సాక్షి, హైదరాబాద్: తాను ఆరోగ్యంగానే ఉన్నానని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తన ఆరోగ్యంపై ఆందోళన అనవసరమన్న బొత్స.. రొటీన్ చెకప్లో భాగంగా ఆస్పత్రికి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆయన స్పందించారు.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
ADVERTISEMENT
ADVERTISEMENT