Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. లోకేష్ పాదయాత్రకు ఎందుకింత హైప్‌.. ‘ఈనాడు’ భయం అదేనా?
ADVERTISEMENT 

లోకేష్ పాదయాత్రకు ఎందుకింత హైప్‌.. ‘ఈనాడు’ భయం అదేనా?

Politics Sakshi User Sakshi Sakshi Time Jan 22, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ramoji-rao.jpg1_.jpg

తెలుగుదేశం మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పాదయాత్రకు విపరీతమైన హైప్ సృష్టించడానికి  టీడీపీకి మద్దతు ఇచ్చే ఈనాడు మీడియా చాలా కష్టపడుతోంది. సాధారణంగా పాదయాత్ర ఆరంభం అయిన తర్వాత వచ్చే స్పందనను బట్టి మీడియా తగురీతిలో కవరేజీ ఇస్తుంటుంది. లేదా పార్టీ పరంగా ఈ సందర్భంగా జరిగే యాక్టివిటిని కవర్ చేయవచ్చు. కాని ఈనాడు మీడియా తనకు, తాను ఒక  భారీ కథనం రాస్తూ లోకేష్  యువగళాన్ని నొక్కేస్తారా! అంటూ ప్రశ్నించింది.

నిజానికి ఏ నాయకుడికి అయినా పాదయాత్ర చేసుకునే హక్కు ఉంటుంది. దానిని ఎవరూ కాదనజాలరు. ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పదు. కాని అదే సమయంలో ఒక ప్రముఖుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంటుంది. ప్రతి చిన్న,పెద్ద విషయానికి ఏపీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే పనిలో ఉన్న ఈనాడు మీడియా దీనిని కూడా వివాదాస్పదం చేయాలని యత్నిస్తోంది. దీనివల్ల లోకేష్‌కు ఒక నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆయన పాదయాత్రకు ఆశించిన రెస్సాన్స్ రాదేమోనని భయపడి ఈనాడు ఇంతగా హైప్ ఇస్తోందేమోనన్న భావన కలగవచ్చు.

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి నిర్దిష్ట ప్రశ్నలు వేసి తగు వివరాలు కోరారు. వాటిలో వేటికైనా జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ విషయం తెలియచేయవచ్చు. లేదా మరికొంత సమయం కోరవచ్చు. ఇప్పటికే ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఒక ప్రకటన చేస్తూ గతంలో పాదయాత్రలకు పోలీసులు ఇన్ని వివరాలు కోరారా అని అడిగారు. దానికి పోలీసు ఉన్నతాధికారులు సమాధానం చెబుతారు ఇక్కడ విశేషం ఏమిటంటే కుప్పం నుంచి ఆరంభం అయ్యే పాదయాత్రకు పోలీసులు వివరాలు అడగడం, వాటిని స్థానిక నేతలు అందించడం జరిగింది. 22 వాహనాల శ్రేణి లోకేష్‌తో పాటు ఉంటుందని తెలిపారు.

అంతేకాక ఆ వాహనాలను నడిపే డ్రైవర్ల జాబితా కూడా అందచేశారట. ఈ విషయం కూడా ఈనాడులోనే వచ్చింది. మరి అలాంటప్పుడు యువగళాన్ని అణచివేస్తున్నది ఎక్కడ? టీడీపీ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ఆందోళన చెందలేదు. కాని ఈనాడు మాత్రం టీడీపీ నేతలు అనుకుంటున్నారనుకుంటూ తన సొంత పైత్యం అంతటిని జోడించి ఓ పెద్ద స్టోరీని వండి వార్చింది. ఎవరైనా నాయకుడికి ప్రచారం చేయదలిస్తే ఇది ఒక టెక్నీక్. ఆ నాయకుడికి విపరీతమైన స్పందన వచ్చేస్తోందని, దానిని అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తుంటారు.

ఈనాడు కూడా అలాగే తంటాలు పడినట్లు అనిపిస్తుంది. గతంలో విపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర అప్పుడు అనుమతులు అవసరం లేదని ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారని కోట్ చేశారు. ఆయన ఏమన్నారో కాని, అప్పట్లో మరో నేత బొత్స సత్యారాయణ ఆద్వర్యంలో ఒకటికి ,రెండుసార్లు డిజిపి ఆఫీస్ కు వెళ్లి అనుమతులు కోరిన విషయాన్ని మాత్రం ఈనాడు విస్మరిస్తూ ప్రజలకు అర్ధ సత్యాలనే చేరవేస్తోంది.

కొద్ది కాలం క్రితమే కందుకూరులో పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది, గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ సందర్భంలో మరో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జిఓ 1 తెస్తే ప్రభుత్వం ప్రతిపక్షాల ర్యాలీలను అడ్డుకోవడానికే ఈ ఉత్తర్వు అని ఈనాడు ప్రచారం చేసింది. అంతే తప్ప పదకుండు మంది చనిపోవడంపై ఏ మాత్రం బాధపడినట్లు కనిపించలేదు.

ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో ఇలాంటివి ఏవైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి?. పోలీసులు ఎక్కువ మందిని భద్రత కోసం నియమిస్తే, ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడానికే ఇలా చేశారని విమర్శిస్తున్నారు. కాస్త తక్కువ మందిని పెడితే భద్రతను విస్మరించారని రాస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మాదిరే డబుల్ టాక్ చేస్తున్న టీడీపీ మీడియాను ఎదుర్కోవడమే పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు వైసీపీ భయపడిపోతోందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వారికంటే ఎక్కువగా ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు భుజాన వేసుకుని అదే పనిలో ఉన్నాయి.

నిజానికి ఎవరి పాదయాత్రకు అయినా భయపడవలసిన పని లేదు.  ఇంతవరకు లోకేష్ తన ఎజెండా ఏమిటో చెప్పలేదు. కాని ఈనాడు మాత్రం వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నట్లు రాస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల గురించి వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అరాచకపాలన అని, శాంతి భద్రతలు లోపించాయని, ఉన్నవి, లేనివి కలిపి అబద్దాలను సృష్టించే యత్నంలో ఉన్నారు. లోకేష్ ఇలాంటి మీడియాను నమ్మి యాత్రలు చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్న సంగతి తర్వాతకాలంలో కాని తెలియదు. ప్రస్తుతం ఆయన ప్రచారార్భాటం కోరుకుంటారు కనుక అంతా పచ్చగానే కనిపిస్తుంది.

లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించడం ద్వారా అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం అయి ఉండవచ్చు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఏడుసార్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో గత స్థానిక ఎన్నికలలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు ఓకే అంటే  భవిష్యత్తులో ఆయన కూడా ఇక్కడ నుంచి పోటీచేస్తారేమో తెలియదు. ఏది ఏమైనా లోకేష్ పాదయాత్రలో ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేయడానికి టీడీపీ మీడియా విశ్వయత్నం చేస్తుంది. తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నదే వారి లక్ష్యం అని వేరే చెప్పనవసరం లేదు. కనుక తస్మాత్ జాగ్రత్త!

-హితైషి 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ramoji Rao
TDP
Nara Lokesh Babu
Chandrababu Naidu
yellow media
pada yatra
special story
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.