Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఇసుక దోపిడీ సహించం: సీఎం రేవంత్‌
ADVERTISEMENT 

ఇసుక దోపిడీ సహించం: సీఎం రేవంత్‌

Telangana Sakshi User Sakshi Sakshi Time May 28, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
revanth.jpg

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్‌ ద్వారా ఉచితంగా సరఫరా చేయాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం 

ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి.. కలెక్టర్లు మరింత ప్రో యాక్టివ్‌గా ఉండాలి 

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు వివరించాలి..

దుష్ప్రచారం తిప్పికొట్టాలి.. 

రుతుపవనాలు ముందే వచ్చాయి..

సాగు ఏర్పాట్లు పర్యవేక్షించండి 

కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రులు రేపు,ఎల్లుండి క్షేత్రస్థాయికి వెళ్లాలి 

భూ భారతిపై 3 నుంచి సదస్సులు

రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. మరింత ప్రో యాక్టివ్‌గా (చురుగ్గా) ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ జరగకుండా చూడాలి. లబ్ధిదారులకు టోకెన్‌ జారీ చేసి ఉచితంగా సరఫరా చేయాలి. ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న సంఘటనలు కూడా విస్తృత ప్రచారంలోకి వస్తున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లనే అని దుష్ప్రచారం జరుగుతోంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. 

కొన్ని రాజకీయ ప్రేరేపిత సంఘటనలూ జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎంవో నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయ శాఖ తదితర అంశాలపై.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ కె.రామకృష్ణారావులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

పరిహారం ప్రతిపాదనలు పంపండి 
‘పౌరసరఫరాల శాఖ గతసారి కంటే దాదాపు 22 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ) అధికంగా ధాన్యాన్ని, అదీ తక్కువ సమయంలోనే కొనుగోలు చేయడం అభినందనీయం. 10.50 లక్షల మంది రైతుల దగ్గర్నుంచి 64 ఎల్‌ఎంటీలకు పైగా ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేశాం. 

ఇప్పటివరకు రూ.12,184 కోట్లు చెల్లించాం. 90 శాతానికి పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి రుతుపవనాలు ముందే రావడంతో కల్లాల వద్ద ధాన్యం తడిసిపోయి కొంతమంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపాలి.  

రైస్‌ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి 
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు బలంగా జరుగుతున్నాయి. వీటిని తిప్పికోట్టాలి. జిల్లాల్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంది. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్లు వెల్లడించాలి. రైస్‌ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి. రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

జూన్‌ 1 నాటికి నివేదిక ఇవ్వాలి 
‘వర్షాలు ముందే వచ్చినందున వ్యవసాయ శాఖ ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉంచాలి. విత్తనాల, ఎరువులు అక్రమ నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రులు ఈ నెల 29, 30 తేదీలలో క్షేత్రస్థాయిలో వానాకాలం సాగు ఏర్పాట్లు పర్యవేక్షించాలి. నకిలీ విత్తనాలు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై నివేదిక తయారు చేసి జూన్‌ 1 నాటికి సమర్పిచాలి. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి..’ అని రేవంత్‌ ఆదేశించారు 

పేదలకు చుట్టంలా భూ భారతి చట్టం 
‘గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ ప్రజలను భూతంలా పీడిస్తే, భూ భారతి చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుంది. భూ భారతి చట్టం కోసం తొలుత 4 మండలాలనే పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నాం. తర్వాత ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్‌గా ఎంపిక చేసుకుని రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించాలి. 

పైలట్‌ మండలాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. జూన్‌ 3 నుంచి జూన్‌ 20 వరకు భూ భారతి సదస్సులు అన్ని మండలాల్లో నిర్వహించాలి. ఈ సదస్సుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. 
 
ధరల నియంత్రణ కమిటీలు నియమించండి 
‘ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో ప్రభుత్వ పనితీరు ఏంటో తెలుస్తుంది. కలెక్టర్లు ఈ కీలకమైన పథకం అమలు పర్యవేక్షించాలి. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను నియమించాలి. మేస్త్రీ చార్జీలు, నిర్మాణ పరికరాల ధరలపై నియంత్రణ ఉండాలి. 

అడ్డుగోలు ధరలతో పేదలను మోసం చేయకుండా జాగ్రత్త వహించాలి. మహిళా సంఘాలు, రాజీవ్‌ యువ వికాసం ద్వారా ఇటుక, సెంట్రింగ్‌ యూనిట్ల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తక్కువ ధరతో నాణ్యమైన ఇళ్లు నిర్మించేందుకు సాంకేతికంగా అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. వీటిని లబ్ధిదారులకు తెలియజేయాలి. మండల కేంద్రాల్లో నిర్మించిన మోడల్‌ ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు పరిశీలించేలా కార్యక్రమాలు రూపొందించాలి..’ అని రేవంత్‌ చెప్పారు.  

సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త 
‘ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. ముందుగా వచ్చే వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు ప్రబలే ప్రమాదముంది. వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. 

అన్ని జిల్లాల్లోనూ సీజన్‌కు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పారు. ముందస్తు సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.    

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Revanth Reddy
Sand Mining
Farmers
Indiramma house
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.