-
బీజేపీ భారీ ప్రయోగం.. ఫలించేనా?
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ ఎన్నికల్లో హ్యట్రిక్ విక్టరీపై బీజేపీ కన్నేసింది. అయితే అది కేవలం జాతీయ స్థాయిలోనే కాదు. దేశానికి గుండెకాయలాంటి రాజధాని ఢిల్లీలోనూ హ్యట్రిక్ క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లకు ఏడు సీట్లు కాషాయం పార్టీనే గెలుచుకుంది. అయితే.. ఈసారి ఇక్కడ బీజేపీ భారీ ప్రయోగానికే దిగింది. ఢిల్లీలో ఈనెల 25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి పాత వాసనలు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. మొత్తం ఏడు సీట్లలో.. ఆరుగురు సిట్టింగ్లను పక్కన పెట్టేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారి మాత్రమే టికెట్ దక్కించుకోగలిగారు. బీజేపీ లీగల్ సెల్లో యాక్టివ్గా పనిచేస్తున్న సుష్మాస్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్.. న్యూఢిల్లీ ఎంపీ సీటు నుంచి పోటీకి దిగారు. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేయడం బన్సూరికి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. బస్సూరితో పాటు చాందిని చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, ఈస్ట్ ఢిల్లీ నుంచి హర్ష మల్హోత్ర, నార్త్వెస్ట్ ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా, వెస్ట్ డిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రవాత్, సౌత్ ఢిల్లీ నుంచి రాంవీర్ సింగ్ బిదూరి కొత్తగా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ➡️ అయితే.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బిజెపికి గట్టి సవాలే ఎదురవుతోంది. గత రెండు ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీచేయడంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. కానీ ఈ సారి ఆప్, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. ఆప్ నాలుగు సీట్లలో, కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీ విజయం కాస్త కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా.. ➡️ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ ప్రచారం చేస్తోంది. తద్వారా ప్రజల్లో కొంత సానుభూతిని రాబట్టాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలను బీజేపీ ఎలా తిప్పికొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈలోపే.. ➡️కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్పై సీఎం వ్యక్తిగత అనుచరుడు దాడి చేసిన ఘటన జరిగింది. ఇది ఇప్పుడు బీజేపీకి రాజకీయ ప్రచార అస్త్రంగా మారింది. సీఎం ఇంట్లోనే మహిళలకు భద్రతలేదనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుతోంది. అయితే బీజేపీ కేవలం ప్రత్యర్థులపై విమర్శలతోనే సరిపెట్టడం లేదు. ➡️నరేంద్ర మోదీ సారథ్యంలో గత ప్రభుత్వం పదేళ్ల సాధించిన విజయాలనూ ఢిల్లీలో బిజెపి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్ను రాజధాని ప్రజల ముందు పెడుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఢిల్లీలో అమలు చేయకుండా కేజ్రీవాల్ అడ్డుపడ్డారనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మినీ ఇండియా లాంటి ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అన్ని పార్టీల ప్రచారాలను గమనిస్తున్న ఓటరు ఎటు నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
నామినేషన్ వెనక్కి.. ప్రముఖ నటుడికి ఊరట
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్లోని కరకట్ లోక్సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.ఈ సీటు నుంచి భోజ్పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.పవన్ సింగ్ తల్లి నామినేషన్ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున కరకట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్ సింగ్ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.దీనికి ముందు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానం టిక్కెట్ను బీజేపీ పవన్ సింగ్కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ సింగ్ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్పై దాడి
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంకా ఎన్నికల జరగని నియోజకవర్గాల్లో నేతలు ప్రచారాలు సాగిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మే 25న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్పై దాడి జరిగింది.జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నేత, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్తార్ నగర్లో కన్హయ్య కుమార్కు పూలమాల వేసే నెపంతో వచ్చిన కొందరు వ్యక్తులు అతనిని చెప్పుతో కొట్టారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్పై కూడా వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఆ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కన్హయ్య కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు పూలదండలతో రావడం కనిపిస్తుంది. వీరు కన్హయ్యకు పూలమాల వేయకుండా, అతనిపై దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కన్హయ్య కుమార్ మద్దతుదారులు వెంటనే ఒక యువకుడిని పట్టుకున్నారు.బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. తనకు అమితంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి, సిట్టింగ్ ఎంపీ తివారీ నిరుత్సాహానికి గురయ్యారని, అందుకే తనపై దాడి చేసేందుకు గూండాలను పంపారని కన్హయ్య పేర్కొన్నారు. మే 25న ఓటింగ్ ద్వారా ప్రజలు దీనికి సమాధానం చెబుతారని అన్నారు.ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మే 25న ఓటింగ్ జరగనుంది. ఈశాన్య ఢిల్లీ లోక్సభ స్థానం నుండి బీజేపీ.. మనోజ్ తివారీని అభ్యర్థిగా నిలబెట్టగా, కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్ను బరిలోకి దించింది. ఈ సీటులో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని సమాచారం. కన్హయ్య తన రాజకీయాలను జేఎన్యూ నుంచి ప్రారంభించారు. మనోజ్ తివారీ నటుడు, గాయకుడు. రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. -
Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
భుజాన సంచి. అందులో జాగ్రఫీ పుస్తకం, ఒక జత బట్టలు. మెడలో ఎర్ర కండువా. ముఖాన చెరగని చిరునవ్వు. మండే ఎండల్లోనూ అలుపెరుగని ప్రచారం. వయసు 30 ఏళ్లు. పేరు దీప్సితా ధర్. బెంగాల్ వామపక్ష రాజకీయాల్లో కొత్త ముఖం. సీపీఎం సానుభూతిపరురాలిగా మొదలై, ఢిల్లీలో విద్యార్థి నాయకురాలిగా ఎదిగి ఇప్పుడు సొంత బెంగాల్లో శ్రీరాంపూర్ లోక్సభ స్థానం అభ్యరి్థగా బరిలోకి దిగారు. ‘ఖేలా హోబ్’ (గేమ్ ఈజ్ ఆన్) అన్న తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా దీదీ ఇచ్చిన నినాదానికి బదులుగా ‘నేను సైతం సిద్ధం’ అంటూ తలపడుతున్నారు... టామ్ బోయ్... దీప్సిత పశ్చిమబెంగాల్లోని హౌరాలో 1993లో జన్మించారు. తండ్రి పీయూష్ ధర్. తల్లి దీపికా ఠాకూర్ చక్రవర్తి. తాత పద్మనిధి ధర్. అంతా సీపీఎం రాజకీయాల్లో ఉన్నారు. బాల్యం నుంచి టామ్ బోయ్లా పెరిగిన దీప్సితకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళని చూసి రాజకీయాలు చేస్తే కుటుంబానికి సమయం ఇవ్వలేమని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత అభిప్రాయం మారింది. దక్షిణ కోల్కతాలోని అశుతోష్ కాలేజీలో జియాలజీ చదివాక ఢిల్లీ జేఎన్యూలో జాగ్రఫీలో పీజీ, ఎంఫిల్ చేశారు. పాపులేషన్ జాగ్రఫీలో పీహెచ్డీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో అరంగేట్రం... కోల్కతాలో కాలేజీ రోజుల నుంచీ దీప్సిత విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తర్వాత ఎస్ఎఫ్ఐ జేఎన్యూ అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా పనిచేశారు. రోహిత్ వేముల మృతి సందర్భంగా జరిగిన ఉద్యమంలో, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు కేసులు ఎదుర్కొన్నారు. ఇంగ్లి‹Ù, హిందీ, బెంగాలీల్లో అద్భుతంగా, అనర్గళంగా మాట్లాడే దీప్సిత జాతీయ చానళ్లలో రాజకీయ చర్చల్లో తరచూ పాల్గొంటారు. 2011లో బెంగాల్లో సీపీఎం అధికారం కోల్పోవడం ఆమెను బాధించింది. అదే పదేళ్ల తర్వాత ఎన్నికల రాజకీయాలవైపు నడిపించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు శ్రీరాంపూర్ లోక్సభ స్థానంలో సీపీఎం తరఫున రాజకీయ ఉద్ధండులతో పోరాడుతున్నారు. మిస్టర్ ఇండియా వర్సెస్ మిస్ యూనివర్స్ రెండు నెలల ముందునుంచే దీప్సిత ప్రచారం మొదలుపెట్టారు. తృణమూల్, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తృణమూల్కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమే. తృణమూల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచాక బీజేపీలో చేరారు. సీపీఎం నుంచి మాత్రం ఎవరూ బీజేపీలోకి వెళ్లలేదు. ‘‘మిస్టర్ ఇండియా సినిమాలో అనిల్ కపూర్ వాచ్ పెట్టుకుంటే మాయమైపోయేవాడు. మన ఎంపీలదీ అదే పరిస్థితి. గెలుస్తారు, మాయమైపోతారు’’ అంటూ బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కళ్యాణ్ కౌంటరిస్తూ దీప్సితను మిస్ యూనివర్స్గా అభివరి్ణంచారు. ‘‘దేశమంతా పర్యటించి వచ్చారు. ఇప్పుడు మిస్టర్ ఇండియాను చూసేందుకు శ్రీరాంపూర్ వచ్చారు’ అంటూ ఆమెను ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర సీపీఎం తీవ్రంగా మండిపడుతోంది. బాధించిన ‘రంగు’ తన బాల్యం కాస్త బాధాకరంగానే గడిచిందంటారు దీప్సిత. తల్లిదండ్రులిద్దరిదీ మంచి రంగు. తాను మాత్రం నల్లగా ఉంటుంది. దాంతో ఇరుగుపొరుగు మొదలు అందరూ ‘అమ్మాయేంటి ఇంత నల్లగా ఉం’దని అడిగేవారట. బయటికి వెళ్లినా అదే పరిస్థితి. దాంతో నలుగురికిలోకి వెళ్లాలంటే ఒక రకమైన భయం! ఒకసారి చూసిన వారు మళ్లీ పరికించి చూస్తే తన రంగు గురించేమోననే బాధ తెలియకుండానే కలిగేది. తర్వాత ఆ ఆత్మన్యూనత నుంచి బయటపడ్డారామె. ఇప్పుడు బెంగాల్లో భయంకరమైన ఎండలు. అయినా ప్రచారంలో దీప్సిత కళ్లజోడు కూడా పెట్టుకోవడం లేదు. ఎందుకంటే, ‘‘అందరూ నా కళ్లలోకి చూడగలగాలి. నా మనసులో ఏముందో అర్థం చేసుకోగలగాలి. కళ్లను అద్దాలతో మూసేస్తే ఎలా?’’ అని ప్రశి్నస్తారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
'నా కొడుకు రాహుల్ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార హోరు జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు సైతం క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ అధినేత్రి 'సోనియా గాంధీ' శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.రాహుల్ గాంధీకి తన (సోనియా గాంధీ) పట్ల చూపిన అదే ప్రేమ, ఆప్యాయతలను అందించాలని సోనియా గాంధీ ప్రజలను కోరారు. ''నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను. మీరు నన్ను మీవారిలా భావించినట్లే, అతనికి కూడా అదే ప్రేమ, ఆప్యాయతని అందించండి''. రాహుల్ మిమ్మల్ని మీరసపరిచేది లేదని అన్నారు.తమ కుటుంబానికి ఎప్పుడూ మద్దతు ఇచ్చే రాయ్బరేలీ ఈ సారి కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు, వయసు రీత్యా తాను లోక్సభ ఎన్నికలలో పాల్గొనడం లేదని సోనియా గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఈమె 2004 నుంచి రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది.ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. రాయ్బరేలీ ప్రజలకు 20 ఏళ్ల పాటు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించారు. అదే నాకు పెద్ద ఆస్తి. రాయ్బరేలీకి చెందిన నా కుటుంబ సభ్యులు, చాలా కాలం తర్వాత మీ మధ్య ఉండే అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.రాయ్బరేలీ మాదిరిగానే.. అమేథీ కూడా నా ఇల్లు అని పేర్కొంటూ.. నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు, కుటుంబ మూలాలు ఈ మట్టితో ముడిపడి ఉన్నాయి. గంగామాత వలె పవిత్రమైన ఈ సంబంధం అవధ్ మరియు రాయ్బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమైంది, ఇది నేటికీ కొనసాగుతోందని సోనియా గాంధీ అన్నారు.मैं आपको अपना बेटा सौंप रही हूं।: श्रीमती सोनिया गांधी जी📍 रायबरेली, यूपी pic.twitter.com/5kwxLtM8nt— Congress (@INCIndia) May 17, 2024 -
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్లల్లాను టెంట్కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలనుకుంది. కాంగ్రెస్ వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్, పవార్.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ అన్నారు. మత నిర్జవ్స్త్రన్లకు ల్యాబ్గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు. -
Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగిసింది. మిగతా 13 నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీల్లో అసలు పారీ్టగా ప్రజలు దేన్ని గుర్తిస్తున్నదీ ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తదితరులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో తుది దశలో పోలింగ్ జరగనున్న కీలక స్థానాలపై ఫోకస్... నాసిక్ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు తదితరాలపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి రాజాభావు వాజే పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, ఏడు గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్గా వీరిద్దరికీ పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. సీఎం షిండే ముమ్మరంగా ప్రచారం చేశారు. వంచిత్ బహుజాన్ అగాడీ నుంచి కరణ్ గైకర్ కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోరు నెలకొంది.పాల్గఢ్ ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవర బరిలో ఉన్నారు. శివసేన (ఉద్ధవ్) నుంచి భారతి భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడీ, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడీ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించడం, ఇక్కడ ఇద్దరు సాధువులను కొట్టి చంపడం ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదేపదే ప్రస్తావించారు. రూ.76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివసేన (షిండే)కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్య గవిట్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భివండి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సురేశ్ మాత్రే (బాల్యా మామ), స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ సంబారే పాటిల్కు గట్టి పోటీ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో 5 లక్షల మంది ముస్లింలే. 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్ర వర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్థులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది.ముంబై నార్త్ ఇక్కడ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం తొలుత దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గుచూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రాం నాయక్ విజయం సాధించాక పరిస్థితులు మారాయి. 2008లో లోక్సభ స్థానాల పునరి్వభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్య తరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్పై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4.47 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళా మతోండ్కర్ను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు.కల్యాణ్ అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యరి్థగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండటంతో ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడీ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యరి్థగా వైశాలి దారేకర్ రాణే బరిలో నిలిచారు. దాంతో ఇంతకాలంగా శివసేనను ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది. సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పారీ్టల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. గత రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఉద్దవ్ వర్గం అభ్యరి్థకి కలిసొచ్చే అంశం. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారీ గెలిపిస్తే మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడని సీఎం షిండే భరోసా ఇస్తున్నారు. థానే ఇక్కడ రెండు శివసేనల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతరులు పోటీలో ఉన్నా నామమాత్రమే. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాబూరావు విచారే 4.12 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజపేపై ఘన విజయం సాధించారు. ఈ విడత విచారే శివసేన (ఉద్ధవ్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థిగా నరేశ్ గణపత్ మాస్కే బరిలో ఉన్నారు. విచారే ముందునుంచీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కేకు మద్దతుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సేన, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యరి్థత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరూ థానే మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది.ఐదో విడత పోలింగ్ జరిగే స్థానాలుధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కల్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్–వెస్ట్, ముంబై నార్త్–ఈస్ట్, ముంబై నార్త్–సెంట్రల్, ముంబై సౌత్–సెంట్రల్, ముంబై సౌత్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
సంప్రదాయ చీరలు. భుజానికి డోలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కంటే ముందే దర్శనమిస్తారు. అభ్యరి్థది ఏ పార్టీ అయినా సరే, వీరు మాత్రం ఉండాల్సిందే. వారే మహిళా ఢాకీలు. ఈసారి పశి్చమబెంగాల్లో ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న కళాకారులు వీళ్లు. ఢాకీ చప్పుడు దుర్గ పూజ సమయంలో ప్రజలను మేల్కొలిపే సంబరం. ‘ధునుచి నాచ్’లాగే డ్రమ్స్ వాయించడం దుర్గ పూజలో ముఖ్యమైన అంశం. సాధారణంగా దుర్గ పూజ సమయంలో స్త్రీలు నృత్యకారిణులుగా, పురుషులు ఢాకీలుగా ఉంటారు. కొంతకాలం కింద మహిళలు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దుర్గ పూజల్లో డ్రమ్స్ వాయిస్తూ ఢాకీలుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రచారంలో కీలకంగా మారారు. దాదాపుగా అన్ని పారీ్టలూ వీరిని పిలుస్తున్నాయి. వీళ్లు ముఖ్యంగా రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. అయితే అదంత సులువైన వ్యవహారం కాదు. రోజంతా డ్రమ్ భుజానికి తగిలించుకునే ఉండాలి. మరోవైపు తీవ్రమైన వేడి. అయినా ఉపాధి దొరుకుతుండటంతో మహిళలు ఢాకీ ధరించి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఢాకీ వాయిస్తూ రోజుకు రూ.700 నుంచి రూ.800 దాకా సంపాదిస్తున్నారు. దుర్గాపూజ వేళ వీరికి 5 రోజులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వస్తాయి. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో అయితే ఆదాయం ఇంకాస్త ఎక్కువ వస్తుంది. గతేడాది హైదరాబాద్లోనూ దసరా ఉత్సవాల్లో మహిళా ఢాకీలు సందడి చేశారు! డిమాండ్ పిరిగింది... ఎన్నికల ప్రచారంలో గతంలో మహిళా ఢాకీలకు ఇంత డిమాండ్ ఉండేది కాదంటున్నారు శివ్పాద్ దాస్. ఆయన మాచ్లాండ్పూర్లో ఢాకీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ‘‘ఈసారి మహిళా ఢాకీలకు పారీ్టల నుంచి బాగా డిమాండ్ ఉంది. సామాన్యులు కూడా మహిళా ఢాకీలనే ఇష్టపడుతున్నారు. పురుషుల సంగీత వాయిద్యాలను మహిళలు తమ భుజాలపై వేసుకుని వాయిస్తుండటంతో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు’’ అని శివ్పాద్ చెప్పారు. ‘‘భర్తతో పాటు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఢాకీలుగా పని చేస్తున్నాం. పిల్లల చదువుల ఖర్చుతో కుటుంబ అవసరాలను తీర్చగలుగుతున్నాం. ఒకేసారి వేల రూపాయలు సంపాదించగలగడం ఆనందాన్నిస్తోంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ గనుక తినడానికి, తాగడానికి కూడా సమయం ఉండటం లేదు. రోజూ ఏదో ఒక పార్టీ ప్రచార కార్యక్రమానికి డ్రమ్ భుజాన వేసుకుని వెళ్తూనే ఉన్నాం’’ అని ఆనందంగా చెబుతున్నారు మహిళా ఢాకీలు. 14 ఏళ్ల కిందట మొదలై... ప్రముఖ ఢాకీలలో ఒకరైన గోకుల్ చంద్ర దాస్ పద్నాలుగేళ్ల కిందట తన కుటుంబంలోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కోడలు ఉమా దాస్, కుమార్తె టుకుతో కలిసి మహిళా ఢాకీల బృందాన్ని ప్రారంభించారు. 2011లో దుర్గా పూజ పండల్లో తొలిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయి చూశారు. అయితే బెంగాలీ టాలెంట్–హంట్ షోలో మహిళా ఢాకీలు కనిపించిన తరువాత పరిస్థితి మారింది. వారిని దుర్గా పూజలకు పిలవడం మొదలైంది. ఇప్పుడు బెంగాల్లో అనేక మహిళా ఢాకీ శిక్షణా కేంద్రాలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ఉద్దేశిస్తూ.. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే తాను తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే ఇండియా కూటమి అభ్యర్ధులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ చాందినీ చౌక్ లోక్సభ అభ్యర్థి జేపీ అగర్వాల్కు మద్దతుగా మోడల్ టౌన్లో కేజ్రీవాల్ రోడ్షో నిర్వహించారు.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానుఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను మీ మధ్య ఉండటానికి జైలు నుండి నేరుగా వచ్చాను. ఈ వ్యక్తులు (బీజేపీ) నన్ను కటకటాల వెనక్కి నెట్టారు. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని నాకు బాగా తెలుసు. నేను చిన్న వ్యక్తిని. మాది ఢిల్లీ, పంజాబ్లలో ప్రభుత్వాలున్న చిన్న పార్టీ అని కేజ్రీవాల్ అన్నారు.ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? నన్ను ఎందుకు జైలులో పెట్టారని నేను ఆలోచిస్తున్నాను. ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. పిల్లలకు మంచి విద్యను అందించడం, వారికి మంచి పాఠశాలలు నిర్మించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించడం, ప్రజలకు ఉచితంగా మందులు అందేలా చేయడం నేను చేసిన తప్పా అని అన్నారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. నేను జైలుకు వెళ్లాలా వద్దా అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు కమలం (బీజేపీ గుర్తు) ఎంచుకుంటే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇండియా కూటమి అభ్యర్థిని ఎంచుకుంటే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటు వేసేముందు ఆలోచించండిఓటు వేయడానికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ జైలుకు వెళ్లాలా అని మీరు ఆలోచించాలి అని ఆయన అన్నారు. నేను జైలులో ఉన్నప్పుడు తనను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కానీ హనుమంతుడి ఆశీర్వాదం వల్ల నేను బలంగా ఉన్నాను అని ఆరోపించారు. -
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని అనే అంశంపై తాను ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నట్లు ప్రధాని మోదీ అన్నారుమహారాష్ట్రలోని కళ్యాణ్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 100 రోజులకు సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దేశం కోసం తన 100 రోజుల ప్రణాళిక దాదాపుగా పూర్తయిందని, నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి జాప్యం ఉండదని, బ్లూప్రింట్కు అనుగుణంగా జూన్ 4 తర్వాత వెంటనే పనులు ప్రారంభిస్తానని ప్రధాని ప్రకటించారు.జూన్ 4 తర్వాత చేసే పని బ్లూప్రింట్తో మేం ముందుకు రానున్నాం. ప్రజలు ఈ బ్లూ ప్రింట్పై నా విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది నా కాన్ఫిడెన్స్ కాదని, ప్రజల నుండి నేను పొందుతున్న ఆశీర్వాదం నాకు భరోసా ఇస్తుంది అని అన్నారు. 100 రోజుల ప్రణాళిక కోసం తాను యువతను స్ఫూర్తిగా తీసుకున్నానని ప్రధాని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో నేను కలిసిన యువత నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. ఓ 25 రోజులు వారి కోసం కేటాయిస్తున్నాను. నా దేశం యువత తమ మనస్సులో ఏ ఆలోచనలు వచ్చినా నాకు పంపాలని నేను కోరుకుంటున్నాను అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్ భారత్, పాకిస్థాన్ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీహార్లో పోరు ఆసక్తికరంగా మారింది. బీహార్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించిన చర్చలు సోషల్ మీడియాలో విరివిగా సాగుతున్నాయి. వీరికి ఈ పేర్లను లాలూ యాదవ్ ఎందుకు పెట్టారని పలువురు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు.అది.. 1976.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నాటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) అని పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ లాలూ తన తొలి కుమార్తెకు ‘మీసా భారతి’ అని పేరు పెట్టారు.ఇక రోహణి ఆచార్యకు ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయానికొస్తే.. లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి 1979లో మరోసారి తల్లి అయ్యారు. ఆమెకు డెలివరీకి ముందు తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలియగానే అప్పట్లో లాలూ యాదవ్ భయపడ్డారట. పట్నాకు చెందిన నాటి ప్రముఖ మహిళా వైద్యురాలు కమలా ఆచార్య.. లాలూ భార్య రబ్రీ దేవికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.అయితే ఆమె ఆపరేషన్కు అయిన ఖర్చును లాలూ నుంచి తీసుకునేందుకు నిరాకరించాట. లాలూ యాదవ్కు రెండో కుమార్తె పుట్టిన సమయంలో రోహిణి నక్షత్రం ఉందట. దీంతో లాలూ తన కుమార్తెకు రోహిణి ఆచార్య అని పేరు పెట్టారు. అంటే కుమార్తె పేరుకు వైద్యురాలి పేరును జత చేశారన్నమాట. ప్రస్తుతం మిసా భారతి పాటలీపుత్ర నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. రోహిణి ఆచార్య బీహార్లోని సారణ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్పై పోటీ చేస్తున్నారు. -
వారణాసి.. రాజకీయ చరిత్ర ఇదే!
కాశీగా పేరొందిన వారణాసి మహా శివుని ఆవాసమని అంటారు. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఈ నగరంలో నిరంతరం శివనామస్మరణ మారుమోగుతుంటుంది. మోక్షదాయినిగా భావించే గంగా నది ఒడ్డున నిర్మించిన మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్తో సహా 80 ఘాట్లు ఇక్కడున్నాయి.అయితే వారణాసికి రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. ఈ నగరం గత పదేళ్లుగా భారత రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం. వారణాసి లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ప్రధాని మోదీ మరోమారు ఇక్కడి నుంచే తన నామినేషన్ దాఖలు చేశారు. 2014లో తొలిసారిగా ఇక్కడి నుంచి విజయం సాధించిన ప్రధాని మోదీ గంగానదికి తల వంచి నమస్కరించారు. తనకు కాశీతో గాఢమైన అనుబంధం ఉందని, ఈ నగరాన్ని తన తల్లిలా భావిస్తానని, గంగామాత తనను ఇక్కడికి పిలిచిందని ప్రధాని మోదీ చెబుతుంటారు.2014లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ కాశీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై 371,784 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పుడు నరేంద్ర మోదీకి 581,022 ఓట్లు రాగా, అరవింద్ కేజ్రీవాల్కి 209,238 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్రాయ్కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. అజయ్రాయ్ ఇప్పుడు తిరిగి వారణాసి లోక్సభకు పోటీ చేస్తున్నారు.ఠాకూర్ రఘునాథ్ సింగ్ వారణాసి నుంచి ఎంపికైన తొలి ఎంపీ. ఆయన 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన 1957, 1962లో కూడా ఇక్కడి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1967లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన సత్యనారాయణ సింగ్ ఈ స్థానంలో గెలిచారు. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన రాజారాం శాస్త్రి, 1977లో జనతా పార్టీకి చెందిన చంద్రశేఖర్, 1980, 1984లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలపతి త్రిపాఠి, 1989లో జనతాదళ్కు చెందిన అనిల్ శాస్త్రి ఈ స్థానం నుంచి గెలిచి ఎంపీలు అయ్యారు.భారతీయ జనతా పార్టీ 1991, 1996, 1998, 1999 సంవత్సరాల్లో వరుసగా నాలుగు సార్లు ఈ స్థానాన్ని గెలుచుకుంది. 2004లో ఈ సీటును కాంగ్రెస్ గెలుపొందగా, 2009 నుంచి 2019 వరకు బీజేపీ విజయం సాధిస్తూ వచ్చింది. 2009లో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఎంపీ అయ్యారు. -
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం పరిపాటే. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మంగళవారం ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు! ఆయన పేరు రాజన్ యాదవ్. ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. భిక్షపైనే జీవిక గడుపుకుంటారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారాయన. ‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశానవాటికలోనే తెరిచారు! స్థానిక రాప్తీ నది ఒడ్డున ఉన్న ఆ శ్మశానవాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచి్చన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. గమ్మత్తైన హామీలు రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే ఎలాగైనా లైఫ్టైం ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ ‘పాడె బాబా’ది. ఆయన తర్వాతి లక్ష్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట! ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసి ఆప్ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు! – గోరఖ్పూర్ -
ఈయన పోటీ రైళ్ల కోసం.. ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల్లోకి..
66 ఏళ్ల వామన్ మహదేవ్ సంగలే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అంతగా తెలియని ధర్మరాజ్య పక్ష అనే పార్టీలో కార్యకర్తగా మారాడు. రోజువారీ ప్రయాణికుల కోసం ముంబై-నాసిక్, ముంబై-పూణే లోకల్ రైళ్లను ప్రారంభించాలనే ఏకైక కల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వాటి సాధన కోసమే నాసిక్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు.రైల్వేలో చీఫ్ లోకో ఇన్స్పెస్టర్గా పనిచేసిన సంగలే ఉద్యోగ విరమణ తర్వాత కూడా రైలు ప్రయాణికులకు సేవలను మెరుగుపరచడం కోసం పరితపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు హేమంత్ గాడ్సే ద్వారా లోకల్ ట్రైన్ తెప్పించి ట్రయల్స్ నిర్వహించాలని రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో ఆయన కొంత సఫలమయ్యారు.అయితే సొరంగాల పరిమితులు, నిటారు ఎత్తుపల్లాల కారణంగా ట్రయల్స్ మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. కానీ పట్టువదలని సంగలే ఈసారి లోక్సభ ఎన్నికల్లో నేరుగా పోటీకి దిగారు. "అవును. ధర్మరాజ్య పక్ష తరఫున 'టేబుల్'ను నా గుర్తుగా చేసుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా వద్ద మేనిఫెస్టో కూడా ఉంది. ప్రజల కోసం నా ప్రాధాన్యతలను జాబితా చేశాను" అని వామన్ మహదేవ్ సంగలే చెబుతున్నారు.'కసారా నుంచి నాసిక్, కర్జాత్ నుంచి పుణె వరకు లోకల్ ట్రైన్ను ముంబైకి అనుసంధానం చేయడం నేను చేసిన సూచనల్లో ఒకటి. దీని కోసం నేను చాలా ఏళ్లుగా పోరాడుతున్నాను. రైల్వేలను మెరుగుపరచడానికి నేను సూచించిన 15 సూచనలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్టు ఎంఎంఆర్ పరిధిలోని నాసిక్, పుణె, ముంబై ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ రైల్ శిబిరాన్ని నిర్వహించారని, అందులో తాను చేసిన 15 సూచనల్లో మూడింటిని ఎంపిక చేశారని సంగలే పేర్కొన్నారు.సంగలే మేనిఫెస్టో ఇదే..కల్యాణ్ను నాసిక్, పుణెలకు లోకల్ రైళ్ల ద్వారా అనుసంధానించడమే తన మొదటి ప్రాధాన్యత అని సంగలే పేర్కొన్నారు. భుసావల్ డివిజన్ లో మెయిన్ లైన్ ఈఎంయూ రైళ్లు నడపడం, నాసిక్కు పెద్ద ఈఎంయూ కార్ షెడ్ నిర్మాణం, నాసిక్ నుంచి గుజరాత్ రైల్వే లైన్ వంటివి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయని సంగలే వివరించారు.అలాగే నిఫాద్ నుంచి మన్మాడ్ వరకు తీవ్రమైన తాగునీటి కొరత సమస్యను పరిష్కరించడం, ప్రతిపాదిత నాసిక్ మెట్రో రైలు పురోగతి, కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, పంచవటిలోని రాంకుండ్, సీతాకుండ్ వంటి పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయడం, గోదావరి నదిని పరిశుభ్రం చేయడం వంటివి తన ప్రాధాన్యతలు అని వామన్ మహదేవ్ సంగలే నాసిక్ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కాగా నాసిక్ లోక్సభ స్థానానికి ఐదవ దశలో మే 20న పోలింగ్ జరగనుంది. -
చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
ఒడిశాలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 147 మంది సభ్యులున్న అసెంబ్లీకి నాలుగు దశల్లో పోలింగ్ జరుగుతోంది. మే 13న నాలుగో దశ లోక్సభ ఎన్నికలలోని తొలి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్ మే 20న, మూడో దశ ఓటింగ్ మే 25న, నాలుగో దశ జూన్ ఒకటిన జరగనుంది. కాగా సోరో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ చివరి క్షణంలో మార్చింది.బాలాసోర్ జిల్లాలోని సోరో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన మంగళవారం నాడు బీజేపీ తన అభ్యర్థిని మార్చింది. తొలుత అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజేంద్ర కుమార్ దాస్ స్థానంలో పరశురామ్ దాదాను నిలబెట్టింది. కాగా దాస్, దాదా ఇద్దరూ బీజేపీ అభ్యర్థులుగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే దాదా నామినేషన్ను పార్టీ ధృవీకరించింది.బీజేపీ ఒడిశా ఎన్నికల ఇన్ఛార్జ్ విజయ్ పాల్ సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ సోరో అభ్యర్థిగా పరశురామ్ దాదా పేరును ధృవీకరించిందని తెలిపారు. 2014, 2019లో బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థిగా సోరో నుండి దాదా రెండుసార్లు గెలిచారు. ఆయన గత నెలలో బీజేడీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. -
ఒకే సీటుపై మూడు సార్లు పోటీకి దిగిన మూడో ప్రధానిగా మోదీ!
యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ తొలి ప్రధాని నెహ్రూ, వాజ్పేయిల రికార్డును సమం చేశారు. ఈ మాజీ దివంగత ప్రధానులిద్దరూ ఒకే లోక్సభ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడు మోదీ కూడా ఒకే లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.పండిట్ నెహ్రూ 1951, 1957, 1962లో మూడుసార్లు ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఫుల్పూర్ సీటుకు ఎంపీగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా దేశ పగ్గాలను చేపట్టారు. భారతరత్న పండిట్ అటల్ బిహారీ వాజ్పేయి లక్నో నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్నప్పటికీ, 1996, 1998, 1999లో ఎంపీ అయిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టారు. తాజాగా నరేంద్ర మోదీ 2014, 2019లో వారణాసి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆయన నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా, ఒకే లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత దక్కించుకున్నారు.భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 14 మంది ప్రధానులు దేశాన్ని పాలించారు. వారిలో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్కు చెందినవారే కావడం విశేషం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నరేంద్ర మోదీ వరకూ వచ్చింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి యూపీలోని వివిధ స్థానాల నుండి ఎన్నికలలో గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. -
ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
సాక్షి, అమరావతి: ఏపీలో తుది పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ లెక్కలు తేలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈసారి పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉంది. నేటి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 వరకు 78.25 శాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్తో కలుపుకొని 79.40 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని అన్నారు. పోలింగ్ పర్సంటేజ్పై సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. -
రోడ్డు పక్క సెలూన్లో రాహుల్ షేవింగ్.. ఫొటో వైరల్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో పలువురు నేతల ప్రకటనలు, ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్హచల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలలో రాహుల్ రోడ్డు పక్కనున్న ఒక సాధారణ సెలూన్లో హెయిర్ కటింగ్తో పాటు షేవింగ్ చేయించుకోవడం కనిపిస్తుంది.కాంగ్రెస్ తన అధికారిక హ్యాండిల్లో రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది. దానితోపాటు క్యాప్షన్లో 'ఎన్నికల సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే జుట్టు కత్తిరించుకోవడం కూడా అవసరం. నైపుణ్యం కలిగిన యువత హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నాం’ అని రాసివుంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికలు పూర్తికాగా, ఇక మూడు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఐదో దశ ఎన్నికలు మే 20న, ఆరో దశ ఎన్నికలు మే 25న, చివరి దశ అంటే ఏడో దశ ఎన్నికలు జూన్ ఒకటిన జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. चुनाव की तैयारी पूरी है, लेकिन हेयर कटिंग भी जरूरी है।हम ऐसे ही हुनरमंद नौजवानों के हक के लिए लड़ रहे हैं, देश के विकास में इनकी हिस्सेदारी मांग रहे हैं। 📍 रायबरेली, उत्तर प्रदेश pic.twitter.com/iTfEzkDGsh— Congress (@INCIndia) May 13, 2024 -
ప్రధాని మోదీ నామినేషన్కు సీఎం నితీష్ గైర్హాజరు.. కారణమిదే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మంగళవారం)వారణాసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా ఉంది. అయితే ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కావడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.సీఎం నితీష్ కుమార్ అస్వస్థతకు గురయిన నేపధ్యంలో ఆయన నేడు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదని సమాచారం. ఆయన ఎన్నికల ప్రచారానికి, బహిరంగ సభలకు కూడా హాజరుకారు. అయితే ఈరోజు సుశీల్ కుమార్ మోదీ నివాసానికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఆయన నితీష్ కుమార్కు సన్నిహితునిగా మెలిగారు.ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర సీఎం మాణిక్ సాహా పాల్గొననున్నారు. -
2019లో ప్రధాని మోదీకి ఎదురు నిలిచి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. 2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి ప్రధాని అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఈ స్థానం నుంచి 25 మంది అభ్యర్థులతో తలపడ్డారు.నాడు ప్రధాని మోదీతో పోటీపడిన 25 మంది అభ్యర్థుల్లో 22 మంది డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇద్దరు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. నాడు సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్కు ఒక లక్షా 95 వేల 159 ఓట్లు రాగా, మొత్తం ఓట్లలో ఇవి 18.40 శాతం. మూడో స్థానంలో కాంగ్రెస్కు చెందిన అజయ్రాయ్కు 14.38శాతం ఓట్లు వచ్చాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ ఖాతాలో లక్షా 52 వేల 548 ఓట్లు పడ్డాయి.2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి 4 లక్షల 79 వేల 505 ఓట్లతో విజయం సాధించారు. 2014లో తొలిసారిగా వారణాసి స్థానం నుంచి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాడు కాంగ్రెస్ తరఫున అజయ్రాయ్, సమాజ్వాదీ పార్టీ నుంచి కైలాష్ చౌరాసియా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అజయ్ రాయ్కు 75 వేల 614 ఓట్లు రాగా, కైలాష్ చౌరాసియాకు 45 వేల 291 ఓట్లు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన విజయ్ ప్రకాశ్ జైస్వాల్కు 60 వేల 579 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచి రెండు లక్షల, తొమ్మిది వేల 238 ఓట్లు దక్కించుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోదీకి ఐదు లక్షల ఒక వేయి 22 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 56.37 శాతం. నాడు మోదీ మూడు లక్షల 71 వేల 784 ఓట్ల తేడాతో విజయం సాధించారు.నరేంద్ర మోదీ వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రధాని మోదీ గత విజయాలను అధిగమిస్తారని బీజేపీ చెబుతోంది. ఈసారి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. వారణాసి స్థానం నుంచి కాంగ్రెస్ మరోసారి అజయ్ రాయ్కు అవకాశం కల్పించగా, ఆయనకు సమాజ్వాదీ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. -
వారణాసిలో ఏ వర్గంవారు ఎందరు? బీజేపీ ఎన్నిసార్లు గెలిచింది?
యూపీలోని వారణాసి లోక్సభ ఎన్నికల పోరులో మరోసారి బరిలోకి దిగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఆయన ఈ స్థానం నుంచి నేడు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత ఎన్నికల విజయాల కంటే ఈసారి మోదీ భారీ విజయాన్ని నమోదు చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వారణాసిలో ఏ వర్గంవారు అధిక సంఖ్యలో ఉన్నారు? ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ఏ అంశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది?దేశ ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన వారణాసి లోక్సభ స్థానం ఐదు అసెంబ్లీ స్థానాల కలయిక. అవి వారణాసి సౌత్ సిటీ, వారణాసి నార్త్, వారణాసి కాంట్, రోహనియా, సేవాపురి. 1957 నుంచి ఈ సీటును బీజేపీ ఏడుసార్లు, కాంగ్రెస్ ఆరుసార్లు దక్కించుకున్నాయి. 1991 నుంచి 2003 మధ్యకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సీటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతికి చిక్కింది. 2009 నుంచి ఈ సీటును బీజేపీ అభ్యర్థులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. దీంతో వారణాసి బీజేపీకి కంచుకోటగా మారింది.వారణాసి నియోజక వర్గంలో మొత్తం 19.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10 లక్షల 65 వేల 485 మంది పురుషులు, 8 లక్షల 97 వేల 328 మంది మహిళలు. వారణాసిలో 135 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 52 వేల 174 మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.వారణాసి లోక్సభ స్థానంలో మొత్తం జనాభాలో 75 శాతం మంది హిందువులు, 20 శాతం ముస్లింలు. మిగిలిన ఐదు శాతం జనాభాలో ఇతర మతాలకు చెందిన వారున్నారు. ఈ నియోజకవర్గంలో 65 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో, 35 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 10.01 శాతం గిరిజనులు , 0.7 శాతం దళిత తరగతికి చెందినవారున్నారు.ఈ నియోజక వర్గంలో గరిష్టంగా రెండు లక్షల మంది ఓటర్లు కుర్మీ సామాజికవర్గానికి చెందినవారున్నారు. వీరు రోహనియా, సేవాపురి ప్రాంతాలలో ఉన్నారు. ఈ స్థానంలో రెండు లక్షల మంది వైశ్య ఓటర్లు కూడా ఉన్నారు. వారు ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నారు. కుర్మీ, వైశ్య వర్గం తర్వాత బ్రాహ్మణ, భూమిహార్ ఓటర్లు కూడా వారణాసిలో అత్యధికులు ఉన్నారు. ఈ సీటుపై ఎన్నికల విజయ పతాకాన్ని ఎగురవేసే శక్తి యాదవ, ముస్లిం వర్గాల ఓట్లకు కూడా ఉంది. ఈ స్థానంలో యాదవ సామాజికవర్గానికి లక్ష ఓట్లు ఉన్నాయి. యాదవ ఓటర్లు కాకుండా ఈ స్థానంలో మొత్తం మూడు లక్షల మంది ఓటర్లు ఓబీసీ వర్గానికి చెందినవారున్నారు. -
శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ లోక్సభ స్థానంలో సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. 38 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం. నాడు జమ్మూకశ్మీర్లోని ఈ స్థానంలో దాదాపు 41 శాతం ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు శ్రీనగర్ నియోజకవర్గంలో జరిగాయి.సోమవారం రాత్రి 11 గంటల వరకు శ్రీనగర్లో 38 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారిని ప్రశంసించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వలన జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి యువతకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు.ఓటింగ్లో పాల్గొన్న శ్రీనగర్ నియోజకవర్గ ప్రజలకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలు రాజకీయ పార్టీలు అభినందనలు తెలిపాయి. శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, గండేర్బల్, పుల్వామా జిల్లాలు, బుద్గామ్, షోపియాన్ జిల్లాల్లోని 2,135 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఓటింగ్ జరిగింది.ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గత 34 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 1996లో పోలింగ్ నమోదైంది. నాడు దాదాపు 41 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 14.43 శాతం ఓట్లు పోలయ్యాయని, అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లో అంటే 2014లో 25.86 శాతం 2009లో 25.55 శాతం, 2004లో 18.57 శాతం, 1999లో 11.93 శాతం, 1986లో 30.086 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. Would especially like to applaud the people of Srinagar Parliamentary constituency for the encouraging turnout, significantly better than before. The abrogation of Article 370 has enabled the potential and aspirations of the people to find full expression. Happening at the… https://t.co/2DvSCnXFKR— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
లోక్సభ ఎన్నికలు: నాలుగు దశల ఓటింగ్ ఖాతాలో విశేషాలివే..
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొదటి, రెండవ, మూడవ, నాల్గవ దశలకు సంబంధించిన ఓటింగ్ పూర్తయ్యింది. నాలుగో దశతో దేశంలోని సగానికి పైగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 26న రెండో దశలో 12 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 7న మూడో దశలో 11 రాష్ట్రాల్లోని మొత్తం 93 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 13న 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తంమీద ఇప్పటి వరకు దేశంలోని 379 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇంకా ఐదో దశలో 49, ఆరో దశలో 58, ఏడో దశ(చివరి)లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, గోవా, అసోం, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్లో నాలుగో దశతో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.దేశంలో అతి తక్కువ లోక్సభ స్థానాలు కలిగిన మొదటి ఈశాన్య రాష్ట్రం సిక్కిం. ఈ రాష్ట్రంలో ఒకే ఒక లోక్సభ స్థానం ఉంది. ఇది అన్రిజర్వ్డ్. ఏప్రిల్ 19న మొదటి దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. దీని తరువాత తక్కువ లోక్సభ స్థానాలు కలిగిన రెండవ రాష్ట్రం నాగాలాండ్. ఇక్కడ కూడా ఒకే ఒక లోక్సభ స్థానం ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్. తొలి దశలోనే నాగాలాండ్లో కూడా ఓటింగ్ జరిగింది. మిజోరంలో ఒక లోక్సభ స్థానం కూడా ఉంది. ఇది ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయ్యింది. ఇక్కడ కూడా ఏప్రిల్ 19న ఓటింగ్ ప్రక్రియ జరిగింది.మొదటి దశలో అత్యధికంగా త్రిపురలో 80 శాతం ఓటింగ్ జరిగింది. బీహార్లో అత్యల్పంగా 48 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో త్రిపురలో గరిష్టంగా 78.63 శాతం ఓటింగ్ జరిగింది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్లలో అత్యల్పంగా 54శాతం పోలింగ్ నమోదైంది. మూడో దశలో అసోంలో అత్యధికంగా 81.71 శాతం ఓటింగ్ జరిగింది. యూపీలో అత్యల్పంగా 57.34 శాతం ఓటింగ్ నమోదైంది.లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఏప్రిల్ 19న సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. ఒడిశాలోని 147 స్థానాలకు నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికానున్నాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టీడీపీ ఎగనామం: సర్వేల పేరుతో పనిచేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన టీడీపీ
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
పార్లమెంట్ ఎన్నికలు..BRS పరిస్థితి ఏంటి ?..KSR విశ్లేషణ
వచ్చే ఏడాది మెగా వేలంలోకి.. కోచ్ ప్రశ్నకు రోహిత్ శర్మ ఆన్సర్ ఇదే
TG: విడుదలైన ఈఏపీ సెట్ ఫలితాలు
ఒక్క క్లిక్తో ఈఏపీ సెట్ ఫలితాలు
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
కేన్స్లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
బీజేపీ భారీ ప్రయోగం.. ఫలించేనా?
తప్పక చదవండి
- TG: విడుదలైన ఈఏపీ సెట్ ఫలితాలు
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement