పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మరో ఘనత సాధించారు. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనను లండన్లోని ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’గుర్తించింది. ఈ విషయాన్ని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా పంచుకున్నారు. ‘పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నితీ‹ష్ కుమార్ సాధించిన మైలురాయిని లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించిది.
ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా, గర్వంగా ఉంది. దేశ ప్రజాస్వామ్యంలో ఇదో అరుదైన ఘనత’అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో అభివర్ణించారు. ఆయన అచంచల ప్రజాసేవ, స్థిరమైన పాలన, బిహార్ ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసానానికి ఇది ప్రతిబింబమని ఝా కొనియాడారు.
ADVERTISEMENT
ADVERTISEMENT