Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు
ADVERTISEMENT

Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు

National Sakshi User Sakshi Sakshi Time Apr 26, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
250420241115-PHOTO-GALLERY.jpg

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక పోరులో రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో నేడు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ నిర్వహించనున్నారు. 16 లక్షలకుపైగా సిబ్బందితో పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వాస్తవానికి 89 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణంతో అక్కడ ఓటింగ్‌ను మే 7వ తేదీకి వాయిదావేశారు. ఈరోజు కేరళలోని అన్ని 20 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ నిర్వహించనున్నారు.
 

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి 56 చోట్ల, యూపీఏ కూటమి 24 చోట్ల విజయం సాధించాయి. ఇప్పటికే తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఏప్రిల్‌ 19వ తేదీన జరిగిన ఓటింగ్‌లో 65.5 శాతం పోలింగ్‌ నమోదైన విషయం విదితమే. నేతల మాటల మంటలు ఎన్నికల వేడిని మరింత రాజేసిన నేపథ్యంలో ఎండవేడిమిని సైతం తట్టుకుని ఈదఫా ఓటర్లు ఏ మేరకు పోలింగ్‌శాతాన్ని పెంచేస్తారో నేటితో తేలిపోనుంది. ఎండవేడి కారణంగా బిహార్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయాన్ని        పెంచారు.  

బరిలో కేంద్ర మంత్రులు
రెండోదశ పోలింగ్‌ ఉన్న స్థానాల్లో కేరళలోని వయనాడ్‌ స్థానంలో రాహుల్‌ గాం«దీ, సీపీఐ నాయకురాలు అన్నీ రాజా, బీజేపీ నుంచి కె. సురేంద్రన్‌ బరిలో నిలిచారు. తిరువనంతపురంలో నాలుగోసారి గెలవాలని శశిథరూర్‌ ఆశపడుతుండగా ఆయనను నిలువరించేందుకు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ రంగంలో దిగారు. కర్ణాటకలోని బెంగళూరు సౌత్‌లో బీజేపీ నేత తేజస్వీ సూర్య, కాంగ్రెస్‌ నాయకురాలు సౌమ్యా రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి హేమామాలిని, అరుణ్‌ గోవిల్‌ పోటీచేస్తున్నారు.
 
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ జో«ద్‌పూర్‌ నుంచి మూడోసారి గెలవాలని ఉవి్వళ్లూరుతున్నారు. ఓం బిర్లా, డీకే సురేశ్‌(కాంగ్రెస్‌), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(జేడీఎస్‌), ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌(రాజ్‌నంద్‌గావ్‌), సు కాంత మజూందర్‌(బీజేపీ), రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్, వైభవ్‌ గెహ్లాట్, వి.సోమన్న, మన్సూర్‌ అలీ ఖాన్, కైలాశ్‌ చౌదరి సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేరళలో 20 సీట్లకుగాను ఓడిపోయిన ఏకైక అలప్పుజ సీటును ఈసారి ఎలాగైనా గెలవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ కూటమి బరిలో నిలిపింది.  

కేరళలో బీజేపీ బోణీ కొట్టేనా?
కేరళలో ఎలాగైనా బోణీ కొట్టేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. అందుకే తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాక కొత్తగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఓబీసీలకు కేటాయించిన కోటాలోనే ముస్లింలకు రిజర్వేషన్లు కలి్పస్తూ వారిపై కాంగ్రెస్‌ అతి ప్రేమ చూపిస్తోందంటూ మోదీ చేస్తున్న తీవ్ర విమర్శలు కేరళలో పాగా వేసేందుకు పనికొస్తాయా అనే చర్చ సర్వత్రా నెలకొంది. ముస్లింలను చొరబాటుదారులంటూ, హిందూ మహిళల మంగళసూత్రాలు, బంగారం లాగేసుకుని ముస్లింలకు పంచనుందన్న మోదీ ప్రసంగాలు ఏ మేరకు ముస్లిమేతర ఓట్లను బీజేపీ తనవైపునకు తిప్పుకోనుందో చూడాలి.
 

రాష్ట్రం               సీట్లు
కేరళ                 20
కర్ణాటక             14
రాజస్థాన్‌           13
మహారాష్ట్ర           8
ఉత్తరప్రదేశ్‌          8
మధ్యప్రదేశ్‌         6
అస్సాం              5
బిహార్‌               5
ఛత్తీస్‌గఢ్‌           3
పశి్చమబెంగాల్‌   3
మణిపూర్‌          1
త్రిపుర               1
జమ్మూకశీ్మర్‌   1
 

రెండో విడత              88 స్థానాలు
జనరల్‌                        73
ఎస్టీ                              6
ఎస్సీ                            9
మొత్తం అభ్యర్థులు    1,202
పురుషులు             1,098
మహిళలు                 102
థర్డ్‌ జెండర్‌                    2
మొత్తం ఓటర్లు      15.88 కోట్లు
పురుషులు          8.08 కోట్లు
మహిళా ఓటర్లు       7.8 కోట్లు
థర్డ్‌ జెండర్‌               5,929
తొలిసారి ఓటర్లు        34.8 లక్షలు
పోలింగ్‌ స్టేషన్లు    1.67 లక్షలు

Tags:
General Elections 2024
Second phase elections
Election Commission of India
NDA
UPA
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

పొలిటికల్‌ హైడ్రామా.. హోటల్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్‌డౌన్!

పొలిటికల్‌ హైడ్రామా.. హోటల్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్‌డౌన్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.