ప్రకాశం: ముండ్లమూరు (Mundlamuru)లో తాజాగా, మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. గత డిసెంబర్ నెల మూడు,నాలుగు వారాల్లో ఇదే ముండ్లమూరులో మూడుసార్లు భూకంపించింది. తాజాగా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 43 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో, రెండు నెలల (డిసెంబర్లో మూడు సార్లు,జనవరిలో ఒకసారి) వ్యవధిలో నాలుగు సార్లు భూకంపం సంభవించడంపై ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT