-
అసలు ఈ గొడవ కి ముందు వీడియో.. లైవ్ లో చూపించిన అంబటి
-
కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి, కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ మధ్య పోరు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జేఎన్యూ విద్యార్థి సంఘం నేతగా రాజకీయాల్లో కాలుమోపిన కన్హయ్య ఆ తరువాతి కాలంలో కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు.కన్హయ్య కుమార్ తన ప్రచార ఖర్చుల కోసం గడచిన ఏడు రోజుల్లో రూ. 52 లక్షలను క్రౌడ్ ఫండింగ్ రూపంలో సేకరించారు. ఆయన మే 15 నుంచి ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా చందాలను స్వీకరించడం ప్రారంభించారు. బుధవారం రాత్రి నాటికి కన్హయ్య కుమార్కు మొత్తం 2,250 మంది రూ. 52 లక్షలను చందాల రూపంలో అందించారు. కన్హయ్యకు చందాలు ఇచ్చిన వారిలో హాస్య కళాకారుడు కుణాల్ కుమార్, సినీ నిర్మాత విశాల్ భరద్వాజ్, అతని భార్య, గాయని రేఖా భరద్వాజ్, జెఎన్యూ మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్, మాజీ ప్రొఫెసర్ మోహన్రావు తదతరులు ఉన్నారు.కన్హయ్య కుమార్ ‘క్రౌడ్ ఫండింగ్’ రూపంలో మొత్తం రూ. 75 లక్షలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ఫండ్ సేకరణకు ముందు కన్హయ్య కుమార్ ఒక వీడియో విడుదల చేస్తూ తాను శాంతి, ప్రగతి, న్యాయం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నానని పేర్కొన్నారు. ఫ్యూయల్ డ్రీమ్ అనే వెబ్సైట్ ద్వారా తాను చందాలు సేకరిస్తున్నానని, అలాగే గూగుల్ పే నంబర్ ద్వారా కూడా చందాలు సేకరిస్తున్నానని తెలియజేశారు. -
మిగిలిన రెండు దశలకు కాంగ్రెస్ ప్రచారాస్త్రాలివే?
దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. ఆరు, ఏడో దశ ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ రెండు దశల్లోనూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని సమాచారం. ఢిల్లీ, హర్యానా, హిమాచల్, పంజాబ్ కాంగ్రెస్కు చాలా ముఖ్యమైనవి. ఈసారి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు రాబడుతందని పార్టీ అంచనా వేస్తోంది.ఈ నాలుగు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగిలిన మూడు స్థానాల్లో పోటీ బీజేపీ, ఇండియా కూటమి మధ్యే నెలకొంది. హర్యానా, హిమాచల్లలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో మొత్తం 35 సీట్లు ఉన్నాయి. గతంలో వాటిలో 24 సీట్లు బీజేపీకి దక్కగా, రెండు సీట్లు ఎన్డీఏలో భాగమైన అకాలీదళ్కు దక్కాయి. కాంగ్రెస్కు ఎనిమిది సీట్లు, ఆప్కు ఒక సీటు వచ్చాయి. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ మెరుగైన పలితాలు సాధిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఢిల్లీలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్, ఆప్తో కలిసి పోటీకి దిగింది. దీంతో కాంగ్రెస్, ఆప్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసారి చీపురు గుర్తు బటన్ను నొక్కి, కేజ్రీవాల్కు ఓటు వేస్తానని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో మోదీ ప్రభుత్వ హ్యాట్రిక్ను అడ్డుకునేందుకు ఇరు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి.ఈ రెండు దశల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు రైతుల సమస్యలు, అగ్నివీర్ అంశంపై దృష్టి పెడుతున్నదని సమాచారం. హర్యానాలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కురుక్షేత్ర సీటును ఆప్కి ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా గట్టి పునాదిని ఏర్పర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ జోరుగా ర్యాలీలు నిర్వహిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రంలోని మహేంద్రగఢ్, పచ్కుల, సోనిపట్లలో మూడు ర్యాలీలు నిర్వహించారు. -
నేను గీతాంజలిలా కాదు.. ఒక్కొక్కరి అంతు తేల్చేస్తా
-
పరారీలో టీడీపీ నేతలు
-
కౌంటింగ్ డే పై టీడీపీ గుండాల కుట్రలు
-
ఈవీఎం లు ధ్వంసం చేసిన టీడీపీ నేతలకు రిమాండ్
-
టీడీపీ అంటేనే కుట్ర కుతంత్రం.. చంద్రబాబుపై రెచ్చిపోయిన మల్లాది విష్ణు
-
నక్కి నక్కి తిరుగుతున్న "చంద్ర" మామ
-
దేశాన్నే ఆశ్చర్యపరిచిన బాబు తెలివి తేటలు
-
లోక్సభకు ఎక్కువసార్లు నెగ్గింది ఎవరంటే..
2024 లోక్సభ ఎన్నికల్లో పలువురు సీనియర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు ఐదోసారి, మరికొందరు ఏడోసారి ఎంపీల రేసులో ఉన్నారు. 1952లో తొలిసారిగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే లోక్సభకు ఎక్కువసార్లు ఎవరు గెలిచారనే విషయానికొస్తే..ఇంద్రజీత్ గుప్తా(11 సార్లు): లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇందర్జిత్ గుప్తా రికార్డు సృష్టించారు. 1960లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో చివరిసారిగా ఎంపీ అయ్యారు. ఇంద్రజిత్ గుప్తా తన జీవితకాలంలో 11 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచారు.సోమనాథ్ ఛటర్జీ(10 సార్లు):1929 జూలై 25న అస్సాంలోని తేజ్పూర్లో జన్మించిన సోమనాథ్ ఛటర్జీ లోక్సభ ఎన్నికల్లో 10 సార్లు గెలిచారు. ఛటర్జీకి 1996లో 'అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు' లభించింది.పీఎం సయీద్ (10 సార్లు):పీఎం సయీద్ 1967 నుండి 1999 వరకు వరుసగా 10 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు.అటల్ బిహారీ వాజ్పేయి(9 సార్లు)మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి తొమ్మిది సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అటల్ జీకి నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ అనుభవం ఉంది. మరికొందరు నేతలు కూడా తొమ్మిది సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారుకమల్ నాథ్: లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్లోని చింద్వారా లోక్సభ స్థానం ఆయనకు బలమైన కోటగా పరిగణిస్తారు. కమల్నాథ్ 1980లో తొలిసారిగా ఇక్కడి నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు.మాధవ్ రావ్ సింధియా: దివంగత నేత మాధవరావు సింధియా 1971లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఉన్నారు. గ్వాలియర్ లోక్సభ స్థానం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని కూడా ఆయన ఓడించారు.ఖగపతి ప్రదాని: ఒడిశాలోని నబరంగ్పూర్ లోక్సభ స్థానం నుంచి వరుసగా తొమ్మిది సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ దివంగత నేత ఖగపతి ప్రదాని రికార్డు సృష్టించారు. 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.గిరిధర్ గోమాంగ్: కాంగ్రెస్ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు విజయం సాధించారు. కోరాపుట్ నియోజకవర్గం నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.రామ్విలాస్ పాశ్వాన్: తొమ్మిదిసార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన నేతల్లో రామ్విలాస్ పాశ్వాన్ పేరుంది. రామ్ విలాస్ బీహార్లోని హాజీపూర్ లోక్సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు, రోస్రా లోక్సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు.జార్జ్ ఫెర్నాండెజ్: లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కూడా ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. అతను బీహార్లోని ముజఫర్పూర్ లోక్సభ స్థానం నుంచి ఐదుసార్లు, నలంద నుంచి మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచారు.బాసుదేబ్ ఆచార్య: పశ్చిమ బెంగాల్లోని బంకురా లోక్సభ స్థానం నుంచి సీపీఐ(ఎం) నేత వాసుదేబ్ ఆచార్య తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వాసుదేబ్ ఆచార్య 1980లో తొలిసారిగా బంకురా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.మాణిక్రావ్ హోడల్యా గవిత్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత మాణిక్రావ్ హోడల్యా గవిత్ లోక్సభ ఎన్నికల్లో వరుసగా తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 1981లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు.వీరంతా ఎనిమిది సార్లు: బీజేపీ నేత సంతోష్ గంగ్వార్ లోక్సభ ఎన్నికల్లో బరేలీ స్థానం నుంచి ఎనిమిది సార్లు గెలిచారు. సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు విజయం సాధించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ
-
అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు
-
రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..
-
శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..
-
తెలుగు ఓటర్లు కీలకం
-
ఎన్నికల తర్వాత.. బాబు, పవన్, పురందేశ్వరి సైలెంట్: KSR
-
ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
2024 లోక్సభ ఎన్నికల ఐదవ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈసారి 57.5 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత సారి అంటే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఇప్పటి ఓటింగ్ ఐదు శాతం తక్కువ.2019 ఎన్నికల ఐదో దశలో 62.0 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటింగ్ ట్రెండ్ తగ్గుముఖం పట్టడం అటు రాజకీయ పార్టీల్లో, ఇటు ఎన్నికల సంఘంలో మరోసారి ఆందోళన పెంచింది. ఐదో దశలో మహారాష్ట్రలో 13, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, జార్ఖండ్లో 3, ఒడిశాలో 5, జమ్ము-కశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 48.88 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్లో 52.55 శాతం, జమ్మూకశ్మీర్లో 54.21 శాతం, జార్ఖండ్లో 63 శాతం, ఒడిశాలో 60.72 శాతం, ఉత్తరప్రదేశ్లో 57.43 శాతం, లడఖ్లో 67.15 శాతం ఓటింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం ఈ దశలో అంచనా వేసిన ఓటింగ్ శాతం 57.38గా నమోదైంది.2019లో ఈ సీట్లలో నమోదైన ఓటింగ్ శాతం విషయానికొస్తే బెంగాల్లోని ఈ స్థానాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో 55.7 శాతం, బీహార్లో 57.2 శాతం, జమ్మూ కాశ్మీర్లో 34.6 శాతం, జార్ఖండ్లో 65.6 శాతం, ఒడిశాలో 72.9 శాతం, ఉత్తరప్రదేశ్లో 58.6 శాతం, లడఖ్లో 71.1 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గంలో ఈసారి 54 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం. ఈసారి మొత్తం ఓటింగ్ శాతం 54.21, ఇది 1984లో ఈ నియోజకవర్గంలో 58.84 శాతం ఓటింగ్ తర్వాత అత్యధికం. లోక్సభ ఎన్నికలకు ఇంక రెండు దశలు మాత్రమే మిగిలాయి. మే 25న ఆరో దశ, జూన్ ఒకటిన చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ఐదో దశ ముగియడంతో 428 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
-
జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి
-
ఏపీలో అల్లర్లు చేసింది వీరే..
-
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
-
ఓటు వేయనివారిపై నటుడు పరేష్ రావల్ ఆగ్రహం
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్సభ ఎన్నికల ఐదవ దశ ఓటింగ్ కొనసాగుతోంది. దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తన ఓటు హక్కు వినియోగంచుకోవడంతో పాటు ఓటర్లందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.నటుడు పరేష్ రావల్ తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పరేష్ రావల్ ఓటు వేయని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చాలామంది ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపిస్తుంటారు. అయితే మన వంతుగా ఓటు వేయడం అనేది మన బాధ్యత. ఓటు వేయకుంటే దాని పర్యవసానం కూడా మనమే ఎదుర్కొంటాం. దానికి ప్రభుత్వం బాధ్యత వహించదు’ అని పరేష్ రావల్ పేర్కొన్నారు. #WATCH | Bollywood actor Paresh Rawal says, "...There should be some provisions for those who don't vote, like an increase in tax or some other punishment." pic.twitter.com/sueN0F2vMD— ANI (@ANI) May 20, 2024 -
ఐదో దశకు సర్వం సిద్ధం..
-
బీజేపీపై వసుంధరా రాజే అలక?
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగిసింది. పలువురు నేతలు ఎన్నికల ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. అయితే రాజస్థాన్లో బీజేపీకి చెందిన ఓ మహిళా నేత ఇందుకు భిన్నమైన పరిస్థితిలో కనిపిస్తున్నారు.రాజస్థాన్కు చెందిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలంతా వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే మాజీ సీఎం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం విశేషం. రాజస్థాన్లోని ఏ లోక్సభ స్థానంలోనూ ప్రచారం చేసేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి సైతం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రచారాల్లో పాల్గొంటున్నారు.వసుంధర రాజే రాజస్థాన్లోని బరన్-జలావర్ లోక్సభ స్థానంలో మినహా మరెక్కడా ప్రచారం నిర్వహించలేదు. గత లోక్సభ ఎన్నికల్లో ఆమె రాష్ట్రంలోని అన్ని లోక్సభ ఎన్నికల్లో యాక్టివ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె పచారపర్వానికి దూరంగా ఉండటం పలు చర్చలకు దారితీస్తోంది.రాజస్థాన్లో లోక్సభకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో కొన్ని సీట్లలో వసుంధర రాజే సమావేశాలు, ర్యాలీల గురించి చర్చ జరిగింది. అక్కడి నేతలు వసుంధర రాజే రాకను కోరుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. రెండవ దశలో ఝలావర్లోనే ఓటింగ్ ఉండటంతో పైగా అది తన కుమారుని సీటు కావడంతో ఆమె ప్రచారం నిర్వహించారు. అయితే మూడో దశలో ఆమెను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగే ప్రచారాలకు పంపేందుకు బీజేపీ సన్నాహాలు చేసింది. అయినా ఆమె ఏ సమావేశంలోనూ కనిపించలేదు.రాజస్థాన్కు చెందిన బీజేపీ నేతలు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నెల రోజులు ఒడిశాలోనే ఉంటూ ప్రచారం సాగించారు. పశ్చిమ బెంగాల్లోనూ రాజస్థాన్కు చెందిన ఒక మంత్రి ప్రచారం నిర్వహించారు. హర్యానాలోనూ రాజస్థాన్ బీజేపీ నేతలు ప్రచారాలు సాగించారు. ఢిల్లీ, యూపీలలోనూ బీజేపీ మహిళా నేతలు ప్రచార విధులను చేపట్టారు. వీటిలో ఎక్కడా వసుంధరా రాజే కనిపించకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ మరో కుట్ర మాచర్లలో హైటెన్షన్
బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!
రేవ్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ నేతలు
’ఆప్‘ రాకతో నెలకు రూ. 18 వేలు ఆదా: రాఘవ్ చద్దా
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
రిమాండ్ రిపోర్టులోవిస్తుపోయే నిజాలు
బెంగళూరు: రేవ్పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
అసలు ఈ గొడవ కి ముందు వీడియో.. లైవ్ లో చూపించిన అంబటి
తప్పక చదవండి
- YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
Advertisement