Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

పద్దు ప్రసంగాలు.. సుదీర్ఘమైతే సంచలనాలు!

Business Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
budget.jpg

రాబోయే బడ్జెట్ సెషన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. తమ ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌లో చోటు లభిస్తుందోమోనని బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి చిరువ్యాపారుల వరకూ, వేతన జీవులు మొదలుకొని రోజుకూలీల వరకూ ఇలా.. వివిధ వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా ఏం ప్రకటిస్తారు.. ఎంత సేపు ప్రసంగిస్తారు..? అని ఆమె బడ్జెట్‌ ప్రసంగం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు పన్ను మినహాయింపుల గురించి దేశం ఆశాజనకంగా ఉంది. శనివారం సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించి చేసే ప్రసంగంతో బడ్జెట్‌కు సంబంధించిన అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.

ఇది చదివారా? ముందే లీకైన బడ్జెట్.. ఎప్పుడో తెలుసా?

బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రులు చేసే ప్రసంగాలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కొంత మంది మంత్రులు తమ ప్రసంగాలకు పొయెటిక్ టచ్ ఇచ్చి ఆకట్టుకుంటుంటారు. బడ్జెట్‌ ప్రసంగాలు కొన్నిసార్లు గంటలపాటు చాలా సుదీర్ఘంగా ఉంటాయి. మరికొన్ని మూడు ముక్కల్లో ముగుస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏమేం చేస్తుందో ప్రసంగాల ద్వారా ముందుకు తీసుకురావడం మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. అందుకే బడ్జెట్ ప్రసంగం అంటే అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బడ్జెట్ 2025-26 మన ముందుకు వస్తున్న తరుణంలో  భారత బడ్జెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన, సంక్షిప్తమైన ప్రసంగాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

సుదీర్ఘ ప్రసంగాలు
2020 బడ్జెట్ సమర్పణ సమయంలో ఆర్థిక మంత్రి సీతారామన్ భారతీయ చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేసి మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. 2020-21 బడ్జెట్ కోసం ఆమె ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు సాగింది. ఈ బడ్జెట్‌లోనే కొత్త పన్ను విధానం వంటి అనేక కీలక, సంచలన ఆర్థిక సంస్కరణలను సీతారామన్ ప్రవేశపెట్టారు.


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను కూడా ఆర్థిక మంత్రి అప్పుడే ప్రకటించారు. ఇంతటి సుదీర్ఘమైన ప్రసంగం మధ్యలో నిర్మలాసీతారామన్‌ ఒకానొక సమయంలో అస్వస్థతకు కూడా గురయ్యారు. ఈ ప్రసంగం 2 గంటల, 19 నిమిషాల నిడివితో ఉన్న 2019 రికార్డును (నిర్మలా సీతారామన్‌దే) బద్దలు కొట్టింది.

సీతారామన్ కంటే ముందు, సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత జస్వంత్ సింగ్‌ది. 2003లో ఆయన 2 గంటల 13 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ జాబితాలో తర్వాతి స్థానం అరుణ్ జైట్లీది. ఆయన  2014లో 2 గంటల 10 నిమిషాల ప్రసంగం చేశారు.

అత్యంత సక్షిప్తం ఇదే..
దేశంలోనే అత్యంత తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం.పటేల్ చేశారు. అప్పట్లో ఆయన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతోనే పూర్తయింది. 2024లో మధ్యంతర బడ్జెట్ ముందు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల వ్యవధిలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఇదే ఇప్పటి వరకు ఆమె చేసిన అత్యంత సంక్షిప్త బడ్జెట్ ప్రసంగం.

మన్మోహన్ సింగ్ పదాలు సుదీర్ఘం
పదాల పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు అప్పటి ఆర్థిక మంత్రి దివంగత డా. మన్మోహన్ సింగ్ పేరిట ఉంది. 1991లో ఆయన  చారిత్రాత్మక బడ్జెట్‌ ప్రసంగంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశ తలుపులు తెరిచారు. ఆ సంవత్సరం మన్మోహన్‌ సింగ్ బడ్జెట్ ప్రసంగ పాఠం 18,650 పదాలను కలిగి ఉంది. 


తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆ సంవత్సరంలో మన్మోహన్‌ సింగ్ సమర్పించిన ఆర్థిక సంస్కరణలు సరళీకృత ఆర్థిక వ్యవస్థకు దారితీశాయి. ఆయన సాహసోపేతమైన ప్రణాళికలు, వ్యూహాత్మక విధాన మార్పులు  ప్రపంచంలో భారతదేశ స్థితిని మార్చేశాయి. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991 నుండి 1996 వరకు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Union Budget 2025-26
budget speech
longest
short
finance ministers
Nirmala Sitharaman
Manmohan Singh
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

త్వరలో 50 వేలకే తులం బంగారం?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో  స్టాక్ మార్కెట్

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, ఫుల్ జోష్ లో స్టాక్ మార్కెట్

గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?

గోల్డ్ మార్కెట్‌లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?

గంట గంటకు మారుతున్న బంగారం ధరలు

గంట గంటకు మారుతున్న బంగారం ధరలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.