Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. సందేహాలు తీరకుండా చర్యలెలా?
ADVERTISEMENT 

సందేహాలు తీరకుండా చర్యలెలా?

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Jan 12, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CO2.jpg

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చేపట్టే చర్యలకు కొన్ని వైరుద్ధ్యాలు అడ్డుపడుతున్నాయి. ఉష్ణోగ్రతలను తక్కువ పెరిగేలా చూడాలంటే, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. కానీ పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆధారపడే బొగ్గును తగ్గించే అంశానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాలుష్యానికి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత వాటిపైనే ఉండగా, ఆ దాతల జాబితాలోకి భారత్, చైనాలను కూడా చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. భారత్‌కే ప్రత్యేకమైనది చైనాతో వ్యవహారం. చైనా తనకు అనుకూలంగా జీ77+ చైనా గ్రూపులో ఉంటూ వాతావరణ చర్చల్లో పాల్గొంటోంది. ఉద్గారాల్లో యూరప్, అమెరికాను మించనున్నందున దాతల జాబితాలోకి చైనా చేరేలా భారత్‌ ఒత్తిడి తేవాలి.

వాతావరణం విషయంలో గత ఏడాది ఎన్నో వైపరీత్యాలను చూశాం. ఉత్తర భారతం అసాధారణ వడగాడ్పులతో అట్టుడికింది. పాకిస్తాన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు జనావాసాలను ముంచెత్తాయి. యూరప్, చైనా కరవును చవిచూశాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవ డంలో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచం ఇప్పటికే చాలా చర్యలు చేపట్టింది. అయినా సరే... గత ఏడాది మానవాళి ఐదు కీలకమైన వైరుద్ధ్యాలను ఎదుర్కొంది. వీటిని తొల గించుకోకుంటే, ప్రకృతి వైపరీత్యాలు ఈ ఏడాదీ మనల్ని పలకరించక మానవు!

వైరుద్ధ్యాల్లో మొట్టమొదటిది ‘శిలాజ ఇంధనాలు వర్సెస్‌ బొగ్గు’ అన్న అంశం నుంచి పుట్టుకొచ్చింది. వాతావరణ మార్పుల ప్రభా వాన్ని తగ్గించేందుకు భూమి సగటు ఉష్ణోగ్రతలను వీలైనంత తక్కువ పెరిగేలా చూడాల్సిన అవసరముంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు దీన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని అనుకుంటున్నాయి. ఈ అంశంపై ఇతర దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి శాస్త్రీయ మదింపు ప్రకారం, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఈజిప్టులో గత ఏడాది జరిగిన 27వ కాప్‌ సమావేశాల్లో పాశ్చాత్య దేశాలు బొగ్గు వాడకం తగ్గిద్దామనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. అభి వృద్ధి చెందిన దేశాల్లో అత్యధికం చమురు, సహజవాయువుల ప్రధాన ఎగుమతిదారులు లేదా ఎక్కువ మోతాదుల్లో వినియోగించేవారు కావడం ఇక్కడ ప్రస్తావనార్హం!

ఇక రెండో వైరుద్ధ్యం గురించి: కాప్‌–27 సమావేశాల్లో ఇది వ్యక్తమైంది. ఆర్థికాంశాలపై చర్చలో ‘లాస్‌ అండ్‌ డ్యామేజీ’ అంశంలో ఈ వైరుద్ధ్యం ఏమిటన్నది తెలిసింది. వాతావరణ కాలుష్యానికీ, భారీ కర్బన ఉద్గారాలకూ అభివృద్ధి చెందిన దేశాల బాధ్యతే ఎక్కువ. కాబట్టి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా వాటిపైనే ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు ఇతర దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఆర్థిక వనరులను సమ కూర్చాల్సి ఉంది కూడా.

ఇందుకోసం ఏటా సుమారు వెయ్యి కోట్ల డాలర్ల అవసరముండగా... ఇప్పటికి సమకూర్చింది పిసరంతే. ఎందు కిలా అన్న ప్రశ్నకు అభివృద్ధి చెందిన దేశాలు విచిత్రమైన వాదన చేస్తున్నాయి. దాతల జాబితాలోకి భారీ ఆర్థిక వ్యవస్థలున్న దేశాల (భారత్, చైనా అని)ను చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఈ కొత్త వాదన... ఇప్పటివరకూ నిర్ణయించిన విషయాలకు భిన్నం.

మూడో వైరుద్ధ్యం కాప్‌–27 తీర్మానం తుది ప్రతిలో ‘జస్ట్‌ ట్రాన్సిషన్‌’, ‘జస్ట్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ పార్ట్‌నర్‌షిప్‌’ (జేఈటీపీ) అన్న పదాలను చేర్చడంతో ఉత్పన్నమైంది. ఈ రెండు పదాలూ చూసేం దుకు ఒకేలా అనిపిస్తాయి. కానీ వీటి అర్థాలు చాలా భిన్నం. ‘జస్ట్‌ ట్రాన్సిషన్‌’ అనేది సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకానికి మళ్లేందుకు ఒక్కో దేశానికి కావాల్సిన అంశాలకు సంబంధించినది కాగా, జేఈటీపీ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో బొగ్గు వాడకాన్ని నిలిపివేసేందుకు జీ7 దేశాలు అమలు చేస్తున్న అజెండాకు సంబం ధించిన విషయం. భారత్‌ సహా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా బొగ్గుపై ఆధారపడ్డ దేశాలు. వీటిని జేఈటీపీలోకి చేర్చేందుకు జీ7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఏతావాతా... కాప్‌–27 తుది తీర్మానంలో జస్ట్‌ ట్రాన్సిషన్‌ అనే మాట చేరిక ఆహ్వానించదగ్గదైతే... జేఈటీపీ మాత్రం అనుమానించదగ్గది. 

నాలుగో వైరుద్ధ్యం విషయానికి వద్దాం. కార్బన్‌ మార్కెట్లపై జరిగిన చర్చల్లో ఇది బయటపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ కార్బన్‌ మార్కెట్లను (క్యోటో ప్రొటోకాల్‌లో భాగంగా ఏర్పాటైన క్లీన్‌ డెవలప్‌మెంట్‌ మెకనిజమ్స్‌; క్లుప్తంగా ‘సీడీఎం’) ఆర్థిక వనరు లను సమకూర్చుకునే సాధనంగా చూస్తూవచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాల దృక్పథం దీనికి పూర్తిగా భిన్నం. తక్కువ ఖర్చుతో కర్బన ఉద్గారాలను తొలగించుకునేందుకు సీడీఎంను వాడుకోవచ్చునని ఈ దేశాలు భావిస్తున్నాయి. క్యోటో ప్రొటోకాల్, ప్యారిస్‌ అగ్రిమెంట్ల రెండింటిలోనూ కార్బన్‌ మార్కెట్ల ప్రస్తావన ఉన్నప్పటికీ వాటి నేపథ్యాలు మాత్రం వేర్వేరు.

మొదటిదాని ప్రకారం దేశాలకు నిర్దిష్టమైన కర్బన ఉద్గార తగ్గింపు లక్ష్యాలు లేవు. ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం ‘నేషనల్లీ డిటర్మైండ్‌ కంట్రిబ్యూషన్స్‌’ (ఎన్‌డీసీ) ఉన్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఆయా దేశాలు చేసే ప్రయత్నాలే ఈ ‘ఎన్‌డీసీ’. భారతదేశం క్లైమేట్‌ ఫైనాన్స్‌ కోసం ఇతర దేశాలకు కార్బన్‌ క్రెడిట్స్‌ అమ్మితే, అవి ఉద్గారాల తగ్గింపు జాబితాలోకి చేరవు. దీనివల్ల మనం ఎన్‌డీసీలో వెనుకబడిపోతాం. కార్బన్‌ క్రెడిట్స్‌ అమ్ముకుని వాతావరణ మార్పులను తట్టుకునేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం... ఆయా దేశాలు కర్బన ఉద్గారాలపై ఇచ్చిన మాటను పూర్తి చేసిన తరువాతే సాధ్యమవుతుందన్నమాట. 

చిట్టచివరి... ఐదవ వైరుద్ధ్యం గురించి. ఇది భారతదేశం తనకుతాను సమాధానం ఇచ్చుకోవాల్సిన ప్రశ్న. వాతావరణానికి సంబంధించిన రాజకీయాల్లో చైనాతో ఎలా వ్యవహరించాలి? తన ఆర్థిక బలంతో రాజకీయాలు చేస్తున్న చైనా విదేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు వీటిల్లో ఒకటి మాత్రమే. ఫలితంగా కర్బన ఉద్గారాలు ఎన్నో రెట్లు ఎక్కువయ్యాయి. మన మంత్రులు ఈ విషయాలను ఇప్పటికే పలుమార్లు ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.

కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌(సీఈఈడబ్ల్యూ) అంచనా ప్రకారం చైనా గత, భవిష్యత్తు ఉద్గారాలు అమెరికా, యూరప్‌లను కూడా మించిపోతాయి (2060 నాటికి శూన్యస్థాయికి తేవాలన్న లక్ష్యంతో చైనా ఉంది). అంటే అమెరికా, యూరప్‌ల మాదిరిగానే చైనాను కూడా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేర్చాలన్నమాట. కానీ చైనా తనకు అనుకూలంగా ఉండేలా జీ77 + చైనా గ్రూపులో ఉంటూ వాతావరణ చర్చల్లో పాల్గొంటోంది. ఈ విషయంలో భారత్‌ ఒక స్పష్టత ఏర్పరచుకోవాలి. చైనా పాత్ర ఎలా ఉండాలో కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. 

ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాల అధ్యక్ష స్థానంలో ఉంది. దీని ఆసరాతోనైనా భారత్‌ ప్రపంచ వాతావరణ మార్పుల చర్చల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలపరచుకోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధిగానూ స్థిరపడాలి. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వాడకం మాత్రమే కాకుండా... అన్ని శిలాజ ఇంధనాలను దశలవారీగా తగ్గించేలా ప్రపంచాన్ని ఒప్పించాలి. శిలాజ ఇంధనాల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం వైపు మళ్లేందుకు కావాల్సిన అంశాల ఆధారంగా జేఈటీపీ ఉండేలా... జీ7 దేశాల పెత్తనం మాదిరిగా కాకుండా చూసుకోవాలి. చైనా అపరిమిత ఉద్గారాల విషయంలో భారత్‌ విస్పష్టంగా వ్యవహరించాలి. దాతల జాబితాలోకి చైనా కూడా చేరేలా ఒత్తిడి తేవాలి. కార్బన్‌ మార్కెట్లను అవకాశంగా తీసుకుని మరింత పర్యావరణ హితమైన టెక్నాలజీలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. 

ఇప్పటివరకూ ప్రస్తావించిన ఐదు వైరుద్ధ్యాలు పరిష్కార మవుతాయా? లేక అలాగే కొనసాగుతాయా? అన్నది ఇంకోదఫా వాతావరణ మార్పుల చర్చలు జరిగినప్పుడే తేలుతుంది. కాకపోతే ఈ ఐదు అంశాలు ప్రపంచం, మరీ ముఖ్యంగా భారతదేశం వాతావరణ మార్పుల విషయంలో ఈ ఏడాది ఎలా వ్యవహరించాలో నిర్దేశిస్తాయ నడంలో సందేహం లేదు.

వైభవ్‌ చతుర్వేది 

వ్యాసకర్త

ఫెలో, ‘కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ,

ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌’

(‘ద హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Guest Column
G-20 summit
India
china
USA
Carbon dioxide
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.