-
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
టాలీవుడ్లో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్లో గిలిగింతలు పెట్టించే నటుడు సునీల్. తెలుగులో హీరోగాను పలు సినిమాల్లో మెప్పించిన ఆయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పుష్పతో మళ్లీ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సౌత్ ఇండియాలో బిజీగా ఉన్నారు. కోలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ 'జైలర్', కార్తి 'జపాన్', విశాల్ 'మార్క్ అంథోని' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆయన మెప్పించాడు.తాజాగా సునీల్ మలయాళ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అయితే, హాస్యనటుడిగా కాకుండా విలన్గా అతడు మాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. 'భ్రమయుగం' తర్వాత మమ్ముట్టి లేటెస్ట్ మూవీ టర్బోలో సునీల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.సీరియస్ లుక్లో ఉన్న సునీల్.. టర్బో సినిమాలో ఆటో బిల్లా అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే కోలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సునీల్.. మాలీవుడ్లో కూడా తన సత్తా ఎంటో చూపించబోతున్నాడు. మే 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో మమ్ముట్టినే నిర్మించాడు. తన సొంత బ్యానర్లో టర్బో సినిమా రానున్నడంతో అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.Sunil as Auto Billa#Turbo in Cinemas Worldwide on May 23 , 2024 pic.twitter.com/DA4tjNUQbI— Mammootty (@mammukka) May 17, 2024 -
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
అభిమానుల గుండెల్లో మక్కల్ సెల్వన్గా నిలిచిపోయిన విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్య హిందీలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో విలన్గా అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం మహారాజ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.హీరోయిన్ ఎవరంటే?తన 51వ చిత్రానికి ఏస్ అనే టైటిల్ను ఖరారు చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా యోగిబాబు, పీఎస్. అవినాష్, దివ్యా పిళ్లై, బబ్లు, రాజ్కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ముగకుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బహదూర్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. కలర్ఫుల్ పోస్టర్ఇందులో విజయ్ చేతిలో సిగార్, వెనుక భాగంలో స్మిమ్మింగ్ టబ్, చుట్టూ చదరంగం డైస్తో పోస్టర్ కలర్ఫుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యోగిబాబు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. Presenting the quirky Title Teaser of #ACE🔥Not just a card but a Game Changer!😎#MakkalSelvan #VijaySethupathi51 @VijaySethuOffl @7CsPvtPte @Aaru_Dir @justin_tunes @rukminitweets @iYogiBabu #BablooPrithiveeraj #KaranBRawat #Avinashbs @R_Govindaraj @rajNKPK pic.twitter.com/F2O6A0RDo1— 7Cs Entertaintment (@7CsPvtPte) May 18, 2024 చదవండి: ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది -
అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్ల అవుతున్నప్పటికీ తమిళ యువ హీరోయిన్ ధన్సికకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో తన పేరుని సాయి ధన్సికగా మార్చుకుంది. త్వరలో 'ది ప్రూఫ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న ఈమె.. ఈ చిత్ర ప్రమోషన్ల భాగంగా ముద్దు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)'మనదోడు మళైక్కాలం' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ధన్సిక.. పలు చిత్రాల్లో నటించింది. కానీ రజినీకాంత్ 'కబాలి'లో ఆయనకు కూతురిగా చేసిన తర్వాత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాలు చేస్తోంది గానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో తన పేరుని ధన్సిక నుంచి సాయి ధన్సికగా మార్చుకుంది. మరి ఈసారైనా ఆమె కోరుకున్న హిట్ వస్తుందేమో చూడాలి.ఇకపోతే తాను గ్లామర్ పాత్రల్లో నటించలేనని, ఎందుకంటే అలాంటి పాత్రలకు తాను సెట్ అవ్వనని సాయి ధన్సిక చెప్పింది. కావాలనే కొందరు దర్శకులు తనపై గ్లామర్ ముద్రని బలవంతంగా రుద్దుతారు. గ్లామర్గా నటించడం అనేది కథని బట్టి ఉంటుందని ధన్సిక చెప్పింది. తనకు బెడ్రూమ్, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!) -
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్కు కళ్లు చెదిరే యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
తమిళ నటుడు అజిత్ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందు విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్హిట్ కొట్టిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు జంటగా నటి శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే నటి శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల సైలెంట్గా ఎలాంటి హంగామా లేకుండా హైదరాబాద్లో ప్రారంభమైంది. అంతేకాదు శుక్రవారంతో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంటుందని అజిత్ సన్నిహితుడు తెలిపారు. హైదరాబాద్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అజిత్ పాల్గొనే ఇంట్రో పాటను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.కాగా అజిత్ తదపరి విడాముయర్చి చిత్రం షూటింగ్లో పాల్గొననున్నారని.. జూన్ రెండు లేదా మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇదే ఈ చిత్రం చివరి షెడ్యూల్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం షూటింగ్లో పాల్గొంటారని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి ముందు విడాముయర్చి చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. అది కూడా హీరోగా!
సినిమాలకు, రాజకీయాలకు అత్యంత సుపరిచితుడు రామరాజన్. దాదాపు 44 చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సక్సెస్ఫుల్ నటుడీయన. పలు చిత్రాలకు దర్శకత్వం సైతం వహించిన ఈయన రాజకీయ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీర విధేయుడు రామరాజన్. కాగా సినీ, రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన గతంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. దాని నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. పద్నాలుగేళ్ల తర్వాత..సుమారు 14 ఏళ్ల తర్వాత రామరాజన్ మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అదీ కథానాయకుడిగా! అలా ఆయన నటించిన చిత్రం సామానియన్. ఎక్సట్రా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మదియళగన్ నిర్మించిన ఇందులో రాధారవి, ఎంఎస్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.హీరోయిన్ లేదుఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మీడియాతో ముచ్చటించింది. రామరాజన్ మాట్లాడుతూ సామానియన్ చిత్రంలో నటించడానికి ముఖ్య కారణం కథ అన్నారు. దర్శకుడు రాకేష్ చెప్పిన కథ నచ్చిందన్నారు. ఈ చిత్రంలో తనకు హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరన్నారు. ఒక సగటు సామాన్యుని కోపమే ఈ చిత్రమని చెప్పారు. మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన, లేదని సినిమాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొన్ని కథలను వింటున్నానని వాటికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.చదవండి: ప్రభాస్ నుంచి త్వరలో గుడ్ న్యూస్.. ఏమై ఉండొచ్చు? -
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దర పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నట్లు జీవీ ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. ప్రైవసీకి భంగం కలిగించొద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఈ జంటపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విమర్శిస్తున్నారు.తాజాగా తమపై వస్తున్న ట్రోల్స్పై సింగర్ సైంధవి స్పందించింది. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా యూట్యూబ్లో కొందరు వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను.. ప్రకాశ్ ఆలోంచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ మా నిర్ణయాన్ని గౌరవించాలని అభ్యర్థించారు. ఇలా ఒకరిపై ఆరోపణలు చేయడం దారుణమని వాపోయారు. మేమిద్దరం 24 ఏళ్లుగా మంచి స్నేహితుల్లా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తమ స్నేహా బంధాన్ని కొనసాగిస్తామని సైంధవి పేర్కొన్నారు. కాగా.. అంతకుముందే ట్రోల్స్ పట్ల జీవీ ప్రకాశ్ సైతం స్పందించారు. దయచేసి తమ పట్ల ట్రోల్స్ చేయడం సరైంది కాదని హితవు పలికారు. -
సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్!
సత్యరాజ్, వసంతరవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్. మిలియన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన ఈ చిత్రానికి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. దర్శకుడు రాజీవ్ మీనన్ ప్రతినాయకుడిగా ఫవర్ఫుల్ పాత్రలో నటించిన ఇందులో నటి తాన్య హోప్ నాయకిగా నటించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రబందం ప్రెస్ మీట్ నిర్వహించింది.దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ..' సూపర్ హ్యూమన్ ఎలిమెంట్స్తో ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ సభ్యులందరు శ్రమించారన్నారు. వెపన్ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎస్ మన్సూర్, ఎంఎస్ అబ్దుల్ ఖాదర్, ఎంఎస్ ఐజీష్ సహకారం లేకపోతే ఈ చిత్రం సాధ్యం కాదన్నారు. వారు తనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారని.. సత్యరాజ్ తొలిసారిగా సూపర్ హ్యూమన్ పాత్రను అద్భుతంగా పోషించారన్నారు. ఆయన అంకిత భావం, సహకారం తనను ఎంతగానో ఉత్సాహ పరిచాయన్నారు.ఇక నటుడు వసంతరవి స్క్రీన్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. కాగా.. ఈ సినిమాలో యషికా ఆనంద్, రాజీవ్ పిళ్లై, మైమ్ గోపి, కనిక, గజరాజ్, సయ్యద్ సుభన్, భరద్వాజ్, రంగన్, వేలు ప్రభాకరన్, మాయా కృష్ణన్, శ్యామ్ కరీమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా.. ఈ సినిమా ఈనెల 23న రిలీజ్ కానుంది. -
విభేదాలు సరే.. వ్యక్తిగత దూషణలెందుకు?: కమల్ హాసన్
సినీ పితామహుడుగా పేరు గాంచిన సినీ పంపిణీదారుడు డి.రామానుజన్ శత జయంతి వేడుకను మంగళవారం సాయంత్రం చెన్నై లోని ఏవీఎం రాజేశ్వరి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఆయన కృషి మరువలేనిదిఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. డి.రామానుజన్తో, ఆయన కుటుంబంతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఆధునికతకు పెద్దపీట వేసిన ఆయన తమిళ సినిమా ఉన్నతికి అవసరం అయిన వాటిని సమకూర్చారన్నారు. అలాంటి వ్యక్తికి శతజయంతి వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం అని ప్రశంసించారు. వ్యక్తిగత దూషణలెందుకు?ఇటీవల సినిమా ఇండస్ట్రీలో విభేదాలు ఎక్కువ అవుతున్నాయని, దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. విభేదాలు కలగడం సహజమేనని, అయితే వాటిని వ్యక్తిగత దూషణల వరకు తీసుకువెళ్లరాదన్నారు. అప్పట్లో తనకు డి రామానుజన్కు మధ్య కూడా చిన్న వివాదం తలెత్తిందని, కానీ దాన్ని తాము తీవ్రంగా తీసుకోలేదని చెప్పారు. సమైక్యతా భావం ముఖ్యంఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, అయితే సమైక్యతా భావం చాలా ముఖ్యమని కమల్ హాసన్ పేర్కొన్నారు. డి.రామానుజన్ శత జయంతి వేడుకలను నిర్మాత కలైపులి ఎస్.థాను చక్కగా నిర్వహించారని ప్రశంసిస్తూ ఈ సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పన్నీర్ సెల్వన్, దర్శకుడు నటుడు కె.భాగ్యరాజ్, నిర్మాత కేఆర్ వీసీ గుహనాథన్, ఆర్వీ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'ప్రముఖ నటి ఇంట్లో అశ్లీల చిత్రాలను షూట్ చేసిన నటుడు'
కొంతకాలంగా కోలీవుడ్లో టాప్ సింగర్గా నిలిచిన సుచిత్ర.. సుచీ లీక్స్ వ్యవహారం తర్వాత ఎన్నో వివాదాల్లో ఇరుక్కుని, సింగర్ అనే విషయం మరిచిపోయింది. సుచీ లీక్స్ ఇష్యూ తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న సుచిత్ర.. ఇప్పుడు రకరకాల వివాదాస్పద కామెంట్లు చేస్తూ కోలీవుడ్లో పెను తుఫాను సృష్టిస్తోంది. ప్రస్తుతం వరుసగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్గా మారారు.అందుకు తగ్గట్టుగానే తన మాజీ భర్త కార్తీక్ కుమార్ స్వలింగ సంపర్కుడని, ధనుష్తో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన సుచిత్ర.. కోలీవుడ్లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా ఉందని, కమల్ బర్త్ డే పార్టీల్లో వెండి తాంబూలాల్లో కొకైన్ వడ్డించారని ఇలా సెన్సేషనల్ కామెంట్లు చేస్తుంది. అంతే కాకుండా సుచీ లీక్స్ ఇష్యూలో వచ్చిన ఫోటోలను త్రిష తనకు ఇచ్చిందని సుచి చెప్పడం చాలా మందిని షాక్కు గురి చేసింది.తాజాగా వనిత విజయకుమార్ గురించి సుచిత్ర పలు వ్యాఖ్యలు చేసింది. అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వనితా విజయకుమార్ ఇంటిని తమిళ నటుడు బైల్వాన్ ఉపయోగించాడని సుచిత్ర తెలిపింది. ఒక బంగ్లాను వనితకు తన సిన్నిహితులు ఇస్తే.. దానిని నటుడు బైల్వాన్కు ఆమె ఇచ్చినట్లు సుచి తెలిపింది. అయితే ఆ బంగ్లాను అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వాడినందుకే సీల్ వేశారని సుచిత్ర పేర్కొంది. బైల్వాన్ అందరి గురించి కామెంట్లు చేస్తాడు కానీ, వనిత గురించి మాత్రం ఎక్కడా మాట్లడరు. దీనికి కారణం ఈ బంగ్లా కథే అంటూ సుచి చెప్పింది.బైల్వాన్ రంగనాథన్ అశ్లీల సినిమాలకు ఏజెంట్గా పనిచేస్తున్నాడని, తనకు ప్లేబ్యాక్ సింగర్ కాకముందే ఈ విషయాలన్నీ తెలుసని సుచిత్ర తెలిపింది. శరత్కుమార్, రాధా రవి వంటి వారు తమిళనాడులో ఇలాంటి అసభ్యకర చిత్రాలను తెరకెక్కించకుండా అడ్డుకున్నారని కూడా ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ సెలబ్రిటీలకు నిద్రలేకుండా సుచిత్ర చేస్తుంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలియక భయంతో ఉన్నారని చెప్పవచ్చు. సుచిత్ర వెనుక ఎవరో ఉండే ఈ కథ నడుపుతున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. -
సుచీ లీక్స్.. కమల్ హాసన్పై సంచలన ఆరోపణ చేసిన సుచిత్ర
కోలీవుడ్లో సుచీ లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. రోజుకొక సెలబ్రిటీ గురించి ఎదో వార్త వైరల్ అవుతూనే ఉంది. 2017లో కోలీవుడ్ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్ టాపిప్గా మారిన విషయం తెలిసిందే.కొన్నేళ్ల తర్వాత సింగర్ సుచిత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య, త్రిష గురించి పలు విషయాలు తెలుపుతూ రచ్చ మొదలుపెట్టింది. తాజాగా కమల్ హాసన్పై సుచిత్ర సంచలన ఆరోపణ చేసింది. కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్ అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో బాంబ్ పేల్చింది. తమిళ్ బిగ్ బాస్కు హోస్ట్గా కమల్ కొనసాగిన విషయం తెలిసిందే. గత సీజన్లో విక్రమ్ సినిమాతో పాపులర్ అయిన మాయ కంటెస్టెంట్గా పాల్గొంది. కమల్తో పాటు మాయ కూడా ట్రాన్స్జెండర్స్ అయి ఉంటారంటూ సుచిత్ర తెలిపింది. ఆయనకు చుడీదార్, కుర్తా అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 4లో సుచిత్ర కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కమల్ విషయంలో రీసెర్చ్ చేసే ఈ విషయాలు చెబుతున్నానని సుచిత్ర పేర్కొంది. ఆ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్ జెండర్తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయని ఆమె గుర్తుచేసింది. అందులో కూడా కమల్ వైట్ డ్రెస్తో పాటు చుడీదార్ లాంటి దాన్ని ధరిస్తారని ఆమె తెలిపింది. కమల్ నిజజీవితంలో కూడా ఎక్కువగా అలాంటి దుస్తులే ధరిస్తారని ఆమె తెలిపింది. సుచిత్ర చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ వ్యక్తిగతంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు ఆయన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. మీడియా వారు కూడా ఆమెతో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకండి అంటూ వారు కోరుతున్నారు. “Kamal Hassan is a transgender!” 🤯Shocking revelation by singer #Suchitra Arava nibba galla battalu oodadeestundi 😂😂😂#SuchiLeakspic.twitter.com/eWN4RzYiij— Aaku Bhai (@samuraigambhira) May 15, 2024 -
స్టార్ డైరెక్టర్తో నయనతార కొత్త సినిమా
కోలీవుడ్లో తాజాగా ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గౌతమ్మీనన్ దర్శకత్వంలో నయనతార నటించబోతున్నారన్నదే ఆ వార్త. దక్షిణాదిలో దర్శకుడు గౌతమ్మీనన్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్టైలిష్ దర్శకత్వంలో పేరు గాంచిన 2001లో మిన్నలే (చెలి) అనే చిత్రం ద్వారా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో గౌతమ్మీనన్కు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క (ఘర్షణ), కమలహాసన్ హీరోగా వేట్టైయాడు వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులో ఈయన దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏ మాయ చేశావే' చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా నటి సమంత కెరీర్కు మైలురాయిగా నిలిచింది. కాగా ఈయన దర్శకుడిగా కొనసాగుతూనే నటుడిగాను ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో వైవిధ్య భరిత కథాపాత్రలను పోషిస్తున్నారు. గౌతమ్మీనన్ చివరగా దర్శకత్వం వహించిన చిత్రం వెందు తనిందది కాడు. శింబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధృవనక్షత్రం విడుదల కావాల్సి ఉంది. చిన్న గ్యాప్ తరువాత గౌతమ్మీనన్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో లేడీ సూపర్స్టార్ నయనతార కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఈ క్రేజీ చిత్రంలో మలయాల సూపర్స్టార్ మమ్మట్టి నటించనున్నారని టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇది తమిళ చిత్రమా? లేక మలయాళ చిత్రమా, అది కాకుండా పాన్ ఇండియా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. కాగా నయనతార, మమ్ముట్టి కలిసి 2016లో పుదియ నియమం అనే మలయాళ చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్.. గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్ సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని, అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది. అమృత అతడిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై నటుడు కార్తీక్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.నేనేమీ సిగ్గుపడను'నేను స్వలింగసంపర్కుడినా? ఒకవేళ అదే అయ్యుంటే మాత్రం బయటకు చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు. అది ఏదైనా సరే గర్వంగా చెప్పుకునేవాడిని. అంతేకానీ ముడుచుకుపోను. నా నగరంలో దర్జాగా ర్యాలీ చేసేవాడిని.. అన్నిరకాల వాళ్లు అందులో పాల్గొని వారు అండగా నిలబడేవాళ్లు. ఎవరూ దేనికీ తలదించుకోవాల్సిన అవసరం లేదు. గర్వంగా బతకండి' అంటూ ఓ వీడియో షేర్ చేశాడు.గొడవలు ఆగవా?ఇది చూసిన జనాలు అతడు ఎంతో శాంతంగా బదులివ్వడాన్ని మెచ్చుకుంటున్నారు. ఏళ్ల తరబడి మీరు కొట్టుకుంటూనే ఉన్నారు.. మీ గొడవలకు అంతనేదే లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మీరు మీ మాజీ భార్య గురించి ఎంతో మంచి మాటలు చెప్తే ఆమె మాత్రం ఇలా లేనిపోని మాటలనేసి అవమానిస్తుంటే చూడటానికి మాకే బాధగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Karthik Kumar (@evamkarthik) చదవండి: సుచీలీక్స్ సంచలనం.. పెళ్లి తర్వాత ధనుష్- ఐశ్వర్య వేరేవాళ్లతో డేటింగ్.. ఆమె కంటే.. -
నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
సుచీలీక్స్తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి యావత్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్ చేశారు. ఐశ్వర్య కంటే ధనుషే నయంభర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.కార్తీక్ గేభర్త కార్తీక్తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. పూటుగా తాగిన తర్వాత ధనుష్, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్కు ఏం పని?' అని ప్రశ్నించింది.అందుకే టార్గెట్కాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ మాజీ భర్త కార్తీక్.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్, కార్తీక్ టార్గెట్ చేశారని వెల్లడించింది.చదవండి: బాలీవుడ్లో రాణిస్తున్న బ్యూటీ.. ఫస్ట్ సినిమా తెలుగులోనే! -
రజినీకాంత్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో ఇతర రాష్టాలకు చెందిన స్టార్స్ను తీసుకురావడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా జైలర్ చిత్రంతోనే ఇది మొదలైందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్ వంటి వారు అతిథి పాత్రల్లో మెరిసి జైలర్ చిత్ర విజయానికి కారణం అయ్యారనే చెప్పాలి. ఇకపోతే తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ నటుడు రాణా వంటి వారు నటిస్తున్నారు.కాగా రజనీకాంత్ త్వరలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన 171 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ చిత్రానికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్ర టైటిల్తోపాటు ఫస్ట్లుక్ పోస్టర్ను, టీజర్ను వరుసగా చిత్ర ప్రారంభానికి ముందే విడుదల చేసి హైప్ను తీసుకొచ్చారు. కాగా కూలీ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో రజనీకాంత్కు జంటగా శోభన నటించనున్నారు.అలాగే నటి శృతిహాసన్ కూడా ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కూడా కూలీ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా నటుడు నాగార్జున ఇప్పటికే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం కుబేరాలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మరి కూలీ చిత్రంలో ఈయన పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. పలు ప్రత్యేకతలతో కూడిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. -
అతి మంచి పనికిరాదని నాన్న నుంచే నేర్చుకున్నా: హీరోయిన్
ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెెడ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది.తండ్రి అతి మంచి వల్లఈ హీరోయిన్ ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను, అమ్మ పడ్డ బాధలను వివరించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడానికి తన తండ్రి ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పించారన్నారు. అయితే ఆనారోగ్యం కారణంగా తన తండ్రి మరణిస్తే అప్పులు ఎగ్గొట్టిన వారి రుణ భారం అంతా తల్లిపై పడిందన్నారు. దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క ప్లాట్ను విక్రయించి ఆ అప్పును తీర్చినట్లు చెప్పారు. అమ్మ ఏ లోటూ లేకుండాఅంత కష్టంలోనూ అమ్మ తమను మంచి పాఠశాలలో చదివించారని, ఏ లోటూ లేకుండా చూసుకున్నారన్నారు. తన అన్నయ్యలు ఇద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి సిద్ధమైన సమయంలో ఒక ప్రమాదంలో మరణించారన్నారు. అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న అమ్మను ఆ సంఘటన మరింత కుంగదీసిందన్నారు. అయినా తను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపారు. అమ్మ నుంచే నేర్చుకున్నావృత్తిపరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా, ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. అలాగే అతి మంచికి పోకూడదన్నది తన తండ్రి జీవితం నుంచి నేర్చుకున్నట్లు ఐశ్వర్య రాజేశ్ చెప్పారు. -
రూ.1 కోటి విరాళమిచ్చిన హీరో ధనుష్
దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగం పుంజుకుంది. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఆధునిక వసతులతో బ్రహ్మాండంగా నిర్మించడానికి చాలా కాలం ముందే ప్రణాళికలను సిద్ధం చేశారు. భవన నిర్మాణ పనులు కొంతమేరకు జరిగాయి కూడా. అయితే నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి. రూ.1 కోటి విరాళంతాజాగా సంఘం నిర్వాహకులు నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసే పనికి పూనుకున్నారు. అందుకు కావలసిన నిధులను సమకూర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ముందుగా హీరో కమలహాసన్ రూ. కోటి విరాళంగా అందించారు. ఆ తరువాత నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, హీరో విజయ్ తలా కోటి రూపా యలను విరాళంగా అందించారు. ధనుష్ సైతంఅలాగే హీరో శివకార్తికేయన్ రూ. 50 లక్షలను విరాళం ఇచ్చారు. తాజాగా హీరో ధనుష్ కోటి రూపాయలు ఇచ్చారు. దీంతో నడిగర్ సంఘం నిర్వాహకులు ధనుష్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా నూతన భవనాన్ని పూర్తి చేయనున్నట్లు విశాల్ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్న విషయం తెలిసిందే.చదవండి: అందుకే విడిపోతున్నాం.. వివాహ బంధానికి ముగింపు ప్రకటన చేసిన జీవీ ప్రకాష్-సైంధవి -
అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు ప్రకటించింది. తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ షాకింగ్ ప్రకటన చేశారు. తన భార్య.. సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు సైంధవి కూడా తనవైపు నుంచి అధికారికంగా ప్రకటించారు.ఈ ఇద్దరూ విడిపోతున్నట్లు ఈ మధ్య కోలీవుడ్లో ప్రచారం జరిగింది. అయితే.. ఆ కథనాల్ని ధృవీకరిస్తూ.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీళ్ల అభిమానులు విస్మయానికి గురి అయ్యారు. సైంధవి జీవీ ప్రకాష్కు బాల్య మిత్రురాలు. ఇద్దరూ 12 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. 2013లో వీళ్లిద్దరూ వివాహం చేసుకోగా.. ఈ జంటకు ఓ పాప ఉంది.‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్ మీడియాను కోరారు. pic.twitter.com/73IbnNZfEf— G.V.Prakash Kumar (@gvprakash) May 13, 2024 pic.twitter.com/M6GDxgAFqn— Saindhavi (@singersaindhavi) May 13, 2024 మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అయిన జీవీ ప్రకాష్.. కోలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా ఇప్పటిదాకా హీరోగానూ డజనుకు పైగా చిత్రాలతో అక్కడి ఆడియొన్స్ను అలరించారు. తెలుగులోనూ పలు చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందించారు. ఇక 12వ ఏట టీవీ షో ద్వారా సింగర్గా గుర్తింపు దక్కించుకున్న సైంధవి.. విక్రమ్ అన్నియన్(అపరిచితుడు) చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించారు. తమిళ్, తెలుగు చిత్రాల ద్వారా ఆమె అలరిస్తూ వస్తున్నారు. -
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
ప్రముఖ తమిళ హాస్య నటుడు అప్పుకుట్టి మంచి మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు రూ.11 లక్షలు విరాళం ఇచ్చి, తన ఔదార్యం చాటుకున్నాడు. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్ కినరు. ఆ ప్రాంతంలోని ముత్తారమ్మన్ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు అప్పుకుట్టి వెళ్లాడు. వేడుకల సందర్భంగా నాథన్ కినేరులోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)గ్రామ ప్రజల కోరిక మేరకు అప్పుకుట్టి.. రూ.11 లక్షల ఖర్చుతో టేబుల్, కంప్యూటర్, టీవీ విద్యుత్ ఫ్యాన్లు, తదితర వస్తువులను కొని ఇచ్చాడు. దీని గురించి అప్పుకుట్టి మాట్లాడాడు. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాను ఒకటి, రెండు తరగతులు చదివానని, అయితే ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో చదివే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉందన్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించానని అన్నాడు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుకుట్టి కోరాడు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనం ఊరి బయట ఉన్నా, ఏడాదికి కొన్ని రోజులు ఊరిలోనే నివాసం ఉండాలని అప్పుకుట్టి తన అభిప్రాయం వెలిబుచ్చారు.(ఇదీ చదవండి: AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!) -
'హిట్ లిస్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య
దర్శక నటుడు కేఎస్.రవికుమార్ నిర్మిస్తున్న మూడో చిత్రం హిట్లిస్ట్. ఈ సంస్థలో ఇంతకు ముందు కమలహాసన్ 'తెనాలి', ఈ మధ్య 'గూగుల్ కుట్టప్పా' అనే సినిమాల్ని నిర్మించారు. తాజాగా 'హిట్లిస్ట్' పేరుతో మూవీ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కినిష్కాను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూర్య కథీర్, కే. కార్తీకేయన్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ కుమార్, కేఎస్ రవికుమార్, గౌతమ్మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!)నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుందని, తాజాగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను నటుడు సూర్య ఆవిష్కరించి యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు అందించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా రెడీ చేశామని, త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తామని నిర్మాత కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) #I_Am_The_Danger first single from #HitList out now! 💥Song link - https://t.co/XxQoHVyKtpA @CSathyaOfficial Musical!@realsarathkumar @kanvikraman #RKCelluloids @ksravikumardir @menongautham @thondankani @smruthi_venkat @Aishwaryadutta6 @Abinakshatra @RIAZtheboss @V4umedia_ pic.twitter.com/8BTeyaGEzs— K.S.Ravikumar (@ksravikumardir) May 10, 2024 -
చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..
హీరో శింబు సినిమాలు జయాపజయాలకు అతీతంగా మినిమమ్ వసూళ్లు సాధిస్తాయి. అందుకే నిర్మాతలు ఈయనతో చిత్రాలు చేయడానికి క్యూ కడతారు. ఆ మధ్య మానాడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న శింబు, ఆ తరువాత వెందు నిందదు కాడు చిత్రంతోనూ హిట్ కొట్టారు. ఆ తరువాత నటించిన పాత్తు తల చిత్రం నిరాశపరచింది. కాగా త్వరలో కమల్ హాసన్ బ్యానర్లో దేశింగు పెరియసామి దర్శకత్వంలో నిర్మించనున్న భారీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. థగ్లైఫ్ మూవీలోప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న థగ్లైఫ్ చిత్రంలో శింబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే పోస్టర్ కూడా రిలీజైంది. ప్రస్తుతం ఇతడు ఆ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో థగ్లైఫ్ చిత్రంలో శింబు నటించరాదని నిర్మాత ఐసరి గణేశ్ తమిళ నిర్మాతల మండలికి ఫిర్మాదు చేశారు. రూ.4 కోట్లు అడ్వాన్స్అందులో ఆయన తాను వెందు తనిందదు కాడు చిత్రం తరువాత శింబు హీరోగా కరోనా కుమార్ అనే చిత్రాన్ని గోకుల్ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నానని తెలిపారు. అందుకు గానూ ఆయనకు రూ.9 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని, రూ.4 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం శింబు తన చిత్రంలో నటించడం లేదని, ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. అప్పటివరకు ఎక్కడా నటించొద్దుసెప్టెంబరు 19వ తేదీలోగా రూ.1 కోటితో కూడిన అనుమతి పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని, లేని పక్షంలో ఇతర చిత్రాల్లో నటించడానికి నిషేధం విధించనున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. కాబట్టి తన చిత్రాన్ని పూర్తి చేసే వరకూ శింబు థగ్లైఫ్ చిత్రంలో నటించరాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే థగ్లైఫ్ చిత్రంలో నటిస్తున్న శింబు ఆ చిత్రాన్ని పూర్తి చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. -
ఇచ్చినమాట నిలబెట్టుకున్న రవితేజ
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్తో అమర్ దీప్ చౌదరి మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్లో అమర్ ఆటతీరు పట్ల కొందరు నెటిజన్లు తప్పుపట్టినా.. అతనిలోని ఎమోషనల్ కోణం చాలామందికి నచ్చింది. అందుకే బిగ్ బాస్ ఫైనల్ వరకు చేరుకుని రన్నర్గా నిలిచాడు. టాలీవుడ్ మాస్మహారాజా రవితేజ అంటే అమర్కు చాలా ఇష్టం. ఇదే విషయాన్ని చాలా సమయాల్లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అమర్ చూపిన అభిమానానికి ఫిదా అయిన రవితేజ కూడా ఒక ఆఫర్ ప్రకటించాడు. తన నటించబోయే సినిమాలో ఒక మంచి పాత్ర ఇస్తున్నట్లు బిగ్ బాస్ వేదికగా ప్రకటించాడు.తాజాగా రవితేజను అమర్ దీప్ కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. నా డ్రీమ్ నిజం అయిందంటూ అమర్ చెప్పుకొచ్చాడు. రవితేజతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలిపాడు. దీంతో అభిమానులు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇచ్చిన మాటను రవితేజ నిలిబెట్టుకున్నారని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ రేసు నుంచి తప్పుకుంటే రవితేజ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని హోస్ట్ నాగార్జున చెప్పగానే అమర్ కూడా అందుకు రెడీ అంటూ.. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దానిని గమనించిన రవితేజ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు అదే స్టేజీ మీద మాట ఇస్తాడు. 105 రోజులు కష్టపడ్డావ్ ఆట పూర్తి అయ్యే వరకు ఉండమని రవితేజ కోరుతాడు. దీంతో ఫుల్ ఖుషి అయిన అమర్కు ఎట్టకేలకు తన అభిమాన హీరోతో కలిసి నటించే ఛాన్స్ దక్కింది.రవితేజ ఒకవైపు మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తూనే మరోవైపు తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ను కూడా లాంచ్ చేశాడు. రవితేజ 75వ సినిమాని ‘సామజవరగమన’ రచయిత భాను బొగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ ‘RT75’ పేరుతో ఒక పోస్టర్ కూడా విడుదలైంది. అమర్ ఈ రెండు చిత్రాలలో దేనిలో నటిస్తున్నాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by Amardeep G (@amardeep_chowdary) -
ఆ విద్యార్థులకు విజయ్ సాయం.. త్వరలో కలుస్తానంటూ మెసేజ్
కోలీవుడ్ హీరో విజయ్ అందరికీ సుపరిచితుడే.తమిళ సూపర్ స్టార్గా తిరుగులేని ఫ్యాన్ బేస్తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరుసలో ఉంటాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విజయ్ ముందుంటారు. గతంలో తమిళనాడులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. గతేడాది 12వ తరగతి పరీక్షలో 600/600 మార్కులు సాధించిన నందినికి కానుకగా డైమండ్ నెక్లెస్ అందించాడు. అదే సమయంలో రెండు వేల మంది ఉత్తమ విద్యార్థులకు సాయం చేశాడు. అయితే, ఈసారి కూడా విద్యార్థులను ఆయన కలుస్తున్నట్లు ప్రకటించారు.విజయ్ 50వ పుట్టినరోజు వేడుకలను జూన్ 22న జరుపుకోనున్నారు. గతేడాది విజయ్ పుట్టినరోజు సందర్భంగా అకడమిక్ అవార్డుల వేడుకను ఆయన నిర్వహించారు. ఆ సమయంలో 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. వచ్చే నెలలో కూడా అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంచుకుని వారందరినీ పిలిపించి బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు ఇచ్చి సత్కరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.పదో తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు రీసెంట్గా విడుదలయ్యాయి. ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్ధులను తమిళనాడు వెట్రి కజగం తరపున విజయ్ ఓ ప్రకటనలో అభినందిస్తూ, త్వరలో కలుస్తామని ప్రకటించారు. జూన్ 22న విజయ్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరగవచ్చని తెలుస్తోంది. 234 నియోజకవర్గాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులతో పాటు 12వ తరగతి విద్యార్థులను గుర్తించే పనిని తన అభిమానలకు అప్పచెప్పినట్లు సమాచారం.தமிழ்நாடு, புதுச்சேரியில் அண்மையில் நடைபெற்ற 12 மற்றும் 10ஆம் வகுப்புப் பொதுத் தேர்வுகளில் தேர்ச்சி பெற்ற மாணவச் செல்வங்கள் அனைவருக்கும் நெஞ்சார்ந்த பாராட்டுகள். மற்றவர்கள் தன்னம்பிக்கையுடன் மீண்டும் முயன்று, வெற்றி பெற வாழ்த்துகள்.விரைவில் நாம் சந்திப்போம்! pic.twitter.com/OUYZYhl5Ni— TVK Vijay (@tvkvijayhq) May 10, 2024 -
యాచకుడిగా మారిన హీరో..
కొన్ని చిత్రాల టైటిల్స్ ప్రారంభంలోనే హైప్ తీసుకొస్తాయి. బ్లడీ బెగ్గర్ టైటిల్ కూడా అదే కోవలోకి వస్తుంది. కోలమావు కోకిల, డాన్, బీస్ట్, జైలర్ వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా రాణిస్తున్న నెల్సన్ దిలీప్కుమార్ ఈ మూవీతో నిర్మాతగా మారుతున్నారు. ఫిలమెంట్ ఫిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తన శిష్యులును, ఇతర ప్రతిభావంతులైన నూతన దర్శకులను ప్రోత్సహించనున్నారు. బ్లడీ బెగ్గర్వారితో కలిసి మంచి కథా చిత్రాలను నిర్మించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా బ్లడీ బెగ్గర్ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కవిన్ కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా నెల్సన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న శివబాలన్ ముత్తుకుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. బిచ్చగాడి గెటప్లో ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను దర్శకుడు నెల్సన్, నటుడు రెడిన్ కింగ్స్లీ, కవిన్, శివబాలన్లు నటించిన ఓ ఫన్నీ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే బ్లడీ బెగ్గర్ పేరుతో కవిన్ బిచ్చగాడి గెటప్లో ఉన్న పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇకపోతే కవిన్ హీరోగా నటించిన స్టార్ మూవీ తమిళనాట నేడే (మే 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: నేరుగా ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే? -
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement