-
ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ అకౌంట్స్ తెలిపాయి. 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్ను కాగ్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం చేసినట్లు పేర్కొంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. అలాగే, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి.2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం రూ.50,882 కోట్లు కేటాయించగా రూ.52,010 కోట్లు వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్లో రూ.21,183 కోట్లు కేటాయించగా రూ.21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో (విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) రూ.1,10,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు, ఆర్థిక సేవలకు రూ.57,344 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. 2023–24 ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 91.97% వ్యయం చేసినట్లు తెలిపింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు రూ.–37,468 కోట్లు ఉండగా ద్రవ్య లోటు రూ.–61,765 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది,గత ఐదేళ్ల బడ్జెట్లో మూల ధన వ్యయం ఇలా..ఆర్థిక ఏడాది మూల ధన వ్యయం (రూ.కోట్లలో) 2019–20 17,601 2020–21 20,690 2021–22 18,511 2022–23 7,581 2023–24 23,589 మొత్తం రూ. 87,972 -
వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర
-
పింఛన్లపై లోకేశ్ మాట్లాడొద్దన్నాడు
సాక్షి, అమరావతి :ఇంటి వద్ద పింఛన్ల పంపిణీని అడ్డుకుని వృద్ధులను 45 డిగ్రీల ఎండలో నడిరోడ్డున పడేసిన టీడీపీ ఇప్పుడు దానిపై ఏంచేయాలో తెలీక లబోదిబోమంటోంది. టీడీపీ అభ్యర్థులు, నేతలను పింఛనుదారులు ఎక్కడికక్కడ నిలదీస్తుండడం, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ దొంగ రాజకీయం బయటపడిపోవడంతో ఏం మాట్లాడొద్దని చంద్రబాబు తనయుడు లోకేశ్బాబు పార్టీ కేడర్కు సూచించారు. దీనిపై ఏదో ఒకటి చేయాలని పార్టీ అభ్యర్థులు టీడీపీ కార్యాలయంలో పనిచేసే వారికి ఫోన్లుచేసి బతిమలాడుతున్నారు. కానీ, వారు తామేం చేయలేమని, తప్పు టీడీపీదేనని, దీనిపై ఏం మాట్లాడకుండా ఉండాలని చెబుతూ చేతులెత్తేశారు. దీంతో ఎల్లో మీడియా, సోషల్ మీడియా వృద్ధుల ఏడుపులపై దొంగ ప్రచారానికి దిగింది. చంద్రబాబును, టీడీపీని అడ్డగోలుగా వృద్ధులు తిడుతుంటే దాన్ని వక్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించి తాము దిగజారుడులో మాస్టర్స్మని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు ఒకరు టీడీపీ కార్యాలయ ముఖ్య ఉద్యోగితో మాట్లాడుతున్న సంభాషణ వింటే (ఆడియో లీకైంది) పింఛన్లపై టీడీపీ ఏడుపు ఏమిటో అర్థమవుతుంది.ఇదీ సంభాషణ..పెమ్మసాని అనుచరుడు : హలో.. ఏమ్మా రఘు ఎక్కడున్నావ్?టీడీపీ కార్యాలయ ఉద్యోగి : అన్నా ఇక్కడే అన్నా.. ఆఫీసులోఅనుచరుడు : ఏమ్మా ఎట్లా ఉన్నావు?ఉద్యోగి : బానే ఉన్నా.. మీరెట్లా ఉన్నారన్నా..అనుచరుడు : బావున్నా.. ఏంలేదు పెన్షన్ ఇష్యూ బాగా వైరల్ అయిపోతోందంట. బ్యాడ్ నేమ్ వస్తోంది. మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్కి వెళ్లినప్పుడు ఎక్కడపడితే అక్కడ ముసలోళ్లు గోలచేస్తూ సార్ దగ్గరికి వచ్చి నిలదీస్తున్నారు. ఆయన ఫుల్ హార్ష మీద ఉన్నాడు. ఏంటసలు.. వీళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నాడు. అందుకే కాల్చేశా..ఉద్యోగి : అన్నా నాకర్థమైంది. నాకూ ఉదయం నుంచి ఇదే విషయం మీద 40–50 కాల్స్ వచ్చాయి. అనుచరుడు : ఎందుకని మీరేం చేయలేకపోతున్నారు? అసలు ఏంటిది?ఉద్యోగి : చెప్పి చెప్పి విసిగిపోయామన్నా..అనుచరుడు : ఏంది విసిగిపోయేది.. వాళ్లేమో మన మీద అంత అగ్రెసివ్గా ఉంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ మనోడే అంటున్నారు. దాని మీద మనం ఏమీ కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని?ఉద్యోగి : కౌంటర్ కాదన్నా.. అసలు విషయం ఏంటంటే.. యాక్చువల్గా మిస్టేక్ మనదే ఉంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే.. నిమ్మగడ్డ రమేష్తో పెద్దాయనే (చంద్రబాబు) ఇదంతా చేయించారు. పిటిషన్ వేయించి ఎన్నికల కమిషన్తో ఇట్లా చేయించారని బాగా స్ప్రెడ్ అయిపోయింది. అనుచరుడు : దానిపై కౌంటర్ ఇవ్వలేమా?ఉద్యోగి : దీని గురించి లోకేశ్ అన్నకు చెప్పాం. మీరెవ్వరూ దీనిపై ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వొద్దు అని చెప్పారు. 60–70 నియోజకవర్గాల నుంచి దీనిపై కాల్స్ వచ్చాయి. అనుచరుడు : కాదమ్మా రఘు.. ఇప్పటికే మన పరిస్థితి వరస్ట్గా ఉంది. పెమ్మసాని గారు ఇంత ఖర్చుపెట్టి కష్టపడుతున్నారు.. ఆయనే అన్నాడు.. దీనిపై ఇంతమంది ఇలా అడుగుతున్నారు.. మనవాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నారు.ఉద్యోగి : కాదన్నా.. ఇది ఒక పెమ్మసాని గారి విషయం కాదు. స్టేట్ మొత్తం ఇది ఉంది. లోకేశ్ గారు దీనిపై మాట్లాడవద్దన్నారు. ఒకవేళ దీనిపై రెస్పాండ్ అయితే మళ్లీ మన మీదకే మిస్ఫైర్ అవుతుంది, ఏ యాక్షన్ వద్దు అని చెప్పారు. అనుచరుడు : డ్యామేజి కంట్రోల్ ఎట్లా మరి? ఏం చేస్తారో ప్లాన్ ఏమీ చెప్పలేదా?ఉద్యోగి : లోకేశ్ అన్న చెప్పింది ఏమిటంటే అవసరమైతే పార్టీ వాళ్లతో ప్రెస్మీట్లు పెట్టిద్దాం. ఇప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పారు. అందుకే మన వాళ్ల నుంచి దీనిపై ఒక్క పోస్టు కూడా రాలేదు. అనుచరుడు : ఏదో ఒకటి చేయండయ్యా.. ఇప్పటికే మనవాళ్లు చాలా డీమోరలైజ్ అయిపోయారు. లక్ష మంది అట్లా ఉంటే పోనీలే అనుకోవచ్చు. 72–73 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో మనకి ఇంకో 10 రోజులే ఉంది. మనకి ఏదైనా తేడాపడితే..ఉద్యోగి : చూసుకుంటారన్నా మనవాళ్లు.. అనుచరుడు : కొంచెం యాక్టివ్గా ఉండండి..ఉద్యోగి : కేడర్ డీమోరలైజ్ అవకుండా చూడాలన్నా.. అది మీరే చేయాలి.అనుచరుడు : నీకూ తెలుసు. పెమ్మసాని గారు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారని.. మాకు మీరు కొంచెం సపోర్ట్ చేయండి.ఉద్యోగి : ముసలోళ్లతో ఏముంది గానీ.. రెండు, మూడ్రోజులైతే అయిపోతుంది.. పెమ్మసాని అనుచరుడు : 2, 3 రోజులు కాదు. ఇంకా పది రోజులే టైముంది. ఏం చేయాలో? ఉద్యోగి : లోకేశ్ అన్న ప్రెస్మీట్లు పెట్టిద్దామన్నారు. మాట్లాడిస్తారు. -
కళ్లు చల్లబడ్డాయా బాబూ!
సాక్షి, అమరావతి: పింఛన్ల కోసం ఎర్రటి ఎండలో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు బ్యాంకుల వెంట, ఏటీఎంల వెంట, సచివాలయాల వెంట తిరుగుతున్నారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా చంద్రబాబు నాయుడూ? ఇప్పుడు నీ మనసు శాంతించిందా? ఐదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లు... ఈ ఒకటి రెండు నెలల్లోనే ఓటర్లను ప్రభావితం చేసేస్తారా?ఒకవేళ ప్రభావితం చేయగలిగి ఉంటే ఇప్పటికే చేసి ఉండేవారు కదా!!. ఐదేళ్లలో లేనిది... కొత్తగా ఈ రెండు నెలల్లో మారింది.. ఏంటి చంద్రబాబు నాయుడూ నీ కుట్ర బుద్ధి తప్ప? మీరే గనక పనిగట్టుకుని కోర్టుల్లో పిటిషన్లు వేసి, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసి వలంటీర్లను ఈ కార్యక్రమానికి దూరం చేయకుండా ఉంటే అవ్వాతాతలకు ఈ కష్టాలుండేవా? వాళ్లు ఈ రెండు నెలలు కూడా ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చి ఉంటే పండుటాకులు ఇంత వేదన పడేవారా? ఇదెక్కడి రాజకీయం బాబూ? బ్యాంకుల్లో వెయ్యమన్నదీ మీరేగా? ప్రతి పథకాన్నీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం పింఛన్లను మాత్రం ఎందుకు వేయటం లేదు? వలంటీర్లు నేరుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి... ఆయన వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి, దత్త పుత్రుడు పవన్.. వీళ్లు చెప్పినట్టల్లా ఆడే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్ వీళ్లంతా అడిగిన ప్రశ్న ఇదే. అక్కడితో ఆగలేదు వీళ్లెవరూ. కోర్టులకెక్కారు. వలంటీర్లు పింఛన్లు ఇవ్వటానికి ఈ మూడు నెలలూ వీల్లేదన్నారు. నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే నగదు వెయ్యాలని ఎన్నికల కమిషన్కు నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చెప్పారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ బహిరంగ సభల్లో కూడా ఇదే చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో వేసేలా ఈసీపై ఒత్తిడి తెచ్చారు. నిజానికి బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఏమవుతుందో ప్రభుత్వానికి తెలియదా? ప్రతి పథకాన్నీ పైసా అవినీతికి తావు లేకుండా నేరుగా లబి్ధదారులకే చేరుస్తున్న వైఎస్ జగన్కు ఇదంతా తెలియదా? కానీ పింఛన్లు తీసుకుంటున్న వాళ్లంతా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వాళ్లు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే తీసుకోవటం వాళ్లకంత సులువేమీ కాదు. బ్యాంకులు ఎక్కడో ఊళ్లకు దూరంగా ఉంటాయి. అన్ని గ్రామాల్లోనూ ఏటీఎంలు అందుబాటులో లేవు. పైపెచ్చు ఖాతాల్లోని డబ్బులు ఎలా తియ్యాలో కూడా కొందరికి తెలియదు. కొందరికి ఖాతాలే లేవు. ఇంకొందరిదైతే ఇల్లు కదల్లేని పరిస్థితి. అందుకే బ్యాంకుల్లో వేయకుండా... ఆ నగదును బ్యాంకుల్లో డ్రా చేసి నేరుగా వలంటీర్లు ఇళ్లకు పట్టుకెళ్లి వాళ్లకు ఇస్తున్నారు. ఒకరకంగా ఖాతాల్లో వేయటానికన్నా అడ్వాన్స్డ్ ప్రక్రియ ఇది. అలాంటి ప్రక్రియను నిలిపేయించడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబూ? ఖాతాల్లో వెయ్యమని చెప్పేటప్పుడు వీళ్లు ఇన్ని కష్టాలు పడతారన్న సంగతి నీకు తెలియనిది కాదు కదా? మండుటెండల్లో విలవిల్లాడుతున్న వృద్ధుల శాపాలిపుడు ఊరికే పోవు కదా? బాబు రక్షణకు ఎల్లో మీడియా... ఎండలకు విలవిల్లాడుతూ వృద్ధులు పెడుతున్న శాపనార్థాలకు తానెక్కడ కొట్టుకుపోతాడోనన్న భయం చంద్రబాబునిపుడు నిలువెల్లా వణికిస్తోంది. దీంతో పింఛన్లు ఇవ్వటానికి సచివాలయ సిబ్బందిని వినియోగించాలని, వాళ్ల ద్వారా ఇంటింటికీ పంచాలని కథలు చెబుతున్నారు. నిజానికి సచివాలయ సిబ్బందిని కూడా మొదట్లో అడ్డుకున్నది చంద్రబాబే. పైపెచ్చు ప్రతి ఇంటినీ అడ్రస్ పట్టుకుని వెతకటం, ఆ చిరునామాలో ఉన్నవారికి ఇవ్వటం ఎవరో కొత్తవారిని చెయ్యమంటే సాధ్యం కాదు. అయితే ఈసీ ఆదేశాల మేరకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లే పింఛన్లు ఇస్తున్నారు. దారుణమేంటంటే ఇలా పింఛన్లిచ్చేటపుడు కొందరు చిరునామాలు దొరక్క వలంటీర్ల సాయం తీసుకుంటున్నారు. కానీ వారు వలంటీర్ల సాయం తీసుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ‘ఈనాడు’ దాని తోక మీడియా దౌర్భాగ్యపు రాతలు రాసి ఆయా సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేదాకా వెంటాడుతున్నాయి.చంద్రబాబు మాత్రం సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఇస్తే బాగుంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైపెచ్చు చేసిందంతా చేసి... ఇలా వృద్ధులు మండుటెండల్లో బయటకు రావటానికి ముఖ్యమంత్రి జగనే కారణమని ‘ఉల్టా చోర్...’ తరహాలో నిందిస్తున్నారు. ఈ మాటలు ఎవరూ నమ్మటం లేదని తెలిసి... ఎల్లో మీడియానూ రంగంలోకి దింపారు. ‘ఈ పాపం జగన్దే’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వండి వార్చిన కథనం ఉద్దేశం చంద్రబాబును రక్షించటమే. మొదటి నుంచీ వలంటీర్లంటే కక్షే... కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఏపీ వలంటీర్ల సైన్యాన్ని ప్రశంసించని వారు లేరు. కానీ చంద్రబాబు ముఠాకు మొదటి నుంచీ ఈ వ్యవస్థంటే ఇష్టం లేదు. వలంటీర్ల సేవల కారణంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరొస్తుండటమే దీనికి కారణం. ఈ వ్యవస్థను ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వలంటీర్లంతా మగవాళ్లు లేనపుడు ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వీళ్లది మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు నాయుడు నానా మాటలూ అన్నారు. ఇక ఈయన గారి దత్తపుత్రుడైతే మూడడుగులు ముందుకేసి.. వలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని, ఉమెన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ తమ వాళ్లచేత కేసులూ వేయించారు. కానీ వీళ్ల పథకాలేవీ పారకపోవటంతో... తాము వలంటీర్లకు వ్యతిరేకం కాదంటూ, తాము గెలిస్తే వారి పారితోషికాన్ని పెంచుతామంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. చేసిన పనికి కూలీ ఇవ్వనివాడు ఫ్రీగా బిరియానీ పెట్టిస్తానంటే నమ్మేదెవరు బాబూ? బాబు యావ తెలియనిదెవరికి? బాబుకు పని చేయటం చేతకాదు. కానీ చేయని పనిని కూడా అందంగా చెప్పుకోవటంలో మాత్రం పెద్ద బిడ్డే. అమరావతిలో ఒకటిరెండు భవనాలు కూడా కట్టకుండానే అదో పెద్ద సింగపూర్లా అయిపోయినట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసుకున్న ఘనత బాబుది. నిజానికి అమరావతిని గురించి తెలిసిన వారు... బయటి వారెవరైనా ఆ ప్రాంతమెలా ఉందని అడిగితే, పేరు తప్ప అక్కడేమీ లేదని చెప్పటానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇక 2015లో గోదావరి నదిని ఈయనే కనిపెట్టినట్టు పుష్కరాల సందర్భంగా భారీ ప్రచార వీడియోను షూట్ చేయబోయి ఏకంగా 29 మంది అమాయక భక్తుల్ని బలితీసుకున్నాడు. ఏడాదిన్నర కిందట కూడా... ఎక్కువ మంది జనం వచ్చినట్లుగా చూపించుకోవాలన్న తాపత్రయంలో ఇరుకు సందులో సభ నిర్వహించి, జనాన్ని రప్పించడం కోసం తాయిలాలు కూడా ఇవ్వటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెబుతూ పోతే బాబు ప్రచారపిచ్చికి ఎంతైనా చాలదు. అప్పుడు ప్రభావితం చేస్తారా..!! వలంటీర్లను రాజకీయాలకు సంబంధం లేకుండా, అందరి వద్ద నుంచి నిర్ణీత సమయంలో దరఖాస్తులు స్వీకరించి, అధికారులు ఇంటర్వ్యూలు చేసి వారిని ఎంపిక చేశారు. అలాంటి వలంటీర్లు ఇప్పుడు పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటింటికి వెళితే, వాళ్లు అధికార పార్టీకి అనుకూలంగా లబ్దిదారులను ప్రభావితం చేస్తారనేది చంద్రబాబు అండ్ కో విపరీత బుద్ధి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే అంశంపై ఫిర్యాదు చేసి వలంటీర్లను అడ్డుకున్నారు. ‘అయినా నిత్యం ఆ 50 ఇళ్ల మధ్య ఉండే వలంటీర్లు... పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటికి వెళ్లిన పది నిమిషాలు లేదా పావుగంట సమయంలోనే రాజకీయంగా ప్రభావితం చేస్తారా? వాళ్లు గనక చెయ్యాలనుకుంటే మిగిలిన రోజులన్నీ వాళ్ల పక్కనే ఉంటూ ప్రభావితం చేసే అవకాశం ఉండదా?’ అనేది పింఛనుదార్ల మాట. బాబూ... అచ్చెన్నాయుడు చేత ఫిర్యాదు చేయించలేదా? వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని చంద్రబాబు తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఈ ఏడాది మార్చి 1న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదులో.. ‘ప్రభుత్వం పింఛన్ల పంపిణీ, రేషన్ల పంపిణీలో వలంటీర్లను ఉపయోగిస్తోంది. వలంటీర్లు తమ గ్రామాల్లో, వార్డులో రాజకీయ కార్యకలాపాల్లో నిమ్నగమయ్యే అవకాశం ఉంది. వలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచే గౌరవ వేతనాలు చెల్లిసున్నందున సెక్షన్ 32 ఆర్పీ చట్ట ప్రకారం ప్రభుత్వ సేవకులకు వర్తించేలా శాఖపరమైన క్రమశిక్షణ, నిబంధనలను వీళ్లకూ వర్తింపజేయాలి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు వలంటీర్లపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ ఈసీని కలిసి ‘‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు పింఛను డబ్బులు వాళ్ల ఖాతాల్లోనే జమ చేయాలి’’ అని సూచించారు. ఈ విషయాన్ని ఈటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. దీంతో ఈసీ ‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ విధానంలో పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. 97.91% మందికి పంపిణీ రాష్ట్రంలో 97.91 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ శుక్రవారం తెలిపారు. 65,49,864 మందికి ఈ నెల పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి 64,13,200 మందికి పెన్షన్ డబ్బులు నేరుగాను, బ్యాంకు ఖాతాల్లో జమచేయడం ద్వారాను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇవీ... వలంటీర్లపై బాబు, పవన్ మాటలు ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది. గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం, డిస్ట్రబ్ చేయడం. పగలు మగవాళ్లు ఉండరు.. వలంటీర్లు పోయి తలుపులు కొడుతున్నారు. ఎంత నీచం ఇది’ – 2019, సెపె్టంబర్ 27వ తేదీన చంద్రబాబు ‘ఊళ్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటిష్ ఏజెంట్లలా వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ – 2021, అక్టోబర్ 30న కుప్పంలో చంద్రబాబు ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశి్నస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్లకేంటి సంబంధం’ – 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో చంద్రబాబు. ‘వలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ – 2023, అక్టోబర్ 7న ఏలూరులో పవన్కళ్యాణ్ పింఛన్ కోసం వెళ్లి 12 మంది మృతిరెండు రోజుల్లో 16 మంది మృత్యువాత సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు వికృత రాజకీయానికి రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు బలవుతున్నారు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛను కార్యక్రమంపై చంద్రబాబు తన మనుషులతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి పంపిణీని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసి, బ్యాంకుల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు అవ్వాతాతలు మండుటెండలు, వడగాడ్పుల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలా గురువారం పింఛను కోసం వెళ్లి వడదెబ్బకు నలుగురు మరణించగా, శుక్రవారం 12 మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం జంబుకేశవపురానికి చెందిన జి.నాగయ్య (68), పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరుకు చెందిన ఇంజేటి మంగతాయారు (69), గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన వితంతు మహిళ చొప్పర లక్ష్మి (49), బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువుకు చెందిన చాగంటి సుబ్బాయమ్మ (68), ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన తానికొండ రమణమ్మ (65), ఏలూరు జిల్లా పోలవరం బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాంకు చెందిన కె.పోలినాయుడు (70), కర్నూలు జిల్లా మాచాపురం గ్రామానికి చెందిన ఆనంద్ (61), వైఎస్సార్ జిల్లా బద్వేలులో నాగిపోగు యల్లమ్మ (64), రామయ్య (68), పల్నాడు జిల్లా చిలకలూరిపేటకి చెందిన మాట నాగేశ్వరరావు (65), అనంతపురం జిల్లా ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన ఎరుకుల సుంకన్న (72) వడదెబ్బకు మృతి చెందారు. -
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని,పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌరసేవలందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారు?. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయించడమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చుకున్నాడు. ..చంద్రబాబు లెటర్లు రాసి, ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదు. సీఎం జగన్ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడ కలలు వస్తాయి...పెన్షనర్ల పరిస్థితికి చంద్రబాబే కారణం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం అవస్థలు పడ్డారు. చంద్రబాబు ఏనాడు సరిగ్గా పెన్షన్లు అందించలేదు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. చంద్రబాబు, ఆయన ముఠా కారణంగా పెన్షనర్లకు అవస్థలు. .. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరచిపోలేదు. పెన్షనర్ల శాపాలు చంద్రబాబుకు తగులుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఉంది. కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. .. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అడ్డగోలుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించటం లేదు. ఈ దేశంలో ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయాడు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు. -
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పెన్షన్లు పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5 వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబిటి విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70 శాతం మంది పెన్షన్లను బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది.ఆధార్ లింక్యిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.. దివ్యాంగులు, దీర్ఘకాలిగా వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాలేని 25 శాతం మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
రామోజీ పెన్షన్ల లెక్క తేలుద్దాం
-
అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం జగన్
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది. మీ బిడ్డ అలా కాదు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడమే. – పింఛన్దారులతో సీఎం జగన్ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘‘పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఏ వర్గానికైనా సరే.. మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే ఎక్కడా మీ బిడ్డ తగ్గడు. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు అని స్పష్టంగా చెబుతున్నా. మన ప్రమాణ స్వీకారం రోజు వలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమంపైనే మొట్ట మొదటి సంతకం చేస్తా’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసం చేయడం తెలియదు కాబట్టి బాబు, ఆయన కూటమితో ఈ రెండు విషయాల్లో మాత్రం పోటీ పడలేడని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే.. అవ్వాతాతలపై ప్రేమతో... ఈరోజు అవ్వాతాతలతోపాటు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ ఇచ్చిన పెన్షన్ రూ.1,000 మాత్రమే. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకుంటేనే అందిన దుస్థితి. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం కేవలం రూ.400 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ అవ్వాతాతల గురించి, వారి కష్టాలు, ఆత్మగౌరవం గురించి ఆలోచన చేశాడు. అధికారంలోకి రాగానే దేశంలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నెలకొల్పి వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా 1వ తారీఖునే అది సెలవు రోజైనా, ఆదివారమైనా సరే ఇంటివద్దే నేరుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు పెట్టిన పరిస్థితి 56 నెలలు మన ప్రభుత్వం హయాంలోనే జరిగింది. గతంలో 39 లక్షలు మంది మాత్రమే íపింఛనుదారులుండగా ఈరోజు వివక్ష లేకుండా 66.34 లక్షల మందికి ఠంఛన్గా పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా గత సర్కారు హయాంలో మాదిరిగా రూ.వెయ్యి కాకుండా ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్లి అవ్వాతాతలకు మంచి చేశాం. ఈ తేడాను ఒక్కసారి గమనించండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఆ అవ్వలు, తాతలు, అభాగ్యుల పట్ల మనసులో నిజమైన ప్రేమ ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సభకు హాజరైన అవ్వాతాతలు బాబు ఆ ఆలోచనే చేయలేదు.. మీరంతా గత పాలకులను చూశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు పరిపాలన చేశానని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క రోజైనా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఆయన ఆలోచన చేశాడా? అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలనే తాపత్రయం, మనసులో ప్రేమ ఉంటేనే చేతల్లో బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయాలు పాతాళానికి దిగజారాయి. విలువలు, విశ్వసనీయత లేవు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ తొలిసారిగా అడుగులు వేగంగా వేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఏకంగా 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాడు. మీ బిడ్డకు అబద్ధాలు, మోసాలు తెలియవు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ ముందు ఉంచుతున్న వాస్తవాలపై ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా. దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదే జనాభా ప్రకారం చూస్తే ఐదు కోట్ల మందిలో 66.34 లక్షల మందికి పెన్షన్లు, అత్యధికంగా పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రం మనదే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే అందచేస్తున్నాం. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలిపితే ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. ఏటా రూ.24 వేల కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా బిహార్లో రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో రూ.5,160 కోట్లు, కర్ణాటకలో రూ.4,700 కోట్లు, పక్కన తెలంగాణలో రూ.8,180 కోట్లు చొప్పున ఏటా పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే అవ్వాతాతలను మోసం చేసేందుకు రూ.4 వేలు.. రూ.5 వేలు.. రూ.6 వేలు అని చెబుతారు. ఇంకా అవసరం అయితే ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు అని కూడా అంటారు. మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా చేయగలిగిందే చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాదు. ఈ 58 నెలల పాలన చూస్తే చెప్పనివి కూడా చాలా చేసిన పరిస్థితి మీ అందరికీ కనిపిస్తుంది. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. మీ అందరికీ అందుకే చెబుతున్నా. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండీ. మీ బిడ్డ పేదల సంక్షేమానికి సంవత్సరానికి దాదాపుగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తేవడంతో ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని నమ్మబలుకుతున్న చంద్రబాబు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. సునాయాసంగా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరైనా నాకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్లిప్పులో రాసి బాక్సులో వేస్తే నావద్దకు వస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు చంద్రబాబు చేసిన పనికి... నాకు కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి. అన్ని పథకాలు కలిపి రూ.3.40 లక్షలు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లా. తోడు కోసం ఓ పాపను తీసుకెళితే రాయి తగిలి కింద పడటంతో ఆమె ముక్కుకు గాయం అయింది. మమ్మల్ని ఇంత కష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నా. నీవల్లే ధైర్యంగా బతుకుతున్నా. – కర్నాటి సుబ్బులు, కుర్చేటి మండలం, అగ్రహారం ఎంత ఇబ్బంది బాబూ.. ఇన్నాళ్లూ వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెడితే ఈనెలలో మాత్రం మూడు చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళితే అక్కడ కాదన్నారు. ఇంకో చోటకు వెళితే అక్కడా కాదన్నారు. మోకాళ్ల నొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ బాబు! ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. మాకు వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థ కావాలి. కరోనాలో మాసు్కలతో సహా ఇంటివద్దకే పంపించారు. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకు పథకాలు అందుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తే ఒప్పుకోం. – పట్రా ప్రభావతి, దర్శి దివ్యాంగులు, వృద్ధులపై అక్కసు.. టీడీపీ హయాంలో దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. మీరు (సీఎం జగన్) పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలిచ్చారు. అందులో ఇవ్వని హామీ ఒకటి ఏమిటంటే దేవుడి దూతలా వలంటీర్లను పంపించడం. వారు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులకు పెన్షన్లే కాకుండా సదరం సర్టిఫికెట్ నుంచి ఆధార్ కార్డు దాకా ప్రతి ఒక్కటీ అందేలా చేశారు. బాబు మిమ్మల్ని ఏమీ చేయలేక అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టి కొట్టుకుపోతారు. 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోవటాన్ని నేను కళ్లారా చూశా. దీనికి ఎవరు కారణమనేది అందరూ ఆలోచన చేయాలి. – నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు నిన్నే నమ్ముకున్నానయ్యా.. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాకు వైఎస్సార్ ఇల్లు కట్టించాడు. నాకు నలుగురు కొడుకులున్నా నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు వచ్చాయి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా. – గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం దోమలు కుడుతున్నా.. పింఛన్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి మాకు పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలే ఉండేవి. దోమలు కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుందనే భయంతో వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వుండేవాడ్ని. సిబ్బంది 8 గంటలకు వచ్చేవారు. అన్ని పూర్తి చేసేసరికి 9 గంటలు అయ్యేది. అప్పటికే దాదాపు రెండు మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లను తరువాత రావాలని పంపేవారు. అలా వారం రోజులు పెన్షన్లు ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన బంగారు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారికి మే 13న ప్రజాకోర్టు శిక్ష వేస్తుంది. జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది. – వెంకటపతి, దర్శి పల్లెటూళ్లకు పాలన తెచ్చారు.. నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేదలకు నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్కు వెళ్లాల్సిందే. ఇప్పుడు అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసి భయపడుతున్నారు. – శ్రీనివాస్రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం నీ నీడన మేం ఉండాలి.. నా పెనిమిటి మరణించి 15 ఏళ్లు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ రూ.1.30 లక్షల మేర లబ్ధి పొందా. ఈనెల పెన్షన్ వలంటీర్ ఇవ్వలేదు. నా కుమారుడిని అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నా. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. సొంత కొడుకులు, కోడళ్లు పదెకరాల ఆస్తి ఇచ్చినా మనల్ని చూడరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి దైవబలంతో ఆ తల్లికి జన్మించాడు. అలాంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి. – వెంకాయమ్మ, శివాజీ నగరం వార్డు, దర్శి, వితంతు పెన్షన్ లబ్ధిదారు ఐదు గద్దలు మాపై పడ్డాయి.. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు అరకొర పెన్షన్లు ఇవ్వడంతోపాటు ఒక íపింఛనుదారుడు చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలు మంజూరు చేసేవి. వలంటీర్లను అడ్డుకునేందుకు రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి లాంటి ఐదు గద్దలు తోడయ్యాయి. ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి నాలాంటి గుడ్డోళ్లు, ముసలోళ్లను దెబ్బ తీశారు. పది మంది చూపు పడితే బండ రాళ్లైనా పగిలిపోతాయి. 69 లక్షల మంది చూపు పడి ఆ ఐదుగురూ నామరూపాలు లేకుండా పోతారు. – శ్రీను, పెద ఉయ్యాలవాడ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు -
పేదలు పణంగా బాబు రాజకీయం
రాజకీయాల్లో వ్యూహాలు – ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు వేయటం, ప్రత్యర్ధిని దెబ్బతీసి తాము అధికార పగ్గాలు చేపట్టాలనుకోవటం సహజం. దీని కోసం కొంతమంది స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తే మరి కొంతమంది నాయకులు వెన్ను పోట్లు, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తారు. ఇవి కూడా చర్చనీయాంశమే అయినా... పవర్ కోసం కొట్లాట రాజకీయ పార్టీలు, రాజ కీయ ప్రత్యర్ధుల మధ్య ఉండటం వరకు సమర్థించవచ్చు. కాని స్వార్థం హద్దులు దాటి అధికారం కోసం, ప్రత్యర్ధిని దొంగ దెబ్బ తీయటం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెట్టాలనుకోవటం, బలహీన వర్గాల ప్రజలతో చెలగాటం ఆడే కుట్రలు... ఏ మాత్రం సహించ దగినవి కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కూటమి ఇప్పుడు ఇటువంటి ప్రమాదకర రాజకీయ క్రీడకు తెర తీశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తీవ్ర అనారోగ్యగ్రస్థులకు వారి ఇంటి దగ్గరే వాలంటీర్లు పెన్షన్ అందించే విధానాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు. తన జేబులోని మనిషి, తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్లు పెన్షన్లను లబ్ధిదారులకు పంచకూడదని ఫిర్యాదు చేయించారు. వీరి ఫిర్యాదుకు అను గుణంగా ఈసీ ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పుడు 66 లక్షల మంది పెన్షనర్లు మూడు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో, బాబు హయాంలో పెన్షన్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల వద్ద పండుటాకులు ఎలా పడిగాపులు పడేవారో పత్రికల్లో ఫోటోలతో సహా వార్తలు నిత్యం వస్తూ ఉండేవి. వారం, పది రోజుల పాటు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది ఆ రెండు వందల రూపాయల పెన్షన్ కోసం. పూట గడవని స్థితిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అవ్వా తాతలు అలానే అంతటి కష్టాన్నీ భరించే వారు. కాస్త కాలు చేయి బాగానే ఉన్నవారు సరే. మరి మంచాన పడిన వారు, నాలుగడుగులు కూడా వేయలేని వారు, ఆసరా లేకుండా నిలబడ లేని వారి పరిస్థితిని ఊహించగలమా? జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిస్సహాయులను ఇటువంటి దుఃస్థితి నుంచి బయటపడేశారు. పెన్షన్ కోసం మంచం దిగాల్సిన అవసరం రాకుండా సగౌరవంగా వాలంటీర్లే లబ్ధి దారుల ఇళ్ళకు వెళ్ళి అవ్వా, తాతల చేతుల్లో పెట్టే విధంగా వాలంటీర్–సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారు. అది కూడా ఫస్ట్ తేదీనే, కోడి కూయక ముందే! ఇప్పుడు అక్షరాల 3 వేల రూపాయల పెన్షన్ 66 లక్షల మందికి అందు తోంది. వృద్ధులనే కాదు వికలాంగులు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ వంటి తీవ్ర రోగాల పాలైన వారిని కూడ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకుంటోంది. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడేందుకు వీరి ఆరోగ్యం సహకరించదు. ఓ వైపు మండుతున్న ఎండలను తట్టుకునే శక్తీ ఉండదు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల మంచాన పడిన వారు కూడా పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరిగాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఉన్న భయం, ఆక్రోశం ఇవాళ్టిది కాదు. గత రెండు, మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. పట్టుమని పాతికేళ్లు నిండని ఈ పిల్లలను రెడ్ లైట్ ఏరియాకు మహిళలను సరఫరా చేసే బ్రోకర్లుగా, హ్యూమన్ ట్రాఫికర్లుగా, దొంగలుగా పవన్, చంద్రబాబు మొన్నటి వరకు చిత్రించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి చేసిన మంచి వల్ల ప్రజలంతా జగన్కే మళ్లీ పట్టం కడ తారన్న ఆందోళనతోనే చంద్రబాబు ఇంతటి క్రూరమైన క్రీడకు తెర తీశారు. దీని ద్వారా చంద్ర బాబు రెండు విషయాలపై స్పష్టత ఇచ్చారు. రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం మొదటి లక్ష్యం. బడుగు బలహీన వర్గాలకు చెందిన పండు టాకులనూ, నిస్సహాయులనూ మళ్లీ రోడ్డున పడవేసి పెత్తందారీ, దురహంకారపూరిత ఆనందాన్ని పొందటం రెండో లక్ష్యం. వృద్ధులు, నిస్సహాయులను క్షోభ పెడితే ఆ పాపం ఊరకనే పోదు. ఇది నిజం! – ఆర్ఎస్ -
దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: సంకల్పం ఉంటే ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు అండ్ కో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, దిగ్విజయంగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. పింఛన్ల విషయంలోనూ పచ్చ గ్యాంగు కుట్రలకు ఏమాత్రం వెరవకుండా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు ఠంఛన్గా పింఛన్లు అందజేసింది. ఎన్నికల కోడ్ను సాకుగా చూపి చంద్రబాబు అండ్ కో వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించి ఆటంకాలు సృష్టించినా.. ప్రభుత్వం అవ్వాతాతలకు ఠంఛన్గా పింఛన్ డబ్బులను అందజేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీని ప్రారంభించి, కేవలం ఆరు గంటల్లోనే 26,00,064 మంది లబ్దిదారులకు రూ. 785.25 కోట్లు అందజేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్గా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్లు అందజేస్తున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ చేసిన ఫిర్యాదుల మేరకు మార్చి 30న కేంద్ర ఎన్నికల సంఘం ఇ చ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వలంటీర్లను ఈ కార్యక్రమం నుంచి పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ప్రశాంతంగా సాగుతున్న పింఛన్ల పంపిణీలో హఠాత్తుగా గందరగోళం నెలకొంది. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే ప్రత్యామ్నాయ పద్ధతులను రూపొందించింది. మంగళవారం రాత్రికే రాష్ట్రంలోని అన్ని సచివాలయాలకు వాటి పరిధిలోని లబ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా పింఛన్ల నిధులను విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. సచివాలయాల సిబ్బంది బుధవారం బ్యాంకులు తెరిచిన తర్వాత డబ్బులు డ్రా చేసి, మధ్యాహ్నం 12.30 నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. రాత్రి ఏడు గంటల వరకు పింఛన్ల పంపిణీ కొనసాగిందని అధికారులు తెలిపారు. 39.58 శాతం మేర పంపిణీ పూర్తి ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 66 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ. 1,951.69 కోట్లు విడుదల చేయగా, బుధవారం రాత్రి వరకు 26,00,064 మందికి రూ. 785.25 కోట్లను సచివాలయాల సిబ్బంది పంపిణీ చేశారు. మొత్తం 39.58 శాతం మందికి పింఛన్లు అందాయి. మరో మూడు రోజులు సచివాలయాల వద్ద ఈ పంపిణీ కొనసాగుతుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్ చైర్కు పరిమితమైన వారికి తప్పనిసరిగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారమే 54.82 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు ఆ జిల్లాలో 3,16,492 మంది లబ్ధిదారులు ఉండగా, బుధవారం రాత్రి వరకు 1,73,485 మందికి పంపిణీ పూర్తయింది. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలోనూ 52.13 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 50.42 శాతం, ఏలూరు జిల్లాలో 48.88 శాతం, ప్రకాశం జిల్లాలో 46.60 శాతం, తిరుపతి జిల్లాలో 46.26 శాతం చొప్పన పంపిణీ పూర్తయినట్టు అ«ధికారులు వివరించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కువ భాగం ఆఫ్లైన్ విధానంలో పంపిణీ జరుగుతున్నందున, ఆ వివరాలు అందాల్సి ఉందని అధికారులు వివరించారు. నేడు ఉదయం 7 గంటల నుంచే పింఛన్ల పంపిణీ వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించినట్లు చెప్పారు. ఈ విభాగాల పింఛన్దారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బంధం తెంచిన బాబుబుధవారం మధ్యాహ్నం తర్వాత పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కొత్త మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. వలంటీర్లు ఉండి ఉంటే ఈ సమాచారం వెంటనే లబ్ధిదారులకు తెలిసి ఉండేది. వలంటీర్లు లేకపోవడంతో వారికి సరైన సమాచారం అందలేదు. తాజా మార్గదర్శకాల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసినా, ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యే అవ్వాతాతలకు స్పష్టంగా తెలియలేదు. దీంతో లబ్దిదారులు బుధవారం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకోవడంతో కొంత గందరగోళం నెలకొందని అధికారులు చెప్పారు. 2019 ఆగస్టులో రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వివరాలను నేరుగా వలంటీర్ల ద్వారా సంబంధిత లబ్దిదారులకు సకాలంలో, స్పష్టంగా అందుతుండేదని అధికారులు చెప్పారు. లబ్దిదారులకు ఏదైనా సహకారం అవసరమైనా వలంటీర్లు అందించేవారని తెలిపారు. హఠాత్తుగా వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల నుంచి తప్పించడంతో ఇప్పుడు వారి ద్వారా సమాచారం తెలిసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, ఆ కారణంగా పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలవుతుందన్న ప్రభుత్వ సమాచారం కూడా లబ్దిదారులకు తెలియలేదని అధికారులు వివరించారు. నాలుగున్నరేళ్లకు పైగా ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వలంటీర్ల బంధాన్ని చంద్రబాబు అండ్ కో తెంచడంతో పేదలకు ఈ ఇబ్బందులు వచ్చాయని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. -
చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు?
అవ్వతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు.. ముసలి వాళ్లు, వికలాంగుల కన్నీళ్లపై నోరు మెదపరు.. నిమ్మగడ్డ, ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నావు.. చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు? రామోజీ.. అవ్వాతాతల కష్టాలు ఎందుకు రాయవు? చేసిదంతా చేసి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. అవ్వాతాతల రియాక్షన్ చూసి బాబు సైలెంట్ అయిపోయాడా? పింఛన్ దారులకు సమాధానం చెప్పలేక ఎల్లో ముఠా నోరు మూతబడిందా? గత ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం.. సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. అదేదో సినిమాలో డైలాగు లాగా... వాడు ఎక్స్ దొంగ.. ఎప్పుడు దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ..! అన్నట్టుగా సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లోనూ చంద్రబాబు ఇంతే..! కుట్రలు, కుతంత్రాలు చేయడం.. నిమిషంలో దొరికిపోవడం. వాలంటీర్ల విషయంలో ఇదే చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు చేయి నోటికి అడ్డంగా పెట్టుకుని సైలెంట్ అయ్యాడు. నిమ్మగడ్డను కలుగులో దాక్కోమని చెప్పాడు. ఎల్లో మీడియాను జగన్ పై రివర్స్ అటాక్ చేయమన్నాడు. దత్తపుత్రుడ్ని హైదరాబాద్ పోయి ఆసుపత్రి బెడ్పైకి పడుకోమన్నాడు. నాకర్థం కాదు.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లంటే.. చంద్రబాబు ఆయన పచ్చ ముఠాకు ఎందుకంత కోపం.. ఎందుకంత కసి.. ఎందుకంత కక్ష.. వాళ్ల నోటి దగ్గర కూడు లాగేసుకుని రాక్షసానందం పొందాలని ఎందుకు అనుకుంటున్నారు. చంద్రబాబు ముఠా ఎన్ని కుట్రలు చేసినా.. ప్రభుత్వం మాత్రం ఆ 66 లక్షల మందికి పెన్షన్లు అందించేందుకు వేరే మార్గాలు అన్వేషించింది.. పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించింది. సచివాలయాలకు రాలేని వారికి ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో రాష్ట్రం రూపురేఖలనే జగన్ మార్చేశారు. జగన్కు వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక కోర్టుల్లో కేసుల మీద కేసులు వేసి.. ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చి.. ఆఖరికి అవ్వాతాతలకు వాలంటీర్లు ఫించన్లు ఇవ్వకూడదన్న ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని ఫలితం ఏ రకంగా ఉంటుందో.. అవ్వాతాతల శాపనార్థాలు ఏ స్థాయిలో ఉంటాయో.. ఈరోజు పచ్చ ముఠాకు అర్థమైంది. దెబ్బకు ఠా దొంగల ముఠా అన్నట్టుగా.. ఎక్కడి దొంగలు అక్కడే సైలెంట్ అయిపోయారు. అయినా సరే అవ్వాతాతల కన్నీళ్లకు కారణమైన 74 ఏళ్ల కుప్పం తాత.. 87 ఏళ్ల ఎల్లో తాత.. ప్రజలు అడుగుతున్న ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. 1. జగన్ ను నేరుగా ఎదుర్కోలేక అడ్డదారిలో నిమ్మగడ్డను తెరపైకి తెచ్చావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 2. పేదలకు పింఛన్ల అందకుండా నిమ్మగడ్డకు పసుపు ముసుగు తొడిగి ఈసీ వద్దకు పంపించావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 3. నిమ్మగడ్డతో సుప్రీం కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో వరుస కేసులు వేయించావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 4. జగన్ నా మనవడు.. నా కొడుకు అంటున్న అవ్వాతాతలపై కక్ష తీర్చుకున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 5. సంక్షేమంతో సుఖంగా ఉన్న వికలాంగులు, వితంతువులపై పగ తీర్చుకున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 6. ఎర్రటి ఎండలోకి వృద్ధులను లాగి పచ్చమూక పైశాచికానందం పొందుతోందా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 7. పింఛన్ వస్తుందో రాదోనన్న భయంతో తాత చనిపోతే తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 8. నీ కుట్రలు, కుతంత్రాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 9. వాలంటీర్లు ఫించన్లు అందించకూడదంటూ ఈసీకి ఫిర్యాదు చేయించింది నేనే అని చెప్పలేకపోతున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 10. అవ్వాతాతలు నిలదీస్తారని పవన్ హైదరాబాద్ పారిపోయి హాస్పిటల్ బెడ్ పై పడుకుని నటిస్తున్నాడా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు -
పెన్షన్ల పంపిణీని ఆపిన పాపం చంద్రబాబుదే: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని కొనియాడారు. 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా తము అడ్డుకోలేదన్నారు పేర్ని నాని. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారని ప్రస్తావించారు. పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా ఏం మాట్లాడారు ? ఇప్పుడేం మాట్లాడుతుతున్నారని ప్రశ్నించారు. తాము ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారని.. ఇప్పుడు లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని వాళ్లే చెబుతున్నారని అన్నారు. మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారని పేర్ని నాని తెలిపారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా అని మండిపడ్డారు. చదవండి: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ‘చంద్రబాబు కూడా 40 వేల కోట్లు ఇచ్చారు. మరి అప్పుడు జనం ఎందుకు ఓటేయలేదు?. పసుపు కుంకుమ, రైతు నేస్తం అంటూ చంద్రబాబు ఎర వేసినా జనం నమ్మలేదు పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఎవరికి వచ్చింది?. ముసలివారి ఉసురు మీకు తగలదా?. వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే మాకు ఓటేస్తారా?. 50 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నీకు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా?. 58 నెలలు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించాం. 2 నెలలు పెన్షన్లు ఆపినంత మాత్రాన లబ్దిదారులకు జగన్పై ప్రేమ తగ్గిపోతుందా?.వాలంటీర్ల వ్యవస్థ పై విషం కక్కారు. వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైనదైతే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కదా? నిన్నటిదాకా మీరు మాట్లాడిన ప్రతిమాటా విషపు మాటే’ అంటూ ఫైర్ అయ్యారు పేర్ని నాని -
కుట్ర ఫలించి.. గడప దాటించి!
చంద్రబాబు అండ్ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్దారులకు పింఛన్ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికే పింఛన్ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీరికి ఇంటి వద్దే పంపిణీ ► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు (నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు. ► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. బాబు ఎంత పని చేశావయ్యా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్ కోసం ఆలోచించలేదు. ఠంచన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు. –కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో.. నాకు వితంతు పింఛన్ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు. – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం మా ఉసురు తగులుతుంది టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు. మా ముసలోళ్ల ఉసురు ఆయనకు తగులుతుంది. – బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం -
నేటి మధ్యాహ్నం నుంచి.. సచివాలయాల్లో పింఛన్లు
సాక్షి, అమరావతి: ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు. ♦తప్పనిసరిగా ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలు మినహా మిగిలిన కేటగిరీ పింఛనుదారులందరికీ ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే íపింఛన్ల పంపిణీ చేపడతారు. ♦ ఒక గ్రామ సచివాలయం పరిధిలో వివిధ గ్రామాలు ఉన్నచోట్ల ప్రత్యేక సిబ్బందిని నియమించి పంపిణీ చేస్తారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ♦ వేగంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో పంపిణీకి సరిపడినంత మందిని ఇందుకోసం కేటాయించుకోవాలని సూచించారు. ♦ సచివాలయాల వద్దకు వచ్చే íపింఛనుదారులకు ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ సమాచారాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ♦ పింఛన్ల పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ♦ సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 6వతేదీ కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ♦ ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలకు ఇంటి వద్దే పంపిణీ సందర్భంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి. ♦ పింఛన్ల పంపిణీని సచివాలయాల వద్ద లబ్దిదారుల ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలి. ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిïÙయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలి. ♦ ఫింఛన్లు పంపిణీ చేసే సమయంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. తప్పనిసరిగా ఎన్నికల కోడ్ను పాటించాలి. ♦సచివాలయాల సిబ్బంది అందరికీ కొత్తగా íపింఛన్ల పంపిణీకి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ లాగిన్లు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. n పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. కలెక్టర్లతో చర్చించాకే నిర్ణయాలు పింఛన్ల పంపిణీలో వలంటీర్ల ప్రమేయాన్ని పూర్తిగా తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలపై అభిప్రాయాలు సేకరించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణకుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ విధానంలో పింఛన్లు అందించేందుకు అందరికీ బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించామన్నారు. వారందరికీ అప్పటికప్పుడు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవడంలో చాలా సమస్యలున్నట్లు తేలిందన్నారు. పింఛన్ల డబ్బులు బ్యాంకులో జమ చేసినా వాటిని తీసుకునేందుకు లబ్దిదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని గుర్తించామన్నారు. మరో ప్రత్యామ్నాయంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడంలోనూ ఇబ్బందులున్నట్లు వెల్లడైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు 2.66 లక్షల మంది ఉండగా సచివాలయాల ఉద్యోగులు కేవలం 1.27 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. 12,770 మంది ఏఎన్ఏంలు, 14,232 మంది వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, వెటర్నరీ, ఫిషరీష్ అసిస్టెంట్లు, 6,754 మంది ఎనర్జీ అసిస్టెంట్లను వారి విధులకు అటంకం కల్పిస్తూ పింఛన్లు పంపిణీ చేయించే పరిస్థితి లేదని తమ చర్చల్లో గుర్తించామన్నారు. మిగిలిన సచివాలయాల ఉద్యోగులలోనూ చాలా మంది ఎన్నికలకు సంబంధించి బీఎల్వో విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. వారందరినీ మినహాయిస్తే లబ్దిదారుల ఇళ్ల వద్ద í íపింఛన్ల పంపిణీకి వినియోగించుకునేందుకు సచివాలయాల ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు లబ్దిదారుల చిరునామాలు కచి్చతంగా తెలిసే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని, అందువల్ల పంపిణీలో జాప్యం జరిగే అవకాశం ఉందని నిర్ధారించుకున్నారు. -
‘‘ఫించన్లు ఆపి మొసలి కన్నీరా..?’’ బాబుపై మంత్రి మేరుగ ఫైర్
సాక్షి, తాడేపల్లి: పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ‘ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై బాధ్యతగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడు. స్వయాన ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు చేశాడు. నిమ్మగడ్డ సర్వీసులో ఉన్నప్పుడు మాపై కుట్రలు కుతంత్రాలతో పనిచేశాడు. ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి బద్ధ విరోధిలా పనిచేశారు. ఆయనే ఈ రోజు దేశంలోనే గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థపై కత్తి కట్టాడు. పేద ప్రజలు, నిస్సహాయులను ఆదుకోడానికి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమమైన పద్దతిలో చేరవేసే ఉద్ధేశంతో వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ పెట్టారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పింఛన్లు పంచకూడదని నీ బంధువు ద్వారా కోర్టులకు, ఎన్నికల కమిషన్కు వెళ్లి ఆ వ్యవస్థను నిలిపేశావంటే ఎంత దిగజారావో అర్ధం అవుతోంది. వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని కేసులు వేయించి, తగుదునమ్మా అంటూ మళ్లీ పింఛన్లు పంచాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థను ఆపి రాజకీయంగా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు ఆలోచన. ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డాడు. ఈ రోజు పింఛన్లు రాక అనేక ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబే. ఇదంతా చేసి ఎందుకు పింఛన్లు పంచలేదని ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. అంతా నువ్వే చేసి తగుదునమ్మా అంటూ మెసేజ్లు పెట్టడం ఏంటి? ఎవరితో ఆపించావో నీకు తెలుసు. ఆపించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి ఎక్స్(ట్విట్టర్)లో మెసేజ్లు పెడుతున్నావు. నువ్వొచ్చాక పింఛన్లు ఇస్తావా? నువ్వు వచ్చేది ఏంటి బోడిగుండు? నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇస్తున్నావు. ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకోలేక అరువు తెచ్చుకున్నావు. ఎస్సీ, ఎస్టీలను అపహాస్యం చేశావ్..ఎస్సీల్లో పుట్టకూడదు అని చెప్పావు. బీసీల తోకలను కత్తిరిస్తానన్నావు..బీసీలు జడ్జిలుగా పనికిరానన్నావు. నువ్వు డబ్బులున్న వారి అడుగులకు మడుగులు వత్తుతున్నావు. నా పేదవాళ్లు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. టిప్పర్ డ్రైవర్లే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు చూడు చంద్రబాబు. టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారంటూ మాట్లాడతావా? ఎంత మదంతో ఉన్నావు.. మా పల్లెల్లోకి వచ్చి నువ్వు ఓట్లు అడుగుతావా? ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేస్తే పేదవారి స్థితిగతులను మార్చడానికి సీఎం జగన్ పనిచేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్గా ఉన్న నా ఎస్సీ సోదరుడికి...అంబేద్కర్ గారు కల్పించిన అవకాశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. మా డ్రైవర్లు అంటే నీకు అంత తేలిక. ఆటోలు, టిప్పర్లు, లారీలు నడుపుతున్న ప్రతి డ్రైవర్ చంద్రబాబు అంతాన్ని పంతంగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర పునరావృతం అవుతుంది. కాసుకో చంద్రబాబూ..నీ కుట్రలు, కుతంత్రాలు సీఎం జగన్ ముందు చెల్లవు. మా పార్టీలో ఉన్నదంతా పేదలు. వారే జగన్ గారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఏ బ్లేడో, ఏ కత్తో..ఎక్కడ జరిగిందో పవన్ కల్యాణే చెప్పాలి. విలువలు లేని మాటలు, విశ్వసనీయత లేని మాటలు పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి? వారెన్ని మాటలు మాట్లాడినా ప్రజలు వారిని తుంగలో తొక్కుతారు’ అని మేరుగ మండిపడ్డారు. ఇదీ చదవండి.. ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. విధి విధానాలివే -
మళ్లీ ‘అవ్వ’స్థలు తప్పవా!
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా): రేపటి నుంచి పింఛన్ ఇంటికి తెచ్చి ఇవ్వరన్న వార్తలు అవ్వాతాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. టీడీపీ హయాంలో పడిన అవస్థలు జ్ఞప్తికి తెచ్చుకుని వారు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందేమోనని మదనపడుతున్నారు. ఇదే విషయంపై తన గోడు వెలిబుచ్చారు ఓ అవ్వ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చినదొడ్డిగల్లుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అనకాపల్లి లోక్సభ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు కురందాసు వృద్ధురాలు ఎరకమ్మ ఇంటికి వెళ్లారు. పింఛను వస్తుందా అంటూ ఆరా తీశారు. ఎరకమ్మ బదులిస్తూ ‘‘ఇప్పటివరకు ప్రతినెలా ఒకటో తేదీ పొద్దుపొద్దునే వలంటీరు వచ్చి డబ్బులిస్తున్నాడు. రేపు ఒకటోతేదీ కదా పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వరంట. మేమే సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంట. వలంటీర్లను తీసేశారంట నిజమేనా బాబూ! ఈ వయసులో సచివాలయం వరకు వెళ్లి తెచ్చుకోలేమయ్యా.. ఇంటికొచ్చి ఇచ్చేటట్టు చూడయ్యా’’ అంటూ వేడుకుంది. ముత్యాలనాయుడు స్పందిస్తూ చంద్రబాబు వల్లే ఎన్నికల అధికారులు వలంటీర్లను రెండునెలలపాటు ఆపారు. జగనన్నకు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇస్తారు. మీరంతా జగన్కే ఓట్లు వేయాలని’’ అని వివరించారు. అవ్వ మాట్లాడుతూ ‘‘నా ఓటు జగన్బాబుకే కొడుకా’’ అని వెల్లడించింది. అదే గ్రామంలో అప్పారావు అనే వృద్ధుడూ పింఛన్ ఇంటికే తెచ్చివ్వాలని కోరాడు. -
పింఛన్లపై బాబు డబుల్ గేమ్
సాక్షి, అమరావతి: అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు, పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛన్లు అందిస్తూ పాలనను ప్రతి గడపకూ చేరువ చేశారు. దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థపై చంద్రబాబు వేయని నింద లేదు, చేయని ఆరోపణ లేదు. వివక్ష, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు పారదర్శకంగా లబ్ధి పొందడం టీడీపీకి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. చంద్రబాబు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా నిత్యం అభాండాలు వేయడమే పనిగా వ్యవహరించారు. వలంటీర్లు రాత్రిళ్లు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారి వల్ల ఆడపిల్లలకు రక్షణ లేదని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని కుట్రపూరిత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో వేలమంది యువతులు కనిపించకుండా పోయారని, అందుకు వలంటీర్లే కారణమంటూ దారుణంగా మాట్లాడారు. ఇలా అడుగడుగునా విపక్షం వేధించి అవమానించినా వలంటీర్లు పేదల సంక్షేమమే లక్ష్యంగా సేవాభావంతో విధులు నిర్వహించారు. నిమ్మగడ్డ ద్వారా.. సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లాలన్నది చంద్రబాబు కుతంత్రం. ఈ పనిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఆయన ప్రత్యేకంగా అప్పగించారు. నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా ఏ స్థాయిలో పని చేశారో అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ కోసం హఠాత్తుగా వాయిదా వేసి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన చరిత్ర ఆయనది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే హైదరాబాద్లోని ఓ హోటల్లో చంద్రబాబు బినామీలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ను కలసి చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా వెనుకాడబోనని చాటుకున్నారు. పదవీ విరమణ తరువాత కూడా నిస్సిగ్గుగా చంద్రబాబుకు మేలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసం కొంతమందిని పోగుచేసి సిటిజన్ డెమొక్రటిక్ ఫోరం పేరుతో తెర వెనుక రాజకీయాలు నడిపారు. అందులో భాగంగానే వలంటీర్ల వ్యవస్థ లేకుండా చేసేందుకు కోర్టులో కేసు వేశారు. పింఛన్ల పంపిణీకి అడ్డుపడి ఈసీకి ఫిర్యాదులు చేశారు. ప్రజాగ్రహంతో... పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం చంకలు గుద్దుకున్నా ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది. చంద్రబాబు, నిమ్మగడ్డ నిర్వాకాల కారణంగా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఆగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేటు ఫిరాయించింది. తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ అందులో పేర్కొన్నారు. -
అవ్వాతాతలపై బాబు పగ..
సాక్షి, అమరావతి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో ఎలాంటి పైరవీలు, లంచాలకు తావులేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలను ఠంఛనుగా అందజేయడంలో కీలకంగా ఉన్న వలంటీర్లపై చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో గ్యాంగ్ చివరకు తన పగ సాధించింది. అవ్వాతాతలకు ఏ కష్టం లేకుండా నెలనెలా ఒకటో తారీఖు పొద్దున్నే తలుపుకొట్టి మరీ పింఛన్లు అందజేస్తున్న ఈ వలంటీర్లపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ మొదటినుంచీ రకరకాల వివాదాస్పద ఆరోపణలు చేస్తూ తమ అక్కసును, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర దాదాపు 66.40 లక్షల మంది లబ్ధిదారులను మళ్లీ టీడీపీ పాలనలో మాదిరిగా ఇబ్బందులకు గురిచేయడానికే చంద్రబాబు బరితెగించారు. ఇందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను పావుగా వాడుకున్నారు. చంద్రబాబు సేవలోనే తరిస్తున్న నిమ్మగడ్డ.. నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ.. ఆయన పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే మొదటి నుంచీ పనిచేసిన వ్యక్తే. స్థానిక సంస్థల నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా సిఫార్సు చేశారు. వాస్తవానికి.. 2018లో రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసినా.. 2019 సాధారణ ఎన్నికల ముందు ఆ ఎన్నికల జరిగితే నాటి చంద్రబాబు ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి నిబంధనలకు విరుద్ధంగా కోర్టు సాకుల పేరుతో సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు సర్పంచి ఎన్నికలు జరగకుండా నిమ్మగడ్డ అడ్డుకున్నారు. ఇక జగన్ సీఎం అయ్యాక కూడా.. 2020 ఆరంభంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేశారు. అప్పట్లో ఈ నిర్ణయం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. వలంటీర్లపై సుప్రీంకోర్టులోనూ నిమ్మగడ్డ కేసులు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత తన పూర్తి సమయాన్ని ఆయన తన బాస్ చంద్రబాబుకే కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన నేతృత్వంలో పలువురు ద్వారా చంద్రబాబు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను ఏర్పాటుచేసి, ఆ సంస్థ ద్వారా వలంటీర్ల వ్యవస్థపై పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తూ కోర్టులోనూ కేసులు దాఖలు చేయించారు. వలంటీర్ల వ్యవస్థ చెల్లుబాటునే ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి, ఆ తర్వాత తనంతట తానుగా ఆ కేసును ఉపసంహరించుకున్నారని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులోనూ కేసు దాఖలు చేశారని, రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో వరుసగా రెండుసార్లు వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఫిర్యాదు చేసింది. రూ.లక్షల్లో లాయర్లకు ఫీజులు.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై మొత్తం కథ నడిపించిన చంద్రబాబు ఇందుకు లాయర్ల ఫీజుల నిమిత్తం రూ.లక్షల్లో వెచ్చించారు. సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసులు వాదించేందుకు ఖరీదైన లాయర్లను వినియోగించారు. నిజానికి.. అంత పెద్ద లాయర్లను భరించడం ఈ సంస్థవల్ల కాదు కాబట్టి చంద్రబాబే వెనుకనుండి ఇదంతా నడిపిస్తున్నారు. ఇక ఈ కేసులను కపిల్ సిబాల్, సిద్ధార్థ దవే., పీబీ సురేష్ వంటి సీనియర్ లాయర్లు వాదిస్తున్నారు. వీళ్ల ఫీజులు రోజుకు రూ.లక్షల్లో ఉంటుందన్నది తెలిసిందే. నరకప్రాయమైన ఆ రోజులు మళ్లీ.. చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర దాదాపు 66.40 లక్షల మంది లబ్ధిదారులు మళ్లీ రోడ్డున పడనున్నారు. అప్పట్లో చంద్రబాబు పాలనలో వీళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవి మళ్లీ పునరావృతం కానున్నాయి. ఆ రోజుల్లో పింఛన్ల కోసం బ్యాంకులకు వెళ్తే చాంతాడంత క్యూలు.. మండే ఎండల్లో తిండి లేకుండా నిరీక్షణ.. ఈలోపు సమయం మించిపోతే మళ్లీ బ్యాంకుల నుంచి ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. కానీ, 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీరి కష్టాలన్నింటికీ మంగళం పాడుతూ వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇది ఎప్పటికైనా తన పుట్టి ముంచుతుందని చంద్రబాబు గ్రహించి సందర్భం వచ్చినప్పుడల్లా వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కేవారు. బాబు జేబు సంస్థ ముసుగులో.. తన జేబు సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను చంద్రబాబు కొద్దిరోజుల ముందే ఏర్పాటు చేయించారు. దీని ముసుగులో చంద్రబాబు తన కుట్రలకు ఎప్పటినుంచో పదునుపెట్టారు. ఎన్నికల సమయంలో ఈ వలంటీర్లను ఎలాగైనా విధుల నుంచి దూరం పెట్టాలని పచ్చబ్యాచ్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా.. తన నమ్మినబంటు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఈ సంస్థకు నేతృత్వం వహించి బాబు డైరెక్షన్లో కేంద్ర ఎన్నికల సంఘానికి మొన్న ఫిబ్రవరి నుంచి అదేపనిగా వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి నగదు పంపిణీ చేపట్టవద్దంటూ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ విషయం ఈసీ కూడా తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. -
CRDA: నిరుపేదలకు ఇక డబుల్ పెన్షన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పెన్షన్ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది. -
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి : ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతుండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటాపెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. 2019–20 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.17,385 కోట్లు ఉండగా, 2022–23 నాటికి పెన్షన్ల వ్యయం రూ.22,584 కోట్లకు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.. అంటే నాలుగేళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం 2019–20లో రూ.36,179 కోట్లు ఉండగా, 2022–23 నాటికి వేతనాల వ్యయం రూ.49,421 కోట్లు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది. -
96.13 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 96.13 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. వలంటీర్లు శనివారం కూడా రాష్ట్రమంతటా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. 66,15,482 మంది లబ్ధిదారులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.1961.13 కోట్లు విడుదల చేసింది. శనివారం వరకు మొత్తం 63,59,727 మంది లబ్ధిదారులకు రూ.1,885 కోట్లు అందజేశారు. ఇందులో దాదాపు 54 లక్షల మంది లబ్ధిదారులకు 1వ తేదీనే పింఛను డబ్బులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
నరకం చూపి ‘నారా’ నాడు
చోడవరం: గత తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులనూ వదల్లేదు. నరకం చూపించింది. జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు మానవత్వాన్నే మరిచి అంగవైకలురుపైనా కక్షసాధింపు చర్యలకు దిగారు. పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైన వారిపైనా కర్కశం ప్రదర్శించారు. ఎన్నిసార్లు వేడుకున్నా.. పింఛన్లు మంజూరు చేయలేదు. అప్పటికే ఉన్నవీ భారీ స్థాయిలో తొలగించారు. ఫలితంగా బాధితులు అష్టకష్టాలు పడ్డారు. పింఛన్ల మంజూరు, పునరుద్ధరణ కోసం శరీరం సహకరించకున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా నాటి ప్రభుత్వ పెద్దల మనసు కరగలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆత్మహత్యయత్నాలు చేసి తమ హక్కును సాధించుకున్నారు. ఇప్పటికీ నాటి ప్రభుత్వ అకృత్యాలను గుర్తుచేసుకుని దివ్యాంగులు మదనపడుతున్నారు. ఇక జన్మలో చంద్రబాబును నమ్మబోమని కరాఖండీగా చెబుతున్నారు. అప్పట్లో నరకం చవిచూసిన అంగవైకలుర మనో‘గతాన్ని’ ఆవిష్కరించే యత్నమిది.. అంధుడిపైనా కర్కశం: అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఖండిపల్లికి చెందిన సియాద్రి దుర్గాప్రసాద్ పుట్టుకతోనే అంధుడు. చోడవరం దివ్యాంగుల స్కూల్లో 10వ తరగతి చదివాడు. ఆరోగ్యం బాగోలేక మధ్యలో చదువు ఆపేశాడు. మళ్లీ ఈ ఏడాది గుంటూరు సమర్ధన ట్రస్టులో చేరి ఇంటర్మిడియెట్ చదువుతున్నాడు. 2014 ముందు వరకు ఇతనికి దివ్యాంగ పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు ఇతని కుటుంబంపై ఉన్న రాజకీయ కక్షతో పింఛన్ తొలగించారు. ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో 2017లో లోక్అదాలత్ను ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో అధికారులు పింఛన్ పునరుద్ధరించారు. నేడు వేకువజామునే ఇంటికి.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారు. ఫలితంగా దివ్యాంగులు, అవ్వాతాతల మోములు ‘సిరి’నవ్వులు చిందిస్తున్నాయి. కాళ్లు లేకున్నా.. కరుణించలేదు నేను లారీ డ్రైవర్గా పనిచేసేవాడిని. 2015లో రాజమండ్రి దగ్గర విద్యుత్ తీగలు లారీకి తగిలి ప్రమాదం జరిగింది. నేను చాలా వరకూ కాలిపోయాను. వైద్యులు నా రెండు కాళ్లూ తొలగించారు. కదల్లేని పరిస్థితి తలెత్తింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు కరుణించలేదు. చివరకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ అప్పటి కలెక్టర్ పింఛన్ మంజూరు చేయలేదు. ఆ తర్వాత కూడా సక్రమంగా పెన్షన్ నగదు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వలంటీర్ వచ్చి నగదు ఇస్తున్నాడు. – వియ్యపు సోమునాయుడు, దివ్యాంగ పింఛన్దారు, పెదపాడు, బుచ్చెయ్యపేట మండలం ఆత్మహత్యాయత్నం చేస్తేకానీ ఇవ్వలేదు నేను లారీలో పనిచేసేవాడిని. 2014లో అనకాపల్లి దగ్గర అడితీలో కర్రలు లోడ్ చేస్తుండగా అవి నాపై పడ్డాయి. కాలు, చెయ్యి పూర్తిగా విరిగిపోయాయి. వాటిని వైద్యులు శరీరం నుంచి తొలగించారు. అప్పట్లో దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేశా. జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. 2017లో బుచ్చెయ్యపేట మండల ఆఫీసు దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ పింఛన్ రాలేదు. అయినా సక్రమంగా ఇచ్చేవారు కాదు. – ఐతిరెడ్డి గోవింద, వికలాంగ పింఛన్దారు, ఐతంపూడి, బుచ్చెయ్యపేట మండలం -
ఇదీ.. విశ్వసనీయత
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా అందించే పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3,000కి పెంచిన నేపథ్యంలో ఊరూవాడా ఉత్సాహంగా వేడుకలకు సిద్ధమైంది. జనవరి 1వ తేదీ నుంచి ఆయా మండలాలవారీగా మొదలయ్యే పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ దాకా పూర్తి పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎక్కడికక్కడ లబ్ధిదారులతో స్వయంగా మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొననున్నారు. సోమవారం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు కానుండగా ఈనెల 3వతేదీన సీఎం జగన్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజి గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పెంచిన పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందచేయనున్నారు. వలంటీర్లు ఎప్పటి మాదిరిగానే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు. అయితే ఈసారి రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా నిర్దేశించిన మేరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీగా పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. ఆయా చోట్ల ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొని పంపిణీని ప్రారంభిస్తారు. ఇలా ఈనెల 8వతేదీ వరకు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తంగా ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించి అందరికీ వలంటీర్ల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దే పంపిణీ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కొత్త పింఛన్లు 1.17 లక్షలు జనవరి నుంచి కొత్తగా మరో 1,17,161 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెలలో కొత్తగా జారీ చేసిన వారికి స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పింఛను మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన వారితో కలిపి మొత్తం 66.34 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీకి ప్రభుత్వం రూ.1,968 కోట్లను విడుదల చేసింది. సీఎం లేఖను చదివి వినిపిస్తూ.. ఈ నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కి పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇళ్ల వద్ద పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే సమయంలో సీఎం జగన్ రాసిన లేఖ ప్రతిని వలంటీర్లు వారికి అందజేస్తారు. లబ్ధిదారులకు లేఖ సారాంశం పూర్తిగా అర్ధమయ్యేలా వలంటీర్లే ఆ లేఖను చదివి వినిపించాలని అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నమ్మకాన్ని పెంచుకుంటూ... దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1,000 మాత్రమే పింఛన్ అందించగా సీఎం జగన్ ప్రభుత్వం నెలకు రూ.2,250 చొప్పున ప్రారంభించి రూ.3,000 దాకా ఏటా పెంచుకుంటూ వచ్చింది. కరోనా గడ్డు కాలంలోనూ పెంపూ ఆగలేదు.. పెన్షన్లూ ఆగలేదు. మొత్తం లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో కూడా పింఛన్లు పెంచడమూ ఆగలేదు.. పంచడమూ ఆగలేదు. ‘అవ్వాతాతల పింఛన్ రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతాం...’ అని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాటను ముఖ్యమంత్రి జగన్ తు.చ. తప్పకుండా ఆచరించి చూపారు. ఆత్మ గౌరవంతో పింఛన్లు.. పింఛన్ల కోసం చంద్రబాబు సర్కారు హయాంలో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న దుస్థితిని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా మానవీయ కోణంలో సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారు. ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే పెన్షన్లను అందిస్తున్నారు. ► గత పాలకుల హయాంలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఒకటో తేదీనే గడప వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవైనా, పండుగైనా సరై టంచన్గా చేతిలో పింఛన్లు పెడుతున్నారు. ► టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే కొత్తగా పెన్షన్లు మంజూరైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండీ ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందకుంటే వారికి మరో అవకాశాన్ని కల్పిస్తూ ఏటా జూన్, డిసెంబర్లలో ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టారు. ► ఇప్పుడు పెన్షన్ల కోసం దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21 రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. ► టీడీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన పెన్షన్ మొత్తం రూ.58,000 మాత్రమే కాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆయా లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.1,47,500 అందిస్తోంది. గత ప్రభుత్వం కంటే ఇది రూ.89,500 అదనం. ► టీడీపీ హయాంలో దివ్యాంగుల పెన్షన్ కింద ఐదేళ్లలో ఒక్కొక్కరికీ రూ.58,500 మేర మాత్రమే లబ్ధి చేకూర్చగా ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వారికి రూ.1,82,000 అందిస్తోంది. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం ► టీడీపీ సర్కారు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు కాగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం 66.34 లక్షల మందికి పింఛన్లను అందచేస్తోంది. పింఛన్లకే రూ.83,526 కోట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 29,51,760 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. దీంతో పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు చేరుకుంది. ఒక్క పెన్షన్ల కోసమే ప్రభుత్వం ఏటా రూ.23,556 కోట్లు వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల రూపంలో రూ.83,526 కోట్లను అందించినట్లు అధికారులు వెల్లడించారు. పింఛన్ పెరిగిందిలా... – టీడీపీ పాలనలో పెన్షన్ రూ.1,000 మాత్రమే – జూలై 2019 నుంచి పెన్షన్ రూ.2,250కి పెంచిన సీఎం జగన్ – జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు – జనవరి 2023న రూ.2,750కు పెంపు – జనవరి 2024న రూ.3 వేలకు పెంపు నాడు 400 కోట్లు.. నేడు 1,968 కోట్లు – 2014–19 మధ్య టీడీపీ హయాంలో నెలకు పెన్షన్ల సగటు వ్యయం రూ.400 కోట్లు. – జూలై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,384 కోట్లు – జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,570 కోట్లు – జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు – జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు -
2024 ప్రాధాన్యం రైతు, మహిళ, యువత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను ‘రైతు, మహిళ, యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని ప్రకటించారు. ప్రజాపాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆదివారం సీఎం ప్రజలకు విడుదల చేసిన సందేశం ఆయన మాటల్లోనే.. ఆ హామీలు నిలబెట్టుకున్నాం.. నిర్బంధాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యార్యంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష. యవత భవితే ప్రాధాన్యం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి వారి భవిష్యత్కు గ్యారంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. సాగునీటి రంగంలో అవినీతిపై త్వరలో శ్వేతపత్రం ‘గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. త్వరలో సాగునీటిరంగంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాం. అసత్య ప్రచారాలతో గందరగోళం వద్దు.. పింఛన్లు, రేషన్కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురుచూశారు. త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అధికారం కోల్పోయిన కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గతపాలన కాదు, జనపాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులకు కేసుల నుంచి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
జార్ఖండ్లో 50 ఏళ్లకే పెన్షన్
రాంచీ: పెన్షన్ల మంజూరు విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు, దళితులకు పెన్షన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. 50 ఏళ్ల వయసు రాగానే పెన్షన్ ప్రయోజనాలు అందుకోవచ్చని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో జేఎంఎం కూటమి ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితుల్లో మరణాల రేటు అధికంగా ఉందని, 60 ఏళ్లు దాటాక వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదన్నారు. గిరిజనులు,
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
Advertisement