Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సిటీ డిపోలన్నీ ప్రైవేటుకే..
ADVERTISEMENT 

సిటీ డిపోలన్నీ ప్రైవేటుకే..

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 11, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bus.jpg

హైదరాబాద్‌లో డీజిల్‌ బస్సుల తొలగింపు

వాటి స్థానంలోజీసీసీ విధానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు.. ప్రైవేటు సంస్థలకునగరంలోని బస్‌ డిపోలు 

ఈ బస్సుల్లో కండక్టర్లు తప్ప అంతాప్రైవేటువారే.. దీంతో డీజిల్‌ బస్సులతోపాటే సిటీ బయటకు ఆర్టీసీ సిబ్బంది 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆర్టీసీ డీజిల్‌ బస్సులను నగరం వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించటం ఆ సంస్థ ఉద్యోగులకు ప్రాణ సంకటంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

డీజిల్‌ బస్సుల స్థానంలో ప్రైవేటు సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సులను తిప్పాలని భావిస్తున్నారు. ఈ బస్సుల్లో కండక్టర్‌ తప్ప ఇతర సిబ్బంది అంతా సదరు సంస్థవారే ఉంటారు. దీంతో ఇప్పుడు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది డీజిల్‌ బస్సులతోపాటే నగరం బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.  
సిటీ బయటకు 80 శాతం సిబ్బంది! 
ప్రస్తుతం నగరంలో 2,500 సిటీ బస్సులు తిరుగుతున్నా యి. విమానాశ్రయం సర్వీసులు, సిటీ సర్వీసులుగా తిరుగుతున్న కొన్ని నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు మినహా అన్నీ డీజిల్‌ బస్సులే. ఇటీవలే ఎలక్ట్రిక్‌ పాలసీలో మార్పులు తెచి్చన రాష్ట్ర ప్రభుత్వం.. నగరంలో డీజిల్‌ బస్సులను తిప్పొద్దని నిర్ణయించింది. వీటిని ఔటర్‌ రింగురోడ్డు అవ తలికి తరలించి, నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. 

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద ఆర్టీసీ దరఖాస్తు చేసింది. ఆ పథకం కింద దేశవ్యాప్తంగా 9 నగరాలకు 14 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అందులో 2,800 బస్సులు తమకు అందజేయాలని టీజీఆర్టీసీ కోరింది. ఈ పథకానికి సంబంధించి ఈ నెలలో లేదా వచ్చే నెలలో కేంద్రం టెండర్లు పిలవనుంది. టెండర్లు దక్కించుకునే సంస్థలు గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు (జీసీసీ) పద్థతిలో ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీలో అద్దెకు తిప్పుతాయి. 

ఈ బస్సుల నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలదే. ఒక్క కండక్టర్‌ సర్వీసును మాత్రమే ఆర్టీసీ పర్యవేక్షిస్తుంది. డ్రైవర్, మెకానిక్, సెక్యూరిటీ వంటి బాధ్యతలను బస్సుల యజమానులే చూసుకొంటారు. దీంతో నగరంలోని ప్రస్తుత ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేటు బస్సులు నిలిపేందుకు కేటాయిస్తారు. రెండేళ్లలో దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. డిపోలపై అజమాయిషీ మాత్రం ఆర్టీసీదే ఉండనుంది. 

అంటే, డిపో మేనేజర్, సహాయ మేనేజర్, కండక్టర్లకు టికెట్‌ యంత్రాలు అందివ్వటం, టికెట్ల ద్వారా వచ్చే నగదును లెక్కించి బ్యాంకుల్లో జమ చేయటం వంటి బాధ్యతలు చూసే కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఆర్టీసీలో ఉంటారు. డ్రైవర్లు, మెకానిక్‌–శ్రామిక్‌లు, సెక్యూరిటీ సిబ్బందిని రాష్ట్రంలోని ఇతర డిపోలకు పంపాల్సి ఉంటుంది. దీంతో నగరంలోని 80 శాతం మంది ఆర్టీసీ సిబ్బంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాల భర్తీ కూడా ఉండదని చెబుతున్నారు. 
 
ఇది ప్రైవేటీకరణే:కార్మిక సంఘాలు
ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటి సిబ్బంది ఆధ్వర్యంలో బస్సులను తిప్పటమంటే అంతమేర ఆర్టీసీని ప్రైవేటీకరించినట్టేనని ఆర్టీసీలోని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సహించేది లేదని, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. మరో వైపు జీసీసీ పద్ధతిలో బస్సుల నిర్వహణ చేపట్టినంత మాత్రాన దాన్ని ప్రైవేటీకరించినట్టు అనటం సరికాద ని ఉన్నతాధికారులు పేర్కొంటున్నా రు. 

డిపోల్లోని స్థలాలను మాత్రమే ఆయా సంస్థలు బస్సులు నిలుపుకోవటం, చార్జింగ్‌ చేయటం, నిర్వహణ పనులకు వినియోగించుకుంటాయని చెబుతున్నారు. డిపోల అజమాయిషీ పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటుందని అంటున్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
city buses
diesel
Hyderabad
electric buses
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.