టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర ఎమోషనల్గా ఓ పోస్ట్ పెట్టింది. వరుసకు నానమ్మ అయ్యే (పూరీ జగన్నాధ్ బంధువు) బంధువు చనిపోయిన సంగతిని సోషల్ మీడియాలో పంచుకుంది. శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది.
(ఇదీ చదవండి: వివాదంలో 'ఒడిస్సీ'.. కనీసం రూ.6 లక్షలు చెల్లించలేరా?)
'ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ' అని పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర.. ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: కోయంబత్తూరులో రామ్ చరణ్కి సర్జరీ)
