Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Fact Check: షరతులతోనే జగన్‌ పాదయాత్ర
ADVERTISEMENT 

Fact Check: షరతులతోనే జగన్‌ పాదయాత్ర

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 26, 2023 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
YS_JAGAN_PADAYATRA_SCHEDULE.jpg

సాక్షి, అమరావతి: చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నది రాజ్యాంగం స్పష్టం చేస్తున్న అంశం. కానీ చట్టానికి తాము అతీతమన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహరిస్తోంది. అందుకు ‘ఈనాడు’, ఇతర ఎల్లో మీడియా  వత్తాసు పలుకుతూ వక్రీకరణలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయి. చంద్రబాబు, ఈనాడు రామోజీరావుకు మధ్య పరస్పర వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉండొచ్చు. అందుకోసం చంద్రబాబును అర్జంటుగా సీఎంను చేసేయాలని రామోజీరావు ఆరాటపడుతూ ఉండొచ్చు.



లోకేశ్‌కు లేని ప్రజాదరణను ఉన్నట్టుగా చూపించేందుకు నానా తంటాలు పడొచ్చు. కానీ చట్టానికి వాటితో ఏం పని? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలా కాకుండా చట్టం తమ చుట్టం అని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు భావిస్తూ రాజకీయ రాద్ధాంతం చేస్తుండటం విస్మయ పరుస్తోంది. అందుకే తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్‌ పాదయాత్రకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందంటూ కట్టుకథలతో కనికట్టు చేసేందుకు ఈనాడు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయానికి పాల్పడుతోంది.



లోకేశ్‌ పాదయాత్రకు నిబంధనల మేరకు పోలీసు శాఖ అనుమతిచ్చింది. అయినా సరే ‘యువ గళానికి ఆంక్షల సంకెళ్లు’ అంటూ ఈనాడు పత్రిక బుధవారం ఓ కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తాజా నిదర్శనం. పాదయాత్ర సజావుగా సాగేందుకు పోలీసులు చట్టంలో ఉన్న అతి సామాన్యమైన షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.



ఆ షరతులు ఇప్పటికిప్పుడు కొత్తగా పెట్టినవి కావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్న భారత పోలీసు చట్టంలో పేర్కొన్నవే అవి. 2009లో సుప్రీంకోర్టు తన తీర్పులో కూడా స్పష్టం చేసిన షరతులనే ప్రస్తుతం పోలీసులు తమ అనుమతి పత్రంలో పేర్కొన్నారు.



నాడు పోలీసులు నిర్దేశించిన, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షరతులు ఇలా..

► వైఎస్సార్‌సీపీ స్థానిక నేతలు పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను జిల్లా ఎస్పీలు/ నగర పోలీసు కమిషనర్లు, సంబంధిత ప్రాంతంలోని పోలీసు అధికారులకు ముందుగా తెలియజేయాలి.



► పాదయాత్రలోకానీ, పాదయాత్ర సందర్భంగా నిర్వహించే సభల్లో కానీ.. వచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీదే. అంటే పాదయాత్ర నిర్వాహకులదే. వలంటీర్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నియంత్రించే బాధ్యత తీసుకోవాలి. 



► పాదయాత్ర శాంతియుతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. 



► ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులకు నష్టం కలిగితే, అల్లర్లు చెలరేగితే ఆ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు ఆ పాదయాత్ర నిర్వాహకులు కూడా బాధ్యత వహించాలి. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే కార్యకర్తలపై కేసులు పెడతారు. కానీ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నిర్వా­హకులు తెరవెనుక ఉండిపోతారు. ఆ విధంగా కాకుండా వారిపై కూడా పోలీసులు తగిన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. పాద­యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామ­ని...­అందుకు విరుద్ధంగా ఏదైనా విధ్వంసం జరిగితే తాము బాధ్యత వహిస్తామని నిర్వా­హకులు ముందే లిఖిత పూర్వకంగా తెలియ­జేయాలి. 



► పాదయాత్ర కొనసాగే పరిధిలోని పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ అధికారి ప్రత్యేకంగా ప్రైవేట్‌ వీడియో­గ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని మరీ పాద­యాత్ర/సభను వీడియో తీయించాలి. ఏదైనా విధ్వంసం జరిగితే సంబంధిత వీడియో క్లిప్పింగులను ఆధారాలుగా పరిగణిస్తూ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలి. ఆ వీడియో సీడీనీ మెజిస్ట్రేట్‌ ఎదుట సమర్పించాలి. 



► పాదయాత్రలో ఏదైనా విధ్వంసం సంభవిస్తే నిర్వాహకులు వెంటనే పోలీసు అధికారులను కలవాలి. పాదయాత్ర శాంతియుతంగా నిర్వహించేందుకు గాను రూట్‌మ్యాప్‌లో మార్పులు చేయాలి.



► ఎటువంటి ఆయుధాలను పాదయాత్రలో అనుమతించరు.



► పాదయాత్రలో ఏదైనా విధ్వంసంగానీ, దుస్సంఘటనగానీ జరిగితే పోలీసులు తగిన వీడియో ఆధారాలతో ప్రభుత్వానికి నివేదించాలి. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నివేదికను రూపొందించాలి. అవసరమైతే వాటి­ని హైకోర్టుకుగానీ సుప్రీంకోర్టుకుగానీ సమర్పించాలి. ఎందుకంటే ఆ విధ్వంసం/ దుర్ఘటనపై సుమోటోగా హైకోర్టుగానీ సుప్రీంకోర్టుగానీ కేసు నమోదు చేయవచ్చు. అప్పుడు విచారణకు ప్రభుత్వం ఆ నివేదికను సమర్పించాలి. 



► పాదయాత్రలో ఏదైనా విధ్వంసంగానీ దుర్ఘటనగానీ సంభవిస్తే న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తాయి. బాధితులకు నిర్వాహకులతో నష్టపరిహారాన్ని ఇప్పిస్తాయి. అందుకోసం అవసరమైతే సిట్టింగ్‌/ రిటైర్డ్‌ న్యాయమూర్తితో క్‌లైమ్‌ కమిషన్‌ను న్యాయస్థానం ఏర్పాటు చేస్తుంది. 



► పాదయాత్ర సందర్భంగా ఏదైనా విధ్వంసంగానీ దుర్ఘటనగానీ సంభవిస్తే మీడియా (ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ మీడియా) బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛ కల్పించింది. కానీ సంచలనాలకు కాకుండా సంయమనానికి మీడియా అధిక ప్రాధాన్యమివ్వాలి. అందుకోసం మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి. మీడియాను నియంత్రించడం అని కాదు గానీ ప్రెస్‌ కౌన్సిల్‌ మీడియా బాధ్యతా­యుతంగా వ్యవహరించేలా పర్యవేక్షించాలి. 

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు అనుమతి కోరుతూ ఆయన పీఎస్‌ పి.కృష్ణమోహన్‌రెడ్డి 2017లో అప్పటి డీజీపీకి సమర్పించిన దరఖాస్తు  



ఇప్పుడెందుకీ రాద్ధాంతం?

భారత పోలీసు చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అవే షరతులతో ప్రస్తుతం పోలీసు శాఖ నారా లోకేశ్‌ పాదయాత్రకు అనుమతిచ్చింది. గతంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు విధించిన షరతులనే ప్రస్తుతం పేర్కొంది. కొత్తగా ఎలాంటి షరతూ విధించ లేదు. పోలీసులకు రూట్‌మ్యాప్‌ను ముందుగా తెలపాలి.. రూట్‌మ్యాప్‌కు కట్టుబడి పాదయాత్ర సాగాలి.. నిర్ణీత ప్రదేశాల్లోనే సభలు నిర్వహించాలి.. ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదు.. ఎవరూ మారణాయుధాలు కలిగి ఉండకూడదు.. ఇలా ఎప్పటి నుంచో దేశంలో అమలు­లో ఉన్న సాధారణ షరతులనే పోలీసులు విధించారు.



ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తాము ఆనాడు తలచుకుని ఉంటే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయగలిగేవారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండటం హాస్యాస్పదం. ఇటీవల చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటలతో 11 మంది దుర్మరణం చెందారు. అందుకే పాదయాత్ర నిర్వాహ­కు­లు అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని.. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని సూచించారు.



అందులో తప్పుబట్టడానికి ఏముంది? కేవలం నారా లోకేశ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన లభించడం లేదన్నదే చంద్రబాబు, ఈనాడు రామోజీ­రావు ఆందోళన. అందుకే పోలీసులు సాధారణ షరతులతో ఇచ్చిన అనుమతిని వక్రీకరిస్తూ ప్రభు­త్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. తద్వారా లోకేశ్‌ పాదయాత్ర పట్ల లేని హైప్‌ను సృష్టించేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడు­తు­న్నారని స్పష్టమవుతోందనిపరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

పోలీసుల షరతులు, సుప్రీంకోర్టు తీర్పులోని షరతులతో పాదయాత్రకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం 

షరతులకు కట్టుబడే.. చరిత్రాత్మక పాదయాత్ర

పోలీసు శాఖ విధించిన షరతులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తునే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర పూర్తి చేశారు. తన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను 2017 నవంబరు 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించి 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించి.. 2019 జనవరి 10న ఇచ్ఛాపురంలో ముగించారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగానే సంబంధిత పోలీసు అధికారులకు అందజేశారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రూట్‌మ్యాప్‌ రూపొందించారు.



సభలు నిర్వహించేందుకు తగినంత విశాలమైన ప్రదేశాలను నిర్వాహకులు ముందుగానే ఎంపిక చేసుకుని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆమోదించిన తర్వాతే ఆ ప్రదేశాల్లో సభలు నిర్వహించారు. ఎక్కడ కూడా ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో కాదని మరోచోట సభ నిర్వహించ లేదు. అంత పకడ్బందీగా రూట్‌మ్యాప్‌ అనుసరించారు. మైక్‌లను ఉపయోగించేందుకు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు.



పాదయాత్రలో, పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలు సక్రమంగా నిర్వహించేందుకు పార్టీ వలంటీర్లను ముందే నియమించారు. అందుకే అంతటి సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడా సాధారణ జనజీవనానికి ఇబ్బందులుగానీ ట్రాఫిక్‌ సమస్యలుగానీ తలెత్తనే లేదు.  ఎక్కడా తోపులాటలుగానీ తొక్కిసలాటలుగానీ సంభవించలేదు. ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం సజావుగా, సక్రమంగా సాగింది. 

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు విశాఖపట్నం పోలీసులు విధించిన షరతులు, మైక్‌ వినియోగానికి జారీ చేసిన అనుమతి పత్రం 

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు షరతులతోనే అనుమతి

67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017లో ‘ప్రజా సంకల్ప యాత్ర’పేరుతో చేపట్టిన పాదయాత్రకు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పోలీసు శాఖ షరతులతోనే అనుమతి మంజూరు చేసింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన పీఎస్‌ పి.కృష్ణమోహన్‌రెడ్డి డీజీపీకి దరఖాస్తు చేశారు.



వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కూడిన బృందం అప్పటి డీజీపీ సాంబశివ­రావును కలిసి పాదయాత్రకు అనుమతి కోరింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే డీజీపీ షరతులతో కూడిన అనుమతినిచ్చారు. పోలీసు­లు ఎన్నో షరతులు విధించడంతోపాటు సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన మార్గదర్శకాలు, షరతు­లను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పాదయాత్ర సాగే జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఆ షరతుల అమలును కచ్చితంగా పర్యవేక్షించాలని కూడా ఆయన ఆదేశించారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
YSRCP
YS Jagan Mohan Reddy
yellow media
Nara Lokesh Babu
Praja Sankalpa Yatra
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.