-
కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా!: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘రాష్ట్రంలో ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు..మోటార్లు, ఆస్పత్రుల్లో గంటల తరబడి కరెంటు కోతలు, ఎండుతున్న చెరువులు.. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? ఒక్కసారి ఆలోచించి వారికి ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలి..’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్తో సహా అందరం ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. మోసపోతే గోసపడుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపితే నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు. డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. కేసీఆర్ లక్ష మాఫీ చేసిన వారికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేస్తారో వేయాలి..’అని అన్నారు. ‘సీఎం రేవంత్రెడ్డి ఓ మెజీషియన్.. పచ్చి అబద్ధాలకోరు. తెలంగాణ ప్రజలను ఇంకా నమ్మించాలని చూస్తున్నాడు..’అని ధ్వజమెత్తారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నర్సంపేట, వరంగల్, హనుమకొండలలో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ ప్రసంగించారు. రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈస్ట్మన్ కలర్ సినిమా చూపించారు. కానీ రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం నాటి ఘటనే ఉదాహరణ. ఎంజీఎం లాంటి పెద్ద ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్ పోవడం దారుణం కాదా? ఆరు నెలల క్రితం వ్యవసాయం ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? రుణమాఫీ జరిగిందా? కౌలు రైతులకు, రైతు కూలీలకు సాయం అందిందా? వంద రోజుల్లోనే చేసేస్తామన్న హామీలు ఏమయ్యాయి? రూ.2500 వచ్చినయా? ఏడాదిలో రూ.2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏదీ చేయలేదు. నాట్లు వేసే నాడు వేయాల్సిన రైతుబంధు..ఓట్లు వేసే నాడు రేవంత్రెడ్డికి గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో అన్ని హామీలు ఆమలు చేస్తున్నట్లు రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీలు కూడా ఇతర రాష్ట్రాల్లో అబద్ధాలు చెబుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్ల ప్రగతి చెప్పుకోవడంలో విఫలమయ్యాం ‘గత పదేళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. కానీ మనం చేసిన మంచి పనులను చెప్పుకోవటంలో విఫలమయ్యాం. యూట్యూబ్లలో మనపై తప్పుడు ప్రచారాలు చేశారు. దీని కారణంగానే 1.8 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించి కాంగ్రెస్కు తగ్గిన బుద్ధి చెప్పాలి..’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమావేశాల్లో రాకేశ్రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీలు డా.బండా ప్రకా‹Ù, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యేలు డా.సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మానవత్వాన్ని చాటిన కేటీఆర్ గీసుకొండ: రోడ్డు పక్కన పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, మాజీ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటారు. బుధవారం హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళుతుండగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు సమీపంలో అంజయ్య అనే వ్యక్తి మోపెడ్పై వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనపడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. విషయం గమనించిన కేటీఆర్ కారు ఆపి అతన్ని పరిశీలించారు. వెంటనే గన్మెన్ల సాయంతో తన కాన్వాయ్లోని ఓ వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నర్సంపేటకు వెళ్లారు. ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు – పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు – కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు – ‘ఎక్స్’లో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టళ్లు ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. ‘కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లతో పాటు మళ్లీ ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం. బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులతో క్యూలు కడుతున్నారు. అయినా కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..’అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
సన్న బియ్యం పెద్ద లొల్లి
-
KSR : సన్నబియ్యం రాజకీయం..! ఎవరి వాదన కరెక్ట్ ?
-
సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
నల్లగొండ టూటౌన్/ మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాల లో నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమా వేశాల్లో కేటీఆర్ మాట్లాడారు.‘‘కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్ 9 నాటికి రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. మే వచి్చనా సొమ్ము వేయలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు. రేవంత్ పాలనలో అంతా మోసమే..’’అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్ను గెలిపించారని.. ఇప్పుడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని.. అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచి్చన గోల్డ్ మెడ లిస్ట్ కావాలో.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్ స్నాచర్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. దీనిపై మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిస్తే.. మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వానాకాలం నుంచి అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇచ్చేలా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. వరి ధాన్యానికి బోనస్ చెల్లింపు అంశంపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హరీశ్రావు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్గాం«దీ, ప్రియాంకగాందీతో పాటు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా హామీ ఇచి్చన విషయాన్ని హరీశ్రావు గుర్తు చేశారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం మోసానికి పరాకాష్టగా పేర్కొన్నారు. యాసంగిలో సాగు చేయని సన్నవడ్లకు బోనస్ ప్రకటించడం రైతుల నోట్లో మట్టికొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో 20 శాతం మాత్రమే సన్నరకం సాగు చేస్తారని, యాసంగిలో 99 శాతం దొడ్డు వడ్లు సాగు చేస్తారన్నారు. ‘భరోసా’రూ.5 వేలేనా? రాష్ట్రంలో దిగుబడి వచ్చే 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని హరీశ్రావు పేర్కొన్నారు. అయితే కేవలం సన్న రకం వడ్లకే బోనస్ ఇచ్చేందుకు రూ.500 కోట్లు సరిపోతాయని, దీనితో రూ.5,500 కోట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించి, గతంలో మాదిరిగా తొలి విడతలో కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. రైతు భరోసా కింద రైతులకు బకాయి పడిన రూ.2,500తో పాటు వానాకాలం సాయం రూ.7,500 కూడా కలుపుకుని జూన్ నెలాఖరులోగా ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. వాస్తవ పరిస్థితిని వివరించేందుకు మీడియా సమావేశంలోనే మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి బెజ్జంకి కేంద్రానికి లోడ్ తీసుకెళ్లిన లారీ డ్రైవర్ ప్రభాకర్రెడ్డితో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్లు కోరారు.కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్ కుమార్ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్ ప్రొడ క్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్కుమార్, చరణ్ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్ కుమార్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ప్రశ్నించే గొంతు మండలిలో ఉండాలి
ఖమ్మం సహకారనగర్/ఇల్లెందు/సూపర్బజార్ (కొత్తగూడెం): ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జాబ్ కేలండర్ ఇవ్వలేదు. రూ.400 ఉన్న టెట్ ఫీజు రూ.2 వేలు చేసింది. వీటిపై మండలిలో గళం విప్పి గర్జించాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డిని గెలిపించాలి’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందులో వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగుల రాకేష్రెడ్డి గోల్డ్మెడలిస్ట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్మెయిలర్ అని, 74 రోజులు జైలులో గడిపారని, అలాంటి వ్యక్తి పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా అని ప్రశ్నించారు. విద్యావంతులు ఎన్నుకునే వ్యక్తి వారి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించాలన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించా మని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చిఉంటే తాను ఎమ్మెల్యే పద వికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వెనకబడి.. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మాయలో పడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో విజ్ఞులైన పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాల న్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్లు అదానీకి అమ్మేస్తాయని ఆరో పించారు. ఆయా సభల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏను గుల రాకేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీశ్రావు మండిపడ్డారు. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని హరీశ్రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం.కెసిఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను… pic.twitter.com/CwnErdltSu— Harish Rao Thanneeru (@BRSHarish) May 20, 2024 -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
అన్నదాతలకు అండగా ఉందాం
సిద్దిపేట జోన్: ఆరుగాలం పండించిన రైతు ధాన్యా నికి మద్దతు ధర అందేలా, చివరి గింజ వరకు కొనేలా అన్నదాతలకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆయన సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, సర్కారు వైఫల్యం, పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అకాల వర్షాలతో అతలాకుతల మవుతున్న రైతులకు కష్టకాలంలో అండగా ఉండి మనోధైర్యం చెప్పాలని కోరారు. రోజుకో మాటతో రైతులను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు. రూ.500 బోనస్ ఇచ్చే వరకు పోరాడుదామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆయా కొనుగోలు కేంద్రాలను రోజూ పార్టీ ప్రజాప్ర తినిధులు, ముఖ్య నాయకులు సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని, వాటి పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.మిల్లర్లు, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులను సమన్వయం చేసుకొని ధాన్యం కొనేలా చూడాల న్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా తన దృష్టికి తీసుకురావాలని హరీశ్రావు సూచించారు. -
తెలంగాణకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని, అధికార గొంతులు, ధిక్కార స్వరాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా ‘ఎక్స్’లో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఏనుగుల రాకేశ్రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యను చదివాడన్నారు. ప్రజా సేవ లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాకేశ్రెడ్డి.. వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆర్థిక సంబంధమైన అంశాలపై రాకేశ్రెడ్డి పలు పుస్తకాలు కూడా రాశాడని కేటీఆర్ చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యే విద్యార్థులు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ, హనుమకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారన్నారు. విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలు, హక్కులపై రాకేశ్రెడ్డి గళం విప్పారని తెలిపారు. ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్నందునే రాకేశ్రెడ్డిని శాసనమండలి పట్టభద్రుల కోటా ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించినట్లు కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి..వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు భువనగిరి నియోజకవర్గంలోని సాయి ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో పాల్గొని అక్కడి ఓటర్లతో మాట్లాడనున్నారు. అలాగే మధ్యా హ్నం 12 గంటలకు ఆలేరు నియోజవర్గంలోని ఎమ్మడి నరసింహారెడ్డి గార్డెన్స్లో జరిగే సమావేశంలో పాల్గొని ఓటర్లు, నాయకులతో కేటీఆర్ సమావేశం అవుతారు. -
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
సుభాష్నగర్/ సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లు డు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై శనివారం పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర ప్రాంతంలో సర్వే నంబర్ 82, 83లో తనతో పాటు 8 మందికి ప్లాట్లు ఉన్నాయంటూ కరీంనగర్కు చెందిన శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తాత్కాలికంగా ప్రహరీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి.. అనుచరులతో అక్కడికి చేరుకుని ప్రహరీని కూల్చివేశారు. ఆ భూమి తమదని, అక్కడ ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీనివాస్రెడ్డి తదితరులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పేట్బషీరాబాద్ ఏసీపీ రాములు.. విచారణ అయ్యేంత వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టవద్దని సూచించడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. మరోవైపు శ్రీనివాస్రెడ్డి అనుచరులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డిలను అదుపులోకి తీసుకుని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు.మా భూమిని ఆక్రమించారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న భూమిలోకి శుక్రవారం రాత్రి 300 మంది అక్రమంగా చొరపడి హద్దులను చెరపి, ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మరో బిహార్గా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. -
ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే..
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడకుండా ఇకపై నేతలు, పార్టీ యంత్రాంగం నిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండేలా కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు చెప్పారు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పార్టీ కార్యక్రమా లు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు, కొందరు నేతలు గురువారం ఎర్రవల్లి నివా సంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తీరుతెన్నులతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది.వరికి రూ.500 బోనస్, ధాన్యం కొనుగోలు అంశాలపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన నిర సన కార్యక్రమాలపై ఆరా తీశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యవర్గాల ఏర్పాటు లాంటివి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టే అవకాశమున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, కిందిస్థాయి వరకు సోషల్ మీడియా విభాగం బలోపేతం తదితరాలకు సంబంధించిన కార్యాచరణపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. ‘స్థానిక’సన్నద్ధత ప్రారంభించాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతను కూడా ఇప్పటినుంచే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు క్షేత్ర స్థాయిలో క్రియాశీలంగా పనిచేసే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు.పార్టీ కార్యవర్గాల ఏర్పాటులోనూ ఇలాంటి నేతలు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా పద్దతిలో రిజర్వేషన్లు కల్పించేందుకు 113 బీసీ ఉప కులాల గణన చేపట్టాలనే డిమాండ్ను కూడా ప్రభుత్వం ముందు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అన్ని ఎన్నికల ఫలితాలు అనుకూలమే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలూ పార్టీకి అనుకూలంగా వెలువడే అవకాశం ఉన్నట్లు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి 28న జరిగిన శాసనమండలి మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి గెలుస్తారని పార్టీ నేతలు కేసీఆర్కు వివరించినట్లు తెలిసింది. మహబూబ్నగర్ జిల్లాలో 1,439 మంది ఓటర్లకు గాను 800 మందికి పైగా పార్టీ అభ్యర్థికే ఓటు వేసినట్లుగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడంతో సానుకూల ఫలితం వస్తున్నట్లు వివరించారు.ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నివేదిత మంచి మెజారిటీ సాధిస్తారని కేసీఆర్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 27న జరిగే ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించకుండా పార్టీ నేతలు, అభ్యర్థులు పార్టీ ఇచ్చే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. -
పట్టభద్రుల ఎన్నిక ప్రతిష్టాత్మకం
సాక్షి, హైదరాబాద్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుమార్లు పార్టీ అభ్యర్థులే విజయం సాధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముమ్మర ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రచారానికి కేవలం పది రోజులే ఉన్నందున సర్వశక్తులొడ్డి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి వరకు ప్రచారం జరిగేలా సంబంధిత నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు బాధ్యత తీసుకోవాలన్నారు. బూత్ల వారీగా ఇన్చార్జీలను నియమించి ప్రచారం సమన్వయం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సింగరేణి–ఆర్టీసీ సంస్థల కార్మికులు, మహిళలు, యువత తదితర వర్గాలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అవసరమైన చోట తనతోపాటు హరీశ్రావు, ఇతర ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు. ముఖ్య నేతల ప్రచారానికి వీలుగా షెడ్యూల్ సిద్ధం చేయాలని, పార్టీ యంత్రాంగాన్ని ప్రచారంలో నిమగ్నమయ్యే లా చూడాలని కేటీఆర్ ఆదేశించారు.అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి!ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీఆర్ఎస్కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్లో చేరగా, నల్లగొండ నుంచి జగదీశ్రెడ్డి, వరంగల్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సుమారు 130 మంది నేతలకు ఆహ్వానం పంపగా, 60 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం.ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బసవరాజు సారయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి తదితరులు ఈ భేటీకి హాజరు కాలేదు. ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఉపేందర్రెడ్డి తదితరులు కూడా రాలేదు. అభ్యర్థి ఎంపికపై ఉన్న అసంతృప్తి వల్లే పలువురు సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.కేటీఆర్తో ఎంపీ అభ్యర్థుల భేటీరెండు రోజులుగా పార్టీ అధినేత కేసీఆర్ను కలిసిన పలువురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా లోక్సభ నియోజక వర్గాల వారీగా పోలింగ్ సరళిపై చర్చించారు. మెజారిటీ స్థానాల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్ కు అనుకూలిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నా యని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఫలితాల తర్వాత జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలపైనా చర్చించారు. కేటీఆర్ను కలిసిన వారిలో నామా నాగేశ్వర్ రావు, మాలోత్ కవిత, డాక్టర్ సుధీర్కుమార్, క్యామ మల్లేశ్, కంచర్ల కృష్ణారెడ్డి, పద్మారావు గౌడ్, కొప్పుల ఈశ్వర్, గడ్డం శ్రీనివాస్ యాద వ్, గాలి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. -
రైతు సమస్యలుపక్కనపెట్టి రాజకీయాలా?
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో రైతులు పడుతు న్న ఇబ్బందులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను నెల రోజులుగా పట్టించుకోవడం లేదన్నారు. రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పారు. తెలంగాణభవన్లో బుధవారం కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై పర్యవేక్షణ లేదని, హమాలీలు, ధాన్యం సంచుల కొరత, తరు గు పేరిట క్వింటాల్కు మూడున్నర కిలోల చొప్పున కోత విధించడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వీటిపై కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేలా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతులకు అండగా రోడ్డెక్కి ఆందోళన చేస్తామన్నారు. రైతాంగం ఆందోళన, ధైర్యం చెడొ ద్దని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కేటీఆర్ పిలుపుని చ్చారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి తోనే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు. రుణ మాఫీ, ధాన్యం కొనుగోలు, బోనస్ వంటి హామీలు అమలయ్యేంత వరకు రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.అప్పులపై రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలిగత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ శ్వేతపత్రాల పేరిట చిల్లర రాజకీయం చేసిన సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ.3.89లక్షల కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక వెల్లడించిందన్నారు. అప్పులు చేయడం తప్పు అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎందుకు అప్పులు చేస్తుందని ప్రశ్నించారు. కొత్తగా చేస్తున్న అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు చేయడానికి అప్పులు చేయడం దివాలాకోరు విధానం అని, దీనిపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ విద్యుత్ ఉద్యోగులను పల్లెత్తు మాట అనలేదని, ఉద్యోగులతో తమది పేగుబంధం అని కేటీఆర్ పేర్కొన్నారు. నయీం లాంటి వ్యక్తికి కాంగ్రెస్ టికెట్వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మె ల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిలర్, ఎన్నో పార్టీలు మారిన నయీం తరహా వ్యక్తికి టికెట్ ఇచ్చిందన్నారు. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఐదున్నర నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వపాలన చూసి బీఆర్ఎస్కు మద్దతు పలకాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 30 వేల మంది ఉద్యోగులు భర్తీ కాగా, సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలతో తన ఖాతాలో వేసుకుంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. నల్లగొండపైనే కాంగ్రెస్ ఆశలుఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలిచే అవకాశముందని కేటీఆర్ అన్నారు. కేవలం నల్లగొండ ఎంపీ స్థానంపైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుందన్నారు. తెలంగాణభవన్లో కేటీఆర్ మీడి యాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ‘పార్లమెంటు ఎన్నికలు ఆశావ హంగా జరిగినట్టు ఈ రోజు మా ఎంపీ అభ్యర్థులతో జరిగిన భేటీలో చెప్పారు. నేను ప్రత్యేకంగా చేయించిన సర్వేలోనూ బీఆర్ఎస్ కు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ పడినట్టు తేలింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరు. సునీతా మహేందర్రెడ్డికి మల్కాజిగిరితో ఏమైనా సంబంధం ఉందా. బండి సంజయ్ను గెలిపించేందుకు వెలిచాల రాజేందర్రావు లాంటి అడ్రస్ లేని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూల్లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్కు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. నాగర్కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కాగా గెలుస్తున్నాం. పెద్ద పల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్లో బీజేపీతో బీఆర్ఎస్కు ప్రధానంగా పోటీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మళ్లీ గెలుస్తారని మాకు సమాచారం ఉంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
సన్న వడ్లకే బోనస్సా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతాంగాన్ని ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేసీఆర్ మండిపడ్డారు. ‘పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన సీఎం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే వర్తింప చేస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచించి మోసం చేయడం, దగా చేయడమే..’ అని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందైతే తుక్కుతుక్కు చేసేవాళ్లు‘రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారనే విషయం తెలిసీ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమే. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్కు రైతుల అవసరం తీరింది. సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని ఎన్నికలకు ముందు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. రైతాంగ హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతోంది..’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడంపై కూడా నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ సీఎం విమర్శించారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు, కల్లాల సందర్శన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయటం అధికార దుర్వినియోగం చేయటమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్పై మండిపడ్డారు. నిన్న( మంగళవారం) అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడి ఘటనలో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయటమే. పోలీసుల దుర్వినియోగం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. ఇది రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం. తెలంగాణ డీజీపీ.. ఈ గూండాలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులాగా ప్రేక్షక పాత్ర వహిస్తే.. మేము మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తాం’’ కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు.Yahi Hai Kya Aapki “Mohabbat Ki Dukaan” @RahulGandhi ?Brazenly attacking opponents and abusing power. Shameful that police have become part of the abuse and attack @TelanganaDGP If you don’t act and book these goons and the spectator like cops, we will move the Human Rights… https://t.co/9VL4VjxD31— KTR (@KTRBRS) May 15, 2024 అచ్చంపేటలో కాంగ్రెస్ గూండాల దాడికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ ట్యాగ్ చేశారు. ప్రవీణ్కుమార్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్పై విధంగా స్పందించారు. -
పోలింగ్పై పోస్టుమార్టం..
-
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్చార్జ్లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్చార్జ్ల నియామకం చేపట్టనున్నారు. ఇక, ఇన్చార్జ్లను నియమించే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో, ఇన్చార్జ్లు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇక, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. మరోవైపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
Malkajgiri Lok Sabha: ఈవీఎంలలో అభ్యర్థుల భవిత
చంపాపేట: పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగియడంతో మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలో నిలచిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు గెలుపుపై టెన్షన్ మొదలైంది. తమ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సర్వశక్తులు ఒడ్డి పని చేశారు. ఓటర్లు అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఎల్రక్టానిక్ యంత్రాల్లో భద్రపర్చారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ 20 రోజులూ తమ పార్టీ అభ్యర్థుల విజయంపై ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటుండగా, ఎల్బీనగర్లోని ప్రధాన పారీ్టల అభ్యర్థులు, నాయకులు మాత్రం బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఓటింగ్ శాతం తాము ఊహించినంతగా లేకపోవటంతో లోలోపల మాత్రం వారిలో ఆందోళన నెలకొంది. 👉 మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలో ఎల్బీనగర్తో పాటు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎంపీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే అధిక ఓటర్లు కలిగిన ఎల్బీనగర్ శాసన సభ నియోజకవర్గ పరిధిలో 6,04,763 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ 46.27 శాతం మాత్రమే కావటంతో ఆ ప్రభావం ఏ పార్టీ అభ్యర్థి జయాపజయాలపై చూపుతుందోనని పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు, 👉 మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేయడం వల్ల ఎల్బీనగర్ వాసులు, అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సత్సబంధాలు ఉన్నాయి. దానికి తోడు ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో ఆయన తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ కార్పొరేటర్లు, క్రియాశీలక కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఈటల విజయం కోసం ఏమాత్రం పాటు పడ్డారో అభ్యర్థి జయాపజయాలను నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 👉 బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం కోసం స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి ఉన్న కొద్దిపాటి పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ రాగిడి విజయానికి అహరి్నషలు కృషి చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉన్న సానుభూతి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు నోచుకోక పోవటం వంటి అంశాల వల్ల రాగిడి లక్ష్మారెడ్డికి ఎల్బీ నగర్లో మెజారిటీ ఓట్లు వచ్చి విజయం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 👉 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డికి ఎల్బీనగర్లోని పలు పార్టీ నేతలతో పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. దీనికి తోటు ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ఇతర పారీ్టలనుంచి కార్యకర్తలు కాంగ్రెస్లో చేరి బూత్ స్థాయినుంచి పార్టీ ఇన్చార్జీలను నియమించి పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి కారణాల వల్ల పార్టీ అభ్యర్థి ఎల్బీ నగర్లో మెజార్టీ ఓట్లు సాధించడం పక్కా అని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు నాడి అంతు చిక్కటుంలేదని, ఓటర్లు ఎక్కడా తమ మనోభావాన్ని, అంతరంగాన్ని బయట పెట్టడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు
-
లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు
-
ఇక ‘పట్టభద్రుల’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల కోటా ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా వరంగల్కు చెందిన ఏనుగుల రాకేశ్రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి కైవసం చేసుకోవడాన్ని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ పోలింగ్ ముగిసిన వెంటనే రంగంలోకి దిగింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం కీలక భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశంఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 ఏప్రిల్ వరకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 27న ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్కు కేవలం 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ముమ్మర ప్రచారం నిర్వహించేలా కేటీఆర్ బుధవారం జరిగే భేటీలో దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్రావు ప్రచార, సమన్వయ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా ప్రచారాన్ని సమన్వయం చేస్తారు. మూడు జిల్లాల్లో సుమారు 4.61 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగించాల్సిన ప్రచారంపై బీఆర్ఎస్ వ్యూహాన్ని ఖరారు చేస్తోంది. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలకు గ్రామాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితాను అందజేసి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.లోక్సభ పోలింగ్ సరళిపై సమీక్షరెండురోజుల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం కూడా సమీక్షించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ను పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు కలిశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సరళిపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపారనే కోణంలో చర్చ జరిగింది. కాగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేసినట్లు నేతలు వెల్లడించారు. -
ఎవరి లెక్క వారిదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పారీ్టలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటుండటం, అన్ని పార్టీలూ తమకే ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా వాదిస్తుండటంతో.. ఆసక్తి మరింత పెరుగుతోంది. సోమవారం జరిగిన పోలింగ్ సరళిని విశ్లేíÙంచుకున్నాక కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు తమ అంచనాలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. పైగా మరిన్ని స్థానాలు అదనంగా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పెరిగిన పోలింగ్ శాతాన్ని ఎవరికి వారే తమకు అనుకూలమని అంచనా వేసుకుంటుండటం గమనార్హం. అయితే అన్ని పారీ్టలు మహిళలు, గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో అన్నది తేల్చుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. పెరిగినది పాజిటివ్ ఓటింగేనంటున్న కాంగ్రెస్.. ఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పాజిటివ్ ఓటింగ్ జరిగిందని.. ప్రస్తుతం పెరిగిన ఓటింగ్ శాతం కూడా ప్రభుత్వ అనుకూల ఓటేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని అంటున్నాయి. ప్రధానంగా మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్లుతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఎన్నికలకు ముందే రైతుభరోసా నిధులు వెళ్లడం, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి ఒట్టు వేసి మరీ ప్రకటించడం వంటివి పాజిటివ్ టాక్ తెచ్చాయని.. అవి ఓట్ల రూపంలో కాంగ్రెస్కే దక్కాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే.. లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనిచి్చన బీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయిందని చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న ప్రచారం బాగానే ప్రభావం చూపిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు పన్నెండు నుంచి 13 సీట్లు లభిస్తాయని పేర్కొంటున్నారు. బాగా బలోపేతం అయ్యామంటున్న బీజేపీ.. లోక్సభ ఎన్నికలతో రాష్ట్రంలో మరింతగా బలోపేతం అయ్యామని, ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీపై అభిమానం, కేంద్రం గత పదేళ్లుగా అందించిన నీతివంతమైన పాలనకు తగిన ప్రతిఫలం తమకు లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అంటున్నారు.పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాజ్యాంగం జోలికి కానీ, రిజర్వేషన్ల జోలికి కాని వెళ్లని విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మోదీ మేనియా బాగా వర్కౌట్ అయిందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్ షా సహా జాతీయ నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం కలసి వచి్చందని అంటున్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు ఖాయమని ధీమాగా చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్కు బీజేపీకి అనుకూలంగా ఉందని.. అసెంబ్లీ ఎన్నికల్లోకు ఓటేయని వర్గాలు కూడా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వచ్చి తమకు ఓటు వేశాయని అంటున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర ఊపుతో.. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభించిందని ఆ పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, జిల్లాల రద్దు వంటి అంశాలతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచిందని అంటున్నారు.ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయానికి వచ్చారని, ఇది తమకు సానుకూలంగా మారిందని అంటున్నారు. రెండు జాతీయ పార్టీలకు నేరుగా తమతోనే పోటీ జరిగిందని చెప్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానం ఎక్కడికీ పోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించామని పేర్కొంటున్నారు. ఆ రెండు పారీ్టలు పారాచూట్ లీడర్లకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా.. కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తిని రగిలించిందని అంటున్నారు. -
‘సీఎం రేవంత్కు ఆగస్టు సంక్షోభం తప్పదు’
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కావటం ఖయమని అన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి
ఏపీ పరువు తీశారు టీడీపీ వాళ్ళు..కృష్ణంరాజు సంచలన కామెంట్స్
స్టేజ్పైనే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే!
బెంగాల్ గవర్నర్పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కాంగ్రెస్ లీడర్లు నన్నేదో చేయాలనుకుంటున్నారు: మల్లారెడ్డి ఫైర్
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)
Team India Head Coach: బీసీసీఐ ఆఫర్ నిజమే.. కానీ!
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
తప్పక చదవండి
- మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
- 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
- Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
- ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
Advertisement