Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘సాక్షి’ ఎడిటర్‌పై మరో కేసు
ADVERTISEMENT 

‘సాక్షి’ ఎడిటర్‌పై మరో కేసు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 7, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sakshi.jpg

అక్రమాలు, అరాచకాలు, దోపిడీని ప్రశ్నిస్తున్నందుకు అక్కసు

ఒక్క కర్నూలులోనే ఇప్పటికే ఐదు కేసులు 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు.. ‘భరత్‌ ఆదేశమా? ప్రభుత్వ నిర్ణయమా?’ కథనంపై తాజాగా మరో కేసు

ఏ, బీ, సీ క్యాంపు క్వార్టర్ల వ్యవహారంలో మంత్రి టీజీ భరత్‌పై తీవ్ర ప్రజా వ్యతిరేకత 

ఇది తట్టుకోలేక ‘సాక్షి’పై కక్షసాధింపు 

మంత్రి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఎన్నిసార్లు హెచ్చరించినా మారని ప్రభుత్వ వైఖరి  

సాక్షి ప్రతినిధి కర్నూలు: ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా వ్యతిరేకత తట్టుకోలేక తప్పుడు కేసులు నమోదు చేస్తూ ‘సాక్షి’ గొంతు నొక్కడానికి విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కర్నూలులో  ఇప్పటికే ‘సాక్షి’పై 5 కేసులు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. ఇందులో రెండు కేసులు పోలీసులు అక్రమంగా నమోదు చేస్తే, మిగిలిన కేసులు మంత్రి టీజీ భరత్‌ ఆదేశాలతో నమోదయ్యాయి. 

‘క్యాంపు భరతం పట్టేస్తా!’ శీర్షికన సెప్టెంబర్‌ 13న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. కర్నూల్లో కీలకమైన ఆ ప్రాంతాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని వివరించింది. ఉన్నఫళంగా క్వార్టర్లు ఖాళీ చేయా­లని నోటీసులు అందడంతో ఏ,బీ,సీ క్యాంపు క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారు, ప్రభుత్వ ఉద్యోగు­లు వరుస ఆందోళనలకు దిగారు. ఎలా­గైనా క్వార్టర్లు కూల్చేయాలని భీష్మించిన మంత్రి టీజీ భరత్‌ ‘క్వార్టర్లు ఖాళీ చేయాల్సిందేనని, లేదంటే కర్ర పట్టుకోవాల్సి వస్తుంది’ అని బెదిరించారు. 

దీంతో క్వార్టర్లు కూల్చేయడం, ఖాళీ చేయడం అనేది ప్రభుత్వ నిర్ణయమా? భరత్‌ వ్యక్తిగత నిర్ణయమా? అనే చర్చ నగరంలో జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణ­యమైతే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువరించాలి. భరత్‌ వ్యక్తిగత నిర్ణయమైతే క్వార్టర్లు ఖాళీ చేయండనే హక్కు ఆయనకు లేదు. ఇంత వరకూ ప్రభుత్వం నుంచి క్వార్టర్లు ఖాళీ చేయాలని ఉత్తర్వులు లేవు. అక్కడ మినీ స్టేడియం నిర్మిస్తున్నామని, ఖాళీ చేయాలంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు కొంత మందికి నోటీసులు జారీ చేశారు. 

నోటీసులకు, మంత్రి మాటలకు పొంతన ఏదీ?  
ఏబీసీ క్వార్టర్లు ఖాళీ చేయాలని, అక్కడ మినీ స్టేడియం నిర్మిస్తున్నామని ఏప్రిల్‌ 10న ఆర్‌అండ్‌బీ ఏఈ, డీఈ, ఈఈలు 39 మందికి నోటీసులు జారీ చేశారు. మినీ స్టేడియం నిర్మిస్తున్నామని నోటీ­సులో స్పష్టంగా పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 5 ఎకరాలు కూడా అవసరం లేదు. అయితే అక్కడ 160–­170 ఎకరాల స్థలం ఉంది. మార్కెట్‌ రేటు ప్రకారం ఈ స్థలం విలువ రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లు ఉంటుంది. తక్కిన స్థలాన్ని పీపీపీ విధానం ప్రకారం టీడీపీ నేతలు కొట్టేయాలనే ప్రచా­రం నడిచింది. 

అధికార, రాజకీయ వర్గాలు కూడా ఈ అంశాన్ని చర్చించాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ సెపె్టంబర్‌ 13న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో ఆగ్రహం చెందిన ప్రభుత్వ పెద్దలు టూటౌన్, త్రీటౌన్‌లో ‘సాక్షి’పై కేసు నమోదు చేయించారు. ఈ కథనం తర్వాత నగరవాసులంతా విలువైన ప్రభు­త్వ స్థలం లీజు పేరుతో పరుల పరం కాకూడదని చర్చించుకున్నారు. ఈ వ్యవహారంలో భరత్, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో భరత్‌ అక్కడ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నామని, స్థలాలు ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు. 

అధికా­రులు నోటీసుల్లో పేర్కొన్నట్లు మినీ స్టేడి­యం నిర్మించడం వాస్తవమా? లేక భరత్‌ చెప్పినట్లు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నారా? ఈ రెండింటిలో ఏది నిజమైనా ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా? స్టేడియం నిర్మిస్తున్నామని, లేదా హైకోర్టు బెంచ్‌ ఏ,బీ,సీ క్యాంపుల్లో నిర్మిస్తున్నామని ప్రభుత్వం ఎందుకు జీవో జారీ చేయలేదు? హైకోర్టు బెంచ్‌ ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు? తక్కిన స్థలాన్ని ఏం చేస్తారు? అనే విషయాలను ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. 

ఈ వ్యవహారంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని, పీపీపీ విధానం ద్వారా టీడీపీ నేతలు కొట్టేయకూడదనే ‘సాక్షి’ రాసింది. ప్రజల తరఫున పై విషయాలను ప్రశ్నించినందుకు వాటికి సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు నమోదు చేయడంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అక్రమ కేసులను చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసింది.

జాతీయ స్థాయిలో తప్పుబట్టినా మారని ప్రభుత్వ, పోలీసు వైఖరి
ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ పత్రికపై, జర్నలిస్టుల­పై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నేతలు, జర్నలిస్టు యూ­నియన్లతో పాటు జాతీయ స్థాయిలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎడిటర్స్‌ గిల్డ్‌ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. 

హైకోర్టు, సుప్రీ­ంకోర్టు కూడా ప్రభుత్వ వైఖరిని ఎత్తి చూ­పి­ంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని, రాజ్యంగం పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా కల్పించిందని, దాన్ని ఇత­ర వ్యవస్థలు కాపాడాలని విన్న­విస్తున్నా ప్రభుత్వా­నికి, పోలీసులకు ఏమాత్రం చెవికెక్క­డం లేదు. 


ప్రభుత్వ పెద్ద­లు ఎలా చెబి­తే అలా అక్ర­మ కేసులు నమో­దు చేస్తు­న్నా­రు. వార్త­లతో ఎవ­రికైనా పరువునష్టం వాటిల్లి ఉంటే కోర్టును ఆశ్రయింవచ్చు. పరువునష్టం దా­వా దాఖలు చేయొచ్చు. కానీ అధికారం ఉందికదా అని ‘సాక్షి’­పై అక్రమ కేసులు నమో­దు చేయించడాన్ని ప్రజలు, మేధావులు తప్పుపడుతున్నా­రు.

కర్నూల్లో ‘సాక్షి’పై ఇవీ కేసులు
» చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై కర్నూలులో 6 కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్‌ 13న ‘క్యాంపు భరతం పట్టేస్తా!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై త్రీటౌన్‌ పోలీసు­స్టేష­న్‌­లో సాక్షి మేనేజ్‌­మెంట్, సాక్షి పబ్లిషర్‌పై క్రైం నెంబర్‌ 419/­20225 కింద సెక్షన్‌ యూ/­ఎస్‌192, 352,353 (1),(బి),356­(1),­­61(1)(ఏ) రెడ్‌విత్‌ 3(5) 
బీఎ­న్‌ఎస్‌ ప్రకారం కేసు నమోదు చేశారు.  

»  ఇదే కథనంపై రెండో పట్టణ పోలీసు­స్టేషన్‌­లో సెక్షన్‌ 192, 356(1),­352, 353(1)(బి)61­(1)­(ఏ)­రెడ్‌విత్‌ 3(5) బీఎన్‌సీపై మరో కేసు నమోదు చేశారు. నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌లో, శరత్‌బాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టూటౌన్‌లో కేసులు నమోదు చేశారు.

»  ‘ప్రభుత్వ నిర్ణయమా? భరత్‌ ఆదేశమా?’ అనే శీర్షికతో గత నెల 28న ప్రచురితమైన కథనంపై ఈ నెల 4న టూ టౌన్‌ పోలీసు­స్టేషన్‌లో గజేంద్ర సింగ్‌ ‘సాక్షి’ ఎడిటర్, పబ్లిషర్, సెల్లర్, రిపోర్టర్‌పై సెక్షన్‌ 192, 352,353(1)(బి),­353(1)(సి),­353(2), 356(3),­356(4)­,­రెడ్‌విత్‌ 3(5) బీఎ­­న్‌ఎస్‌ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నీ మంత్రి తన అనుచరులతో ఫిర్యాదు చేయించినవే అన్నది బహిరంగ రహస్యం.

»  జూలై 26న కర్నూలు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ‘సాక్షి­’పై సెక్షన్‌ 132, 308(3), 353(1)(బి), 356(3), రె­డ్‌విత్‌ 61(2)బీఎన్‌ఎస్‌ ప్రకారం కేసు నమోదు చేశారు. ‘రాయ­ల­సీమలో అనకొండ ఐపీఎస్‌’ పేరు­తో ప్రచురి­త­మైన కథనం నేపథ్యంలో ఆ కేసు నమోదు చేశారు. 

» గతేడాది డిసెంబర్‌ 22న కర్నూలులో మునీర్‌ అహ్మద్‌ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీ­సులు కిడ్నాప్‌ చేశారు. దీనిపై కథనం రాస్తే త్రీటౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు తన విధులకు ‘సాక్షి’ విలేకరి ఆటంకం కల్గించారని తప్పుడు ఫిర్యాదుతో త్రీటౌన్‌లో కేసు నమోదు చేశారు. 

» కర్నూలు కార్పొరేషన్‌ టెండర్లలో ఎవ్వరూ పాల్గొన­వద్దని మంత్రి భరత్‌ అనుచరుడు సందీప్‌ అనే వ్యక్తి వాట్సాప్‌ గ్రూపుల్లో కాంట్రాక్టర్లకు బెదిరింపు మెసేజ్‌లు పంపారు. దీనిపై ఆధారాలతో ‘సాక్షి’ కథనం ప్రచురిస్తే అతని ఫిర్యాదుతో వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
tg bharath
Cases registered
sakshi media
dhananjaya Reddy
Chandrababu Naidu
freedom of Press
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.