సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయానికి సోమవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. క్యాంప్ ఆఫీసుకు వచ్చిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, నారాయణస్వామి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ కుమార్ అప్పారావు, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఉన్నారు. తమ నియోజకవర్గంలోని సమస్యల గురించి నేతలు సంబంధిత అధికారులను కలిసినట్లు తెలుస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT