Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. సీఎం జగన్‌ తలుచుకుంటే.. అది పెద్ద కష్టమేమీ కాదు..
ADVERTISEMENT

సీఎం జగన్‌ తలుచుకుంటే.. అది పెద్ద కష్టమేమీ కాదు..

Politics Sakshi User Sakshi Sakshi Time Mar 24, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tdp-And-Yellow-Media.jpg01.jpg

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఆరు సీట్లను గెలుచుకున్న అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కోల్పోవడం సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. ఇందులో  తప్పెవరిది, ఒప్పు ఎవరిది అన్న మీమాంస ఉంటుంది. కాని ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మాత్రం రాజకీయాలలో ఫెయిర్‌గా ఉండాలన్న తన ఆలోచనను వీడలేదని, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాలన్న ఉద్దేశానికి రాలేదని అర్ధం అవుతుంది.

శరభ.. శరభ.. పూనకం పూనినట్లు..

ఈ విషయంలో ఆయన నిజాయితీని మెచ్చుకోవలసిందే. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో శరభ.. శరభ.. పూనకం పూనినట్లు ఒక ఎమ్మెల్సీ సీటు టీడీపీకి వచ్చిందంటూ  పేజీలకొద్ది వార్తలు, వ్యాఖ్యలను  ప్రచారం చేశాయి. ఇదేదో మంచి అవకాశంగా ఆ మీడియా సంస్థలు భావించి ఉండవచ్చు. కాని వారు తెలిసిరాశారో, తెలియక రాశారో కాని జగన్ ఎంత నిబద్దతతో ఉంటారో తెలియచెప్పేలా కొన్ని కథనాలు వాటిలో ఉన్నాయి. జగన్‌కు షాక్ అంటూ రాస్తున్న ఉత్సాహంలో కొన్ని వాస్తవాలు బయటపెట్టారు.

ఉదాహరణకు ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం చూడండి. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు ఓపెన్ గానే పార్టీతో కొంత కాలం క్రితం విభేదించారు. వారు ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేస్తామని చెప్పారు. కాగా రహస్యంగా ఉన్న మరో ఎమ్మెల్యే గురించి ఈనాడులో ఏమి రాశారంటే...'నెల్లూరు జిల్లాకే చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వడం లేదని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఆయన అడిగిన పనులు కూడా చేయలేదు...అంటూ ఆ వార్తలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులొకరికి మార్కెట్ చైర్మన్ పదవి కూడా అడిగినా ఇవ్వలేదని తెలిపారు. మరో పేరాలో ఇలా రాశారు...'రాజకీయంగా చైతన్యవంతమైన కోస్తాజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కి సైతం రానున్న ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వడం సాధ్యం కాదని ఇటీవల పార్టీ అగ్రనేతలు తేల్చి చెప్పారు. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా కలిసి సి.ఎమ్. జగన్‌తో గురువారం భేటీ అయ్యారు. అప్పుడు కూడా టిక్కెట్ ఇవ్వలేనని పునరుద్ఘాటించినట్లు సమాచారం..." అని తెలిపారు.

ఈ విషయాలు చూస్తే ఏమనిపిస్తుంది..

ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాంటి వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే అవకాశం ఉందని తెలిసినా, జగన్ మాత్రం నిజాయితీగా తన అభిప్రాయం చెప్పడం ఎంత ధైర్యంతో కూడిన పని అని తెలియడం లేదా!ఒక వేళ టిక్కెట్లు ఇస్తామనో, లేక మరేదో చేస్తామని మాట ఇచ్చి, ఆ తర్వాత మాట తప్పితే వచ్చే అప్రతిష్టను భరించడానికి ఆయన సిద్దంగా లేరన్నమాట. మరో పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూడండి..'ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు నిశ్శబ్దంగా గెలుపు కొట్టేశారు. తనకు చాలినంత బలం లేకపోయినా పోటీ పెట్టి, అధికార పార్టీ శిబిరాన్ని చీల్చి మరీ తమ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధను గెలిపించుకున్నారు.." అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి?

చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహ రచన చేసి వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి గెలిపించుకున్నారనే కదా! అలా ప్రలోభపెట్టడాన్ని ఈ పత్రిక సమర్దిస్తున్న తీరు పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలలో కొందరు మీడియా యజమానులు  కూడా భాగస్వాములవుతుండడమే కావచ్చు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకసారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వంపై ఏవో ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియా తో మాట్లాడుతూ మాటవరసకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు..అని వ్యాఖ్యానించారు.

ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తు చేసుకోండి.

అంతే.. ఇవే మీడియా సంస్థలు ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తు చేసుకోండి.. ఇంకేముంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి జగన్ స్కెచ్ వేశారని వీరు ఆరోపించారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ నాయకత్వం కొనుగోలు చేసింది. దానిని తప్పు అని ఈ మీడియా ఖండించలేదు. అలాగే ఇప్పుడు కూడా టీడీపీ వారు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం తప్పు అని అనడం లేదు.అది చంద్రబాబు చాతుర్యంగా ప్రచారం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నిశ్శబ్దంగా కొట్టేశారు ! అని శీర్షికలు కూడా పెట్టారు. తెలుగుదేశం పార్టీకి చాలా కాలం క్రితం నలుగురు ఎమ్మెల్యేలు దూరం అయ్యారు.

అదేదో ముందుగానే గ్రహించి ఉంటే..

జగన్ తలచుకుని ఉంటే ఇంకొంతమందిని టీడీపీకి దూరం చేయడం పెద్ద కష్టం కాదు. అయినా ఆయన ఆ పని చేయలేదు. గతంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం నేతలు ఎలా పట్టుబడ్డారో అందరికి తెలుసు. అయినా మళ్లీ అదే పనికి టీడీపీ పూనుకోవడం రాజకీయ చాతుర్యంగా చెప్పుకోవడం సిగ్గుచేటైన వ్యవహారమా?.కాదా అన్నది ఆలోచించుకోవాలి. టీడీపీ మీడియా కథనాల ఆధారంగా విశ్లేషిస్తే ఏమి కనిపిస్తుంది.వైఎస్సార్‌ కాంగ్రెస్ అభ్యర్ధి ఒకరు ఓడిపోయే అవకాశం ఉందని తెలిసినా, జగన్  తన విధానంలో రాజీపడలేదనే కదా! అయితే అదేదో ముందుగానే గ్రహించి ఉంటే ఈ కాస్త అసౌకర్యం కూడా ఏర్పడేది కాదేమో!

ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటంటే?

ఆరు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ గెలిచినా, ఒక్క సీటును గెలుచుకున్న టీడీపీ మాత్రం మొత్తం మండలినే గెలుచుకున్నంత సంబరం చేసుకుంది. నిజానికి మండలిలో ఒక సీటు గెలవడం, ఒక సీటు ఓడడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అవి దాదాపు అన్ని పరోక్ష ఎన్నికల ప్రాతిపదిక ద్వారానే భర్తీ అవుతుంటాయి. ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటంటే 2019 శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిటిలో వైఎస్సార్‌ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అలాగే బద్వేలు, ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలలోను, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలోను వైసీపీ భారీ ఆధిక్యతతో గెలిచింది. ఇవన్ని ప్రత్యక్ష ఎన్నికలు. అదే టైమ్‌లో పరోక్షంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధికం వైసీపీ గెలిచినా, నాలుగింటిని మాత్రం టీడీపీ సాధించుకుంటే, మొత్తం మారిపోయిందని చెప్పడమే విడ్డూరం.



-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
yellow media
mla quota mlcs
MLC election
Chandrababu Naidu
TDP
kommineni Srinivasa Rao
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.