నల్గొండతో మ్యాచ్లో అన్విత్ ఖమ్మం బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ హిమతేజ(31 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 80) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు జీఎస్కే రెడ్డి(56), పరాస్ రాజ్(46) రాణించారు. నల్గొండ బౌలర్లలో నిశాంత్, దివేష్ తలా వికెట్ సాధించారు.
తొలుత బ్యాటింగ్ చేయనున్న ఖమ్మం
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా అన్విత్ ఖమ్మం ఏసెస్, నల్గొండ నైట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఖమ్మం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కూడా ఖమ్మం కెప్టెన్ సీవీ మిలింద్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో హిమతేజ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్లు
అనురాగ్ నల్గొండ నైట్స్: జశ్వత్ మోతె, గౌరవ్ రెడ్డి, పాట్కూరి నితీష్ రెడ్డి, రాహుల్ బుద్ధి(కెప్టెన్), ఏలగాని వరుణ్ గౌడ్, అర్ఫాజ్ అహ్మద్ మహ్మద్, అనికేత్ రెడ్డి, చింతల రక్షణ రెడ్డి, హర్షవర్ధన్ సింగ్(వికెట్ కీపర్), దివేష్ సింగ్, శరణు నిశాంత్
అన్విత్ ఖమ్మం ఏసెస్ జట్టు: వాఫీ డైమండ్ కచ్చి, పరాస్ రాజ్, మిక్కిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి(వికెట్ కీపర్), కొడిమెల హిమతేజ(కెప్టెన్), జీఎస్కే రెడ్డి, సహేంద్ర మల్లు, మహేష్ విప్పర్ల, విద్యానంద రెడ్డి, వేద్ రెడ్డి, హర్షిత్ సాయి వై