.31 శాతం నుంచి 54.06 శాతానికి; బెంగళూరు సౌత్లో 53.69 శాతం నుంచి 53.17 శాతానికి తగ్గింది. ⇒ 2019లో కూడా పట్టణ ఓటర్లలో ఇదే ధోరణి కనబడింది. అత్యంత తక్కువ ఓటింగ్ నమోదైన 50 లోక్సభ స్థానాల్లో 17 మెట్రోపాలిటన్, పెద్ద నగరాల్లోనే కావడం గమనార్హం. ⇒ తక్కువ ఓటింగ్కు వలసలు కూడా కారణమే. పొట్టకూటి కోసం వలస వెళ్లేవాళ్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఓటింగ్ తగ్గుతున్నట్లు తేలింది. ⇒ వచ్చి ఓటేసేంత స్థోమత లేకపోవడం, కూలి డబ్బులను వదులుకోలేని అశక్తత వల్ల వారు ఓటింగ్కు దూరంగా ఉండిపోతున్నారు. ⇒ దేశంలో అత్యధిక ఓటర్లున్న ఉత్తరప్రదేశ్లో అతి తక్కువ ఓటింగ్ నమోదవడం దీనికి నిదర్శనం. ⇒ మండుటెండలు కూడా ఓటింగ్కు గండికొడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ⇒ రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగేలా ఉండటంతో మిగతా నాలుగు విడతల ఓటింగ్పైనా తీవ్ర ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.ఫలితాలపై ప్రభావం.. ఎప్పుడెలా...?! 1951 నుంచి 2019 వరకు లోక్సభ ఎన్నికల ఫలితాలను చూస్తే భారీగా ఓటింగ్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు అనూహ్య ఫలితాలే వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో ఓటింగ్ 5 శాతం పైగా పెరిగి 60 శాతం దాటింది. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర పరాజయం పాలై జనతా కూటమికి అధికారం దక్కింది. 1980లో ఓటింగ్ మళ్లీ భారీగా పడిపోయింది. అధికార జనతా పార్టీ ఓడి కాంగ్రెస్ విజయం సాధించింది. 1984 ఎన్నిక్లలో ఓటింగ్ 7 శాతం పైగా పెరగడం ఇందిర మరణంపై వెల్లువెత్తిన సానుభూతికి నిదర్శనంగా నిలిచింది. రాజీవ్గాంధీ ఘన విజయం సాధించారు. 1989లో మళ్లీ ఓటింగ్ తగ్గింది. కాంగ్రెస్ ఏకంగా సగానికి పైగా సీట్లను కోల్పోయింది. 1991 ఎన్నికల్లోనూ ఓటింగ్ 6 శాతానికి పైగా తగ్గింది. మళ్లీ అధికార పక్షానికి షాక్ తగిలి కాంగ్రెస్ గద్దెనెక్కింది. 2004లో ఓటింగ్ స్వల్పంగానే తగ్గినా ఐదేళ్ల వాజ్పాయి సర్కారు ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు కొలువుదీరింది. 2009 ఓటింగ్ స్వల్పంగా పెరిగింది. యూపీఏ ప్రభుత్వమే కొనసాగింది. 2014లో ఓటింగ్ రికార్డు స్థాయిలో 8 శాతానికి పైగా పెరిగింది. బీజేపీ తొలిసారి ఘనవిజయం కొట్టింది. పెరిగిన ఓటింగ్ మోదీ వేవ్కు అద్దం పట్టింది. 2019లోనూ 1 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మెజారిటీ మరింత పెరిగింది. ఆ లెక్కన ఈసారి ఓటింగ్ భారీగా తగ్గితే కచి్చతంగా అనూహ్య ఫలితాలే రావచ్చంటున్నారు రాజకీయ పండితులు.అధికార పార్టీకే నష్టమా? 2019లో 67.4 శాతం ఓటింగ్ జరిగినా వాస్తవంగా చూసుకుంటే 30 కోట్ల మంది ఓటే వేయలేదు! ఇదే నిరాసక్తత ఈసారి కూడా కొనసాగితే ఓటింగ్కు దూరంగా ఉండేవారి సంఖ్య 35 కోట్లకు పెరగవచ్చు. ఓటింగ్ భారీగా తగ్గడం దేనికి సంకేతమన్న దానిపైనా పలు రకాలు వాదనలున్నాయి. ఓటింగ్ పడిపోవడం అధికార పారీ్టకే ఎక్కువ నష్టమని చరిత్ర చెబుతోంది, అయితే ఇది అన్నివేళలా నిజం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘ఓటింగ్ తక్కువగా నమోదైనప్పుడు ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓటింగ్ తగ్గుదల 5 శాతం లోపుంటే ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, పెద్దగా స్తబ్ధత లేదని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో స్థానికాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చు. ఏదైనా జరగొచ్చు’’ అంటున్నారు రాజీకీయ విశ్లేషకుడు నోమిత పి.కుమార్. ఓట్ల శాతం భారీగా తగ్గడం వల్ల మెజారిటీలకు గండిపడి ఒక్కోసారి ఫలితాలు భారీగా తారుమారవుతాయన్నది మరికొందరి వాదన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
మే 13, 2024.. సోమవారం. రెండు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ. ప్రతీ ఓటరు ఓటేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఓటుకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓటు వేయడానికి అమల్లో ఉన్న పద్ధతులేంటీ? అన్న విషయాలు తెలుసుకుందాం.ఓటరు జాబితాలో పేరుందా?మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయం మీ పేరు ఓటరు జాబితాలో ఉందా? ఎన్నికల సంఘం వెబ్సైట్లో మీ పేరు లేదా ఎపిక్ నెంబర్ లేదా అడ్రస్తో చెక్ చేసుకోవచ్చు. https://electoralsearch.eci.gov.in/ వెబ్సైట్లో మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చుఎపిక్ డౌన్లోడ్ చేసుకోండిఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్) ఉండడం మంచిది. మీ పేరు జాబితాలో ఉంటే మీ ఎపిక్ను మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://voterportal.eci.gov.in/login వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేయగానే డౌన్లోడ్ అప్షన్ వస్తుంది. అయితే మీ మొబైల్ నెంబర్ అనుసంధానం కాకపోతే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోలేరు.ఎపిక్లో లోపాలుంటే... ఇక కొందరి ఓటరు కార్డుల్లో స్వల్ప తేడాలు (అడ్రస్ మార్పు, ఫోటో పాతది ఉండడం లేదా పేరు అక్షరాల్లో మార్పులు) ఉండొచ్చు. దానికి ఎలాంటి కంగారు లేదు. ఎపిక్ వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది.♦ ఆధార్కార్డు ♦ ఉపాధి హామీ కార్డు♦ జాబ్ కార్డు ♦ బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్బుక్ ♦ కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ♦ డ్రైవింగ్ లైసెన్స్♦ పాన్కార్డు ♦ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్(ఎన్పిఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు ♦ భారతీయ పాస్పోర్టు ♦ ఫొటో గల పెన్షన్ పత్రాలు ♦ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు ♦ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ♦కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)పోలింగ్ స్లిప్పులుపోలింగ్కు కొన్ని రోజుల ముందే పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేస్తారు. అయితే, వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరు. కానీ ఇందులో.. పార్ట్ నెంబర్, ఓటరు సీరియల్ నెంబరు ఉంటాయి. ఈ వివరాలతో ఓటరు జాబితాలో మిమ్మల్ని సులభంగా గుర్తిస్తారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదున్నా.. మీకు ఓటు హక్కు కల్పిస్తారు. కాబట్టి పోలింగ్ స్లిప్పు ఉంటే మీ పని చాలా సులభం.పోలింగ్ బూత్లో మీ ఓటు ఎలా వేసుకోవాలంటే.?పోలింగ్ బూత్లోకి వెళ్లగానే మీ దగ్గరున్న పోలింగ్ స్లిప్పును చూపించండి. లేదా మీ ఓటరు సీరియల్ నెంబర్, పార్టు నెంబరు చెప్పండి.ఈ వివరాలను బట్టి ఒక్క నిమిషంలో ఓటర్ వివరాలను ధృవీకరిస్తారువివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తరువాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు.మీ వివరాలను (ఓటరు ఐడీ నెంబరు) ఫారం 17Aలో నమోదు చేస్తారు.ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు.ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తు పెట్టి మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్కు వెళ్లడానికి అనుమతిస్తారు.ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే EVM మెషీన్, దాని పక్కనే VVPAT యంత్రమూ ఉంటుంది.(మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే ఈ VVPAT)ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క.... వారికి కేటాయించిన గుర్తులు మరో వైపు... వీటి పక్కన్నే నీలి రంగు బటన్ ఉంటాయి.మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న నీలి రంగు బటన్ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క.బటన్ నొక్కిన తరువాత అయిదు సెకన్ల పాటు చిన్న శబ్ధం వినిపిస్తుంది.ఆ వెంటనే VVPAT మెషీన్పై పచ్చటి లైట్ వెలుగుతుంది.VVPATపై ఉండే స్క్రీన్పై చూస్తే... మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకూ గుర్తు, ఈవీఎంపై అతడికి కేటాయించిన క్రమసంఖ్య, పేరు ముద్రించిన కాగితపు స్లిప్ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది.ఏడు సెకన్ల తరువాత ఈ స్లిప్ కాస్తా బాక్స్లోకి పడిపోతుంది.ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి.. పోలింగ్ బూత్లో రెండు ఈవీఎంలు, రెండు వీవీ పాట్లు ఉంటాయి. ఒక ఓటు మాత్రమే వేసి రెండో ఓటు మరిచిపోవద్దు. ఓపిగ్గా.. రెండు ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో ఓటరుగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవాలి.మీ ఓటు గురించి మీకు ఎలాంటి అనుమానాలున్నా.. మాకు ఈ మెయిల్ రాయగలరు. info@sakshi.com మీ సందేహాలకు సంబంధించి ఎన్నికల అధికారులతో మాట్లాడి సమాధానం ఇవ్వగలం. -
ఓటేసి వస్తే టిఫిన్ ఫ్రీ
శివమొగ్గ: ఓటు హక్కు చాలా విలువైనది, ఓటేసి వస్తే టిఫిన్లు ఫ్రీ అని శివమొగ్గలోని శుభం హోటల్ యజమాని ప్రకటించాడు. దీంతో ఓటేసినవారు పోలోమంటూ హోటల్కు రావడంతో రద్దీ ఏర్పడింది. ఓటు వేసిన సిరా గుర్తు చూపిస్తే టిఫిన్, టీ, కాఫీలు ఉచితంగా ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్లను పెట్టారు. ఉచితంగా మసాల దోసె, పలావ్ ఇచ్చి అభినందించారు. ముఖ్యంగా ఓటర్లు మసాల దోసె కోసం ఎగబడ్డారు. యజమాని ఉదయ్ కదంబ మాట్లాడుతూ ఉచితమని చెప్పడం వల్ల వెయ్యి నుంచి 1500 వరకు మంది రావొచ్చని అనుకున్నా. కానీ సుమారు 5 వేల మందికి పైగా వచ్చారు. అయినా కూడా అందరికీ ఉపాహారం ఇచ్చామని, తమ వల్ల 5 వేల మంది ఓటు వేశారన్న సంతోషంగా ఉందని అన్నారు. -
విదేశాల నుంచి వచ్చి ఓటు
రాయచూరు రూరల్: జిల్లాలో మంగళవారం జరిగిన రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా భారతీయులు స్వదేశానికి తరలివచ్చి ఓటేయడం గమనార్హం. అమెరికా నుంచి శక్తినగర్కు తరలివచ్చిన డీవీఏ సయ్యద్ అబ్దుల్ ఖాద్రి తాలూకాలోని శక్తినగర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం–18లో ఓటు వేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. కాగా జిల్లాలోని మస్కి తాలూకా వటగల్కు చెందిన అమరేష్ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు ఖర్చు చేసుకొని ఓటు వేయడానికి స్వదేశానికి తరలిరావడం విశేషం. ఆయన ఒమన్ దేశం నుంచి మస్కికి వచ్చి ఓటేశారు. -
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్లో తప్పక పాల్గొనాలి. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.ముఖేశ్ అంబానీ కుటుంబంముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద విలువ: సుమారు రూ.18.9 లక్షల కోట్లు.2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్: రూ.3.5లక్షల కోట్లు.గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.2019 లోక్సభ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్లో ఓటు వేశారు.ఆనంద్ మహీంద్రామహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్రా సారథ్యం వహిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండడం ఈయన ప్రత్యేకత. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ మహీంద్రా ముంబయిలో తన ఓటు వేశారు.అనిల్ అంబానీరిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ ఛైర్మన్గా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని కఫ్ పరేడ్లోని జిడి సోమాని స్కూల్లో 17వ లోక్సభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు.నరేష్ గోయల్జెట్ ఎయిర్వేస్ ఎయిర్లైన్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత 2019లో ముంబయిలో ఓటువేశారు.శక్తికాంత దాస్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్ పనిచేస్తున్న శక్తికాంత దాస్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు వేశారు.ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునే వారు చరిత్రలో తెలుసుకోవాల్సినవి..1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 భవితవ్యంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు. 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.1999 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్పేయీ ప్రభుత్వం పడిపోయింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.2008లో రాజస్థాన్లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది కర్నాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం. సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కాగే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు ఓటు వేయాలని, లేకుంటే వారి ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్ను నిలిపివేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారాయి.రాజు కాగే తన నియోజకవర్గమైన బెలగావిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో ఆయన ‘నాకు గతంలో కొన్ని చోట్ల తక్కువ ఓట్లు వచ్చాయి. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఇకముందు మాకు ఎక్కువ ఓట్లు రాకపోతే, అప్పుడు మేము మీ ఇంటికి అయ్యే విద్యుత్తును నిలిపివేస్తాం. దీనిని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను’ అని ప్రజల ముందు వ్యాఖ్యానించడం చూడవచ్చు.దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి పూనావాలా ఈ వ్యాఖ్యలను రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటనతో ముడిపెట్టారు. డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్కు ఓటు వేయాలని, లేకపోతే మీరనుకున్న పనులు జరగవని ప్రజలతో అన్నారు. ఇది కాంగ్రెస్కు ఉన్న అర్హత, అహంకారాన్ని తెలియజేస్తోందని, ఓటర్లను తమ బానిసలు అని కాంగ్రెస్ నేతలు ఎలా అనుకుంటారని పూనావాలా ప్రశ్నించారు.కగ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గం చిక్కోడి లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఏప్రిల్ 26న రెండో దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను 14 స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరిగింది. మూడో దశలో మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. -
ప్రియాంక ఉంటేనే ఓటు.. గ్రామస్తుల హెచ్చరిక!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో ఆసక్తికర రాజకీయం నెలకొంది. ఐదో దశ నామినేషన్లకు గడువు సమీపిస్తున్నా, అటు రాయ్బరేలీ, ఇటు అమేధీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులెవరనేది కాంగ్రెస్ ఇంకా వెల్లడించలేదు. రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అయోమయంలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాయ్బరేలీ జిల్లాలోని కనకపూర్ గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామం బయట ‘ప్రియాంకా గాంధీ పోటీ చేయకుంటే తాము ఓటు వేయం’ అని రాసివున్న బ్యానర్ను ఉంచారు. రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీచేయకుంటే ఓటింగ్ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీ కుటుంబంతో తమ అనుబంధం ఏళ్ల నాటిదని, అందుకే గాంధీ కుటుంబం నుండి ప్రియాంక లేదా రాహుల్ ఇక్కడి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.మరోవైపు అమేథీ, రాయ్బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ కుటుంబం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీకి రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ నేడు (బుధవారం) ప్రకటిస్తుందనే వార్త వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు సమాచారం. -
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం కాదు’
‘‘ఎవరో ఒకరు... ఎపుడో అప్పుడు...నడవరా ముందుగా.. అటో.. ఇటో.. ఎటో వైపు’’అప్పుడెప్పుడో వచ్చిన సినిమా ‘అంకురం’ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన గీతం!ఈ వీడియో చూస్తే ఆ పాట గుర్తుకు రాక మానదు. బెంగళూరు ట్రాఫిక్ కూడళ్లలో పండు ముదుసలి ఒకరు.. ‘‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం’ కాదు అన్న ప్లకార్డ్ పట్టుకుని ఒంటరిగా ప్రచారం చేశారు. ఆ అనుభవజ్ఞుడి ప్రచారానికి జనాలూ ఫిదా అయ్యారు. ‘‘మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు’’ అంటూ కొందరు ప్రశంసించడమూ ఈ వీడియోలో చూడొచ్చు. ನನ್ನ ಮತ ದ್ವೇಷಕ್ಕಾಗಿ ಅಲ್ಲ❌ನನ್ನ ಮತ ಬದಲಾವಣೆಗಾಗಿ✅ಒಂದು ವಿನೂತನ ಕ್ಯಾಂಪೇನ್👇 pic.twitter.com/MwkXcYe3JR— Mamatha R (@mamathcr) April 25, 2024 ఇక.. రేపు (శుక్రవారం) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
శతాధిక వృద్ధుడి స్ఫూర్తి.. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు
సార్వత్రిక ఎన్నికలు రెండో దశ పోలింగ్లో ఆదర్శంగా నిలిచాడు ఈ శతాధిక వృద్ధుడు. శుక్రవారం జరిగిన లోక్సభ ఎన్నికల రెండో విడతలో ఓటు వేయడానికి 102 ఏళ్ల హాజీ కరమ్ దిన్ జమ్మూలోని పోలింగ్ బూత్కు చేరుకున్నాడు. చేతి కర్ర, కుటుంబ సభ్యుల సాయంతో జమ్మూ నియోజకవర్గంలోని రియాసి జిల్లాలోని పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేశాడు.ఓటు వేసిన అనంతరం శతాధిక వృద్ధుడు తన సిరా వేసిన వేలిని చూపిస్తూ బూత్ బయట ఫొటోలకు పోజులిచ్చాడు. "ఈ వయస్సులో ఈ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిసారీ ఓటు వేశాను. 102 సంవత్సరాల వయస్సులో ఈ ప్రయాణం నేటికీ కొనసాగుతోంది" అని ఆయన వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.రియాసి జిల్లా జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 22 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17.81 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఐదేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూలో జరుగుతున్న మొదటి ప్రధాన ఎన్నికలు ఇవే. -
సార్వత్రిక సమరం: లోక్సభ తొలి విడత పోలింగ్ చిత్రాలు
-
బియ్యపు గింజపై ‘ఓటు వేయండి’!
దేశంలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగున్నాయి. వివిధ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే జనం చేతిలో ఓటు అనే అయుధం ఉంది. దీనితో వారు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తుంటుంది. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఒక హస్త కళాకారిణి వినూత్న రీతిలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. జైపూర్లోని సాంగనేర్ నివాసి నీరూ చాబ్రా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేయాలని భావించారు. ఇందుకోసం ఆమె బియ్యపుగింజలపై ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ రాశారు. ఆమె బియ్యపు గింజపై భారత మ్యాప్ను సూక్ష్మ శైలిలో గీయడంతోపాటు ఎన్నికల స్లోగన్ కూడా రాశారు. ఈ సందర్భంగా నీరూ చాబ్రా మీడియాతో మాట్లాడుతూ 1984 నుంచి తాను బియ్యపు గింజపై సూక్ష్మ అక్షరాలు రాయడాన్ని కొనసాగిస్తున్నానని, కిచెన్లో వంట చేసేటప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు. మెల్లమెల్లగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించానని అన్నారు. కాగా నీరూ బియ్యపు గింజపై 108 అక్షరాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నీరూ చాబ్రా ప్రతిభను గతంలో మెచ్చుకున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
Advertisement