సాక్షి, నంద్యాల: డోన్ మండలం కన్నప్పకుంట గ్రామంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ బీఎల్ఏపై టీడీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎస్ఐఆర్ సర్వేలో TDP ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారని వైఎస్సార్సీపీ బీఎల్ఏ భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన మధుసూదన్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త భరత్పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకున్న సోదరుడిపైనా దాడికి తెగబడ్డాడు. దీంతో వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ADVERTISEMENT
ADVERTISEMENT