-
ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్ జోన్ జోరుగా హుషారుగా
యూత్ పల్స్: కంటెంట్లో సత్తా ఉండాలేగానీ కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా సొంత ఊళ్లోనే ఉంటూ తగినంత డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామీణ యువ కంటెంట్ క్రియేటర్లు. హాస్యం నుంచి వ్యవసాయం వరకు రకరకాల సబ్జెక్ట్లను వైరల్ చేయడంలో నేర్పు సాధించారు.ఉత్తర్ప్రదేశ్లోని ఆరియారి గ్రామానికి చెందిన శివానీ కుమారికి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రామీణ జీవితాన్ని పాటలు, కామెడీతో కూడిన స్కెచ్ల ద్వారా ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. తనతో సమానంగా ఫాలోవర్లు ఉన్న ఇంగ్లీష్ క్రియేటర్లు కుమారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటికీ డబ్బుల గురించి చింత ఆమెకు లేదు. డబ్బుల కంటే కంటెంట్ క్రియేషన్ గురించే ఎక్కువ దృష్టి పెడుతుంది కుమారి.ఒడిశాలోని చిత్రకూట్కు చెందిన ధీరజ్ టక్రీకి గతంలో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చేది కాదు. తడబడుతూ మాట్లాడేవాడు. దీంతో యూట్యూబ్ వీడియోలు చూసి ధీరజ్ అమెరికన్స్లా ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకున్నాడు. అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడే నైపుణ్యం ధీరజ్ను ‘ఇన్స్టా ఫేమ్’ చేసింది. 2023లో ధీరజ్ ఫాలోవర్ల సంఖ్య 160 మాత్రమే. హ్యాండ్సమ్ అనే మాటను ఫారిన్ యాక్సెంట్లో ఎలా పలకాలి అనే రీల్ వైరల్ కావడంతో ధీరజ్ టక్రీ ఫాలోవర్ల సంఖ్య వేలకు చేరింది. మధ్యప్రదేశ్లోని బిరాఖేడీ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల రామ్ పారమార్ 17 సంవత్సరాల వయసులో యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. తన చానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేవాడు. ఏడు, ఎనిమిది వేలతో యూట్యూబ్లో అతడి సంపాదన మొదలైంది. ఇప్పుడు బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.పది లక్షలు వెచ్చించి తన గ్రామంలో ఆఫీస్ నిర్మించుకున్నాడు. కారు కొన్నాడు. ఇద్దరు సభ్యులతో ఉన్న టీమ్ను విస్తరించే పనిలో ఉన్నాడు. గుజరాతీ, తమిళ భాషల్లో కూడా కంటెంట్ను విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.‘మన దేశంలో చాలా ప్రాంతాల్లో రైతులు హిందీ భాషను అర్థం చేసుకోలేరు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల సహకారంతో ప్రాంతీయ భాషల్లో కంటెంట్ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కంటెంట్ను చేరువ చేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు ధీరజ్.ఇరవై ఏడు సంవత్సరాల మయూరి పాటిల్కు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం కాదు. ‘పశ్చిమ కనుమలను కాపాడుకుందాం’ అనే నినాదంతో రీల్స్ చేస్తొంది. పశ్చిమ కనుమల అందాలను కళ్లకు కట్టేలా ఉండే ఆ రీల్స్ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచించేలా చేస్తున్నాయి. కొండపై ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి జీవనశైలిపై పాటిల్ చేసిన రీల్ వైరల్ అయింది. ఎలాంటి కమర్శియల్ ఎలిమెంట్స్ లేని ఈ రీల్ సూపర్ సక్సెస్ కావడమే కాదు అది పాటిల్కు ఎంతో ఉత్సాహాన్నీ ఇచ్చింది.మహారాష్ట్రలోని పులగామ్ గ్రామానికి చెందిన నేహా తాంబ్రేది సూపర్ పవర్ గ్రామీణ యాస. కామెడీ దట్టించి వివిధ సామాజిక సమస్యలపై తమ ప్రాంత మాండలికంలో నేహా చేసే వీడియోలు సోషల్ మీడియాలో ΄ాపులర్ అయ్యాయి. తన గ్రామం నుంచి వెళ్లి పుణెలో ఇంజనీరింగ్ చేయడం నేహాకు కల్చరల్ షాక్.‘నా గ్రామీణ మరాఠీ యాసను వెక్కిరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది నేహా.ఎంతోమంది వెక్కిరించిన ఆ యాస కంటెంట్ క్రియేషన్లో ఆమె బలం అయింది. నేహా సృష్టించిన ‘తోంబ్రే బాయి’ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది.స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత క్రియేటర్లు సోషల్ మీడియాలో కొత్త దృశ్యం ఆవిష్కరిస్తున్నారు. కర్నాటకాలోని చిన్న పల్లెల నుంచి ఈశాన్యప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు కంటెంట్ క్రియేషన్ ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రతి క్రియేటర్ తనదైన ప్రత్యేకతను కంటెంట్కు జోడిస్తున్నారు.‘ఇన్స్టాగ్రామ్ ఉద్దేశాన్ని చాలా బ్రాండ్స్ మరిచి΄ోయాయి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫన్, స్టోరీ టెల్లింగ్కు వేదిక’ అంటుంది ముంబైకి చెందిన కంటెంట్ సొల్యూషన్స్ ఫర్మ్ ‘అప్పర్కేస్’ డైరెక్టర్ నిఠషా భర్వానీ. ఇన్స్టాగ్రామ్కు కీలకమైన ఫన్, వైవిధ్యాన్ని జోడిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గ్రామీణ ప్రాంత యువ కంటెంట్ క్రియేటర్లు.ఎక్కడా తగ్గేదే లేదండీగ్రామీణ్ర ప్రాంత జీవనశైలికి అద్దం పట్టే వీడియోలతో ΄ాపులర్ అయింది ఉత్తర్ప్రదేశ్కు చెందిన శివానీ కుమారి. ఆడంబరాల కంటే సహజత్వమే కంటెంట్కు అందాన్ని తీసుకువస్తుంది అనేది కుమారి నమ్మే థియరీ. అందుకే ఆమె చేసే వీడియోల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఊళ్లో సొంత ఇళ్లు కట్టుకుంది. సోషల్ మీడియాలో కుమారి ΄ాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వ్యక్తుల నుంచి మొదలు ఆర్గనైజేషన్స్ వరకు ప్రశంసపూర్వకమైన ఈ–మెయిల్స్ వస్తుంటాయి. అవి ఆమెకు బలమైన టానిక్లా పనిచేస్తాయి. ‘ఇంగ్లిష్లో గడగడా మాట్లాడితేనే కంటెంట్ హిట్ అవుతుంది’ అనే భావనను కుమారిలాంటి వాళ్లు తప్పని తేల్చేస్తు్తన్నారు. ఇంగ్లీష్–స్పీకింగ్ అర్బన్ క్రియటర్స్ కంటే తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు శివాని కుమారి -
డూడులమ్మలు...
మొదట ఏమిటోగానీ ఇప్పుడు ‘డూడుల్’ అనేది పక్కింటి అబ్బాయి పేరు విన్నంత సహజమైపోయింది. నిఘంటువు అర్థం ప్రకారం ‘డూడుల్’ అంటే వోన్లీ వన్ వే... అదే ఫన్ వే! కొందరు మహిళా ఇలస్ట్రేటర్లు ఆ దారి తప్పకుండా, ఒకవైపు వినోదం పంచుతూనే మరోవైపు సామాజికస్పృహకు ప్రాధాన్యత ఇస్తూ ఇన్స్టాగ్రామ్లాంటి సామాజిక మాధ్యమాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేహాశర్మ’(దిల్లీ) ‘నేహా డూడుల్స్’ పేరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ‘స్త్రీ సాధికారత’ను ప్రధాన వస్తువుగా తీసుకొని ఆమె డూడుల్స్ రూపొందిస్తుంటుంది. తన కళాత్మక అంశం చాలామందికి రియాలిటీచెక్లా ఉపయోగపడుతుంది. ‘డూడుల్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు? హాయిగా నవ్వించవచ్చు కదా! అనుకుంటారు చాలామంది. అయితే సామాజిక విషయాలను డూడుల్స్గా ఎంచుకున్నంత మాత్రాన సీరియస్గానే చెప్పాలనే రూల్ ఏమీ లేదు కాదా! సున్నితంగా నవ్విస్తూనే విషయాన్ని సూటిగా చెప్పవచ్చు అని చెప్పడానికి ‘నేహా డూడుల్స్’ ఉదాహరణగా నిలుస్తాయి’ అని చెబుతుంది నేహాశర్మ చిరకాల ఫాలోవర్ రమ్య. సలోని పటేల్ (కోల్కతా) రూపొందిస్తున్న డూడుల్స్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం ఒక్కటే...‘జీవితాన్ని గ్లోబ్ మోసినంత భారంగా మోయనక్కర్లేదు. చిన్న జీవితాన్ని ప్రతిరోజూ పెద్దపండగలా జరుపుకోవచ్చు’ ‘ఎప్పుడైన మనసు బాగలేకపోతే నా దృష్టి సలోని సృష్టించే డూడుల్స్పై మళ్లుతుంది. హాయిగా నవ్వుకుంటాను. కొత్త ఉత్సాహంతో పనిచేస్తాను’ అంటుంది జాన్వీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకసారి యాదృచ్ఛికంగా ఆమె సలోని వేసిన డూడుల్స్ను ఇన్స్టాగ్రామ్ లో చూసింది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతోంది. వైబ్రంట్ కలర్స్, ఇమేజరీలతో ఆకట్టుకుంటుంది దిల్లీకి చెందిన భావ్య దోషి. రోజూ వినే సాధారణ సంభాషణలే ఆమె రూపొందించే డూడుల్స్లో కొత్త సొగసును సంతరించుకుంటాయి. బిగ్గరగా నవ్విస్తాయి. ‘కంటెంట్ కోసం జుట్టు పీక్కోవాల్సిన పనిలేదు. మన చుట్టూ ఉన్న జీవితం నుంచే ఎంతో సృష్టించుకోవచ్చు’ అంటుంది కోల్కతాకు చెందిన శ్రేయా కుందు. ‘శ్రేయా రూపొందించే డూడుల్స్లో బొమ్మలు కనిపించవు. ఎక్కడో ఒకచోట మనకు పరిచయం ఉన్నవారు కనిపిస్తారు. అదే శ్రేయా ప్రత్యేకత’ అంటుంది శ్రేయా అభిమాని సత్య. ఇక ఆకాంక్ష కుంచె నుంచి జాలువారే డూడుల్స్ ఆకట్టుకునేలా ఉండడమే కాదు కాసేపు ఆలోచించేలా చేస్తాయి. నవ్వించడం మంచిదే. నవ్వించడం ద్వారా మంచిని చెప్పడం అందులోనూ సునిశితంగా... కళాత్మకంగా బోధించడం అంతకంటే మంచిది కదా! -
అర్థశాస్త్రం.. ప్రాథమిక భావనలు
కానిస్టేబుల్ పరీక్షలో అర్థశాస్త్రం నుంచి దాదాపుగా 6 ప్రశ్నలు రావచ్చు. అందులో అర్థశాస్త్ర ప్రాథమిక భావనల నుంచి కనీసం ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రిపేరయ్యేటప్పుడు అర్థశాస్త్ర పదజాలంను అవగాహన చేసుకోవడం కొద్దిగా క్లిష్టంగానే ఉంటుంది. కాబట్టి ఆయా అంశాలను చదివేటప్పుడు వాటి అర్థాలను వెంటనే తె లుసుకోవడం ప్రయోజనకరం. పాఠ్యపుస్తకాల చివర ఇచ్చిన పదజాలం, ప్రశ్నలు, నిర్వచనాలను తప్పకుండా చదవాలి. సమాజంలోని ఆర్థిక కార్యకలాపాలను విస్తృతంగా విశ్లేషణ చేసేది అర్థశాస్త్రం. దీన్ని ఆంగ్లంలో ఎకనామిక్స్ (ఉఛిౌౌఝజీఛిట) అంటారు. ఇదీ ‘ైఓఐై (ఒక గృహం)’, ‘ూఉకఉఐూ (నిర్వహణ)’ అనే గ్రీకు పదాల కలయిక నుంచి ఏర్పడింది. అంటే గృహ సంబంధ నిర్వహణాంశాలను ప్రాతిపదికగా ఆర్థిక పరమైన కోణంలో శాస్త్రీయంగా వివరించే అర్థశాస్త్రం. అర్థశాస్త్రాన్ని ‘రాగ్నార్ ప్రిష్’ రెండు భాగాలుగా వర్గీకరించారు. అవి.. 1)సూక్ష్మ అర్ధశాస్త్రం: ఇది ఒక కుటుంబ ఆదాయం, సంస్థ ఆదాయం, పరిశ్రమ ఆదాయం గురించి వివరిస్తుంది. అలాగే ఉత్పత్తి, వినియోగం, వినిమయం, పంపిణీ వంటి అంశాలు దీనిలోని ప్రధాన అంశాలు. ఈ శాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.2)స్థూల అర్ధశాస్త్రం: సాధారణ ధరల స్థాయిని, జాతీయ ఉత్పత్తులను, జాతీయాదాయం గురించి చర్చిస్తుంది. అంటే దేశంలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాలను వివరిస్తుంది. దీన్ని ఆదాయ సిద్ధాంతంగా అని కూడా పిలుస్తారు. కోరికలు-వర్గీకరణ: మానవుని కోరికలకు పరిమితి ఉండదు. కానీ ఆ కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించే వస్తువులు మాత్రం పరిమితంగానే లభ్యమవుతాయి. ఈ కోరికలు ఆ వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. కోరికలు మూడు రకాలు. అవి.. 1) అత్యవసరాలు: ఆహారం, బట్టలు, ఇల్లు తదితరాలు. 2) సౌకర్యాలు: కరెంట్, ఫ్యాన్, టీవీ, ఫ్రీజ్, మొబైల్ ఫోన్, సైకిల్ మొదలైనవి. 3) విలాసాలు: కారు, ఏసీ, ఆభరణాలు తదితరాలు. వ్యక్తి ఆదాయ స్థాయి, నివసిస్తున్న ప్రదేశం, కాలాన్ని బట్టి ఈ కోరికలు మారొచ్చు. ఒకరికి సౌకర్యంగా అనిపించింది మరొకరికి అత్యవసరంగా అనిపించవచ్చు. ఇంకొకరికి విలాసంగా తోస్తే మరొకరు అత్యవసరంగా భావిస్తారు. ఈ విషయాలన్నీ ఆదాయ వనరులు, ఎంపికపై ఆధారపడి ఉంటాయి. అర్థశాస్త్రం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఇటువంటి విషయాల్లో మెరుగ్గా వ్యవహరిస్తాడు. ఆ వ్యక్తి కోరికలను సంతృప్తి పరచడానికి ప్రత్యామ్నాయ ఎంపికలను కూడా అర్థశాస్త్రం చూపిస్తుంది. ఈ కోరికలకు, ఎంపికలకు మూలం వస్తువులు. వస్తువుల ఉత్పత్తికి కావల్సినవి వనరులు. వనరులు కూడా పరిమితమే. ఈ వనరుల కొరత కారణంగానే ఎంపిక సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య సార్వజనీనమైంది. దీనికి పరిష్కార మార్గాలను అర్థశాస్త్ర భావనలను సూచిస్తాయి. వస్తువులు-రకాలు: వినియోగ వస్తువులు: మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు. ఉదాహరణ-పాలు, పండ్లు, ఆహారం, వస్త్రాలు, సబ్బులు, బ్రష్ మొదలైనవి.ఉచిత వస్తువులు: ఎలాంటి ధర చెల్లించకుండా ప్రకృతిలో విరివిగా లభిస్తూ ఉచితంగా దొరికే వస్తువులు. ఉదాహరణ-సూర్యరశ్మి, గాలి, నీరు (ప్రస్తుతం ఇది ఆర్థిక వస్తువుగా మారింది) ర్థిక వస్తువులు: ఉచితంగా లభించని, డబ్బు చెల్లించి కొనే ప్రతి వస్తువు. ఉదాహరణ-ఆహారం, దుస్తులు, ఇల్లు మొదలైనవి.ఉత్పాదక వస్తువులు: ఒక వస్తువు తయారీకి ఉపయోగపడే వస్తువులు. ఉదాహరణ-యంత్ర పరికరాలు, భవనాలు, ఇతర పనిముట్లు. వీటిని మాలధన వస్తువులని కూడా అంటారు. మాధ్యమిక వస్తువులు: పూర్తిగా తయారు కాని, ఉపయోగించడానికి సిద్ధంగా లేని వస్తువులు. ఉదాహరణ -సిమెంట్, ఇటుకలు, ఉక్కు. ఇవి ముడి పదార్థాలు కావు. అంతిమ వినియోగ వస్తువులు కావు.పబ్లిక్ వస్తువులు: ప్రభుత్వం సమకూర్చి ప్రజలందరికి అందుబాటులో ఉంచే వస్తువులు. ఇవి ఎంత మంది ఉపయోగించినా తరిగి పోవు. ఉదాహరణ-దేశ రక్షణ దళాలు. పార్కులు, రోడ్లు, వీధి దీపాలు, ప్రభుత్వ సేవలు కూడా పబ్లిక్ వస్తువులే కానీ, స్వచ్ఛమైన పబ్లిక్ వస్తువులు కాదు. అదేవిధంగా ప్రభుత్వ సేవలు కూడా ఆర్థిక వస్తువులయ్యాయి. ఉదాహరణ-భారతీయ రైల్వే సేవలు, తపాలా సేవలు, మీ సేవ తదితరాలు.ప్రైవేట్ వస్తువులు: డబ్బు చెల్లించి కొనే ప్రతి ఒకటీ ప్రైవేట్ వస్తువు కిందకే వస్తుంది. ఉదాహరణ- పుస్తకాలు, పెన్నులు, చెప్పులు, మోటార్ సైకిల్ తదితరాలు. ఉత్పత్తి-ఉత్పత్తి సాధనాలు: ఉత్పత్తి అంటే ఒక వస్తువును సృష్టించడం ద్వారా అర్థశాస్త్ర పరంగా ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి వాటిని అంతిమ వస్తువుగా రూపొందించే ప్రక్రియనే ఉత్పత్తిగా పిలుస్తారు. సంగ్రహంగా ఉత్పత్తి అంటే ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియ. వస్తువుల తయారీ, ప్యాకింగ్, రవాణా, నిల్వ చేయడం వంటివి ఉత్పత్తి పరిధిలోకి వస్తాయి. ప్రముఖ ఆర్థికవేత్త మేయర్-అంతిమంగా వస్తువులు, సేవలు పొందడానికి చేసే కార్యకలాపాలన్నీ ఉత్పత్తిగానే పరిగణించారు. ఈ వస్తు సేవల ఉత్పత్తికి ఆధారం వినియోగం. వినియోగం లేనిదే ఉత్పత్తి లేదు. వినియోగం: వ్యక్తులు తమ అవసరాలను, సౌకర్యాలను, విలాసాలను, కోరికలను తీర్చుకోవడానికి వస్తువులను సేవలను ఆధారం చేసుకోవడాన్ని వినియోగం అంటారు. ఉపయోగించుకునే వ్యక్తులు.. వినియోగదారులు. ఈ వినియోగానికి మూలం కోరికలు. వీటిని తీర్చుకోవడానికి వినియోగదారులు నిరంతరం వస్తు సేవలను వాడుకుంటారు. ఈవిధంగా వినియో గం, ఉత్పత్తి రెండూ పరస్పరాధారితాలు. ఉత్పత్తికి సహకరించే కారకాలను ఉత్పత్తి సాధనాలు అంటారు. అవి.. భూమి: భూమిపై ప్రకృతి సిద్ధంగా లభించే ప్రతిదీ వస్తువు ఉత్పత్తికి దోహదపడుతుంది. వ్యవసాయ లేదా వ్యవసాయేతర భూమైనా ఉత్పత్తికి ఆధారంగానే ఉంటుంది. శ్రమ: ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి చేసే శారీరక, మానసిక పనిని శ్రమ అంటారు. శ్రమను అందించేది శ్రామికులు. శ్రామికులు లేనిది దేన్ని ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. మూలధనం: యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఇతర సామాగ్రిని మూలధనంగా పిలుస్తారు. ఇది స్థిర మూలధనం, చర మూలధనం అని రెండు రకాలు. ఉత్పత్తి ప్రక్రియలో ఎక్కువ కాలం ఉపయోగపడే యంత్రాలు, భవనాలు స్థిర మూలధనం కిందకు వస్తాయి. ఉత్పత్తిలో ఒకసారి ఉపయోగపడే శ్రామికుల వేతనాలు, ముడిపదార్థాలు, విద్యుచ్ఛక్తి, ఇంధనం చర మూలధనం పరిధిలో ఉంటాయి. మూలధనం శ్రామికుని తలసరి ఉత్పాదకతను పెంచి తద్వారా మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది. వ్యవస్థాపనం/ఉద్యమధారిత్వం: భూమి, శ్రమ, మూలధనాన్ని సమకూర్చి, సమన్వయం చేసి ఉత్పత్తిని చేపట్టే కార్యనిర్వహణనే వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపకులను ఉద్యమదారులుగా పిలుస్తారు. వీరు ఉద్యమధారిత్వం వహించి నష్ట భయాలను కూడా తట్టుకుని, ఉత్పత్తిని కొనసాగిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం: ఉత్పత్తి కారకాలను సంపూర్ణంగా ఉపయోగించి నాణ్యమైన, ఆధునికమైన వస్తువులను అధిక వేగంతో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుంది. ఇది శ్రామికుని శ్రమను కూడ తగ్గిస్తుంది. ప్రస్తుతం ఇది ముఖ్యమైన ఉత్పత్తి సాధనంగా మారింది. ఉత్పత్తి ఫలం: ఉత్పత్తి కారకాలకు, ఉత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పత్తి ఫలం వివరిస్తుంది. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని ఉత్పత్తి ఫలంగా పేర్కొంటారు. దీన్ని ఖ=ఊ (ూ,ఔ, ఓ,ై) సమీకరణ రూపంలో వివరిస్తారు. ఖ -ఉత్పత్తి, -భూమి, ఔ-శ్రమ, ఓ-మూలధనం, ై-వ్యవస్థాపన, ఊ- ఉత్పత్తికి, ఉత్పాదకాల మధ్య ఉన్న ప్రమేయ సంబంధం. ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యలు: ఉత్పత్తి దృష్ట్యా మన ఆర్థిక వ్యవస్థ నాలుగు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటుంది. అవి.. 1. ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణలో ఉత్పత్తి చేయాలి? 2. ఏవిధంగా ఉత్పత్తి చేయాలి? 3. ఎక్కడ ఉత్పత్తి చేయాలి? 4. ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి? అర్థశాస్త్ర నిర్వచనాలు: అర్థశాస్త్రవేత్త నిర్వచనం పేరు నిర్వచనం ఆడమ్ స్మిత్ సంపద అర్థశాస్త్రం సంపద గురించి అధ్యయనం చేస్తుంది. (అర్థశాస్త్ర పితామహుడు) ఆల్ ఫ్రెడ్ మార్షల్ శ్రేయస్సు మానవుని శ్రేయస్సును అధ్యయనం చేస్తుంది. లయెనెల్ రాబిన్స్ కొరత కొరత, ఎంపికను గురించి వివరిస్తుంది. పాల్ శామ్యూల్సన్ వృద్ధి కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధిని అధ్యయనం చేస్తుంది. (అర్ధశాస్త్రాన్ని సామాజిక శాస్త్రల రాణిగా పేర్కొన్నారు) అమర్త్యసేన్ సంక్షేమం మానవుని సంక్షేమం గురించి అధ్యయనం చేస్తుంది. ప్రయోజనం-రకాలు వస్తువులను వినియోగించడం ద్వారా వ్యక్తుల కోరికలు తీరుతాయి. వస్తువులకు గల ఈ శక్తినే ప్రయోజనం అంటారు. వస్తువులను ఉపయోగించడం ద్వారా వ్యక్తులు పొందే ప్రయోజనాలు నాలుగు రకాలు. అవి.. 1.రూప ప్రయోజనం: ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణ రూపం మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చే శక్తి ఉంటే దాన్ని రూప ప్రయోజనం అంటారు. ఉదాహరణ-చెక్కతో కుర్చీనిగాని, టేబుల్ను గాని తయారు చేయడం, ముడి పత్తి నుంచి దుస్తులు రూపొందించడం. 2.స్థల ప్రయోజనం: స్థలాన్ని మార్చడం ద్వారా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణ- సముద్ర తీరంలోని ఇసుకను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం, హిమాచల్ప్రదేశ్లోని యాపిల్ పండ్లును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం వంటివి. 3.కాల ప్రయోజనం: కాలాన్ని బట్టి కూడ వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు వ్యాపారస్థులు పంటలు చేతికి వచ్చినప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచి కొంతకాలం తర్వాత మార్కెట్లో విక్రయించడంతో ప్రయోజనం పొందుతారు. 4.సేవల ప్రయోజనం: సేవలు కూడా మానవుల కోరికలను తీరుస్తాయి. ఉదాహరణ టీచర్లు, లాయర్లు, వైద్యుల సేవల ద్వారా పొందే ప్రయోజనం. మాదిరి ప్రశ్నలు స్థూల అర్థశాస్త్రం దేనికి ప్రాధాన్యతనిస్తుంది- జాతీయాదాయం ఉత్పత్తిలో వినియోగ వస్తువులకు అధిక ప్రాధాన్యతనిస్తే దేశ ఆర్థిక భవిష్యత్ ఎలా ఉంటుంది-దెబ్బతింటుంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు-1969 ప్రయోజనాల సృష్టి అంటే-ఉత్పత్తి దుస్తులను చొక్కగా రూపొందిస్తే కలిగే ప్రయోజనం-ఆకార ప్రయోజనం పోస్ట్మ్యాన్కు సైకిల్-అవసరమైన వస్తువు ఆర్థికశాస్త్రాన్ని సంక్షేమశాస్త్రం అని పేర్కొన్న శాస్త్రవేత్త-అమర్త్యసేన్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement