-
అనుకున్నట్లే అయింది.. ఏపీలో కూటమిని ముంచేసిన..
అనుకున్నట్లే అయింది. ఏపీలో కూటమిని కుమ్ములాటలు పూర్తిగా ముంచేసాయి. సఖ్యత లేని కారణంగానే పార్టీల మధ్య ఓటు బదిలీ జరగలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటు షేర్ బదిలీ కాకపోవడం ఆయా పార్టీలను కలవరపరుస్తోంది. టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నేతల్లో గెలుపుపై ధీమా లేక డీలా పడిపోయారు. పోలింగ్ పూర్తయ్యాక బిజెపి, జనసేన నేతలెవరూ మీడియా ముందుకు రాకపోవడం పరిస్ధితికి అద్దం పడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య అసలేం జరిగిందో చూద్దాం.కూటమిగా జతకడితే విజయం ఖాయమనుకున్న టిడిపి, బిజెపి, జనసేనలలో పోలింగ్ తర్వాత అయోమయం కనిపిస్తోంది. లెక్కలు తేలిన తర్వాత ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓటు షేర్ బదిలీ కాలేదని అర్థం కావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2014లో టిడిపి, బిజెపి, జనసేనలతో జట్టుకట్టి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపికి మద్దతు పలికిన జనసేన బరిలోకి దిగలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలన్న ఉద్దేశంతో జనసేన విడిగా పోటీ చేసింది. కాని జనసేన ఒక సీటు గెలుచుకోగా..టీడీపీకి 23 మాత్రమే దక్కాయి. 152 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించింది.మళ్ళీ తాజా ఎన్నికలలో ఎట్టి పరిస్ధితుల్లోనైనా వైఎస్సార్ సిపి గెలుపును అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలతో 2014లో మాదిరిగా మూడు పార్టీలు మరోసారి కూటమి కట్టాయి. మూడు పార్టీలు కలిస్తే 2019 వచ్చినట్టుగా ఓటు షేర్ దాదాపుగా 50 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. అయితే మూడు పార్టీల అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూటమిలో కుమ్ములాటలు పోలింగ్ రోజున దెబ్బేసాయి. కనీసం సగం సీట్లలలోనైనా పోటీ చేస్తుందని భావించిన జనసేన పార్టీ నేతల్ని పవన్ తీరు పూర్తిగా నిరాశపరిచింది. కేవలం 21 అసెంబ్లీ సీట్లకి, రెండు పార్లమెంట్ సీట్లకి జనసేన పరిమితం కావడం ఆ పార్టీ నేతలను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టింది. దీనికి తోడు మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో పలువురు టీడీపీ నేతల్ని జనసేనలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి ఆగ్రహం కలిగించింది. గోదావరి జిల్లాల్లో అయితే నియోజకవర్గ ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేనకు బలం ఉన్న సీట్లను టిడిపికి త్యాగం చేయడం అక్కడి కేడర్ను నిరాశలోకి నెట్టింది. దీంతో పలువురు నేతలు జనసేనకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ సిపిలో చేరారు. సీట్ల పంపకాల సమయంలోనే సొంత పార్టీలోనే పవన్ నిప్పు రాజేసుకున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ నేతలకి టీడీపీ నుంచి పూర్తి సహకారం లభించలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో టీడీపీ నేత వర్మ చివరి నిమిషం వరకు కంట్లో నలుసుగానే కొనసాగారు. పవన్ కళ్యాణ్ గెలుపొందితే శాశ్వతంగా పిఠాపురం నుంచి తాను దుకాణం సర్ధుకోవాల్సి ఉంటుందనే భయంతో వర్మ తన క్యాడర్ ని పవన్ కి పూర్తిగా సహకరించనివ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పవన్ తో పాటే వర్మ తిరిగినా టిడిపి ఓటు షేర్ జనసేనకి పూర్తిగా బదిలీ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో 21 అసెంబ్లీ స్ధానాలలో ఎన్ని సీట్లలో గెలుస్తామనేది జనసేన చెప్పలేకపోతోంది. ఎన్డీఎ కూటమి గెలుస్తుందంటూ పవన్ పోలింగ్ ముగిసిన తర్వాత కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. చాలా బలంగా ఉన్నామని చెప్పుకున్న గోదావరి జిల్లాలలోనూ కాపు ఓట్లు తప్పితే బిజెపి, టిడిపి ఓట్లు జనసేనకి పడలేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.ఇక బిజెపి కూడా అదే విధమైన అయోమయంతో ఉంది. వాస్తవానికి ఈ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు గెలుపుపై ధీమా లేకుండా చేశాయి. బిజెపి సీనియర్లెవరికీ ఇష్టం లేకపోయినా చివరి నిమిషంలో టిడిపి, జనసేన కూటమితో జతకట్టి పది అసెంబ్లీ స్ధానాలకి, ఆరు పార్లమెంట్ స్ధానాలకి పరిమితం కావడం పార్టీలో సీనియర్లకి మింగుడుపడలేదు. దీంతో పాటు బిజెపిలో మొదట నుంచి ఉన్న వారికి, సీనియర్లకి టిక్కెట్ల కేటాయింపు కోసం సీనియర్లు ఎంత ప్రయత్నించినా..రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కుతంత్రాలతో ఒరిజినల్ బిజెపి కాస్తా తెలుగు బిజెపిగా మారిపోయింది. ఇక్కడ కూడా విశాఖపై పట్టున్న జివిఎల్ కి టిక్కెట్ రాకుండా తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి చేసిన కుట్రలతో జీవీఎల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఆశించిన సోము వీర్రాజుకి టిక్కెట్ ఇవ్వకపోవడం, హిందూపూర్ ఆశించిన విష్టువర్ధన్ రెడ్డికి టిక్కెట్ రాకుండా పురందేశ్వరి అడ్డుపడ్డారు.ఈ నేపధ్యంలో బీజేపీ అసలు నేతలంతా ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టిడిపి నుంచి బిజెపిలో చేరిన, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నవారికే టిక్కెట్లు దక్కడం బిజెపిలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి నేతలు వచ్చినపుడు తప్పితే మిగిలిన సమయాలలో పార్టీ అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు సహకరించలేదని తెలుస్తోంది. దీనికి తోడు టిడిపి, జనసేన నుంచి కూడా ఓటు బదిలీ కాలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని బిజెపి అభ్యర్ధులు వాపోతున్నారు. జనసేన, టిడిపి ఓట్లు తమకు బదిలీ కాకపోవడం చాలా దెబ్బేసిందని వారు చెబుతున్నారు. దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ లో పూర్తిగా విఫలమయ్యామని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు.సొంత పార్టీ నేతలకంటే బిజెపి, జనసేనను నమ్ముకుని పూర్తిగా మునిగిపోయామని టిడిపి నేతలు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటే జనసేన, బిజెపి ఓట్లు తమకు పడకపోవడంపై నైరాశ్యంలో ఉన్నారు. గాజు గ్లాజు గుర్తు ఉన్న చోట మాత్రమే ఓట్లు పడ్డాయని...టిడిపి అభ్యర్ధులు ఉన్న చోట జనసేన ఓట్లు వేయలేదని..చాలా చోట్ల తమకి నచ్చిన పార్టీకి...నేతకి ఓటు వేసుకున్నారని గోదావరి జిల్లాకి చెందిన ఓ టిడిపి నాయకుడు చెబుతున్నారు. గోదావరి జిల్లాలలో టిడిపి, జనసేన కలిస్తే క్లీన్ స్వీప్ అవుతాయని భావించామని కానీ బిజెపితో కలవడం బాగా దెబ్బ కొట్టిందని అంటున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ ఓట్లు తమకు పడలేదని..గాజు గ్లాసు లేని చోట పలువురు వైఎస్సార్ సిపికి ఓటు వేయడంతో తమ విజయవకాశాలను దెబ్బ కొట్టిందంటున్నారు. కొన్ని చోట్ల గత అయిదేళ్లగా పార్టీ కోసం కష్టపడిన నేతలని పక్కన పెట్టడం కూడా టిడిపికి మైనస్ అయింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని వైఎస్సార్ సిపి బహిషృత నేత రఘరామకృష్ణంరాజుకి ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా మైనస్ గా మారిందంటున్నారు.దీనికి తోడు టిడిపి రెబెల్ గా ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బరిలో ఉండటం కూడా పూర్తిగా వ్యతిరేకమైందంటున్నారు. ఇలా పలు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలని కాదని బయట పార్టీ వారికి ఇవ్వడం కూటమి అభ్యర్ధుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. టిక్కెట్ రాని నేతలంతా చివరి నిమిషంలో కూటమి నేతలకి షాక్ ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు జనసేన, బిజెపి ఓట్లు కూడా పూర్తిగా టిడిపికి పడలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే గెలుపుపై టిడిపి ధీమా కోల్పోయి..ఓటమి ఖాయమై నేతలంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. -
ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే..
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడకుండా ఇకపై నేతలు, పార్టీ యంత్రాంగం నిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండేలా కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు చెప్పారు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పార్టీ కార్యక్రమా లు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు, కొందరు నేతలు గురువారం ఎర్రవల్లి నివా సంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తీరుతెన్నులతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది.వరికి రూ.500 బోనస్, ధాన్యం కొనుగోలు అంశాలపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన నిర సన కార్యక్రమాలపై ఆరా తీశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యవర్గాల ఏర్పాటు లాంటివి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టే అవకాశమున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, కిందిస్థాయి వరకు సోషల్ మీడియా విభాగం బలోపేతం తదితరాలకు సంబంధించిన కార్యాచరణపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. ‘స్థానిక’సన్నద్ధత ప్రారంభించాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతను కూడా ఇప్పటినుంచే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు క్షేత్ర స్థాయిలో క్రియాశీలంగా పనిచేసే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు.పార్టీ కార్యవర్గాల ఏర్పాటులోనూ ఇలాంటి నేతలు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా పద్దతిలో రిజర్వేషన్లు కల్పించేందుకు 113 బీసీ ఉప కులాల గణన చేపట్టాలనే డిమాండ్ను కూడా ప్రభుత్వం ముందు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అన్ని ఎన్నికల ఫలితాలు అనుకూలమే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలూ పార్టీకి అనుకూలంగా వెలువడే అవకాశం ఉన్నట్లు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి 28న జరిగిన శాసనమండలి మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి గెలుస్తారని పార్టీ నేతలు కేసీఆర్కు వివరించినట్లు తెలిసింది. మహబూబ్నగర్ జిల్లాలో 1,439 మంది ఓటర్లకు గాను 800 మందికి పైగా పార్టీ అభ్యర్థికే ఓటు వేసినట్లుగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడంతో సానుకూల ఫలితం వస్తున్నట్లు వివరించారు.ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నివేదిత మంచి మెజారిటీ సాధిస్తారని కేసీఆర్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 27న జరిగే ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించకుండా పార్టీ నేతలు, అభ్యర్థులు పార్టీ ఇచ్చే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. -
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
కోల్కతా: సీట్ల పంపకం విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్తో విభేదించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యత్వం తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. అయితే ఈ విషయంలో ఆమె కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే దానికి బయటి మద్దతు ఇస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం)లను కలపవద్దు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు మాతో లేరు. బీజేపీతో ఉన్నారని మండిపడ్డారు. -
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని అనే అంశంపై తాను ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నట్లు ప్రధాని మోదీ అన్నారుమహారాష్ట్రలోని కళ్యాణ్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 100 రోజులకు సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దేశం కోసం తన 100 రోజుల ప్రణాళిక దాదాపుగా పూర్తయిందని, నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి జాప్యం ఉండదని, బ్లూప్రింట్కు అనుగుణంగా జూన్ 4 తర్వాత వెంటనే పనులు ప్రారంభిస్తానని ప్రధాని ప్రకటించారు.జూన్ 4 తర్వాత చేసే పని బ్లూప్రింట్తో మేం ముందుకు రానున్నాం. ప్రజలు ఈ బ్లూ ప్రింట్పై నా విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది నా కాన్ఫిడెన్స్ కాదని, ప్రజల నుండి నేను పొందుతున్న ఆశీర్వాదం నాకు భరోసా ఇస్తుంది అని అన్నారు. 100 రోజుల ప్రణాళిక కోసం తాను యువతను స్ఫూర్తిగా తీసుకున్నానని ప్రధాని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో నేను కలిసిన యువత నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. ఓ 25 రోజులు వారి కోసం కేటాయిస్తున్నాను. నా దేశం యువత తమ మనస్సులో ఏ ఆలోచనలు వచ్చినా నాకు పంపాలని నేను కోరుకుంటున్నాను అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
న్యూఢిల్లీ: బిభవ్ కుమార్తో రాజీనామా చేస్తారా? లేదంటే అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ వెల్లడించిన తరుణంలో బీజేపీ స్పందించింది.సీఎం పదవికి రాజీనామా చేయాలి బిభవ్ కుమార్తో రాజీనామా చేయించాలని, లేదంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ డిమాండ్ చేశారు. స్వాతి మలివాల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఇల్మీ.. కేజ్రీవాల్ బెదిరింపులకు గురిచేస్తున్నారా అని ప్రశ్నించారు.మహిళా ఎంపీపై దాడి జరిగితే మౌనమేలామరోవైపు ఓ మహిళా ఎంపీపై దాడి జరిగినా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గేతో పాటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ అంశంపై మౌనం వహించడాన్ని తప్పుబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ గురించికేజ్రీవాల్ అధికారిక నివాసంలో తనపై దాడి జరిగిందని మలివాల్ సోమవారం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదునే ఇల్మీ ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ నివాసంలో ఆమెను కొట్టినట్లు స్పష్టంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి (ఇల్మీ గతంలో ఆప్లో పనిచేశారు) నాకు బాగా తెలుసని అన్నారు.బిభవ్తో రాజీనామా చేయించాలి. లేదంటే తనకు తానే రాజీనామా చేయాలని అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ నొక్కాణించారు. -
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
తమ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై జరిగిన దాడి నిజమేనని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతి మాలివాల్పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ దాడిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, తగిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ సంజయ్ సింగ్ వెల్లడించారు.అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు ఎంపీ స్వాతి మలివాల్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రాయింగ్ రూమ్లో ఉన్న కేజ్రీవాల్ను కలిసేందుకు ఎదురు చూస్తున్న సమయంలో బిభవ్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సంజయ్ సింగ్ అన్నారు. బిభవ్ కుమార్పై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆప్ ఎంపీ ఎంపీ స్వాతి మలివాల్ స్థానాన్ని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన తనపై దాడిచేసినట్లు బిభవ్పై స్వాతి మలివాల్ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దాడి వ్యవహారం మరింత చర్చకు దారి తీసింది. మరోవైపు బీజేపీ.. ఆప్పై విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో అప్ ఎంపీ సంజయ్ సింగ్ దాడిని ఖండించారు. -
మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
మొబైల్ ఫోన్ యూజర్లకు షాక్. త్వరలో ఫోన్ బిల్లలు తడిసి మోపెడు కానున్నాయి. దేశంలోని మొత్తం లోక్సభ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగో రౌండ్ టారిఫ్ ధరల్ని పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. టెలికం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) ను పెంచుకునేందుకు కంపెనీలు తప్పుకుండా 25 శాతం టారిఫ్ ధరల్ని పెంచనున్నాయి. మార్కెట్లో కాంపిటీషన్, 5జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుపడులు ఇతరాత్ర కారణాల వల్ల టారిఫ్ ధరల పెంపు అనివార్యం కానుంది. వినియోగదారులపై ప్రభావం25 శాతం టారిఫ్ ధరల పెంపు భారీగా ఉన్నప్పటికీ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల యూజర్లకు భరించే ఆర్ధిక సామర్ధ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెలికం సేవల్ని వినియోగించుకునేందుకు గాను ప్రస్తుతం పెట్టే ఖర్చు 3.2 శాతంతో పోలిస్తే పట్టణ గృహాల మొత్తం వ్యయంలో 3.6 శాతానికి పెరుగుతుందని అంచనా. అదేవిధంగా, గ్రామీణ చందాదారుల కోసం, ఈ సంఖ్య ప్రస్తుత 5.2 శాతం నుండి 5.9 శాతానికి పెరుగుతుందని అంచనా.టారిఫ్ ధరలు పెరిగితేటారిఫ్ 25 శాతం పెంచితే టెలికాం ఆపరేటర్ల ఏఆర్పీయూ 16 శాతం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఎయిర్టెల్కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.29, జియో 26 శాతం ఉందని యాక్సిస్ కేపిటల్ ఎస్టిమేట్ తెలిపింది. కంపెనీలకు లాభమేమార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఏఆర్పీయూ రూ.181.7 గా ఉంది. ఎయిర్టెల్కు రూ.208, వొడాఫాన్ ఐడియాకు రూ.145 గా ఉంది. టారిఫ్ ధరలు పెరిగితే ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రభావం కంపెనీ లాభాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది. -
పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం పోటెత్తింది. ఉదయం ఆరు గంటల నుంచే వారు భారీ క్యూలైన్లలో వేచిఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పథకాల కొనసాగింపునకు మద్దతుగా మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు తప్ప రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం ఏర్పడలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా సోమవారం సాయంత్రం ప్రకటించారు.తొలిసారి ఓటర్లు, వృద్ధులు పెద్దఎత్తున పోలింగ్లో పాల్గొన్నారని, దీంతో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. సా.6 గంటల దాటిన తర్వాత కూడా 3,500 పోలింగ్ స్టేషన్లలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, రాత్రి 8.30 గంటలకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసిందని మీనా తెలిపారు. మరో 360 పోలింగ్ స్టేషన్లలో రాత్రి 10.30 గంటల వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. దీంతో తుది పోలింగ్ శాతం మంగళవారం ప్రకటిస్తామని, సాయంత్రం ఐదు గంటలకు 68.04 శాతం నమోదైందని మీనా తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, గాలివాన బీభత్సాలతో పోలింగ్ మందకొడిగా సాగిందన్నారు.చెదురుమదురు సంఘటనలుఇక రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్ లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం గత కొన్ని నెలలుగా చేసిన కసరత్తు సత్ఫలితాలిచి్చందని మీనా చెప్పారు. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న భావనతో ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశామని.. దీంతో సంఘటన జరిగిన వెంటనే స్పందించి వాటిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారన్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 ఈవీఎంలను ధ్వంసం చేయగా వాటిని భెల్ అధికారులు పరిశీలించి అందులోని డేటా సురక్షితంగా ఉందని నిర్థారించడంతో రీపోలింగ్ అవసరంలేకుండా కొత్త ఈవీఎంలతో పోలింగ్ను కొనసాగించినట్లు తెలిపారు.కౌంటింగ్ సమయంలో ఈ రెండు ఈవీఎంల డేటాను పరిగణనలోకి తీసుకుంటారని మీనా స్పష్టంచేశారు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 12 హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. తెనాలి, నరసరావుపేటల్లో ఎమ్మెల్యేలను.. అనంతపురంలో ఇరుపార్టీల అభ్యర్థులను గృహనిర్భందం చేయడం ద్వారా ఉద్రిక్త వాతావరణాన్ని నియంత్రించినట్లు ఆయన తెలిపారు. ఇక పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ విషయం దృష్టికి రాగానే పోలీసులు రంగం ప్రవేశంచేసి వారిని తీసుకొచ్చి పోలింగ్ కొనసాగించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పోలింగ్ పరిశీలకులు, రాజకీయ పార్టీలతో 17ఏ స్రూ్కటినీ పూర్తయిన తర్వాత రీ–పోలింగ్పై ఒక స్పష్టత వస్తుందని మీనా చెప్పారు. స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్న ఈవీఎంలుఇక ఎన్నికల ప్రక్రియ పూర్తియిన చోట్ల ఈవీఎం మిషన్లను పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు చేర్చినట్లు మీనా తెలిపారు. కొన్నిచోట్ల 10.30 వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడ అర్థరాత్రి దాటిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరుకుంటాయన్నారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చి ఆ తాళాలను సీఆర్పీఎఫ్ వారికి అందిస్తారన్నారు. 24 గంటలూ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్రూమ్లు ఉంటాయని, రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అక్కడ 24 గంటలు కాపలాగా ఉండటానికి అనుమతిస్తామన్నారు.ఓటు హక్కు వినియోగించుకున్న మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా సోమవారం ఉ.7.30కు తన ఓటు హక్కును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని రైల్వే ఫంక్షన్ హాల్లో వినియోగించుకున్నారు. -
‘మిమ్మల్ని ప్రాధేయ పడుతున్న’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో ప్రధాని మోదీ నిరంకుశ పాలనను అంతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మద్యం పాలసీ కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.మిమ్మల్ని ప్రాదేయపడుతున్నాను‘గతంలో అనేక మంది నేతలు నిరంకుశ పాలన సాగించారు. కానీ దేశ ప్రజలు అలాంటి వారికి అధికారాన్ని దూరం చేశారని అన్నారు. ఓ నియంత ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నాను. అయితే ఆ పోరాటాన్ని నేను ఒంటరిగా చేయలేను. నాకు 140 కోట్ల మంది భారతీయుల మద్దతు కావాలి. మిమ్మల్ని ప్రాదేయపడుతున్నాను. నాకు అండగా నిలవండి’ అని వ్యాఖ్యానించారు.#WATCH | Delhi CM Arvind Kejriwal says "...Whenever a dictator tried to take over, the people of the country uprooted him. Today again a dictator wants to end democracy...I am fighting against that dictator but I cannot do anything alone. I have come to beg from 140 crore people… pic.twitter.com/rLnnGXjbwA— ANI (@ANI) May 11, 202475కి మోదీ వయస్సుఈ సందర్భంగా ప్రతిపక్షాల ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్ధులే లేరన్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు..బీజేపీలో నేతల పదవీ విరమణ వయస్సు 75. వచ్చే ఏడాది మోదీ వయస్సు 75కి చేరుతుందన్నారు. బీజేపీని ఒకటే అడుగుతున్నాబీజేపీని ఉద్దేశిస్తూ వారు ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్ధి ఎవరని ప్రశ్నిస్తున్నారు. కానీ నేను వాళ్లని ఒకటే అడగాలని అనుకుంటున్నాను. బీజేపీలో పదవీ విరమణ వయస్సు 75. వచ్చే ఏడాది మోదీ వయస్సు 75 దాటుతుంది అని అన్నారు.బీజేపీకి ఓటమి ఖాయంఇక ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంతో ఉన్న బీజేపీ.. అధికారం కోల్పోతుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. 220-230 లోక్సభ సీట్లు కూడా దాటవన్న ఆయన హర్యానా, రాజస్థాన్,కర్ణాటక, ఢిల్లీ, బీహార్,మహరాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్లో లోక్సభ సీట్లను కోల్పోతుందని లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడారు. -
27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్రెడ్డి తన భుజాలపై వేసుకొని తెలంగాణ అంతా చుట్టివచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగిన జన జాతర సభతో ఆ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచా రం మొదలవగా 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలలో రేవంత్ పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి ముఖ్యమంత్రి పలు సభల్లో పొల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదే శాల మేరకు కర్ణాటక, కేరళలలోనూ పర్యటించి బహిరంగ రోడ్ షోలలో ప్రచారం చేపట్టారు.ఈ ప్రచారంలో సీఎం ప్రధానంగా బీజేపీని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని ఆయన వ్యాఖ్యనించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన చేసిన ప్రసంగాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు కలిసి వచ్చాయని ఆ పార్టీ భావిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై మోదీ, అమిత్ షా మొదలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వరకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్రానికి బీజేపీ ‘గాడిద గుడ్డు’ తప్ప ఏమిచ్చిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం విజయం సాధించారని పేర్కొన్నారు. తమ ప్రచారానికి అనూహ్య రీతిలో ప్రజా స్పందన వచ్చిందని.. అందువల్ల 14 సీట్లలో గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. -
పాతాళంలో దాక్కున్నా మిమ్మల్ని వదలం.. అమిత్ షా హెచ్చరిక
పాతాళంలో దాక్కున్నా సందేశ్ ఖాలీ దోషుల్ని వదలి పెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని రణఘాట్ లోక్సభ స్థానంలోని మజ్డియాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.సందేశ్ఖాలీ అంశంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీ అలా కాదు. ఒక్క దోషిని వదిలిపెట్టదు. వారిని తలక్రిందులుగా వేలాడదీస్తోందన్నారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్ఖాలీలో టీఎంసీ నేతలపై వస్తున్న ఆరోపణలపై అమిత్ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ, మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ, దోషులను రక్షించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అన్నారు.సందేశ్ఖాలీలో టీఎంసీ నేతలు వందలాది మంది అక్కాచెల్లెళ్లను మతం ఆధారంగా చిత్రహింసలకు గురిచేశారు . సందేశ్ఖలీ నేరస్థులను అరెస్టు చేసేందుకు మమతా దీదీ సిద్ధంగా లేరు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా విచారణ జరగకపోవడంతో హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించిందని తెలిపారు. సందేశ్ఖాలీలో అఘాయిత్యాలకు పాల్పడిన వారెవరైనా.. పాతాళంలో దాక్కున్నా.. కనిపెట్టి జైల్లో పెడతాం.. ఈ దోషులను బీజేపీ శిక్షిస్తుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. -
సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
ఎన్నికల్లో సింపతి పొందేందుకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లారని అయ్యారని బీజేపీ న్యూఢిల్లీ లోక్సభ అభ్యర్ధి బన్సూరీ స్వరాజ్ అన్నారు.కేజ్రీవాల్ తన వ్యూహంలో భాగంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన తొమ్మిది సమన్లపై స్పందించ లేదన్నారు. కాబట్టే దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్ను కస్టోడియల్ ఇంటరాగేషన్కు తీసుకెళ్లాయని అన్నారు.ఈ సారి దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాల్ని కైవసం చేసేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బీజేపీ గెలుపు గుర్రాల్ని బరిలోకి దించింది. కాగా, బన్సూరీ స్వరాజ్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆప్- కాంగ్రెస్ ఒప్పందంలో భాగంగా అదే స్థానం నుంచి ఆప్ నేత సోమనాథ్ భారతి పోటీ చేస్తున్నారు. -
జూన్ 4 తర్వాత జరిగేది ఇదే.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్4 లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం డూబ్లికేట్ ఎన్సీపీ, డూబ్లికేట్ శివసేన తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.నార్త్ మహరాష్ట్ర నందూర్బర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై సెటైర్లు వేశారు.ఓ పెద్దాయన 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు.నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులోనకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్ పవర్, ఎక్నాథ్ షిండ్తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కుఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్ పవార్ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. -
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
కోల్కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
ఒడిశాలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్పూర్ లోక్సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్లో రోడ్షో, మే 11న బొలంగీర్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్పూర్, కోరాపుట్లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్ ద్వయం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర్యటనలు చేయనున్నారు. -
అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
ఉత్తర్ ప్రదేశ్ అమోథీ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమోథీ నియోజక వర్గం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల వారసత్వమని అభివర్ణించారు. ముసాఫిర్ఖానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కిషోరి లాల్ శర్మ తనని తాను రాహుల్ గాంధీ కుటుంబానికి సేవకునిగా పేర్కొన్న ఆయన.. అమోథీ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అమానత్ (సందర్భాన్ని బట్టి ఆస్తి, సందప) అని, వారు ఎప్పుడు అడిగితే అప్పుడు దానిని తిరిగి ఇచ్చేస్తానని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని అమోథీ నియోజకర్గం కాంగ్రెస్ కంచుకోట. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి కిషోరి లాల్ శర్మ.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషోరి లాల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కుటుంబం అమోథీని రాజకీయాల పరంగా చూడలేదు. వారు తమ సొంత ఇల్లులా, కుటుంబంగా భావించారు. 1983 నుండి ఈ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నాను. చివరి నిమిషంలో పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అందుకే నేను గాంధీ కుటుంబానికి సేవకుడిగా, అమోథీ నియోజవర్గానికి సేవకునికిగా భావిస్తున్నారు. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని పేర్కొన్నారు. -
బీజేపీనా? సమాజ్వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
Lok Sabha Election 2024: 14న ప్రధాని మోదీ నామినేషన్
వారణాసి: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్ అజయ్ రాయ్ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా, రాజస్తాన్కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
‘భాగ్ రాహుల్ భాగ్’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దక్షిణాదిలో ఓటమి భయంతో రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. భాగ్ రాహుల్ భాగ్, రాహుల్ భాగ్ ఇదే ట్రెండ్ అవుతోంది. రాహుల్ గాంధీ మీరు ప్రధాని మోదీని చూసి బయపడొద్దని చమత్కరించారు. రాహుల్ గాంధీ చిన్న పిల్లాడు అతడిని ప్రోత్సహించాలి. కానీ ప్రజలు అతనిని తిరస్కరించారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేయాలనే రాహుల్ నిర్ణయం వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ద్రోహం చేశారని బీజేపీ నేత ఆరోపించారు. వాయనాడ్ ఓటమి భయంతో అమేథీకి బదులు రాయ్బరేలీ (ఎన్నికల్లో పోటీ చేసేందుకు) వచ్చారని దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్కొన్నారు.కాగా, గత రెండు దశాబ్దాలుగా తన తల్లి సోనియా గాంధీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. -
కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
హైదరాబాద్, సాక్షి : మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ తమపై, తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్పై చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు(బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. నిషేధ సమయంలో ఎలాంటి రోడ్షోలు, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పుర్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి క్రితికా జోత్నకు నామినేషన్ ప్రతాలు అందించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీలు నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, అప్నాదల్ నేత, కేబినెట్ మంత్రి అశిష్ పటేల్లు ఆమె వెంట ఉన్నారు.నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మేనకా గాంధీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చేసిన అభివృద్ది కంటే వచ్చే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడి ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.ప్రతిపక్షాల ఆరోపణలపైబీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై మేనకా గాంధీ ఖండించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నుంచి తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.వరుణ్ గాంధీకి నో టికెట్వరుణ్ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పిలిభిత్ లోక్సభ టికెట్ను బీజేపీ నిరాకరించింది. జితిన్ ప్రసాదకు అప్పగించింది.2009 లోక్సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. -
రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ, అమోథీ లోక్సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠతకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటి (సీఈసీ) తెరదించింది.24 గంటల్లోగా ఆ రెండో స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ స్పష్టం చేశారు.అయితే నామినేషన్ల తుది గడువు మే 3 వరకు ఉండగా..మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయా లోక్సభ స్థానాల అభ్యర్ధులు ఖరారు చేయకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాలుగు లోక్సభ స్థానాల అభ్యర్ధులను ప్రకటించింది.అయితే లోక్సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడు రోజులు సమయం ఉండడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసిన లోక్సభ స్థానాల అభ్యర్ధుల్లో గుర్గావ్ నియోజకవర్గం నుంచి రాజ్ బబ్బర్, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా నియోజకవర్గం నుండి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ,హమీర్పూర్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ రైజాదాను పోటీకి దించింది. ముంబై నార్త్ నుంచి భూషణ్ పాటిల్ను ఖరారు చేసింది.హమీర్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచారు. అనురాగ్ ఠాకూర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव 2024 के लिए हरियाणा, हिमाचल प्रदेश और महाराष्ट्र के कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/ys7tVzC61y— Congress (@INCIndia) April 30, 2024 -
ఓపిక నశించింది.. అమేథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట అమేథీ లోక్సభ అభ్యర్ధి ఎవరనేది స్పష్టత రాలేదు. అయితే అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూసి విసిగిపోయిన కార్యకర్తలు అమేథీ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యలయం బయట అభ్యర్ధిని ప్రకటించాలని ప్లకార్డ్లతో నిరసన చేపట్టారు. అమేథీ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్మృతి ఇరానీ 4,68,514 ఓట్లు సాధించగా, రాహుల్ గాంధీ 4,13,394 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఈ సారి ఎన్నికల్లో మరోసారి తాను గెలుస్తామంటూ స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేయలేదు. అమోథీ, వయనాడ్ ఈ రెండు స్థానాల్లో ఒకచోటే గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, ఇద్దరూ పోటీ చేస్తారని, అమేఠీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారని ఇలా రకరకాలుగా కాంగ్రెస్ వర్గాల నుంచి లీకులు కొనసాగుతున్నాయి.మరో రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతుండగా.. సహనం కోల్పోయిన కార్యకర్తలు తమ లోక్సభ స్థానానికి అభ్యర్ధిని ప్రకటించాలని ఆందోళన చేపట్టడం ఆసక్తికరంగా మారింది. -
ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
లోక్సభ ఎన్నికల పోలింగ్ తరుణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ హోమంత్రి రాంనివాస్ రావత్ బీజేపీలో చేరడం చర్చాంశనీయంగా మారింది.ఆరుసార్లు ఎమ్మెల్యేగామధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ రాహుల్గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు వెయ్యి మంది మద్దతుదారులతో బీజేపీలో చేరారు. సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ చీఫ్ వీడీ శర్మ, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. రావత్ విజయపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులలో ఒకరు.బీజేపీలోకి కమల్ నాథ్ సన్నిహితుడు కాగా,ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీలో చేరిన రెండో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్. మార్చి 29న మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్కు అత్యంత సన్నిహితుడు, అమర్వాడ ఎమ్మెల్యే కమలేష్ షా బీజేపీలో చేరారునామినేషన్ ఉపసంహరణ.. ఆపై బీజేపీలోకి జంప్మధ్యప్రదేశ్ ఇండోర్లో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 29న ఇండోర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరారు. కాగా, బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీపై కాంగ్రెస్ నేత అక్షయ్ కాంతి బామ్ను రంగంలోకి దించింది. అనూహ్యంత్ అక్షయ్ కాంతి బామ్ బీజేపీ చెంతకు చేరడం మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
జూన్ 4న జగన్ ప్రభంజనం..
'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..
విదేశాల నుంచి ఆప్ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్తో భేటీ
అడ్డంగా దొరికిన నకిలీ పోలీసులు...
అందుకే సీఎం జగన్ విక్టరీ వ్యాఖ్యలు!
మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు
ఐటీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్
తప్పక చదవండి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- చివరి బెర్త్ ఎవరిదో?
Advertisement