-
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ రివీల్ చేయనున్నారు.ఈ సినిమాలోని బుజ్జి పేరుతో ఉన్న కారును ఫ్యాన్స్కు పరిచయం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన భారీ ఈవెంట్లో బుజ్జి లుక్ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Darlings... In life, you meet people for the first time only once. World, meet #Bujji...- https://t.co/8XhJordNtn#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal… pic.twitter.com/SvwwuXpzBa— Kalki 2898 AD (@Kalki2898AD) May 22, 2024 -
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కమల్హాసన్- శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్-2. భారతీయుడు మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. సౌరా అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ విషయాన్ని సోషళ్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హీరోలు పెళ్లి వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అదేమంటే.. ఆ హీరో పెళ్లయ్యాక చేసుకుంటా, ఈ హీరో జోడీని వెతుక్కున్నాక చేసుకుంటా అని సాకులు చెప్తుంటారు. హీరో విశాల్ కూడా ఇదే రూటులో వెళ్తున్నాడు.పెళ్లి ఊసే లేదు!తను గతంలో ప్రేమించిన ఓ బ్యూటీ కూడా పెళ్లి చేసుకోబోతుంది. 46 ఏళ్లొచ్చినా ఈయన మాత్రం వివాహానికి తొందరేముంది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయాడు. కానీ జనాలు ఊరుకుంటారా? మెడ మీద కత్తిపెట్టి అడిగినట్లుగా పెళ్లెప్పుడో చెప్పు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.తెలివైన సమాధానందీనికి విశాల్ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. సల్మాన్ ఖాన్, శింబు, ప్రభాస్.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే నేను కూడా లైఫ్లో సెటిలవుతాను అని చెప్పాడు. శింబుకు మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలుపెట్టారట అతడి పేరెంట్స్. ప్రభాస్ అంటారా? సినిమాల మీద తప్ప పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకుందే లేదు.సల్మాన్ పేరు చెప్పాడంటే..ఇక సల్మాన్ విషయానికి వస్తే.. ఆయనకసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్ ఈ ముగ్గురి తర్వాతే అంటున్నాడంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.చదవండి: విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు -
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్ ప్లే ఆఫ్కు మ్యాచ్కు హాజరైన షారుక్ డీహైడ్రేషన్కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.కాగా.. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. కోల్కతా జట్టుకు యజమానిగా ఉన్న షారూఖ్ ఖాన్ టీమ్కు మద్దతుగా స్డేడియంలో సందడి చేశారు. దీంతో అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లిన బాద్షా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో షారుక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. Due to heat stroke dehydration, but sir is fine now and he’s been discharged, nothing to worry.Love You @iamsrk ❤️#ShahRukhKhan https://t.co/5k5S5z1ixD— Sudhir Kothari (@sudhirkothari03) May 22, 2024 -
హారర్ థ్రిల్లర్తో వస్తోన్న ఆదాశర్మ.. చాలా ఏళ్లకు తెలుగులో!
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సీడీ(క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత అదా శర్మ తెలుగు వారిని పలకరించనున్నారు. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్ఎస్సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ నిర్మాతగా వ్యవహరించారు.హారర్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోస్టర్ చూస్తే సినిమా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతుందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. మే 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.ఈ మూవీలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు. -
విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
బుల్లితెర జంట సంజయ్ గగ్నానీ, పూనమ్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు వైవాహిక బంధాన్ని ప్రారంభించారు. అయితే వీరి మధ్య సఖ్యత కుదరడం లేదని, త్వరలోనే విడిపోవడం ఖాయమంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వైరలవుతున్నాయి. ఇందుకు తోడు సంజయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి తొలగించాడట! ఇంకేముంది.. ఈ దంపతులిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు.ఫస్ట్ టైం చూసి..తాజాగా ఈ రూమర్స్పై సంజయ్ స్పందించాడు. మేము విడిపోతున్నామన్న వార్త మొదటిసారి చదివినిప్పుడు షాకయ్యాను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తను ఇది చూస్తే ఎంత బాధపడుతుందోనని కంగారుపడ్డాను. కానీ ఆమె కూడా ఒక యాక్టర్ కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోగలదనిపించింది.ఈ ప్రపంచం ఏమనుకున్నా..ఈ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సర్వసాధారణమే! మేమేంటో మాకు తెలుసు. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉంది. కాబట్టి ఈ ప్రపంచం మా గురించి ఏమనుకుంటుందనే అస్సలు పట్టించుకోము. అలాగే ఈ పుకారును కూడా లైట్ తీసుకున్నాం. అయితే విడాకుల కోసం లాయర్ను సంప్రదించానని ప్రచారం చేశారు. ఎంత నవ్వుకున్నానో..అది విని అయితే ఎంత నవ్వుకున్నానో నాకే తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కుండలీ భాగ్య సీరియల్ తర్వాత సంజయ్ మరే ధారావాహికలోనూ కనిపించలేదు. అన్నీ నెగెటివ్ రోల్స్ వస్తుండటం వల్లే దేనికీ ఒప్పుకోలేదంటున్నాడు. తాజాగా యూట్యూబ్లో రిలీజైన రాత్ అభి అనే సాంగ్లో సంజయ్ మెరిశాడు.చదవండి: రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి -
చరణ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఉపాసన పోస్ట్
ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనక కూడా ఒక మగవాడు ఉంటాడని ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఎంత వైరలయ్యాయో తెలిసిందే! ఇద్దరూ ఒకరికొకరు తోడుగా, అండగా నిలబడితే ఆ బంధం కలకాలం నిలుస్తుందని చెప్పకనే చెప్పింది ఉపాసన. కేవలం సూక్తులు చెప్పడం కాదు దాన్ని ఆచరించి చూపిస్తున్నారీ జంట.ఉపాసన వెంటే..ఆ మధ్య చరణ్ ఆస్కార్ కోసం అమెరికాకు వెళ్తే కడుపుతో ఉన్నా సరే ఉపాసన అతడి వెంటే వెళ్లింది. ఇప్పుడు ఉప్సీ వృత్తిపరమైన వ్యవహారాల కారణంగా ఒమన్ దేశానికి వెళ్లింది. షూటింగ్స్తో ఎంతో బిజీగా ఉండే చరణ్ పనులన్నీ పక్కనపెట్టి భార్యతో సహా వెళ్లాడు. తమ పాప క్లీంకారను కూడా తీసుకెళ్లారు. గర్వంగా ఉంది..ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'చరణ్ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నేను చేసే పనులకు సపోర్ట్గా నిలబడుతున్నావు. తండ్రిగానూ బాధ్యత నెరవేరుస్తున్నావు. అలాగే ఈ మీటింగ్ను ప్రత్యేకంగా మార్చిన మహిళామణులందరికీ థ్యాంక్స్' అంటూ మూడు ఫోటోలు షేర్ చేసింది. అందులో ఉపాసన కెమెరా వైపు పోజిస్తే చరణ్ మాత్రం ప్రకృతిని ఆస్వాదిస్తూ వెనుదిరిగి నిల్చున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..! -
ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయ అక్కర్లేని పేరు. బీ టౌన్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లాడింది. ప్రస్తుతం హాలీవుడ్తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించిన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.తాజాగా రోమ్లో జరిగిన బుల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రియాంక హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తన బ్రాండ్ క్లాసీ ఆభరణాలను ధరించింది. దీంతో అందరి కళ్లు ప్రియాంక నెక్లెస్పైనే పడ్డాయి.ఇంతకీ ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లెస్ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప్రియాంక వేసుకున్న నెక్లెస్ను 140 క్యారెట్ల డైమండ్తో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం డైమండ్ నెక్లెస్ దాదాపు రూ.358 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఆ నెక్లెస్ రూపొందించడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో అత్యంత ఖరీదైన నెక్లెస్లో ఇది ఒకటిగా నిలిచింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక హాలీవుడ్ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్ను ఇటీవలే పూర్తి చేసుకుంది. బాలీవుడ్లో ఆమె చివరిసారిగా 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో ఫర్హాన్ అక్తర్తో కలిసి నటించారు. ప్రస్తుతం ఆమె అలియా భట్, కత్రినా కైఫ్తో కలసి జీ లే జరా అనే సినిమాలో కనిపించనుంది. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari) -
కాజల్ అగర్వాల్తో ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
పోకెమాన్ కార్టూన్.. అప్పటినుంచే స్ట్రీమింగ్
కొత్త పాత్రలు, సాహసాలతో కూడిన పోకెమాన్ హరిజన్స్: ది సీరీస్ షో వీక్షణ కోసం ప్రేక్షకులు సిద్ధం కావాలని నటులు విశాల్, శేఖర్ పిలుపునిచ్చారు. హంగామా వేదికగా ఈనెల 25వ తేదీ నుంచి ఈ యానిమేటెడ్ షో ప్రసారం కానుంది. పోకెమాన్ హరిజన్స్: ది సీరీస్లో పాత్రలు, కొత్త అంశాల గురించి నటులు విశాల్, శేఖర్ చెన్నైలో మంగళవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో వివరించారు. కొత్త సాహసయాత్రతో, కొత్త పాత్రల పరిచయాలతో, ఉత్తేజకరమైన అంశాలను జోడించి ఈ షోను రూపొందించారన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 9.30 గంటలకు కొత్త ఎపిసోడ్లతో హంగామా టీవీలో సందడి నెలకొననుందని పేర్కొన్నారు. -
విక్రమ్ తంగలాన్.. ఆ నెలలోనే రిలీజ్కు ప్లాన్!
పాత్ర కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాను డైరెక్టర్ పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. స్టూడి యో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్, పార్వతి, డేనియల్ కల్టిగరోన్, పశుప తి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా స్వాతంత్య్రానికి ముందు కర్ణాటకలోని గోల్డ్ మైన్ కార్మికుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన లుక్లో కనిపించనున్నారు. కాగా.. మొదట తంగలాన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.కాగా తాజాగా చిత్రాన్ని జూన్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో తంగలాన్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతమందించారు. -
పోలీస్ యూనిఫామ్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు రామ్ చరణ్
-
'జ్యోతిష్యం బలంగా నమ్ముతా.. తెలుగులో నటించడం నా అదృష్టం'
దేవర భామ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరు అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రెస్మీట్కు హాజరైంది ముద్దుగుమ్మ. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను జ్యోతిష్యాన్ని నమ్ముతానని.. రాశి అనుకూలంగా ఉందా లేదా అని చాలాసార్లు చెక్ చేసుకుంటానని జాన్వీ కపూర్ తెలిపింది.జాన్వీ మాట్లాడుతూ..'మనమందరం రాశులను చెక్ చేసుకుంటాం. నేను కూడా అలాగే చేస్తా. ఇప్పటికీ చాలాసార్లు రాశి అనుకూలంగా ఉందా అని చూసుకుంటా. ఎందుకంటే నేను జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతాను. ఒకవేళ నా రాశి సరిపోకుంటే ఆ వ్యక్తితో మాట్లాడటం మానేస్తాను." అంటూ చెప్పుకొచ్చింది.కాగా.. మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో రాజ్కుమార్ రావ్కు జంటగా నటించారు. రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్ సినిమాలో నటించడం తన అదృష్టమని తెలిపింది. దేవర సినిమా సెట్లో పనిచేయడం నాకు చాలా ఇష్టమని పేర్కొంది. సెట్లోని నాపై ఎంతో అభిమానం చూపించారని.. సినిమా పట్ల వారి అంకితభావానికి ఆశ్చర్యపోయానని వెల్లడించింది. ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు జాన్వీ కపూర్ కృతజ్ఞతలు తెలిపింది. -
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
-
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ హిట్స్
-
‘ఆదిపర్వం’ పై సెన్సార్ సభ్యులు ప్రశంసలు
ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మిస్తున్నాయి. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటలు "అన్విక ఆడియో" ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం.దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ..."బహు భాషల్లో రూపొందిన "ఆదిపర్వం" అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్ కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అన్నారు! -
ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం: విజయేందర్ రెడ్డి
ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు. ‘నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు. కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తాం’ అని విజయేందర్ రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు వస్తునాయని చెబుతూ పది రోజులు వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయంనైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటాల ప్రతిపాదనలను తెలుగు నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు పంపించింది. -
అమ్మ మరణం... ఆమె ఆఖరి కోరిక నెరవేర్చిన ప్రముఖ నటి
మొన్నీ మధ్య 'లాపతా లేడీస్' అనే ఓ సినిమా వచ్చింది. థియేటర్లలో కంటే ఓటీటీలో బాగా ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో మంజు మై అనే పాత్రలో ఆకట్టుకున్న ఛాయా కదమ్ అనే నటి.. ఇప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఈమె ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తోంది.(ఇదీ చదవండి: నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత)2009 నుంచి ఛాయా కదమ్ ఇండస్ట్రీలో ఉంది. 'లాపతా లేడీస్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె నటించిన మలయాళ మూవీ 'ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్' సినిమా, కేన్స్ చిత్రాత్సవంలో స్క్రీనింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ వెళ్లిన ఈమె.. చనిపోయిన తల్లి చీర, ముక్కు పుడక పెట్టుకుని వేడుకలో పాల్గొంది.ఈ మేరకు తల్లికి సంబంధించిన గోల్డ్ కలర్ శారీ, ముక్కు పుడకతో కనిపించిన ఛాయా కదమ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బతికుండగా తన తల్లిని విమానం ఎక్కించాలనుకున్నానని, కానీ ఇప్పుడు కేన్స్లో ఆమె చీర కట్టుకోవడం చాలా బాగుందని, ఇలా తన తల్లి కోరిక నెరవేరిందని భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Chhaya Kadam (@chhaya.kadam.75) -
రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి
హీరోయిన్గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్గానూ చిత్రపరిశ్రమలో పని చేసింది గౌతమి. కానీ తన జీవితాన్ని మాత్రం సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయింది. తెలుగు, తమిళంలో స్టార్స్తో కలిసి నటించిన ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట్లో బిజినెస్మెన్ సందీప్ భాటియాను పెళ్లాడిన ఈమెకు కూతురు సుబ్బలక్ష్మి జన్మించింది. పాప పుట్టిన ఏడాదే అతడికి విడాకులిచ్చేసింది. 13 ఏళ్ల ప్రేమతర్వాతి కాలంటో కమల్ హాసన్తో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజీవనం చేశారు. కాలం కన్ను కుట్టిందో ఏమో కానీ 2016లో విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నీ బలం నువ్వే.. బాధేసినప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూడటమో లేదా నీలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలు వినడమో చేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో దారి అనుసరిస్తుంటారు. అలా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక అంశం ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. దానికి అట్రాక్ట్ అవుతారు.ఆ పాయింట్ దాటొద్దుకానీ నిజమైన బలం వేరెవరూ కాదు.. నాకు నేను, నీకు నువ్వే అసలైన బలం. ఒక రిలేషన్షిప్ వర్కవుట్ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత నీదేనని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ రిలేషన్ అయినా సరే.. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఇద్దరు సమానంగా అక్కడికి చేరుకోవాలి. కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు. పైగా మనకోసం చాలాదూరం వచ్చినట్లు ఫీలవుతారు. ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు. వారికి అదొక అలవాటుగా మారిపోతుంది.లైఫ్ లెస్సన్అప్పుడు నేనెందుకు నీకోసం అంత దూరం రావాలని మనల్నే తిరిగి ప్రశ్నిస్తారు. కావాలంటే నువ్వే వచ్చేయ్ అంటారు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఓ గుణపాఠం. మనమెప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్లకూడదు. లవ్, కమిట్మెంట్ అనేది రెండువైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది' అని గౌతమి చెప్పుకొచ్చింది. కాగా ఈమె కమల్తో కలిసి అపూర్వసహోదరగళ్, దేవర్ మగన్, పాపనాశం వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు! -
ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్!
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్లోనే ఉంటుంది సమంత. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ అలరిస్తుంది. తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది. తన పోస్టులతో అప్పుడప్పడు యువతకు ఓ మెసేజ్ కూడా అందిస్తుంది. అలాగే ఒక్కోసారి చిలిపి పోస్ట్లు కూడా పెడుతూ.. ఫ్యాన్స్ని అయోమయంలో పడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఒకటి ఇటు సామ్ అభిమానులతో పాటు అటు క్రికెట్ లవర్స్ని కన్ఫ్యూజన్లో పడేసింది. సమంత పెట్టిన పోస్ట్ ఏంటి?ఐపీఎల్ 2024 క్లైమాక్స్కి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ప్లేఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. క్యాలిఫయిర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ఫైనల్కి చేరుకుంది. సన్ రైజర్స్ ఫైనల్కు చేరాలంటే.. క్వాలిఫయిర్ 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. దీని కంటే ముందు నేడు(మే 22) రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం సన్రైజర్స్లో పోటీ పడాల్సి ఉంటుంది.(చదవండి: ‘కల్కి’ ప్రమోషన్స్కి అన్ని కోట్లా..? ఓ పెద్ద సినిమానే తీయొచ్చు!)ఇలా ఐపీఎల్ ఆట చాలా ఆసక్తికరంగా సాగుతున్న వేళ సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' ఓ పోస్ట్ పెట్టింది. 'మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో సమంత ఆర్సీబీ మద్దతుగా ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. సామ్ పోస్ట్ని షేర్ చేస్తూ మాకంటే మాకు సపోర్ట్ చేస్తుందంటూ ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవపడుతున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అయితే ఇది క్రికెట్కు సంబంధించినది కాదని, తన అభిమానుల కోసమే అలా రాసుకొచ్చిందని అంటున్నారు. సమంత సందిస్తే తప్ప ఆ పోస్ట్ అర్థం ఏంటి? ఎవరునుద్దేశించి చేశారనే విషయాలు తెలియవు. మరి సామ్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
హీరోయిన్ల జీవితం బయటకు చూడటానికి బాగానే ఉంటుంది. కానీ లోపల మాత్రం వేరేగా ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా సరే చాలామంది బ్యూటీస్ తమ బాధల్ని బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కొత్త సినిమాలు రావేమోనని భయం. సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతుంటారు. ఇప్పుడు అలానే హీరోయిన్ నమిత.. తనకు కెరీర్లో ఎదురైన దారుణమైన మోసాల్ని రివీల్ చేసింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)'మూవీ పేరు చెప్పను కానీ ధనుష్ హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఓ నిర్మాత నా కాల్షీట్ తీసుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి ఆయన కజిన్ హీరోగా నటించాడు. ఆ విషయం నాకు తెలియగానే చాలా బాధపడి సగంలోనే ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశా. ఆపై ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. దీని గురించి అప్పట్లో నిర్మాతల మండలి, నటీనటుల మండలిలో ఫిర్యాదు కూడా చేశాను. అలానే మలయాళంలో పేరున్న నిర్మాత ఉన్నారు కదా అని ఓ ప్రాజెక్ట్ సైన్ చేశా. కానీ దాన్ని వేరే నిర్మాత తీసుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతూనే ఆ మూవీ పూర్తి చేశాను' అని నమిత తనకెదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది.గుజరాత్లో పుట్టి పెరిగిన నమిత.. 'సొంతం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది. 2020లో చివరగా ఓ చిత్రంలో నటించిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బీజేపీ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన గురించి పలు విషయాల్ని బయటపెడుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య) -
కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..!
ఐపీఎల్ టోర్నీలో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) నేరుగా ఫైనల్కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్ విజయంతో ఆ టీమ్సభ్యులు, అభిమానులు విజయానందంలో మునిగిపోయారు. తన టీమ్ సక్సెస్ను కళ్లారా చూసిన బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. వెంటనే అలర్ట్ అయి..మ్యాచ్ అనంతరం వెంటనే మైదానంలోకి వెళ్లి అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు నడిచాడు. అయితే అక్కడ మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, పార్థీవ్ పటేల్, సురేశ్ రైనా జరిగిన మ్యాచ్ గురించి లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. వారిని చూసుకోకుండా తన భార్య, కుమారుడితో ఎంతో హుషారుగా ముందుకు నడిచాడు షారూఖ్. వెంటనే అక్కడ లైవ్ ఎపిసోడ్ జరుగుతుందని గమనించి వాళ్లకు రెండు చేతులు జోడించి సారీ చెప్పి హగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అంత ఖుషీగా ఉండటం చూసి మురిసిపోతున్నారు.షారూఖ్ సినిమాల విషయానికి వస్తే.. కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన షారూఖ్ గతేడాది ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో బాక్సాఫీస్పై కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మేనియాలో ఉన్న ఈ హీరో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. తన టీమ్ కేకేఆర్ ఆడే అన్ని మ్యాచులకు హాజరవుతానని మాటిచ్చిన షారూఖ్ దాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు. జూలై లేదా ఆగస్టులో అతడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. King Is So Happy 💜#shahrukhkhan #srk #KKRvsSRH pic.twitter.com/fZiHHBoPcp— __𝕊𝕣𝕜𝕚𝕒𝕟__ (@Kashif_srk_fan_) May 22, 2024 చదవండి: తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి? -
పాయల్ రాజ్పుత్ రక్షణ మూవీ టీమ్ నుండి వేధింపులను ఎదుర్కొంటుంది
-
ఎన్టీఆర్తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య
రెండో రోజుల క్రితం ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఆల్రెడీ 'దేవర' నుంచి సాంగ్ వచ్చేయడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్తో చేయబోయే మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆగస్టు నుంచి షూటింగ్ అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకోవైపు 'వార్ 2' షూటింగ్తోనూ తారక్ బిజీ బిజీ. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఒకామెతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)పైన ఎన్టీఆర్తో ఉన్న ఆమె పేరు లిఖితా రెడ్డి. 'కేజీఎఫ్'తో సెన్సేషన్ సృష్టించి, 'సలార్'తో కేక పుట్టించి.. ఇప్పుడు తారక్తో రచ్చ లేపేందుకు సిద్ధమయ్యాడు ప్రశాంత్. ఇతడి భార్యనే లిఖితా రెడ్డి. రీసెంట్గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. అయితే ఈ ఏడాది మార్చిలో తారక్, తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లాడు. అప్పుడు తీసుకున్న పిక్ ఇది.ప్రశాంత్ నీల్ అంటే అందరికీ తెలుసు గానీ ఈయన భార్య లిఖితా ఎవరనేది తెలిసింది తక్కువ మందికే. తెలుగు మూలాలున్న అమ్మాయి కావడంతో ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగి ఉంటుంది. ఇక తన అభిమాన హీరో ఇంటికొచ్చేసరికి ఆనందం పట్టలేక ఇలా గట్టిగా పట్టుకుని ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు కానుందని చెప్పారు. అలానే 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.(ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?) -
Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
సినిమాను తీయడం ఒకెత్తు అయితే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేక్షకులను రీచ్ అయ్యేందుకు అదెంచ్చె ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి తర్వాతే మరెవరు అయినా. ఆయన సినిమాను తెరకెక్కించేందుకు ఎలా కష్టపడతాడు.. అంతే స్థాయిలో సినిమా ప్రమోషన్స్కి కష్టపడతాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఆయన చేసిన ప్రమోషన్స్ బాగా కలిసొచ్చింది. ఇద్దరు హీరోలతో దేశం మొత్తం తిరిగి సినిమాను అన్ని భాషల వారికి దగ్గరయ్యేలా చేశాడు. కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు రూ.20 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతుంది ‘కల్కి’ టీమ్. (చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)సినిమా ప్రమోషన్స్కి భారీగా ఖర్చు చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసం దాదాపు రూ. 50 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. రీసెంట్గా ఐపీఎల్లో కూడా ‘కల్కి 2898 ఏడీ’ యాడ్ని రన్ చేశారు. ప్రభాస్ కల్కి అవతార్లో కనిపించి సినిమాను ప్రమోట్ చేశాడు. ఇది కేవలం 12 సెకన్ల యాడ్ మాత్రమే. దీని కోసం మేకర్స్ రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కల్కి సినిమా ప్రమోషన్స్కి ఖర్చు చేసే డబ్బుతో టాలీవుడ్లో ఓ బడా సినిమానే తీయొచ్చు. (చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడుతాడు)నేడు(మే 22)రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ని నిర్వహించబోతున్నాడు మేకర్స్. ఈ ఈవెంట్లో బుజ్జిని పరిచయం చేయనున్నారు. ప్రభాస్తో పాటు చిత్రబృందం అంతా ఈ ఈవెంట్కి హాజరవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో..అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారట. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement