ఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ(76) చాలా కాలం తర్వాత హుషారుగా కనిపించారు. హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి భోజనం చేసిన ఆమె.. ఆపై సరదాగా గడిపి చిందులేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.
తాజాగా రాహుల్ గాంధీ హర్యానా సోనిపాట్లో పర్యటించి.. అక్కడి రైతులతో కలిసి జన్కీ బాత్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన ట్రాక్టర్ నడిపి.. నాట్లు సైతం వేశారు. ఈ క్రమంలో అక్కడి కొందరు మహిళా రైతులు.. ఢిల్లీలోని రాహుల్ ఇంటిని చూడాలని ఉందని కోరారట. దీంతో.. వాళ్లను ఆదివారం ఇంటికి భోజనానికి ఆహ్వానించింది సోనియా కుటుంబం.
కాంగ్రెస్ నేత రుచిరా చతుర్వేది తన ట్విటర్ హ్యాండిల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘ఎలా ఉన్నారంటూ?..’ వాళ్లను రాహుల్ పలకరించడం.. సోనియా, రాహుల్, ప్రియాంక.. ముగ్గురూ వాళ్లతో భోజనం చేయడం, ప్రియాంకను వాళ్లు హత్తుకోవడం, ఇద్దరు మహిళా రైతులు ఆమె చేతుల్ని పట్టుకుని నృత్యం చేయాలని ముందుకు తేవడం, ఆమె సంతోషంగా చిందులేయడం అందులో చూడొచ్చు. స్వచ్ఛమైన ఆనందం అంటూ ఆ వీడియోను రుచిర పోస్ట్ చేశారు.
Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see Delhi and his house. He told them that the Govt has taken away his house.
But just see what happened next.
This video is pure joy! ❤️ pic.twitter.com/1cqAeSW5xg— Ruchira Chaturvedi (@RuchiraC) July 16, 2023
Women farmers who met Raga a few days ago in sonepat Haryana were welcomed at 10 Janpath Delhi
They had lunch with Sonia Gandhi ji, @priyankagandhi & @RahulGandhiiFan
No one sat down all sat on the chairs & had food on the dining table and everyone had the same food pic.twitter.com/P8UHsA2LxP— Shamila Siddiqui (@rebelioushamila) July 16, 2023
धान की रोपाई, मंजी पर रोटी - किसान हैं भारत की ताकत 🇮🇳🚜
सोनीपत, हरियाणा में मेरी मुलाकात दो किसान भाइयों, संजय मलिक और तसबीर कुमार से हुई। वो बचपन के जिगरी दोस्त हैं, जो कई सालों से एक साथ किसानी कर रहे हैं।
उनके साथ मिल कर खेतों में हाथ बटाया, धान बोया, ट्रैक्टर चलाया, और… pic.twitter.com/tUP6TARrJm— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2023
ఇదిలా ఉంటే.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం దావాతో జైలుశిక్ష.. ఆపై లోక్సభ ఎంపీ సభ్యత్వం కోల్పోయారు రాహుల్ గాంధీ. దీంతో తన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే తాజాగా ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ నేత షీలా దీక్షిత్ పాత ఇంటికి రాహుల్ గాంధీ తన మకాం మార్చారు. తన శిక్షను రద్దు లేదా స్టే విధించాలని అభ్యర్థిస్తూ తాజాగా సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ కూడా వేశారు. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేకతను ప్రదర్శించే క్రమంలో.. బెంగళూరులో జరగబోయే విపక్షాల ఐక్యతా సమావేశానికి సోనియా గాంధీ సైతం హాజరు కానున్నారు.
ఇదీ చదవండి: కేజ్రీవాల్ను ఖుష్ చేసిన కాంగ్రెస్