Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘ఆమోద’o లేకుండానే భూ కేటాయింపు!?
ADVERTISEMENT 

‘ఆమోద’o లేకుండానే భూ కేటాయింపు!?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 8, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
land_20f.jpg

అత్యవసరంగా టేబుల్‌ అజెండాగా ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపుల తీర్మానం 

ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం ముందుకు ప్రతిపాదన 

వ్యతిరేకించిన కౌన్సిల్, ప్రకటన కూడా జారీ చేసిన మేయర్‌ 

అయినా డిసెంబర్‌ 12న భూ కేటాయింపుల ఉత్తర్వులు 

కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఇలా ఎలా? రికార్డులు తారుమారయ్యాయా?  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ‘ఆంధ్రజ్యోతి’కి భూ కేటాయింపులు జరిగాయా? కౌన్సిల్‌ ఆమోదించనప్పటికీ ఆమోదించినట్టుగా రికార్డుల్లో మార్పులు చేశారా? తాజాగా ఆంధ్రజ్యోతికి భూమి కేటాయింపులపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో జీవీఎంసీలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆంధ్రజ్యోతికి (ఆమోద పబ్లికేషన్స్‌) భూ కేటాయింపుల అంశాన్ని అత్యవసరంగా, టేబుల్‌ అజెండాగా.. సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2025 ఆగస్టు 22న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెట్టారు.

అయితే, ఆ తీర్మానాన్ని కౌన్సిల్‌ స్పష్టంగా తిరస్కరించినట్టు స్వయంగా మేయర్‌ కూడా అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం 2025 డిసెంబర్‌ 12న ఆంధ్రజ్యోతికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా జీవీఎంసీ కౌన్సిల్‌ తీర్మానం లేకుండా భూ కేటాయింపులపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

కౌన్సిల్‌ ఆమోదించనప్పటికీ, ఆమోదించినట్టుగా రికార్డుల్లో మార్పులు చేశారా? అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్‌లో ‘జంగిల్‌ రాజ్‌’ ప్రయోగించి ఆమోదం తెచ్చుకున్నట్టు హడావుడిగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జ్యోతికి భూ కేటాయింపుల విషయంలో కూడా అసలు కౌన్సిల్‌ నిర్ణయం లేకుండానే బుల్డోజర్‌ రాజకీయాలు నడిపి ఉత్తర్వులు జారీ చేశారా? ఏకంగా రికార్డులనే మార్చివేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.   

కేటాయింపులు రద్దయినప్పటికీ..! 
వాస్తవానికి, తన పాత్రికేయ మిత్రునికి మేలు చేసేందుకు గతంలోనే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రజ్యోతికి భూమిని కేటాయించారు. 2017 జూన్‌ 28న అప్పటి ప్రభుత్వం ఎకరానికి కేవలం రూ.50.50 లక్షల చొప్పున భూమి కేటాయించాలని నిర్ణయించింది. అయితే, కలెక్టర్‌ నిర్ణయించిన ధరకు భిన్నంగా అతి తక్కువ ధరకు భూమిని కేటాయించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ప్రాంతంలో (హౌసింగ్‌ బోర్డు భూమి) భూమి విలువ ఎకరానికి రూ.7.26 కోట్లుగా ఉంటుందని అప్పటి విశాఖ కలెక్టర్‌ యువరాజ్‌ 2016 ఆగస్టు 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 

అనంతరం వచ్చిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కూడా 2016 అక్టోబర్‌ 4న అదే ధరను నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ, పరదేశిపాలెంలోని సర్వే నెంబర్లు 191/10, 191/14లలో ఉన్న అర ఎకరం భూమిని కేవలం రూ.50.50 లక్షలకే కేటాయిస్తూ 2017 జూన్‌ 28న అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ జీవో ఎంఎస్‌ నంబర్‌ 25 జారీ చేశారు.

ఈ అడ్డగోలు వ్యవహారంపై 2019 అక్టోబర్‌ 16న జరిగిన కేబినెట్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ భూ కేటాయింపులను రద్దు చేసింది. ఆ భూమిని గూడులేని పేదలకు కేటాయించాలని నిర్ణయించింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే భూమిని ఆంధ్రజ్యోతికి కేటాయించేందుకు బరితెగించింది.   

అత్యవసర టేబుల్‌ అజెండా 
భూ కేటాయింపులు వంటి కీలక అంశాలను సాధారణంగా రెగ్యులర్‌ అజెండాలో చేర్చాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే టేబుల్‌ అజెండాగా అంశాలను ప్రవేశ పెట్టడం పరిపాటి. అయితే, ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ముందుగా సమాచారం ఇస్తే అడ్డంకులు ఎదురవుతాయనే భయంతోనే దీనిని అత్యవసర టేబుల్‌ అజెండాగా చివరి అంశంగా (67వ అంశం) ప్రవేశపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


‘మార్కెట్‌ ధరకు కేటాయింపు’ అని మాత్రమే పేర్కొని, అసలు ధర ఎంతన్నది స్పష్టం చేయలేదు. పరదేశీపాలెంలోని సర్వే నెంబరు 203/2పీ లోని ఈ భూమి ధర 2016లోనే ఎకరానికి రూ.7.26 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో ఎకరానికి రూ.20 కోట్లకు పైగా విలువ ఉంటుందని అంచనా. అంటే అర ఎకరం భూమి ధర కనీసం రూ.10 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ మార్కెట్‌ ధర పేరుతో అతి తక్కువ ధరకే భూమిని ఆంధ్ర­జ్యోతికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం గమనార్హం.

తీర్మానాన్ని మార్చేశారా?
జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో టేబుల్‌ అజెండా 67వ అంశంగా ఆమోద పబ్లికేషన్స్‌కు భూ కేటాయింపుపై ప్రతిపాదన వచ్చింది. అయితే, చర్చకు వచ్చినప్పటికీ ఆ అంశాన్ని కౌన్సిల్‌ ఆమోదించలేదు. ఈ విషయాన్ని స్వయంగా మేయర్‌ ప్రకటిస్తూ, ఆ అంశాన్ని వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు. ఆగస్టు 22న జరిగిన సమావేశం తర్వాత ఈ అంశం మరో జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు రాలేదు. అయినప్పటికీ 2025 డిసెంబర్‌ 12న ప్రభుత్వం భూ కేటాయింపులపై ఉత్తర్వులు జారీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 

నిజంగా కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఉత్తర్వులు జారీ చేశారా? లేక ఆమోదం పొందినట్టుగా రికార్డులను మార్చేశారా? అన్న ప్రశ్నలు జీవీఎంసీలో హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో యోగా డే సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీలో పెద్ద బండరాళ్లు తొలగించేందుకు నామినేషన్‌ పద్ధతిలో లక్షల రూపాయలు వెచ్చించిన వ్యవహారంలో కూడా ఇలాగే స్టాండింగ్‌ కమిటీ ఆమోదం లేకుండానే రికార్డులు మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. 

ఇప్పుడు ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల విషయంలో కూడా అదే తరహా అక్రమాలు జరిగాయా? అన్నది తేలాల్సి ఉంది. కౌన్సిల్‌ తీర్మానం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తే అవి చెల్లవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా, ఆమోదం లేనప్పటికీ, ఉన్నట్టుగా రికార్డులు మార్చితే సంబంధిత అధికారులు తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
GVMC
land Allocations
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.