-
ఓఎమ్జీ టీజర్: 'అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖికి చెల్లివైనా..'
‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్తో ‘ఓఎమ్జీ’ (ఓ మంచి ఘోస్ట్) చిత్రం టీజర్ ఆరంభమవుతుంది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్వైనా, కాంచన కజిన్వైనా..’ అంటూ వెన్నెల కిశోర్ చేసే కామెడీ, ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా’ అంటూ షకలక శంకర్ చేసే కామెడీతో ఈ టీజర్ సాగుతుంది. ఘోస్ట్ క్యారెక్టర్లో నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా కనిపించారు. హారర్, కామెడీ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘ఓఎమ్జీ’. వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమీ గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు కీలక పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా. అబినికా ఇనాబతుని నిర్మించారు. శనివారం ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు. ‘‘త్వరలో ‘ఓఎమ్జీ’ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఓటీటీలో దూసుకెళ్తున్న వెన్నెల కిశోర్ సినిమా
కొన్ని సినిమాలు థియేటర్స్లో సరిగా ఆడకపోయినా.. ఓటీటీల్లో మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఇది బాగా జరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఓటీటీల్లో మాత్రం ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చారి 111 సినిమా విషయంలోనూ అదే జరిగింది. కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్స్లో విడుదలై పర్వాలేదనిపించుకుంది. సంయుక్త విశ్వనాథన్ గ్లామర్తో పాటు మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేశ్ల కామెడీకి మంచి మార్కులే పడినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేపోయింది. దీంతో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చి నెల రోజులైనా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉండడం విశేషం. కామెడీ జోనర్లో ఈ చిత్రం టాప్లో స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ద హీరోల సినిమాలను మించి ‘చారి 111’ సుమారు 70 మిలియన్స్ కి పైగా వ్యూస్ మినిట్స్ సాధించడం గమనార్హం. ఓటీటీలో వస్తున్న ఆదరణ పట్ల నిర్మాత అదితి సోని ఆనందం వ్యక్తం చేశారు. ‘చారి 111’ కథేంటి?హైదరాబాద్లోని ఓ మాల్లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్ రవీంద్రన్). రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్)కి బాంబ్ బ్లాస్ట్ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్లో ఏజెంట్ ఈషా(సంయుక్త విశ్వనాథన్) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ మూవీ
కొన్ని సినిమాలు అనుకున్న రీతిలో ఆడవు. అయితే థియేటర్లో నష్టపోయినా ఓటీటీ బిజినెస్ ద్వారా చాలా చిత్రాలు గట్టెక్కుతున్నాయి. పైగా కొన్ని బాక్సాఫీస్ ప్రియులకు నచ్చకపోయినా డిజిటల్ ప్లాట్ఫామ్లో క్లిక్ అవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ముందస్తు ప్రకటనలతో ఓటీటీలోకి వచ్చేస్తుండగా మరికొన్ని చడీచప్పుడు లేకుండా డైరెక్ట్గా రిలీజవుతున్నాయి. అలా వెన్నెల కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ మూవీ చారి 111 మూవీ సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మురళీ శర్మ కీలక పాత్రలో నటించాడు. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించగా అదితి సోని నిర్మించారు. సైమన్ కె.కింగ్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పైగా దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సీక్వెల్ కూడా చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం సీక్వెల్ ప్లాన్ను అటకెక్కించినట్లు తెలుస్తోంది. కథేంటంటే.. హైదరాబాద్లోని ఓ మాల్లో మానవ బాంబు పేలుడు జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎటువంటి పేలుడు పదార్థాలు లభించవు. ఇది ఉగ్రవాదుల పని అని.. వారి ప్లానేంటో కనుక్కోవాలని ముఖ్యమంత్రి రాహుల్ రవీంద్రన్ సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు. రుద్రనేత్ర ఏజెన్సీలో చారి (వెన్నెల కిశోర్)కి బాంబు పేలుడు కేసు అప్పగిస్తాడు. ఈ ఆత్మాహుతి దాడిని చారి పరిష్కరించాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! Get ready for a hilarious rollercoaster ride with #CHAARI111, now streaming on @PrimeVideoIN! 🕵️♂️💼 Don't miss out on the fun-filled espionage adventure! 🔗 https://t.co/OAcSJasE2u#Vennelakishore @samyukthavv@barkatstudios @aditisoni1111 @tgkeerthikumar pic.twitter.com/BpStl2jB6B — Divo (@divomovies) April 5, 2024 చదవండి: నేషనల్ క్రష్ ఏం చేసినా ట్రోలింగ్.. చేతలతో జవాబు! -
‘చారి 111’ మూవీ రివ్యూ
టైటిల్ : చారి 111 నటీనటులు: వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, సత్య తదితరులు నిర్మాత: అదితి సోనీ దర్శకత్వం: టీజీ కీర్తీ కుమార్ సంగీతం: సైమన్ కె కింగ్ విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. హైదరాబాద్లోని ఓ మాల్లో హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు లభించవు. కానీ అతనే బ్లాస్ట్ అవుతాడు. ఇది ఉగ్రవాదుల పని.. వారి ప్లాన్ ఏంటో కనుక్కోవాలని సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్రని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి(రాహుల్ రవీంద్రన్). రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీ మేజర్ ప్రసాద్ రావు (మురళీ శర్మ) నడిపిస్తుంటాడు. అతని టీమ్లో పనిచేసే చారి(వెన్నెల కిశోర్)కి బాంబ్ బ్లాస్ట్ కేసుని అప్పగిస్తాడు. ఈ మిషన్ని చారి ఎలా పరిష్కరించాడు? ఈ మిషన్లో ఏజెంట్ ఈషా(సంయుక్త విశ్వనాథన్) పాత్రేంటి? అసలు ఆత్మాహుతి దాడుల వెనుకున్నదెవరు? వారి లక్ష్యమేంటి? మహి, రావణ్లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏజెంట్ ప్రియా (పావని రెడ్డి), రాహుల్ (సత్య), శ్రీనివాస్ (బ్రహ్మజీ) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. చారి 111లో వెన్నెల కిశోర్ హీరో అనగానే..అందరి దృష్టి సినిమాపై పడింది.టీజర్, ట్రైలర్ చూడగానే ఇదొక కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమైపోయింది. సినిమా మొత్తం కామెడీగానే సాగుతుంది. సీరియస్ అంశానికి కామెడీ జోడించి.. హిలేరియస్గా సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఎంత కామెడీ సినిమా అయినా... కొంచెం అయినా లాజిక్ ఉండాలి. అది చారి 111లో మిస్ అయింది. సీక్రెట్ ఏజెన్సీ ఎలా పనిచేస్తుంది? పై అధికారులు ఎలా వ్యవహరిస్తారు. ఓ సీఎంతో అధికారి ఎలా మాట్లాడుతాడు? రియాల్టీకి పూర్తి విరుద్ధంగా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ అంతా సోసోగా సాగినప్పటికీ..కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ చేసే యాక్షన్ సీన్ ఫస్టాఫ్కి హైలెట్. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్లోనే సాగుతుంది. మహి, రావణ్లా ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్లో వెన్నెల కిశోర్ చేసే కామెడి మరింత బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. చారి 111 ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. చారి పాత్రకి వెన్నెల కిశోర్ తగిన న్యాయం చేశాడు. ఆయన నుంచి ప్రేక్షకులు ఎలాంటి కామెడీ ఆశిస్తారో అది ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఈషా పాత్రలో సంయుక్త విశ్వనాథన్ ఒదిగిపోయింది. యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసింది. తెరపై చాలా గ్లామరస్గా కనిపించింది. మేజర్ ప్రసాద్ రావు గా మురళీ శర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సత్య, తాగుబోతు రమేశ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Chaari 111 First Review: హీరోగా వెన్నెల కిశోర్ హిట్ కొట్టాడా?
కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్గా, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్ని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘చారి 111’పై హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మరికొద్ది గంటల్లో(మార్చి 1) చారి 111 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి మ్యాజిక్ డైరెక్టర్ సైమన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. సినిమా మొత్తం చూసి..తన ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చేశాడు. `లాక్ అయ్యింది, లోడ్ అయ్యింది, ఫైర్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇది కచ్చితంగా అదిరిపోయే వినోదాన్ని పంచే మూవీగా ఆడియెన్స్ ముందుకొస్తుంది. వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా బీజీఎం, మ్యూజిక్ ఉంది`అని సైమన్ ట్వీట్ చేశాడు. #Chaari111 - locked , loaded and ready to fireeee ! Had a blast scoring music for this one !! A sureshot entertainer on its way !!! #Vennelakishore fans Podra BGM uh !! 🔥🔥🔥💥💥💥💯💯💯 — Simon K.King (@simonkking) February 28, 2024 వెన్నెల కిశోర్ హిట్ కొట్టేనా? టాలీవుడ్ కమెడియన్స్ అంతా హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కమెడియన్గా ఫుల్ ఫామ్లో ఉన్న సునీల్ హీరోగా మారి తొలి సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు యావరేజ్గా ఆడాయి. కానీ హీరోగా మాత్రం సునీల్ నిలదొక్కుకోలేదనే చెప్పాలి. కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరమై.. మళ్లీ ఇప్పుడు కమెడియన్గాను.. విలన్గాను రాణిస్తున్నాడు. కమెడియన్ ధన్రాజ్ కూడా హీరోగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇటీవల వైవా హర్ష, అభినవ్ గోమఠం కూడా హీరో అవతారమెత్తారు. ‘సుందరం మాస్టర్’తో హర్ష, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాతో అభినవ్ గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఈ వారం మరో కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిశోర్ అయినా హీరోగా హిట్ కొడతాడో లేదో చూడాలి. ప్రచార చిత్రాలు అయితే ఆకట్టుకున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉంటే మాత్రం హిట్ పడినట్లే. -
‘చారి 111’ వినోదాన్ని పంచుతాడు: నిర్మాత అదితి సోనీ
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. అదితీ సోనీ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘చారి 111’ నా తొలి సినిమా. వైవిధ్యమైన కథతో తీసిన మంచి వినోదాత్మక చిత్రమిది. వెన్నెల కిశోర్ కామెడీని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ‘‘మళ్ళీ మొదలైంది’ సినిమా తర్వాత నేను చేసిన ద్వితీయ చిత్రం ‘చారి 111’. ఇదొక స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్’’ అన్నారు టీజీ కీర్తీకుమార్. ‘‘ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. ఈ పాటని అద్భుతంగా రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ‘‘తెలుగులో నాకు తొలి చాన్స్ ఇచ్చిన యూనిట్కి థ్యాంక్స్’’ అన్నారు సంయుక్తా విశ్వనాథన్. ‘‘ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సైమన్ కె. కింగ్. -
సీక్వెల్ ప్లాన్ ఉంది
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర చేశారు. ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితి సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘సుమంత్గారితో తీసిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా సమయంలో ‘వెన్నెల’ కిశోర్గారికి ‘చారి 111’ స్టోరీలైన్ చెప్పాను. ఓకే చెప్పారు. ఆయన్ను దష్టిలో పెట్టుకునే ఈ సినిమా కథ రాశాను. స్పై కామెడీ ఫిల్మ్ ‘జానీ ఇంగ్లిష్’ తరహాలో ‘చారి 111’ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఆలోచన ఉంది’’ అని చెప్పుకొచ్చారు. -
Chaari 111: గూఢచారిగా 'వెన్నెల' కిశోర్..నవ్వులు పూయిస్తున్న ట్రైలర్
'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో 'చారి 111' ట్రైలర్ ప్రారంభమైంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఆయన హెడ్. ఆయన ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు. మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలా అడ్డుకుంది? చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సీరియస్గా కనిపిస్తూ నవ్వించే గూఢచారిగా 'వెన్నెల' కిశోర్ నవ్వించనున్నారు. ఈ 'చారి 111' ట్రైలర్ చివరలో 'వయలెన్స్... వయలెన్స్... వయలెన్స్... ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా' అంటూ 'కెజియఫ్'లో రాకీ భాయ్ టైపులో 'వెన్నెల' కిశోర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. సంయుక్తా విశ్వనాథన్ అందంగా కనిపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టారు. 'నువ్వు ఎప్పటికీ కమెడియనే. హీరో కాదు' అంటూ 'వెన్నెల' కిశోర్ మీద పంచ్ కూడా వేశారు. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి ఇతర పాత్రల్లో కనిపించిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. -
గూఢచారిగా మారిన ‘వెన్నెల’ కిశోర్
కన్ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా చారి పాత్రలో నటించారు ‘వెన్నెల’ కిశోర్. ఆయన హీరోగా నటించిన ‘చారి 111’ స్పై థ్రిల్లర్ మూవీకి టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్గా నటించగా, మురళీ శర్మ ఓ ప్రధాన పాత్రలో నటించారు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితీ సోనీ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 1న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ గురువారం వెల్లడించింది. ‘‘ఇదొక స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్. సిల్లీ మిస్టేక్స్ చేసే ఓ స్పై ఒక పెద్ద కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ చిత్రకథ. ‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా స్పై రోల్స్ చేయగా, వీరి బాస్ పాత్రలో మురళీ శర్మ నటించారు’’ అన్నారు టీజీ కీర్తీ కుమార్. ‘‘చారి 111’ చిత్రం కొత్తగా ఉంటుంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
కామెడీ స్పై
‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ కామెడీ ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ ఓ కీలక పాత్రధారి. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితి సోనీ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఓ కన్ ఫ్యూజ్డ్ స్పై ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా కథనం’’ అన్నారు టీజీ కీర్తీకుమార్, అదితి సోనీ. -
గూఢచారి 111
‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ హీరో హీరోయిన్లుగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘చారి 111’. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రకటించడంతో పాటు, కాన్సెప్ట్ టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ కనిపిస్తారు. అలాగే ఆయన పాత్రలో ఓ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘స్పై జానర్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
సత్తిగాని రెండెకరాలు మూవీ రివ్యూ
టైటిల్: సత్తిగాని రెండెకరాలు నటీనటులు: జగదీష్ ప్రతాప్ బండారి, వెన్నెల కిశోర్, మోహన శ్రీ, రాజ్ తిరందాసు, అనీషా దామా, బిత్తిరి సత్తి, మురళీదర్ గౌడ్, రియాజ్ తదితరులు రచన, దర్శకత్వం: అభినవ్ రెడ్డి దండ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ సంగీతం: జై క్రిష్ నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ విడుదల తేదీ: మే 26, 2023 ఓటీటీ వేదిక: ఆహా పుష్ప సినిమాలో చిత్తూరు కుర్రాడిగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా కామెడీ పండించిన ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సత్తిగాని రెండెకరాలు చిత్రంతో హీరోగా మారాడు జగదీష్. పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో రిలీజైన సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ కొల్లూరు అనే గ్రామంలో నివసించే సత్తి(జగదీష్ ప్రతాప్ బండారి)కి భార్య, ఇద్దరు పిల్లలు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. ఎంత కష్టం వచ్చినా సరే ఉన్న రెండు ఎకరాలు అమ్మవద్దని సత్తికి చిన్నప్పుడే అతడి తాత చెప్తాడు. మీ నాన్న ఉన్నదంతా అమ్మేసి చివరకు రెండు ఎకారలు మాత్రమే మిగిల్చాడని దాన్ని కాపాడుకోమని సెలవిస్తాడు. ఆ మాటలను బుర్రకు ఎక్కించుకుంటాడు సత్తి. పెద్దయ్యాక అతడికో పెద్ద కష్టం వస్తుంది. తన కుమార్తె గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయడానికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్తారు. అప్పటికే సమయం కోసం వేచి చూస్తున్న సత్తి బంధువు, ఊరి సర్పంచ్ తన స్వలాభం కోసం సత్తితో రెండెకరాలు అమ్మించేయాలని కుట్ర పన్నుతాడు. ఓ రోజు సత్తి సైకిల్ మీద వెళ్తుండగా అక్కడ ఓ కారు చెట్టును ఢీ కొడుతుంది. అందులో వ్యక్తికి తీవ్ర గాయాలైనా పట్టించుకోని సత్తి ఆ కారులో ఉన్న సూట్కేసును మాత్రం ఇంటికి తీసుకొస్తాడు. అందులో డబ్బులుంటే కూతురికి ఆపరేషన్ చేయించవచ్చని అతడి ఐడియా. కానీ ఆ సూట్కేస్ ఎలా తెరవాలో తెలియక స్నేహితుడు అంజి(రాజ్ తిరందాసు) సాయం కోరుతాడు. వీళ్లు అప్పటికే ఊర్లో చిన్నచిన్న దొంగతనాలు చేయడంతో దాన్ని ఎలాగైనా ఓపెన్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. మరోవైపు సూట్కేస్ ఓనర్ లలిత్(రియాజ్) తన అనుచరుడు వెన్నెల కిశోర్ను యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి పంపిస్తాడు. అతడు కారుతో పాటు అందులో ఉన్న వ్యక్తిని కూడా కాల్చేసి సూట్కేసు కోసం గాలిస్తాడు. మరోపక్క కారు ప్రమాదం గురించి ఎస్సై(బిత్తిరి సత్తి) విచారణ చేస్తూ ఉంటాడు. తీరా ఒక రోజు సూట్కేస్ తెరుచుకుంటుంది. అందులో ఏముంది? వెన్నెల కిశోర్ ఆ సూట్కేస్ సొంతం చేసుకున్నాడా? ఎస్సై విచారణ ఎలా సాగింది? సత్తి తన కూతురికి ఆపరేషన్ చేయించాడా? అన్నది మిగతా కథ. విశ్లేషణ ఈ మధ్యకాలంలో ప్రాంతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదే కోవలో సత్తిగాని రెండెకరాలు కూడా వచ్చింది. ఈ సినిమాను కామెడీగా లేదంటే క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తీయవచ్చు. కానీ దర్శకుడు అభినవ్ రెడ్డి దండ కామెడీకే జై కొట్టారు. అయితే సత్తిగాని రెండెకరాలు కథలో కొత్తదనం లేదు. కాకపోతే అల్లుకున్న క్యారెక్టర్లు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. సూట్కేసు వచ్చిన తర్వాత సినిమాలో వేగం, బలం పుంజుకుంటుంది. క్లైమాక్స్ బాగుంది. ఎంత మంచివాడైనా కొన్ని సందర్భాల్లో చెడువైపు అడుగులు వేసేందుకు ఆస్కారం ఉంది. అవసరం మనతో ఏ పనయినా చేయిస్తుందని జగదీశ్ పాత్రతో తెరపై చూపించాడు డైరెక్టర్. కామెడీ బాగా పండింది కానీ కొంత సాగదీత ఉంది. కొన్ని సన్నివేశాలను ముందుగానే ఊహించే ఆస్కారం ఉండటం మైనస్. ఎవరెలా చేశారంటే? జగదీష్ ప్రతాప్ బండారి నటనకు వంక పెట్టే పని లేదు. అంత బాగా నటించాడు. ప్రతి సన్నివేశంలో లీనమైపోయాడు. అతడి స్నేహితుడు అంజిగా నటించిన రాజ్ తిరందాస్ యాక్టింగ్ కూడా బాగుంది. వెన్నెల కిశోర్కు మంచి పాత్ర పడితే ఎలా విజృంభిస్తాడో చూపించాడు. బిత్తిరి సత్తి నిడివి ఇంకాస్త పెంచితే బాగుండేది. నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు. తెలంగాణ పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి చాలా సహజంగా, అద్భుతంగా ఆవిష్కరించారు. జై క్రిష్ నేపథ్య సంగీతం, పాటలు కథలో భాగంగానే ముందుకు సాగుతూ ప్రేక్షకులను లీనం చేసేందుకు దోహదపడ్డాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. కథ పక్కన పెడితే కామెడీ ఎంజాయ్ చేయవచ్చు -
ఆ విషయం అందరికీ తెలుసు.. అర్థం కాకపోతే అంతే: మంచు విష్ణు
మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు ఇటీవల చేసిన ట్వీట్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలు కుప్పలుగా రెండు వేల నోట్లు ఉన్నాయంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ నిజమా అంటూ ఆరా తీశారు. దీంతో ఇదంతా ఒక్కసారిగా హాట్టాపిక్గా మారిపోయింది. వెన్నెల కిశోర్ ఇంత డబ్బు సంపాదించాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మీడియాలో వచ్చిన కథనాలపై మంచు విష్ణు ట్వీట్ చేశారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చాడు. (ఇది చదవండి: వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్) మంచు విష్ణు తాజాగా ఓ ట్వీట్తో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా నేను చేసిన జోక్ అని అందరికీ తెలుసు అంటూ పోస్ట్ చేశారు. ఇది అర్థం చేసుకోలేని వారిని ఆ దేవుడే రక్షించాలి అంటూ రాసుకొచ్చారు. కానీ కొంత మంది మీడియా వ్యక్తులు వెన్నెల కిషోర్ మీద వేసిన జోక్ను సీరియస్గా తీసుకన్నారని ట్వీట్లో తెలిపారు. మంచు విష్ణు ట్వీట్లో రాస్తూ..'అది జోక్ అని అందరికీ తెలుసు. కాసింత కళాపోషణ ఉన్న వారెవ్వరికైనా అది జోక్ అని అర్థమవుతుంది. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకోని వాళ్లని ఆ దేవుడే కాపాడాలి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరూ జిన్నా సినిమాలో చివరగా కలిసి నటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్) My joke on Kishore @vennelakishore is taking different turns by some genius new portals ( not the legit and genuine news networks). Almost everyone knows that Kishore and I always have funny banter fights. And everyone with a little bit of humor also understands that it s a joke.… — Vishnu Manchu (@iVishnuManchu) May 22, 2023 -
వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్
కొంతకాలంగా రెండు వేల నోటు కనిపించకుండా పోయింది. ఎక్కడో ఒక చోట తప్పితే పెద్దగా చలామణీ అవడం లేదు. ఈ క్రమంలో రూ.2000 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కాకపోతే మన దగ్గర ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. ఇకపోతే కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంట్లో రెండు వేల నోట్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయట. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. రెండు వేల నోట్ల కట్టలు గుట్టగా పేరుకుని ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. 'వెన్నెల కిశోర్ ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఫోటో తీసుకున్నాను. ఈ నోట్లతో అతడేం చేస్తాడోనని నాకు ఆశ్చర్యంగా ఉంది' అని రాసుకొచ్చాడు. దీనికి వెన్నెల కిశోర్ స్పందిస్తూ.. 'సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ను చంపేసినట్లు.. నామీద పడతారేంటి?' అని డైలాగ్ ఉన్న వీడియో క్లిప్పింగ్ను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు 'మాకు ఓ రూ.30 లక్షలు ఇవ్వొచ్చుగా', 'అర్జంట్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు చెప్పేయాలి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే విష్ణు సరదాగా అన్న మాటలను సీరియస్గా తీసుకున్న కొందరు నెటిజన్లు 'ఇది నిజమా సర్..', 'ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సాయం చేస్తారా బ్రో', 'అన్నా.. పేదలకు పంచవచ్చు కదా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్గా మారింది. ఇక పెద్ద నోట్ల రద్దుతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోటును లీగల్గా చలామణి చేసుకునే అవకాశం ఉన్నా ఎవరు కూడా దాన్ని తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. షాపింగ్, మాల్స్, వైన్ షాప్స్, పెట్రోల్ బంకుల్లో కూడా నోటును తీసుకునేందుకు సిబ్బంది వెనుకడుగు వేస్తున్నారు. Photo was taken when I visited Sri. @vennelakishore garu home. I wonder what he will do with these 2000₹ notes. 🤔 pic.twitter.com/bLApojXxyA — Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2023 చదవండి: మరో వ్యాపార రంగంలోకి నయనతార -
నటి గౌతమి తో సాక్షి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
నా లైఫ్ లో ఇంత పెద్ద సినిమా చేయలేదు
-
హీరోయిన్ ని పొగడ్తలతో ముంచెత్తిన నాని
-
అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్
-
ఆసక్తికరంగా 'భువన విజయమ్'.. ట్రైలర్ విడుదల
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు యలమంద చరణ్ తెరకెక్కించిన చిత్రం ‘భువన విజయమ్’. కిరణ్, వీఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ని విడుదల చేశారు. ‘నువ్వు చనిపోతే తీసుకెళ్లడానికి వచ్చిన యమ భటులం.. అట్లాంటప్పుడు మనం నరకానికి పోవాలి కానీ ఈ సినిమా ఆఫీసుకు వచ్చుడేంది సర్’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘ఫన్, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సాయి. -
యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్బాబు సపోర్ట్
సంగీత్ శోభన్, శాన్వి జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ విమానం'. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గూఢచారి','రావణాసుర'వంటి హిట్ సినిమాలు నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ జీ5తో సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. ఓ పల్లెటూరిలో ఇద్దరు పిల్లలు కొండనెక్కి విమానం చూస్తుంటారు. అసలు విమానం ఎలా పైకి ఎగిరింది? విమానంలోకి ఎక్కాలన్న కోరికతో పలు సందేహాలతో టీజర్ మొదలవుతుంది. సంతోష్ కట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. Presenting the teaser of #PremaVimanam! Wishing the team all the very best! ♥️https://t.co/PKys0pqm6m@AbhishekPicture @saanvemegghana@santoshkata @dopjagadeeshch @anusuyakhasba @vennelakishore @anuprubens @vasupotini @mohitrawlyani @ZEE5Telugu — Mahesh Babu (@urstrulyMahesh) April 27, 2023 -
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ‘ప్రేమ విమానం’
సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా, అనసూయ భరద్వాజ్, ‘వెన్నెల’ కిశోర్ లీడ్ రోల్స్లో నటించిన వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’. బాల నటులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా కీలక పాత్రలు చేశారు. సంతోష్ కటా దర్శకత్వంలో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్, జీ5లపై అభిషేక్ నామా నిర్మిస్తున్న వెబ్ ఫిల్మ్ ఇది. బుధవారం (ఏప్రిల్ 19) అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ‘ప్రేమ విమానం’ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘ఫ్లైట్ ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ఓ ప్రేమ జంట, ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయతి్నంచే ఇద్దరు పిల్లలు.. ఇలా వివిధ వ్యక్తుల ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు.. వంటి ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
Birth Of Bhuvana Vijayam: ఫోస్టర్ చూస్తే ఫ్యాన్స్కి పిచ్చెక్కి పోవాలి
సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భువన విజయమ్’. నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా ఉంది. ఇక చివర్లో ‘నా ఫోస్టర్ చూస్తే ఫ్యాన్స్కి పిచ్చెక్కి పోవాలి’అని సునీల్ అంటుంటే.. వెన్నెల కిశోర్ స్కెచ్తో సునీల్ పోస్టర్ని మార్చడం నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు, దటీజ్ మనోజ్: వెన్నెల కిశోర్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. భూమా మౌనికను పెళ్లాడాడు. మార్చి 3న జరిగిన వీరి వివాహానికి అతి దగ్గరి బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్, మౌనికల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మనోజ్ పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. దీనికి కమెడియన్ వెన్నెల కిశోర్ వాయిస్ అందించడం విశేషం. 'పెళ్లి.. మ్యారేజ్.. మూడు ముళ్ల బంధం, ఆరడుగుల అనుబంధం.. సారీ, మావాడు ఆరడుగులు కదా, సో సెంటిమెంటల్గా ఉంటుందని బ్రేకింగ్ ద రూల్స్! M, M ఫ్రెండ్స్ కదా.. అలాగే ఉంటాయి మరి!' అంటూ మనోజ్, మౌనికల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు వెన్నెల కిశోర్. 'వయసుతో సంబంధం లేకుండా, రేంజును చూడకుండా నచ్చితే నావాడు, మెచ్చితే మనోడు.. అదే మంచు మనోజ్ లైఫ్ స్టైల్. డిగ్రీ సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మాత్రం 14 ఉన్నాయి. మనోడికి ఫారిన్ వెళ్లి మరీ చదివిన సీమబిడ్డ భూమా మౌనికతో ఆ దేవుడు ముడి వేశాడు. వీళ్లిద్దరిదీ బ్లాక్బస్టర్ కాంబినేషన్. నేను నీకెలా సాయపడగలను? అని వాట్సాప్ స్టేటస్ కాకుండా ఏకంగా ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. నమ్మితేనే చేయందిస్తాడు.. అలాంటిది నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు. దటీజ్ మనోజ్. ఏడడుగులు.. ఏడేడు జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని ముగించాడు వెన్నెల కిశోర్. -
ఇండియన్ 2లో విలన్గా వెన్నెల కిశోర్, ఇదిగో క్లారిటీ!
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ తొలిసారి నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారతీయుడు 2లో వెన్నెల కిశోర్ విలన్ రోల్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఓ అభిమాని 'ఏంటి కాకా.. ఇది నిజమా?' అని అడిగాడు. దీనికి సదరు కమెడియన్ స్పందిస్తూ.. 'ఇండియన్ 2లో లేను, పాకిస్తాన్ 3లో లేను' అని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఈ రూమర్స్కు తెర దించినందుకు థ్యాంక్స్ భయ్యా అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇండియన్ 2 విషయానికి వస్తే.. కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్గా వస్తోందీ చిత్రం. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనప్పటికీ వివాదాలు, ప్రమాదాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం నాన్స్టాప్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. Indian 2 lo lenu Pakistan 3 lo lenu pic.twitter.com/gJUmmoO9GG — vennela kishore (@vennelakishore) February 28, 2023 -
టొరెంటోలో ఘనంగా ప్రారంభమైన తెలుగు చిత్రం
6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో సూర్య బెజవాడ నిర్మాతగా తెరకెక్కుతున్న ఓ సినిమా రీసెంట్గా టొరెంటో తెలుగు ప్రేక్షకల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరెంటో అపూర్వ శ్రీవాస్థవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్కు దర్శకత్వం వహించిన వరుణ్ కోరుకొండ తొలిసారి ఫీచర్ ఫిలింను డైరెక్ట్ చేయబోతున్నారు. తన చిత్రాల తరహాలోనే థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతొంది. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిషోర్లో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలో కనిపంచనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ కొరుకొండ మాట్లాడుతూ.. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను, టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను విడుదల చేస్తామని చెప్పారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర నిర్మాత సూర్య బెజవాడ పేర్కొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- పేటీఎంకు పెరిగిన నష్టాలు
- Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
- పాలస్తీనా స్వతంత్ర దేశం
- సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్రెడ్డి
- విమానంలో స్టాండింగ్
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- సన్న విత్తనాలు సిద్ధం
- Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
- మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు
- ‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
Advertisement