Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Fact Check: కట్టకుండానే  కట్టేసినట్లు కలరింగా!?
ADVERTISEMENT

Fact Check: కట్టకుండానే  కట్టేసినట్లు కలరింగా!?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 1, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
factcheck.jpg

సాక్షి, అమరావతి : అబద్ధాలు ఆడటంలో ఆరితేరిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు తర్వాతే ఎవరైనా. అవతలి వాళ్లు నవ్వుకుంటారన్న సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ.. నిత్యం వాటినే పారాయణ చేస్తూ తన స్థాయిని తనే బజారుకీడ్చుకుంటున్నారు. తాజాగా.. రాష్ట్రంలో విమానయాన రంగంపై ‘మాటలు మరిచారు.. రెక్కలు విరిచారు’ అంటూ ఎప్పటిలాగే తన సహజసిద్ధ శైలిలో తన విషపుత్రిక ఈనాడులో తన పాండిత్యాన్నంతటినీ రంగరించి రామోజీ విషం కుమ్మరించారు.



ఎందుకంటే.. రాష్ట్రంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తూ పలు నగరాలకు సర్వీసులు పెరుగుతుంటే కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ అసత్యాలతో రాష్ట్ర ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ఆపసోపాలు పడ్డారు. నిత్యం ఇలా అశుద్ధ కథనాలు రాస్తుండబట్టే పత్రిక సర్క్యులేషన్‌ రోజురోజుకీ దారుణంగా పడిపోతోంది. అయినాసరే.. తన బాబును పల్లకీ ఎక్కించేందుకు తన అసత్యాల యజ్ఞాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఈనాడును ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఎలుక తోలును ఎంత ఉతికినా.. ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టిన వాటి సహజ లక్షణం ఎలా కోల్పోవో రామోజీ శైలి కూడా అంతే. ఈనాడు తాజా కథనంలోని వాస్తవాలు ఏమిటంటే.. 



ఎలాంటి అనుమతులు లేకుండా బాబు హంగామా..

భూసేకరణ చేయకుండా, పునరావాసం చేపట్టకుండా, కనీసం పౌర విమానయాన శాఖ, రక్షణ రంగం, పర్యావరణం వంటి ఎటువంటి కీలక అనుమతులు లేకుండానే చంద్రబాబునాయుడు భోగాపురానికి శంకుస్థాపన చేసేశారు. కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అనుమతులు తీసుకుని 2,203.26 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించే విధంగా జీఎంఆర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి.. ఒప్పందం కుదుర్చుకునే సమయానికి సేకరించిన భూమి కేవలం 377 ఎకరాలు మాత్రమే.



మిగిలిన భూమి మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వమేసేకరించి, 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో విశాలమైన రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ప్రార్థన మందిరాలు, కమ్యూనిటీ హాళ్లు వంటివి నిర్మించి మరీ ఈ ప్రభుత్వం ప్రజలను ఆనందంగా తరలించింది. పునరావాసం కోర్టు కేసులు, పర్యావరణంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో వేసిన కేసుల్లో పోరాడి మరీ విజయం సాధించింది. నిజానికి.. చంద్రబాబు హయాంలో కేంద్రంలో అశోక్‌ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయారు.



అలాగే, విమానయాన రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడంలోనూ విఫలమయ్యారు. కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సేఫ్టీ, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ శాఖల నుంచి కీలక అనుమతులు సాధించి పనులు మొదలుపెట్టారు. బాబు లాగా అనుమతులు లేకుండా టెంకాయ కొట్టడం కాకుండా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మే 2023లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది.



కర్నూలు ఎయిర్‌పోర్టుదీ అదే కథ..

ఇక కర్నూలు ఎయిర్‌పోర్టుకు కూడా 2017లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు పనులు పూర్తికాకుండానే, ఎన్నికలు వస్తున్నాయంటూ 2019 జనవరిలో హడావిడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కానీ, వాస్తవంగా అప్పటికి రన్‌వే, టెర్మినల్‌ బిల్డింగ్, ఏటీసీ టవర్‌ వంటి కీలక నిర్మాణ పనులేవీ 30 శాతం కూడా పూర్తికాలేదు. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తే ఉన్నప్పటికీ ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక అనుమతులను తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.



కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెర్మినల్‌ బిల్డింగ్, ఏటీసీ టవర్, బే పార్క్, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్, నావిగేషన్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్మించింది. ఇందుకోసం ఈ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాక.. కీలకమైన ఏరోడ్రోమ్‌ లైసెన్స్, సెక్యూరిటీ క్లియరెన్స్, అనుమతులతో పాటు ఎస్‌పీఎఫ్‌ ఫోర్స్‌లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 70 శాతం పైగా పనులను ప్రస్తుత ప్రభుత్వమే పూర్తిచేయడంతో ఈ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి 2021 మార్చిలో ప్రారంభించింది.



తెట్టు వద్ద ఎయిర్‌కార్గో హబ్‌..

ఇక గత టీడీపీ ప్రభుత్వం నెల్లూరుకు సమీపంలో దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రతిపాదిస్తే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మధ్యలో రామాయపట్నం పోర్టుకు అత్యంత సమీపంలో తెట్టు వద్ద ఎయిర్‌పోర్టును నిర్మించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టు పక్కనే భారీ పరిశ్రమలు రానుండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు అనువుగా ఉండేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు. ఎయిర్‌ కార్గొ హబ్‌గా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను ఈ ప్రభుత్వం చేపట్టింది. త్వరలో అనుమతులన్నీ రాగానే పనులు మొదలుపెట్టే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.



కొత్త నగరాలతో అనుసంధానం..

ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం అనేక కొత్త నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ పెరిగితే సర్వీసులు తగ్గిపోయాయి రెక్కలు విరిచేశారు అంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. నిజానికి.. కోవిడ్‌ దెబ్బతో ట్రూజెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా తీయగా, స్పైస్‌జెట్‌ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సర్వీసులను తగ్గించుకున్నాయి. చివరకు ఎయిర్‌ ఇండియా కూడా నష్టాలను భరించలేక టాటాలకు అప్పగించేసింది. ఇలా కోవిడ్‌ దెబ్బతో విమాన సర్వీసులు తగ్గితే దానికి కూడా సీఎం జగన్‌ కారణమనడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప మరేమీ కాదు.



అలాగే, విశాఖపట్నం నుంచి గత ప్రభుత్వంలో లేని జైపూర్, గోవా, కడప, కోల్‌కత, తిరుపతిలకు కొత్త సర్వీసులు ప్రారంభమైన మాట రామోజీకి తెలియదనుకోవాలా లేక తెలిసినా తెలీనట్లు నటిస్తున్నారని అనుకోవాలా? అలాగే.. విజయవాడ నుంచి షిర్డీ, విశాఖ, షార్జాలకు, తిరుపతి నుంచి బెల్గాం, గుల్బర్గా, షివమొగ్గలకు కొత్తగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.



అంతేకాదు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా డిమాండ్‌ ఉన్న షార్జాకు నేరుగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా సర్వీసులను నడుపుతోంది. అదే విధంగా దుబాయ్, బెహ్రెయిన్, కువైట్, శ్రీలంక, సింగపూర్, బ్యాంకాక్‌లకు నేరుగా సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీంతోపాటు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్‌ దేశాలకు.. ఆస్ట్రేలియా, యూరప్‌లకు విమాన సర్వీసులు నడపడానికి సంప్రదింపులు జరుపుతోంది.

రూ.20వేల కోట్లతో తీరప్రాంత అభివృద్ధి..

కేవలం ఎయిర్‌పోర్టులే కాకుండా ప్రతీ 50 కి.మీ.లకు పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ ఉండే విధంగా పెద్దఎత్తున తీరప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్లు వెచ్చిస్తోంది.

విమానాశ్రయాల అభివృద్ధి..

మరోవైపు.. రాష్ట్రంలో మొత్తం ఏడు విమానాశ్రయాలు ఉండగా అందులో విశాఖతో కలిపి అయిదింటిని ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తోంది. 

► కర్నూలు ఎయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం, పుట్టపర్తిని శ్రీ సత్యసాయి ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. 

► రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి విమానాశ్రయాల్లో భారీ విమానాలు దిగేందుకు అనుకూలంగా రన్‌వేలను విస్తరించడంతో పాటు కొత్త టెర్మినల్‌ బిల్డింగ్‌లను నిర్మిస్తోంది. 

► రాజమండ్రి విమానాశ్రయాన్ని రూ.350 కోట్లతో విస్తరణ పనులకు ఇటీవలే కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా శంకుస్థాపన చేశారు. 

► అదే విధంగా.. కడప విమానాశ్రయం విస్తరణ కోసం 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడంతోపాటు రూ.450 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 

► అలాగే, విజయవాడ టెర్మినల్, రన్‌వే విస్తరణ పనులు దాదాపు పూర్తయి కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. 

► తిరుపతి విమానాశ్రయాన్ని ఆధునీకరించడంతో పాటు అక్కడ విమానాలను రిపేర్‌ చేసే విధంగా ఎంఆర్‌ఓ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్నారు. 

► కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలెట్‌ శిక్షణా కేంద్రంతో పాటు ఏరోస్పోర్ట్స్‌ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. 



విమాన ప్రయాణికుల వృద్ధి ఇలా.. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ramoji Rao
aviation department
TDP
Fact Check
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు

అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు

కాపులకు బాబు ద్రోహం..!

కాపులకు బాబు ద్రోహం..!

రాజకీయ కక్షతోనే నన్ను జైలుకు పంపారు: బొల్లా బ్రహ్మనాయుడు

రాజకీయ కక్షతోనే నన్ను జైలుకు పంపారు: బొల్లా బ్రహ్మనాయుడు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.