Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రేపటి నుంచి అమల్లోకి..
ADVERTISEMENT 

రేపటి నుంచి అమల్లోకి..

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 4, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
land.jpg

రాష్ట్రంలో భూములవిలువల సవరణకు ముహూర్తం ఖరారు

అధికారికంగాప్రకటించిన ప్రభుత్వం..

పాత విలువలునేడు ఒక్కరోజే వర్తింపు 

నేడు కూడా ఉ. 9:30 నుంచి రాత్రి 7:30 వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు 

వ్యవసాయ భూమి కనిష్ట ధర రూ.2.75 లక్షలు.. గరిష్ట ధర 30 కోట్లు 

‘క్యూర్‌’ లో చదరపు గజం కనిష్టంగా రూ.3 వేలు, చదరపు అడుగు రూ.2 వేలు 

మున్సిపాలిటీల్లో చదరపు గజంకనిష్టంగా రూ.1,500,చదరపు అడుగు రూ.1,000 

ప్రజలకు ఇబ్బంది లేకుండా వాస్తవ మార్కెట్‌ ధరల ఆధారంగా విలువలు నిర్ధారించాం: మంత్రి పొంగులేటి 
 

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు రాష్ట్రంలోని భూముల విలువల సవరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 5వ తేదీ నుంచి సవరించిన రిజిస్ట్రేషన్  విలువలు అమల్లోకి వస్తాయ ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ విలువల సవరణ కనిష్టంగా 15 శాతం, గరిష్టంగా 100 శాతం ఉంటుందని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో భూములు, ఆస్తులకున్న విలువల ఆధారంగా ప్రస్తుత బేసిక్‌ రిజిస్టర్‌ విలువలను సరిచూసుకొని కొత్త విలువలను ప్రతిపాదించారు. 

వ్యవసాయ భూమి కనీస ధర రూ.2.75 లక్షలు, గరిష్ట ధర రూ.30 కోట్లుగా నిర్ణయించినట్టు సమాచారం. ఎక్కడ ఎంత పెంచారనే వివరాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గురువారం అధికారికంగా వెల్లడించనుంది. విశ్వసనీయ సమా చారం ప్రకారం.. క్యూర్‌ పరిధిలో చదరపు అడుగు కనిష్ట ధర రూ.3 వేలు, చదరపు గజం రూ.2 వేలు, వ్యవసాయ భూమి రూ.15 లక్షలుగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. పాత హెచ్‌ఎండీఏ పరిధిలో చదరపు అడుగు రూ.2 వేలు, చదరపు గజం రూ.1,500, వ్యవసాయ భూమి 10 లక్షలుగా, మున్సిపాలిటీల్లో చదరపు గజం రూ.1,500, చదరపు అడుగు రూ.1,000, వ్యవసాయ భూమి విలువ కనిష్టంగా ఎకరానికి రూ.5 లక్షలుగా నిర్ణయించినట్టు సమాచారం. 

ఇక, రాష్ట్రమంతా కలిపి కనిష్టంగా వ్యవసాయ భూమి రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు. ఇక, గరిష్టంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడలో ఓ సర్వేనంబరులోని వ్యవసాయ భూమి ఎకరాకు  గతంలో రూ. 24 కోట్లు ఉండగా, గరిష్టంగా దానిని రూ.30 కోట్లకు పెంచినట్టు సమాచారం. అయితే ఈ ప్రాంతంలోనే భూమి గరిష్ట విలువ 32 కోట్లు ఉన్నా, దానిని పెంచలేదని సమాచారం. విలువల సవరణపై రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ 15–100 శాతం విలువలను పెంచామని, కొన్నిచోట్ల అసలు పెంచలేదని, రేడియల్‌ రోడ్లు, ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల 100 శాతం పెంచగా, ఎక్కువ ప్రాంతాల్లో 15–75 శాతానికి పెంచుతున్నట్టు వెల్లడించారు. 

కాగా, రిజిస్ట్రేషన్‌ ఫీజులో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ఈ విలువల సవరణ ద్వారా ఏడాదికి రూ.1,500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి కొత్త విలువలు అమల్లోకి రానున్న నేపథ్యంలో గురువారం ఒక్క రోజే పాత విలువలు అమల్లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉద యం 9:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటలవరకు పనిచేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు రిజిస్ట్రేషన్  శాఖ అధికారులను ఆదేశించారు.

రేవంత్‌ ఆలోచన.. అరవింద్‌ నివేదిక ఆధారంగా
రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 5వ తేదీ నుంచి భూముల విలువలను సవరిస్తున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన, ఆర్థికనిపుణుడు అరవింద్‌ సుబ్రమణియం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడంతోపాటు విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నా మని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

‘బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం సమగ్ర కసరత్తు లేకుండానే అశాస్త్రీయ పద్ధతుల్లో 2021–22 సంవత్సరంలో కేవలం 6 నెలల వ్యవధిలోనే రెండుసార్లు భూముల విలువలను పెంచింది. ఈ భారీ అంతరం కారణంగా భూలావా దేవీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకే 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో విలువల సవరణ చేపట్టాం. ఈ నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి, భూలావాదేవీల్లో పారదర్శ కతతో పాటు ప్రభుత్వ వృద్ధికి దోహదపడనుంది’అని ఆ ప్రకటనలో పొంగులేటి వెల్లడించారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
Land Value
ponguleti srinivasa reddy
Registration Department
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.