నారాయణపేట: జిల్లా కేంద్రానికి చెందిన భక్త వత్సలం కుమారుడు కార్తీక్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సేవకురాలు సుధా కేశవరాజు.. కార్తీక్ను కలిసి తన ఇష్టాయిష్టాలు తెలుసుకోగా తనకు మెగాస్టార్ చిరంజీవిని కలవాలని ఉంది అని చెప్పాడు. దీంతో ఆమె విషయాన్ని చిరంజీవికి చెప్పగా వెంటనే కార్తీక్తో పాటు అతడి అక్కను కలిసి మాట్లాడారు. కార్తీక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా కార్తీక్కు తనకు తోచిన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ADVERTISEMENT
ADVERTISEMENT