Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నెత్తురోడిన బస్తర్‌.. ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టుల మృతి
ADVERTISEMENT 

నెత్తురోడిన బస్తర్‌.. ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టుల మృతి

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 17, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ENCOUNTER-SPOT.jpg

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 29 మంది మావోయిస్టుల మృతి

ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం..  

బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్, ఎస్పీ కళ్యాణ్‌ ఎలిసెల్లి వెల్లడి  

బస్తర్‌ అడవుల్లోని కాంకేరు జిల్లా ఛోట్‌ బెటియా ప్రాంతంలో ఘటన 

మావోస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్‌ 

చేపట్టిన భద్రతా దళాలు..  మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఎదురుకాల్పులు 

మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్‌ శంకర్‌రావు.. ఈయన తలపై రూ. 25 లక్షల రివార్డు 

ఇద్దరు తెలంగాణ వాసులు కూడా గుర్తింపు 

రాష్ట్రానికి చెందిన మరికొందరు కూడా మరణించి ఉంటారనే అనుమానాలు.. ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు 

ఘటనా స్థలంలో ఏడు ఏకే–47లు, మూడు ఎల్‌ఎంజీలు, ఇతర ఆయుధాలు స్వాదీనం  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



బీఎస్‌ఎఫ్, డీఆర్‌జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్, ఎస్పీ కళ్యాణ్‌ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ, ఆర్‌కేబీ డివిజన్‌ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్‌ విజయ్, అలియాస్‌ శంకర్‌రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.



ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ స్టేట్‌ మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జి రాంధర్‌ అలియాస్‌ మజ్జిదేవ్‌ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్‌ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 



మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. 

బస్తర్‌ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్‌ బెటియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బినాగుండ, కరోనార్‌ మధ్య హపటోలా, (ఛోట్‌ బెటియా పోలీస్‌ స్టేషన్‌కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్‌ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్‌ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.



ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్‌కౌంటర్‌ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్‌ మిషన్‌ గన్స్, రెండు ఇన్సాస్‌ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు.  



మృతుల్లో మజ్జిదేవ్‌ భార్య లలిత! 

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్‌ అలియాస్‌ శంకర్, ఆయన భార్య అదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూరుకు చెందిన ఆశశ్వర్‌ సుమన అలియాస్‌ రజిత మరణించినట్లు తెలుస్తోంది.



సిరిపల్లె సుధాకర్‌ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్‌ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ స్టేట్‌ మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జి రాంధర్‌ అలియాస్‌ మజ్జిదేవ్‌ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్‌ రాజు సలామ్‌ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంగా చెబుతున్నారు.  



మజ్జిదేవ్‌ కూడా ఉన్నారా? 

ఈ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్‌ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్‌ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్‌ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.



ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ జరుగుతోందని తెలిపాయి. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి.  



నెలరోజుల్లో 79 మంది 

లోక్‌సభ ఎన్నికల ముంగిట బస్తర్‌ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్‌ జరగనుంది. 



తెలంగాణ పోలీసుల అలర్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Encounter
Maoist encounter
chhattisgarh
Parliament elections
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చత్తీస్‌గఢ్‌లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

చత్తీస్‌గఢ్‌లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

కొండను ఢీకొట్టిన ప్రైవేట్‌ జెట్‌

కొండను ఢీకొట్టిన ప్రైవేట్‌ జెట్‌

నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌

నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో బస్సుబోల్తా.. ఆరుగురి మృతి

ఛత్తీస్‌గఢ్‌లో బస్సుబోల్తా.. ఆరుగురి మృతి

దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

ఐదు లక్షల రివార్డు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఐదు లక్షల రివార్డు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.