Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మేడమ్‌ వర్సెస్‌ సార్‌.. ఒకరిని మించి మరొకరు!
ADVERTISEMENT 

మేడమ్‌ వర్సెస్‌ సార్‌.. ఒకరిని మించి మరొకరు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 27, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
KCR_Tamilisai.jpg

తెలంగాణలో గవర్నర్ తమిళసైకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య ఏర్పడిన విభేదాలు.. చివరికి రిపబ్లిక్ దినోత్సంపై కూడా ప్రతిబింబిండం దురదృష్టకరం. రాజకీయాలకు,వివాదాలకు అతీతంగా ఉండవలసిన ఈ ఉత్సవం మొత్తం గందరగోళంగా మారింది. రిపబ్లిక్ డే జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టుకు వెళ్లే పరిస్థితి రావడం కేసీఆర్ ప్రభుత్వానికి సొబగు కాదు. కేసిఆర్ మొండి పట్టుదలకు పోతున్నారనిపిస్తుంది. చివరికి రాజ్ భవన్ లో తమిళసై రిపబ్లిక్ డే ని నిర్వహించడం, ఆ సందర్భంగా యధాప్రకారం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇబ్బందికరమైన పరిణామమే. ఆ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.

ఆమె ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు మంచిదే. కాని తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయని అనడం పద్దతికాదు. ఆ లెక్కలు ఆమెకు ఎవరు ఇచ్చారు. ఆత్మహత్యల వంటి సెంటిమెంట్ అంశాలను గవర్నర్ లేవనెత్తడం రాజకీయ ప్రేరితం అవుతుంది. రాజకీయ పక్షాల వారు ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు. కానీ, గవర్నర్ ఒక రాజకీయనేత మాదిరి అలాంటి విమర్శలు చేయడాన్ని  ఎవరూ ఆహ్వానించలేరు. అయితే హైదరాబాద్ ,ఇతర ప్రాంతాలలో జాతీయ రహదారులు, వంతెనల నిర్మాణానికి కేంద్రం నిదులు ఇస్తోందని ఆమె చెప్పడం విశేషం. సాదారణంగా రిపబ్లిక్ డే నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే ప్రసంగ పాఠాన్ని చదువుతారు. కానీ, కొన్నిసార్లు గవర్నర్ లు తమ సొంత అబిప్రాయాలను చొప్పిస్తున్నారు. అది కొంచెం వివాదం అవుతున్నా, స్థూలంగా సర్దుకు పోతుంటారు. కానీ, తెలంగాణలో శృతి మించి అసలు రిపబ్లిక్ డే నే పూర్తి స్థాయిలో జరపలేకపోవడం ప్రభుత్వానికి ప్రతిష్టకాదు.  

కాగా ఈ సందర్భంగా తమిళసై వేసిన ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కరోనా కారణంగా రిపబ్లిక్ డే జరపలేకపోతున్నట్లు ప్రభుత్వం చెప్పడాన్ని ఆమె తప్పుపడుతూ ఖమ్మంలో ఐదు లక్షల మందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. తాను నచ్చకపోయినా, గవర్నర్ కు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వాలి కదా అన్న ఆమె   భావనను ఎవరైనా అంగీకరించాలి. గత రెండేళ్లుగా తమిళసైకి , కేసీఆర్‌కు మధ్య బాగా అంతరం ఏర్పడింది. చివరికి తమిళసై జిల్లాల పర్యటనలకు వెళితే జిల్లా కలెక్టర్, ఎస్పీ  హోదా అధికారులు కూడా వచ్చి  స్వాగతం పలకడం లేదు. ఇది కూడా బాగోలేదు.  

గవర్నర్ బిజెపి కోసం రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ మంత్రులు విమర్శలు చేస్తున్నా, ముందుగా తాము ఎంత మేర ఆమెను గౌరవిస్తున్నది వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేంద్రంతో తగాదా పడుతున్నది మొదలు గవర్నర్‌తో కూడా గొడవ సాగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ నియమిస్తున్న గవర్నర్‌లు.. బీజెపీయేతర ప్రభుత్వాలు ఉన్నచోట్ల పలు అవాంతరాలు సృష్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నమాట నిజమే . గతంలో  ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు ఉన్నప్పుడు కూడా ఆనాటి గవర్నర్ లు రామ్ లాల్, కుముద్ బెన్ జోషి వంటివారితో తీవ్రస్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి. అయినా రిపబ్లిక్ డే వంటి వాటి విషయంలో ప్రభుత్వాలు ఇంత తీవ్రమైన నిర్ణయం చేయలేదని చెప్పాలి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 

కేసీఆర్‌కు పోటీగా తమిళసై కూడా విమర్శల ధాటి పెంచారు. రిపబ్లిక్ డే పరిణామాలపై కేంద్రానికి ఆమె నివేదిక కూడా పంపించారు. ఇంతమాత్రాన ఏదో అయిపోతుందని కాదు., ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రతిదానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. జాతీయ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించాలని బావిస్తున్న కేసీఆర్ కు  ఈ వివాదం  ఏ విదంగా ఉపయోగపడుతుందో కాలమే చెబుతుంది. గవర్నర్ వ్యవస్థ పలుమార్లు దుర్వినియోగం అవుతోందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, అంతమాత్రాన ఆ వ్యవస్థ రద్దు అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల ఇరువైపులా సర్దుకుపోవడం మంచిది అని చెప్పాలి. కానీ, వర్తమాన రాజకీయాలలో పట్టుదలలకు విశేష ప్రాధాన్యం వస్తున్న నేపద్యంలో ఇది అంత తేలికైన వ్యవహారం కాకపోవచ్చు.

::హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్

feedback@sakshi.com

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
KCR
Tamilisai Soundararajan
Hitaishi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.