Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. దళితుల సంక్షేమం, సాధికారతపై చర్చకు సిద్ధమా?
ADVERTISEMENT 

దళితుల సంక్షేమం, సాధికారతపై చర్చకు సిద్ధమా?

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
adimulapusuresh.jpg

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి, రాజకీయ సాధికారతకు నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తున్నదో.., అంతకుముందు  చంద్రబాబు సర్కార్‌ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని టీడీపీ నేతలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వేదిక, సమయం మీరే చెప్పండి. మీ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి వైఎస్సార్‌సీపీలో ఉన్న ప్రతి ఒక్క మాదిగ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు’ అని తేల్చిచెప్పారు.

దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారంతా క్షమాపణలు చెప్పి చర్చకు రావాలని సూచించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను అవహేళన చేసిన చంద్రబాబుకు డప్పు కొట్టడానికి సిగ్గులేదా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. దళిత మహిళను బూటుకాలితో తొక్కిన అచ్చెన్నాయుడిని చెప్పుతో కొట్టి మాట్లాడాలని హితవు పలి కారు. దళితులను చంద్రబాబు అడగడుగునా అవమానిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ అక్కున చేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రి  సురేష్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే

అసలు దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే. ఇప్పటికిప్పుడు కులాల సమావేశాలను చంద్రబాబు నిర్వహించడానికి ప్రధాన కారణం ఎన్నికలే. వాడుకొని వదిలేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దళిత ద్రోహులంతా నేడు సీఎం వైఎస్‌ జగన్‌పై బురదజల్లే 

ప్రయత్నం చేస్తున్నారు.  

చదవండి: Instagram Reels: రీల్స్‌ మోజులో బావిపైకి ఎక్కి...

వైఎస్‌ జగన్‌ వచ్చాకే డప్పు కళాకారులు, చర్మకారులకు న్యాయం

2019 జనవరి.. అంటే.. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నెలకు రూ.1500 చొప్పున డప్పు కళాకారులకు పింఛన్‌ ఇచ్చారు. అది కూడా 6,600 మందికి మాత్రమే మూడు నెలలే ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను సీఎం జగన్‌ రూ.3000కు పెంచారు. 2019–20లో 31 వేల మంది ,2020–21లో 43 వేల మందికి, 2021–22లో 49 వేల మంది, 2022–23లో 56 వేల మందికి పింఛన్‌ అందిస్తున్నాం. టీడీపీ హయాంలో మూడు నెలల్లో కేవలం రూ.30 కోట్లు ఇస్తే.. మేం ఏటా దాదాపు రూ.150 కోట్లు డప్పు కళాకారులకు పింఛన్‌గా ఇస్తున్నాం.

చర్మకారులకు పింఛన్‌ను చంద్రబాబు 2018 నవంబర్‌లో ప్రవేశపెట్టారు. రూ. 1000 చొప్పున 6 వేల మందికి ఇవ్వాలని జీవో నెంబర్‌ 191 ఇచ్చారు. ఇది కూడా ఎన్నికలకు మూడు నెలలు ముందు అమలు చేసి మూన్నాళ్ల ముచ్చట చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్మకారుల పింఛన్‌ రూ. 2 వేలు చేశాం. 2019–20లో 21 వేల మందికి, 2020–21లో 31,280 మందికి, 2021–22లో 35 వేల మందికి, 2022–23లో 40 వేల మందికి, 2023–24లో 41 వేల మందికి ఇస్తున్నాం. ప్రస్తుతం చర్మకారులు రూ. 2,750 పింఛన్‌ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా రూ.3 వేలు అవుతుంది. ఇప్పటి వరకు డప్పు కళాకారులకు రూ.600 కోట్లు, చర్మకారులకు రూ. 350 కోట్లు పింఛన్‌ కోసం ఇచ్చాం. అంటే.. టీడీపీ ఇచ్చిన దానికి మేం పదిరెట్లు ఎక్కువ ఇచ్చాం. 

దళితులకు రాజకీయ సాధికారత వైఎస్‌ జగన్‌తోనే

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మాదిగ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, రాజకీయంగా సాధికారిత కల్పిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గుర్ని ఎస్పీ కమిషన్‌ మెంబర్లుగా నియమించారు. నాలుగు మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్‌లుగా మాదిగలకు అవకాశవిుచ్చారు. గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి క్రిస్టినాకు ఇచ్చారు. డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌లుగా మరో ఇద్దరు మాదిగలకు ఇచ్చారు. మరో ఇద్దరు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌లు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, 46 మంది జెడ్పీటీసీలు, 55 మంది ఎంపీపీలు, 13 మంది మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు కూడా మాదిగ సామాజిక వర్గం వారే.

హెచ్‌ఆర్‌సీ సభ్యునిగా అత్యున్నత స్థాయి పదవిలో గొట్టిపోతుల శ్రీనివాసరావును నియమించారు. మంత్రివర్గంలో నాతో పాటు  తానేటి వనితను ఎంపిక చేశారు.  ఇద్దరు ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, బొమ్మి ఇజ్రాయేల్‌లను నియామకం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మాదిగ సామాజికవర్గానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత జగన్‌గారిదే. అవకాశం ఉన్న ప్రతి చోటా దళితులకు ఇవ్వాలనే తపన వైఎస్‌ జగన్‌ది.

దామాషాకు మించి.. దళితులకు వాటా

28 పైచిలుకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా నేరుగా పేదల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. వీటిలో దళితుల వాటా పెద్దది.  ఎస్సీల్లోని 37 ఉపకులాలు అన్నీ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని అనుకుంటుంటే చంద్రబాబుకి నచ్చడంలేదు. ఆయన మాటలను మాదిగలెవరూ నమ్మరు. ఈ పచ్చ తోడేళ్ల గుంపులో  దళితులెవ్వరూ భాగస్వామ్యం కావద్దని మంత్రి సురేష్‌ చెప్పారు. 

చదవండి: డిగ్రీ చేస్తే జాక్‌పాట్‌.. ఐటీ కంపెనీల క్యూ..

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Chandrababu Naidu
adimulapu suresh
SC ST Welfare Schemes
YSRCP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 ‘కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది’

‘కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది’

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

 ‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

‘ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

‘ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం

కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.