బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం రూ.770 పెరిగి రూ.1,47,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.
గురువారం (జులై 23) ఉదయం రూ.1,47,280 (తులం 24 క్యారెట్స్ గోల్డ్), రూ.1,35,000 (తులం 22 క్యారెట్స్ గోల్డ్) వద్ద బంగారం రేటు, సాయంత్రానికే రూ.1,46,180.. రూ.1,34,000 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1100, రూ.1000 తగ్గింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు ఎంత మారిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీలో కూడా బంగారం ధరలో గణనీయమైన మార్పు ఏర్పడింది. దీంతో ఉదయం, సాయంత్రం ధరలకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146330 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,34,150 వద్ద ఉంది. అయితే.. చెన్నైలో మాత్రం ఈ రోజు సాయంత్రానికి ధరల్లో మార్పు కనిపించలేదు.