ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతొ విజయాన్ని అందుకుంది. కాగా మాములుగానే ఈ సీజన్లో ఒక ఐపీఎల్ మ్యాచ్ను కోటికి తగ్గకుండా వీక్షిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో నమోదవ్వని టీఆర్పీ రేటింగ్ ఈసారి నమోదవుతుంది.

Photo: IPL Twitter
ముఖ్యంగా ఈ సీజన్లో సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్కు వ్యూయర్షిప్ కనీసం రెండుకోట్లు దాటుతుంది. అందునా కేవలం ధోనిని చూడడం కోసమే ఇదంతా. ఇక తెరపై ధోని కనిపిస్తే టీఆర్పీ రేటింగ్స్ బద్దలవడం ఖాయం. ఇప్పటివరకు ఈ సీజన్లో ధోని బ్యాటింగ్ను 2.5 కోట్ల మంది వీక్షించారు. తాజాగా ఆ రికార్డును గిల్ సమం చేశాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో శుబ్మన్ గిల్ బ్యాటింగ్ను దాదాపు 2.5 కోట్లకు పైగా వీక్షించడంతో సరికొత్త రికార్డు నమోదయింది.

Photo: IPL Twitter
అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు జియో సినిమా వ్యూయర్షిప్ 2.5 కోట్లకు తగ్గలేదు. ఇక మ్యాచ్లో గిల్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో గిల్కు ఇది మూడో సెంచరీ కాగా.. 60 బంతుల్లో 129 పరుగులు చేసిన గిల్ ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిల్ ఐపీఎల్లో ఒకే సీజన్లో మూడు సెంచరీలు చేసిన యంగెస్ట్ ప్లేయర్గా.. టీమిండియా నుంచి రెండో బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు కోహ్లి, బట్లర్లు ఒకే సీజన్లో నాలుగేసి సెంచరీలు బాది సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు.
2.5 Crore was watching Shubman Gill bat on JioCinema.
Joint peak in IPL 2023 - This is Gill Era. pic.twitter.com/JiMFLJI502— Johns. (@CricCrazyJohns) May 26, 2023
His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes - Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv
— JioCinema (@JioCinema) May 26, 2023
చదవండి: ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత.. ధోని తర్వాత శుభ్మన్ గిల్దే..!