Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే..
ADVERTISEMENT 

ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే..

Politics Sakshi User Sakshi Sakshi Time Jul 13, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
News-Of-Tdp-Joining-Nda-Has-Further-Damaged.jpg

తెలుగుదేశం పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చాయి.. ఎంతగా పాకులాడవలసి వస్తోంది? అయినా పరువు పోతోందే. తాజాగా ఎన్డీయేలోకి టీడీపీ అంటూ వచ్చిన వార్తలు ఆ పార్టీ  ప్రతిష్టను మరింతగా దెబ్బతీశాయి. ఈ నెల పందొమ్మిదిన ఢిల్లీలో జరగబోయే నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్(ఎన్.డి.ఎ) సమావేశానికి తెలుగుదేశం పార్టీని కూడా ఆ ఆహ్వానించారని మీడియాలో వార్తలు వచ్చాయి. నిజంగా జాతీయ మీడియా ఊహాగానం చేసిందా? లేక తెలుగుదేశం వారెవరైనా ఇచ్చిన లీక్ ఆధారంగా కథనాలు ఇచ్చారో కాని, మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పపోతున్నారన్నంతగా ప్రచారం జరిగింది.

తెలుగుదేశం మీడియా కూడా పోటీపడి ప్రచారం చేస్తూ, ఎన్డీయేలో చేరడమా? వద్దా అన్న దానిపై టీడీపీ ఆలోచన చేస్తోందని ముక్తాయింపు ఇచ్చారు. తీరా చూస్తే అసలు టీడీపీని ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించనే లేదట. స్వయంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో టీడీపీ కుడితిలో పడినట్లయింది. 2017లో ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉపసంహరించడమే కాకుండా ఎన్డీయేకి దూరం అయినట్లు ప్రకటించారు. అక్కడితో  ఆగలేదు. బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టి ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి హడావుడి చేశారు.

పశ్చిమ బెంగాల్ వెళ్లి ముఖ్యమంత్రి మమత బెనర్జీకి సంఘీభావం ప్రకటించి వచ్చారు. తదనంతరం కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. రాహుల్ గాంధీని తానే చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. తెలంగాణలో  కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పక్షాలతో కలిసి పోటీ చేసి దారుణ పరాజయాన్ని చవి చూశారు. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి  ఒంటరిగా పోటీ చేసి అధికారం కోల్పోయారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరికి మోదీ వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేశారు. మోదీ ఏపీకి వస్తే నల్ల బెలూన్లు ఎగురవేయించారు.

చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..!

మోదీ వల్ల దేశం నాశనం అవుతోందని అనేవారు. అమిత్ షా తిరుపతి వస్తే టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. కాని 2019లో ఓటమి తర్వాత చంద్రబాబు మళ్లీ ప్లేట్ ఫిరాయించారు. తన ఎంపీలను బీజేపీలోకి పంపించారు. మెల్లగా బీజేపీ పెద్దలను కాకా పట్టడం ఆరంభించారు. మోదీ గొప్ప నేత అని చెప్పసాగారు.  బీజేపీ వారు పట్టించుకోలేదు. అయినా పట్టు వదలకుండా, ఎలాగైతే అమిత్ షా అప్పాయింట్‌మెంట్ సంపాదించారు. ఈలోగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అవుతున్నాయని తనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియాలో పలుమార్లు ప్రచారం చేయించారు.

అమిత్ షాతో భేటీ అవడం మొత్తం మీద ఏదో జరుగుతోందేమోనన్న భావన కలిగింది. కాని ఆ భేటీ తర్వాత చంద్రబాబు నోరు విప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరచింది. అయినా టీడీపీ తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలపడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు వాస్తవ పరిస్థితిని గమనంలోకి తీసుకున్నారేమో తెలియదు కాని, ఏపీలో టీడీపీతో కలవడానికి భవిష్యత్తులో ఏమి చేస్తారో కాని, ప్రస్తుతానికి  సిద్దపడడం లేదు. అక్కడికి తెలంగాణలో ఉపయోగపడతామని కూడా కబురంపారు. కాని చంద్రబాబు ట్రాక్ రికార్డు చూసిన బీజేపీ ఆయనను నమ్మడం లేదు.

ఈ దశలో మళ్లీ ఎన్డీయే సమావేశానికి టీడీపీ, అకాలీదళ్, జెడిఎస్‌లను పిలిచారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ సోషల్ మీడియా ఎగిరి గంతేసినట్లుగా పోస్టులు పెట్టేసింది. తీరా చూస్తే అదంతా ఒట్టిదేనని తేలడంతో టీడీపీ ఉస్సూరుమంటూ కూర్చోవలసి వచ్చింది. ఒకపక్క ఆయా సర్వేలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభజనం ఏపీలో కొనసాగుతోందని వెల్లడవుతుండడంతో అనవసరంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఎందుకని బీజేపీ భావిస్తోంది. కాని బీజేపీలో చేరిన టీడీపీ నేతలు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అది ఎప్పటికైనా ఫలించకపోతుందా అన్న ఆశ వారిలోలేకపోలేదు.

ఈలోగా జరగవలసిన డామేజీ జరిగిపోయింది. ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్తలతో బీజేపీని వ్యతిరేకించే కొన్ని సామాజికవర్గాలలో టీడీపీపై నెగిటివ్ అభిప్రాయం మరింతగా పెరిగింది. విధం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లుగా అటు  బీజేపీతో పొత్తు కుదరలేదు.. ఇటు ఆ పార్టీతో పొత్తు కోసం పాకులాడుతోందన్న భావనతో పరువు పోయింది. ఒకవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఒంటరిగా పోటీచేస్తామని సవాలు విసురుతుంటే, తాము అలా చేయలేమని, ఒంటరిగా అయితే ఓడించలేమని చంద్రబాబు  అంగీకరిస్తున్నట్లయింది.

చదవండి: భయపెడుతున్నారా? భయపడుతున్నారా?

టీడీపీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న జనసేన కూడా ఈ నేపథ్యంలో ఇంకో రకంగా ఇబ్బంది పడుతోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా ముగిసిపోయిందని, భార్యతో విడాకులు తీసుకున్నారంటూ జరిగిన ప్రచారం ఆయనకు బాగా అప్రతిష్ట తెచ్చిపెట్టింది. దీనిపై జనసేన పరోక్షంగా ఖండన ఇస్తూ వారాహి రెండో దశ యాత్ర కోసం జరిగిన పూజలో పవన్ దంపతులు పాల్గొన్నారంటూ ఒక ట్వీట్ చేసింది.

కాని అది నకిలీ ఫోటో అంటూ కొన్ని యూ ట్యూబ్ చానళ్లు సోదాహరణంగా వివరించడంతో జనసేన మరింత గందరగోళంలో పడింది. దీనికి సంబంధించి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు జనసేన తెలిపి నష్ట నివారణ చర్యలకు తంటాలు పడుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కావాలని ఒకసారి, తాను సీఎం పదవికి అర్హుడను కానని మరోసారి ప్రకటించి పరువు తీసుకున్న పవన్‌కు వ్యక్తిగత విషయం కూడా కాస్త ఇబ్బంది కలిగించేదే. ఇలా టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా తమ గాలి తామే తీసేసుకుంటూ రాజకీయంగా తీవ్రంగానే నష్టపోతున్నాయి.





-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
kommineni Srinivasa Rao
TDP
NDA
damaged
Chandrababu Naidu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.