-
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
స్పేస్ టూరిజంలో అమెజాన్ అధినేత జెఫ్బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ మరో అడుగు ముందుకు వేసింది. బ్లూ ఆరిజన్ సంస్థ టెక్సాస్ కేంద్రంగా అంతరిక్షం అంచు వరకు వెళ్లే మానవ రాకెట్ ప్రయోగాన్ని ప్రారంభించింది. బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ మిషన్ ఎన్ఎస్-25 మిషన్ను పశ్చిమ టెక్సాస్లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న ఉదయం 8.30 (భారత్ కాలమాన ప్రకారం..సాయంత్రం 7.30) గంటలకు రాకెట్ బయలుదేరుతుంది. ఈ ఎన్ఎస్ -25 మెషిన్లో భారత్కు చెందిన గోపి తోటకూర సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు.కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు. -
అమెజాన్ ఉద్యోగులకు ఎంత కష్టం..!?
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్లో కింది స్థాయి ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అమెజాన్ వేతనాలను గంటకు 15 డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తర్వాత, పరిశోధకులు చేసిన సర్వేలో సగం మంది వేర్హౌస్ వర్కర్లు తాము తిండికి, వసతికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో అమెజాన్ ఉద్యోగులు పరిస్థితి మెరుగుపడిందా.. తిండి తింటున్నారా, ఆకలితో ఉంటున్నారా.. అద్దె, ఇతర చెల్లింపులు చేయగలుగుతున్నారా వంటి అంశాలతో వారి ఆర్థిక శ్రేయస్సుపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్ సెంటర్ తాజాగా చేసిన జాతీయ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇందులో 53 శాతం మంది తాము గడిచిన మూడు నెలల్లో తిండికి కూడా కష్టాలు పడినట్లు నివేదించారు. ఇంటి అద్దెలు, ఇతర చెల్లింపులకు అవస్థలు పడినట్లు 48 శాతం మంది పేర్కొన్నారు.సియాటిల్కు చెందిన వాల్మార్ట్ తర్వాత అమెరికాలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అమెజాన్. యూఎస్ వేర్హౌసింగ్ పరిశ్రమ వర్క్ఫోర్స్లో అమెజాన్ 29 శాతం వాటాను కలిగి ఉందని పరిశోధకుల అంచనా. అమెజాన్ వేర్హౌస్లలో పనిచేసే ఉద్యోగులను సోషల్ మీడియా ప్రకటనల ద్వారా 98 ప్రశ్నలతో కూడిన ఆన్లైన్ సర్వే చేసింది అధ్యయన బృందం. యూఎస్ వ్యాప్తంగా 42 రాష్ట్రాల్లోని మొత్తం 1,484 మంది కార్మికుల నుంచి స్పందనలను క్రోడీకరించి నివేదికను విడుదల చేసింది. -
జియో గుడ్న్యూస్.. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా 15 ఓటీటీ యాప్స్
జియో ఫైబర్ తమ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో సహా 15 యాప్ల ప్రీమియం సేవలను రూ. 888 మంత్లీ ప్లాన్కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 30 ఎంబీపీఎస్ ఎంట్రీ లెవల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్.నెట్ఫ్లిక్స్ యాక్సెస్ గతంలో రూ. 1,499 ప్లాన్ని కలిగి ఉన్న జియోఫైబర్ (JioFiber) కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్ ప్లాన్తో కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్ యాప్ల యాక్సెస్ ఉండేది కాదు. అదేవిధంగా, ఎయిర్ ఫైబర్ (AirFiber) కస్టమర్ల కోసం రూ. 1499 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్లలో మాత్రమే నెట్ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది.కంపెనీ సమాచారం ప్రకారం.. జియో రూ.888 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందిస్తున్న 15 ఓటీటీ యాప్ల సేవల్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా సోనీ లివ్, జీ5, లయన్స్గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్బాలాజీ వంటివి ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో పోటీ నెలకొన్న నేపథ్యంలో తమ కొత్త ప్లాన్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో జియో ఉంది. -
Lok Sabha Election 2024: ఈ కామర్స్ వేదికలకు ఎన్నికళ
ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ వేదికలు ఎన్నికల సీజన్ను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. పార్టీల ప్రచార సామగ్రి, వాటి అభిమానించే ఓటర్లు ధరించే ఉత్పత్తులను అమ్మకానికి పెట్టాయి. దాంతో ఎన్ని‘కళ’ ఈ వేదికలనూ చేరింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో పారీ్టల రంగులతో కూడిన టీ షర్టులు, క్యాప్లను విక్రయిస్తున్నాయి. ‘నమో హ్యాట్రిక్’, ‘రాహుల్ ఈజ్ హోప్’ (రాహులే ఆశాకిరణం) వంటి సందేశాలతో కూడిన టీ షర్ట్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘సుమారు 12 మంది విక్రేతలు ఈ కామర్స్ వేదికలపై ఎన్నికల సామగ్రి అమ్మకాలకు నమోదు చేసుకున్నారు. ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ మరింతమంది ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగి వెల్లడించారు. స్వతంత్ర రిటైలర్లు, బ్రాండ్ లైసెన్స్ తీసుకున్న కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో యువ ఓటర్లను ఆకర్షించేలా అమ్మకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఖరీదైన వ్రస్తాలు, కీ చైన్లు, కార్లు, ఇళ్లలో పెట్టుకోగలిగిన జెండాలు, ల్యాంపులు, క్లాక్ల వంటివి వీటిలో ఉన్నాయి. బ్లాక్ వైట్ ఆరెంజ్ కంపెనీ ‘హౌ టు బి యాన్ ఇన్ఫ్లుయెన్సర్’, ‘ఐ వాంట్ టు వోట్ ఫర్ ఇండియా’ వంటి సందేశాలతో ‘ఏ47’ బ్రాండ్పై ఖరీదైన వ్రస్తాలను విక్రయిస్తోంది. అమెరికాలో ఎన్నికల సామగ్రి మార్కెట్ చాలా పెద్దది. భారత్లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని బ్లాక్వైట్ వ్యవస్థాపకుడు భవిక్ వోరా తెలిపారు. బీజేపీ ఇప్పటికే నమో యాప్పై టీ షర్ట్లు, మగ్లు, స్టేషనరీని విక్రయిస్తుండడం తెలిసిందే. -
అమెజాన్ సేల్లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో స్మార్ట్వాచ్లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్బడ్స్పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్ఫోన్స్పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్లో అన్నీ రకాల ప్రొడక్ట్లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్ప్లస్తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది. -
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్ ముఖ్యంగా 8 వన్ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్ప్లస్ 12 (OnePlus 12), వన్ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్ప్లస్ 12 ఆర్ (OnePlus 12R), వన్ప్లస్ నార్డ్ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్మీ 13సీ (Redmi 13C), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్లను పొందే ఐఫోన్ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్లో యాపిల్ డివైజ్లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది. -
విజయవాడ వ్యక్తి సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి గోపీచంద్
సాక్షి, ఢిల్లీ: విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్ తోటకూర ఒకరు. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్గా గోపీచంద్ వెళ్లనున్నారు. విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్గా పని చేశారు. బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్పోర్టే ఉంది. ఆరుగురు వ్యక్తులు వీరే.. అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యటకులు రోదసీయాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే ఎన్ఎస్-25 మిషన్కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. ఇస్రో సైతం.. మరోవైపు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఈ జాబితాలో ఉన్నారు. మన దేశం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. -
కొత్త ఈ-కామర్స్ కంపెనీ.. చవకా.. వీక్నెస్ పట్టేశారు!
దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. ‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది. -
అపరకుబేరుడు ఎలోన్ మస్క్కి భారీ షాక్
ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్ మస్క్కు భారీ షాక్ తగిలింది. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్బెర్గ్ వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో బిలియనీర్ల స్థానంలో తొలిస్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. యథావిధిగా అమెజాన్ అధినేత జెఫ్బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మస్క్ నెట్వర్త్ 198 బిలియన్లుగా ఉంది. అంత వేతనం వదులు కోవాల్సిందే టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5లక్షల కోట్లు) వేతనాన్ని తీసుకుంటున్నారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్కు అంత వేతనం అందుకోవడంపై టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. పలు మార్లు ఈ అంశంపై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. తాజాగా మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పుతో టెస్లా షేర్లు పడిపోవడం, ఆ సంస్థలో అత్యధిక షేర్లున్న మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా బ్లూమ్బెర్గ్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు. పడిపోయిన టెస్లా కార్ల ఎగుమతులు దానికి తోడు చైనాలోని షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుండి కార్ల ఎగుమతులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కనిష్ట స్థాయికి పడిపోయాంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో టెస్లా షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అమెజాన్లో అమ్మకాలో జోరందుకోవడం ఆ సంస్థ అధినేత జెఫ్బెజోస్కి కలిసి వచ్చింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకునేందుకు దోహదం చేసింది. -
మరీ ఇంత మోసమా? ఐఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్..
ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులు కొన్ని సందర్భాల్లో మారిపోతూ ఉంటాయి. ఒక వస్తువు బుక్ చేస్తే.. మరో వస్తువు డెలివరీ అయిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అమెజాన్లో ఒక ఐఫోన్ 15 ఆర్డర్ చేశారు. అయితే అతనికి డెలివరీ అయిన ఫోన్ను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అతనికి వచ్చిన ఫోన్ నకిలీది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. వావ్ అమెజాన్ ఇన్.. ఒక నకిలీ ఐఫోన్ 15ని డెలివరీ చేసింది. బాక్స్లో కేబుల్ కూడా లేదు. మొత్తం డబ్బా, ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొన్నారా? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఈ సంఘటనపైన అమెజాన్ స్పందించి ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి, ఆర్డర్ వివరాలను తెలియజేస్తే.. 6 నుంచి 12 గంటల్లో మీకు తప్పకుండా సహాయం చేస్తామని వెల్లడించింది. ఐఫోన్ కోసం వెచ్చించిన మొత్తాన్ని రీఫండ్ చేయమని బాధితుడు అమెజాన్ను కోరారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? Waah @amazonIN delivered a Fake iPhone 15. Seller is Appario. Tagged with “Amazon choice” No cable in the box. Total Dabba. Has anyone faced similar issue? pic.twitter.com/QjUqR7dKSU — Gabbar (@GabbbarSingh) February 23, 2024 -
అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు
అనకొండనే ప్రపంచంలో అతిపెద్ద పాము జాతి అని అనుకున్నాం. అదే జాతికి చెందిని మరో జాతి అనకొండను ఈ క్వెడార్లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ఈ అనకొండకు సంబంధించి మరో జాతి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ఊహను నిజం చేస్తే మరో జాతి అనకొండ వాళ్ల కంటపడింది. ఇది 26 అడుగుల మరియు 200 కిలోల మేర బరువుంది. ఈ మేరకు శాస్త్రవేత్త విల్ స్మిత్ల బృందం రానున్న నాట్ జియాఓ సిరిస్ పోల్ టు పోల్ కోసం ఫోటో షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ క్కెడార్లోని అమెజాన్ నది అడుగు భాగంలో ఫోటోలు చిత్రిస్తుండగా ఈ అనకొండ కెమెరాకు చిక్కింది. ఆ సరికొత్త అనకొండను చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు ఇది ఇప్పటి వరకు చూసిన అనకొండ జాతులకు చెందిందా కాదా అనే దిశగా పరిశోధనలు చేశారు. దీన్ని చూసి ఇంతకుముందు కనిపెట్టిన ఆకుపచ్చ అనుకొండకు చెందిన మరోక జాతి ఏమో అనుకున్నారు. కానీ పరిశోధనలో వేర్వేరు జాతికి చెందినదని తేలింది. ఆక్కుపచ్చలో ఉండే అనకొండ జాతి ఎక్కువగా బ్రెటిజల్ , పెరూ, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలలో నివశిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఈ కొత్తజాతి అనకొండ తొమ్మిది దక్షిణ అమెరికా దేశాలలో బోవా గ్రూప్ సేకరించిన మిగతా అనకొండాల రక్తం, కణజాల నమూనాలతో సరిపోలలేదన్నారు. ఇది అనకొండలో కొత్త జాతిని నిర్థారించారు. దీనికి జెయింట్ అనకొండగా నామకరణం చేశారు. ఈ అనకొండ మరింత ప్రమాదకరమైనదని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. The world's largest snake has been discovered in the Amazon Rainforest: The Northern Green Anaconda measures 26 feet long and weighs 440 lbs - and its head is the same size as a human's. pic.twitter.com/XlaDk0qVYt — Denn Dunham (@DennD68) February 21, 2024 (చదవండి: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! మరో టార్జాన్, మోగ్లీ లాంటి కథ!) -
ఓటీటీలోకి 'బూట్ కట్ బాలరాజు'.. కనీసం ఇప్పుడైన చూడండయ్యా!
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన చిత్రం 'బూట్ కట్ బాలరాజు' ఓటీటలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్పై సోహైల్ నిర్మించాడు. ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్గా నటించగా.. సునీల్, సిరి హన్మంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మార్చి 1 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని ప్రచారం ఉంది. సినిమా విడుదల సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కానీ అప్పటికీ కూడా పెద్దగా ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టలేదు. సినిమా కథ బాగున్నప్పటికీ కొత్త దనం లేకపోవడంతో సినిమా ఫెయిల్కు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో సోహైల్ కామెడీ మరో రేంజ్లో ఉంటుంది. పేద, ధనిక అంతరాలతో కథ నడిపించిన తీరు బాగానే ఉన్న కమర్షియల్గా పెద్దగా మెప్పించలేదని చెప్పవచ్చు. థియేటర్లో చూడలేకపోయిన వారు ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమా అని చెబుతూ.. కనీసం ఇప్పుడైన 'బూట్ కట్ బాలరాజు'పై ఒక లుక్ వేయండయ్యా అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మార్చి 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'బూట్ కట్ బాలరాజు' వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంట్లోనే చూసేయండి. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
రూ.లక్ష కోట్లకు పైగా విరాళం - ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!
చాలా మంది ధనవంతులు డబ్బు కూడబెట్టే కొద్దీ ఇంకా పోగు చేయాలి, ఇంకా గొప్పవాళ్ళైపోవాలి అని ఆలోచించడం సర్వ సాధారణం. అయితే కొందరు మాత్రమే వారికున్నదాంట్లో చాలా వరకు పేదలకు లేదా మంచి పనులను భారీగా విరాళం అందిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువ మందిలో 'మెకెంజీ స్కాట్' (MacKenzie Scott) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఇప్పటి వరకు ఎంత దానం ఇచ్చింది? బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి అయిన 'మెకెంజీ స్కాట్' ఇప్పటి వరకు సుమారు రూ.1,19,522 కోట్లకుపైగా విరాళంగా ఇచ్చింది. అంతే కాకుండా తాను బ్రతికి ఉండే వరకు, తనకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు సమాచారం. నిజానికి ఈమె (మెకెంజీ స్కాట్) అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య. 1993లో ఈమె జెఫ్ బెజోస్ను పెళ్లి చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణంగా అందిన డబ్బు కారణంగానే ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళలలో ఒకరుగా నిలిచారు. 1907లో కాలిఫోర్నియాలో జన్మించిన మెకెంజీ స్కాట్ ఆరు సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది. చిన్నతనంలోనే 'ది బుక్ వార్మ్' అనే 142 పేజీల బుక్ రాసినట్లు, అది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. స్కాట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్) పూర్తి చేసింది. అంతే కాకుండా ఈమె సాహిత్యంలో నోబెల్ గ్రహీత 'టోని మోరిసన్' వద్ద చదువుకుంది. మెకెంజీ స్కాట్ చదువు పూర్తయిన తరువాత న్యూయార్క్ నగరంలోని ఓ కంపెనీలో పనిచేసింది, ఆ సంస్థలోనే జెఫ్ బెజోస్ కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి 1993లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించి ఇద్దరూ దానిని బాగా అభివృద్ధి చేసారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి 2019లో మెకెంజీ స్కాట్, జెఫ్ బెజోస్తో విడాకులు తీసుకున్న తరువాత రూ. 2,53,600 కోట్ల విలువైన స్టాక్స్ అందుకుంది. ప్రస్తుతం ఈమె విద్య, ఆరోగ్యం, సామజిక న్యాయం, పర్యావరణం వంటి వివిధ అంశాలకు మద్దతు పలుకుతూ వేలకోట్ల రూపాయలు విరాళంగా అందిస్తూ ప్రపంచంలో ఎక్కువ విరాళాలు అందించినవారి జాబితాలో ఒకరుగా నిలిచింది. -
రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్..
అమెజాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ 1.2 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు 2.04 బిలియన్ డాలర్లు(సుమారు రూ.17వేలకోట్లు)గా అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించారు. ఈ మేరకు 7, 8 తేదీల్లోనే 1.19 కోట్ల షేర్లను బెజోస్ విక్రయించారు. 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు తెలిసింది. ఇంతటితో బెజోస్ షేర్ల అమ్మకాలు అయిపోయినట్లు కాదని సమాచారం. మొత్తంగా 8.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.70,000 కోట్ల)కు పైగా విలువైన 5 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించాలన్నది బెజోస్ ప్రతిపాదనగా తెలిసింది. 2021లో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత షేర్లను అమ్మడం ఇదే తొలిసారి. 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు గత ఏడాది నవంబర్లోనే వెల్లడించారు. తాజా 1.2 కోట్ల షేర్లను బుధ, గురువారాల్లో విక్రయించినట్లు బెజోస్ వెల్లడించారు. 169.71 - 171.02 డాలర్ల మధ్య వివిధ ధరల వద్ద వీటిని అమ్మినట్లు తెలిపారు. శుక్రవారం అమెజాన్ షేరు 174.45 దగ్గర స్థిరపడింది. గత 12 నెలల్లో దీని విలువ 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి బెజోస్కు కంపెనీలో 12.3 శాతం వాటా ఉంది. ప్రణాళికలో భాగంగా ఐదు కోట్ల స్టాక్స్ను విక్రయించినా.. ఇంకా ఆయన 11.8 శాతం వాటా కలిగి ఉంటారని అంచనా. తన నివాసాన్ని సియాటెల్ నుంచి మియామీకి మారుస్తున్నట్లు గత నవంబర్లో బెజోస్ వెల్లడించారు. షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు 2,50,000 డాలర్లు దాటితే సియాటెల్లో ఏడు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా మియామీకి మారడం వల్ల ఐదు కోట్ల షేర్ల విక్రయంపై ఆయనకు 600 మిలియన్ డాలర్ల పన్ను ఆదా అవుతుందని అంచనా. పర్యావరణ సమస్యలపై పోరాటానికి 2020లో 10 బిలియన్ డాలర్లతో ‘బెజోస్ ఎర్త్ ఫండ్’ను ఆయన ప్రారంభించారు. ఇళ్లులేని కుటుంబాలు, ప్రాథమిక పాఠశాలల కోసం 2018లో రెండు బిలియన్ డాలర్ల ‘బెజోస్ డే వన్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా జెఫ్ బెజోస్ మాజీ భార్య మకెంజీ స్కాట్ సైతం గతేడాది అమెజాన్లో తన 25శాతం షేర్లను (6.53 కోట్ల షేర్లు) విక్రయించారు. అమెజాన్లో ఆమె వాటా 1.9 శాతానికి తగ్గింది. జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ 25 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం 2019లో విడాకులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల నిర్ణయం ఆ సమయంలో మెకెంజీ స్కాట్కి అమెజాన్లో 4శాతం వాటా దక్కగా.. దాని విలువ 36 బిలియన్ డాలర్లు(రూ.2.9లక్షల కోట్లు). దాంతో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో చేరారు. అయితే, 2019 సంవత్సరంలో ఆమె తన సంపదలో సగభాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. -
ఆ ఇంటిని మడత పెట్టి..! ధర ఎంతంటే..
అమెజాన్లో అమ్ముడుపోతున్న ఓ ఇంటి గురించి ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. లాస్ ఏంజెల్స్లో ఎక్కువ అమ్ముడుపోతున్న ఆ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. అది మడతపెట్టేదిగా ఉండడమే. దీని ధర 26 వేల డాలర్లు(మన కరెన్సీలో 21 లక్షల రూపాయలు)గా ఉంది. చిన్న కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూంతో పాటు టాయిలెట్ సౌకర్యం ఉంది ఈ ఇంట్లో. టిక్టాక్ ద్వారా అక్కడ ట్రెండ్లోకి రాగా.. అక్కడి నుంచి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అయితే ఈ ఇంటిపై ఇంటర్నెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. Someone bought a "foldable" house from Amazon 😳!! How would the future of homes be if you could buy them today from Amazon? pic.twitter.com/PAQGrILPIQ — Tom Valentino (@TomValentinoo) February 4, 2024 Y'all better go head and get yourselves a Amazon foldable house ‼️ pic.twitter.com/m4748K9xNy — Mesh🇧🇧 (@rahsh33m) January 30, 2024 -
20వేల ఉత్పత్తులతో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్.. ఎక్కడో తెలుసా..
దిల్లీలో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్ను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. అవసరమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయడంతోపాటు వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తూ వారికి అవగాహన కల్పించడమే ఈ స్టోర్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ స్వచ్ఛత స్టోర్లో వాక్యూమ్ క్లీనర్లు, శానిటరీ వేర్, వాటర్ ప్యూరిఫైయర్లు, మాప్లు, చీపుర్లతో సహా దాదాపు 20,000 క్లీనింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఇదీ చదవండి: ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్.. ఇంకెన్నో ప్రత్యేకతలు అమెజాన్ ఇండియా కన్జూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ.. ‘క్లీన్ ఇండియా’ అనే ప్రభుత్వ విజన్కు మద్దతివ్వడంపట్ల ఆనందంగా ఉందన్నారు. అమెజాన్ ఎప్పుడూ ‘స్మార్ట్ క్లీనింగ్, అందరికీ పారిశుధ్యం అందించడం, పూర్తి పరిశుభ్రత, పర్యావరణ రక్షణ’కు కట్టుబడి ఉందని తెలిపారు. దేశ పారిశుధ్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. -
జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం.. అమ్మకానికి అమెజాన్ షేర్లు!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న 12 నెలల కాలంలో ఏకంగా 50 మిలియన్ల అమెజాన్. కామ్ షేర్లను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న ఆయన ప్రథమ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. మహమ్మారి ప్రారంభంతో అమెజాన్లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఆ సంస్థ షేర్లు సైతం భారీగా లాభపడ్డాయి. దీంతో దాదాపు 8 శాతం లాభపడి షేర్ ధర 172 డాలర్లకి చేరింది. ఈ క్రమంలో జెఫ్బెజోస్ అమెజాన్ షేర్లు అమ్మాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బెజోస్ నిర్ణయం అనంతరం బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ సంపద శుక్రవారం 12.1 బిలియన్ డాలర్లు లాభపడింది. బిలియనీర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ అధిగమించాలంటే బెజోస్కు 8.1 బిలియన్ డాలర్లకు కావాల్సి ఉంది. కాగా, బెజోస్ 2021 నుండి బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నెంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతూ వస్తున్నారు. కానీ అదెప్పుడ సాధ్యపడలేదు. -
ఉద్యోగులపై నిఘా అమెజాన్ కు భారీ జరిమానా
-
అమెజాన్ అడువుల్లో అలనాటి పురాతన నగరాలు!
అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాల పరిధిలో విస్తరించిన మహారణ్యం ఇది. కొద్ది సహస్రాబ్దాల కిందట ఇక్కడ పురాతన నాగరికతలు వర్ధిల్లేవి. ఆనాటి ప్రజలు ఇక్కడ తమ ఆవాసం కోసం కొన్ని నగరాలను నిర్మించుకున్నారు. దట్టమైన అడవిలో ఇన్నాళ్లూ మరుగునపడిన ఆ నగరాలు ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తల చొరవతో వెలుగు చూస్తున్నాయి. ఈ ఫొటోలు ఇటీవల అమెజాన్ అడవిలో బయటపడిన ఒక పురాతన నగరానికి చెందినవి. ఈక్వడార్లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు డ్రోన్ ద్వారా తీసిన ఫొటోల్లో ఈ పురాతన నగరం బయటపడింది. ఆండెస్ పర్వతాలకు దిగువన ఉపానో లోయలో బయటపడిన ఈ నగరంలోని శిథిల అవశేషాలపై శాస్త్రవేత్తలు లేజర్ సెన్సరీ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధనలు జరిపారు. ఈ నగరం పరిధిలో మట్టి, రాళ్లు ఉపయోగించి నిర్మించిన దాదాపు ఆరువేల కట్టడాలను, వ్యవసాయ క్షేత్రాలను, పంట కాలువలను, ఇళ్లు ఉండే వీథుల్లో ముగురునీటి కాలువలను, నగరంలో సంచరించడానికి వీలుగా ముప్పయి మూడు అడుగుల వెడల్పున నిర్మించుకున్న విశాలమైన రహదారులను గుర్తించారు. ఇక్కడి కట్టడాల్లో నివాస గృహాలు మాత్రమే కాకుండా, ఊరంతా ఉమ్మడిగా ఉపయోగించుకునే సమావేశ మందిరాలు, పిరమిడ్లతో కూడిన శ్మశాన వాటికలు వంటి నిర్మాణాలను గుర్తించారు. చాలా కట్టడాలు నేలకు మూడు మీటర్ల లోతున మట్టిలో కప్పెట్టుకుపోవడంతో శాస్త్రవేత్తలు తవ్వకాలను జరిపి, వాటిని పరిశీలించారు. దాదాపు రెండువేల ఏళ్ల కిందట ఈ నగరంలో పదివేల మంది నుంచి ముప్పయి వేల మంది వరకు నివాసం ఉండేవారని, ఇక్కడి ప్రజలు ఏ పరిస్థితుల్లో అంతరించిపోయి ఉంటారో తెలుసుకోవడానికి మరింత లోతుగా పరిశోధనలు సాగించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
దిగ్గజ సంస్థలో చీలిక.. కోఫౌండర్ కొత్త కంపెనీ..!
ఈ-కామర్స్ వ్యాపారంలో ఫ్లిప్కార్ట్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ గతంలోనే ఫ్లిప్కార్ట్లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్కార్ట్ పూర్తిగా వాల్మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కంపెనీను విడిచి బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్నీ ఇప్పటికే చెప్పారు. జనవరి 2024 ప్రారంభంలో ఆయన తన కొత్త కంపెనీ ‘ఆప్డోర్’ OppDoorను ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్ను అందించనుందని తెలిసింది. ‘ఆప్డోర్’ మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్! ఫ్లిప్కార్ట్ మరో కోఫౌండర్ సచిన్ బన్సాల్ నవీ అనే ఫిన్టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల కిందటే ఫ్లిప్కార్ట్ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు. -
ఉద్యోగులపై అతి నిఘా పెట్టిన కంపెనీ.. భారీ ఫైన్తో తిక్కకుదిరింది!
ఉద్యోగులపై అతి నిఘా పెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఫ్రాన్స్ గోప్యతా రక్షణ సంస్థ భారీ జరిమానా విధించింది. తమ వేర్హౌస్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు, కార్యాచరణను పర్యవేక్షించడానికి అత్యంత అనుచిత వ్యవస్థను ఉపయోగించినందుకు అమెజాన్పై 35 మిలియన్ డాలర్ల (రూ.290 కోట్లు) జరిమానా విధించింది. అమెజాన్ ఉపయోగిస్తున్న మానిటరింగ్ సిస్టమ్ ఫ్రాన్స్ లాజిస్టిక్ విభాగంలోని మేనేజర్లను ఉద్యోగులను చాలా దగ్గరగా పర్యవేక్షించడానికి అనుమతించిందని, ఇది యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన గోప్యతా ప్రమాణాలను ఉల్లంఘించిందని ఫ్రెంచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (CNIL) తన వెబ్సైట్లో పేర్కొంది. "స్టౌ మెషిన్ గన్" అని పిలిచే స్కానర్లతో ఉద్యోగులను పర్యవేక్షిస్తోంది. ఉద్యోగులు ఈ స్కానర్ల ద్వారా పార్సిళ్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పార్సిళ్లను చాలా త్వరగా అంటే 1.25 సెకన్ల కంటే తక్కువ సమయం చేస్తే వారి పనితీరులో లోపంగా కంపెనీ గుర్తిస్తోంది. ఈ పర్యవేక్షణ పద్ధతి ఉద్యోగి ఉత్పాదకతను, పని అంతరాయాలను కొలవడానికి ఉపయోగిస్తున్నారని సీఎన్ఐఎల్ ఆరోపిస్తోంది. అటువంటి వ్యవస్థను సెటప్ చేయడం యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాల ప్రకారం చట్టవిరుద్ధమని సీఎన్ఐఎల్ వాదిస్తోంది. అయితే ఈ వాదనలను అమెజాన్ తోసిపుచ్చింది. సీఎన్ఐఎల్ చేసిన ఆరోపణలతో తాము తీవ్రంగా విభేదిస్తున్నామని, అప్పీల్ ఫైల్ చేసే హక్కు తమకు ఉందని తెలిపింది. "వేర్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్లు పరిశ్రమ ప్రమాణాలు, కార్యకలాపాల భద్రత, నాణ్యత సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, సమయానికి, కస్టమర్ అంచనాలకు అనుగుణంగా ప్యాకేజీల నిల్వ, ప్రాసెసింగ్ను ట్రాక్ చేయడానికి అవసరమైనవి" అని అమెజాన్ తన ప్రకటనలో వివరించింది. -
అమ్మకానికి అమెజాన్ పుట్టినిల్లు.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం!
జెఫ్బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1994లో జెఫ్ బెజోస్, ఆయన మాజీ భార్య మెకంజీ స్కాట్లు కలిసి అమెరికాలోని సియోటెల్లో ఒకే అంతస్తులో మూడు పడకగదుల ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దాన్ని కార్యాలయంగా మార్చారు. అక్కడే అమెజాన్ సంస్థ పురుడు పోసుకుంది. ఆన్లైన్లో పుస్తకాలు అమ్మేలా ఓ వేదికగా ప్రారంభమై ఇప్పుడు 1.6 ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలో ఐదవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. కాలిఫోర్నియాలోని సన్నీవేల్లో ఉన్న జాన్ వైన్రైట్ అనే ఆస్ట్రేలియన్ ఐటీ ఉద్యోగికి అమెజాన్ ‘ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ అనాలజీస్: కంప్యూటర్ మోడల్స్ ఆఫ్ ది ఫండమెంటల్ మెకానిజమ్స్ ఆఫ్ థాట్’ అనే మొదటి పుస్తకాన్ని అమ్మింది. అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దాని ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ను 1.6 ట్రిలియన్లని అంచనా ఇలా ఎన్నో మైలురాళ్లను తనఖాతాలో వేసుకున్న జెఫ్బెజోస్ అమెజాన్ పుట్టినిల్లును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 1,540-చదరపు అడుగుల (143-చదరపు మీటర్ల) ఇంటి ప్రస్తుతం ధర 2.3 మిలియన్లగా ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేందుకు జెఫ్బెజోస్ సిద్ధమవ్వగా.. దాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగులో దారులు ఎగబడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
అమెజాన్ కు కేంద్రం నోటీసులు
-
Ayodhya: ఆన్లైన్లో ప్రసాదం.. అమెజాన్కు నోటీసులు
ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ.. ఆధ్యాత్మికం పేరిట ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల హవా కనిపిస్తోంది. తాజాగా అయోధ్య పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)ఫిర్యాదు నేపథ్యంలో.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA)అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. శ్రీ రామ మందిర్ అయోధ్య ప్రసాద్.. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్ పేడ.. ఇతరాల్ని అమెజాన్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ మిఠాయిలనే.. అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్లైన్లో అమ్ముతున్నారని.. మోసపూరిత వాణిజ్య పద్ధతుల్లో అమెజాన్ నిమగ్నమై ఉందని.. తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని అమెజాన్పై ఫిర్యాదులో పేర్కొంది సీఏఐటీ. నోటీసుల నేపథ్యంలో అమెజాన్ సంస్థ వారంలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది సీసీపీఏ. మరోవైపు నోటీసులపై అమెజాన్ స్పందించింది. ఈ విషయంలో సెల్లర్ల జాబితాను పరిశీలించాలి చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకు వెళ్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి.. వారం వ్యవధిలో మరో షాకిచ్చిన అమెజాన్!
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి వారంలోనే ఈ ఏడాదీ లేఆఫ్స్ తప్పవనే స్పష్టమైన సంకేతాలు ఇస్తూ గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొలువుల కోతకు తెగబడ్డాయి. ఈ తరుణంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వారం వ్యవధిలో మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. వారం రోజుల క్రితం అమెజాన్ తన పేరెంట్ కంపెనీలు ట్విచ్, ఆడిబుల్లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వారం తిరిగే లోపే అమెజాన్లో ‘బై విత్ ప్రైమ్’ విభాగంలో పనిచేస్తున్న 5 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా తొలగింపుల కారణంగా 30 మంది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఓ వైపు తొలగింపులు.. మరోవైపు పెట్టుబడులు 2022లో బై విత్ ప్రైమ్ను అమెజాన్ ప్రారంభించింది. అమెజాన్ వ్యాపారులు, రిటైలర్లకు దాని లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా డెలివరీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, బై విత్ ప్రైమ్లో పెట్టుబడులు పెడుతుంటామని చెబుతూనే లేఆఫ్స్పై అమెజాన్ ప్రకటన చేసింది. సిబ్బందిని ఆదుకుంటాం తొలగించిన సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటామని అమెజాన్ తెలిపింది. కాగా, అమెజాన్ ఇప్పటికే తన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ట్విచ్లో సుమారు 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఆడియోబుక్ యూనిట్ ఆడిబుల్ కూడా ఈ ఏడాది మొదటి రెండు వారాల్లోనే వందలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. ఈ తొలగింపులు వ్యయ తగ్గింపు చర్యల్లో భాగమా లేక ఏఐ పునర్నిర్మాణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఉద్యోగుల్ని నిండా ముంచుతున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2024 జనవరి మొదటి మూడు వారాల్లోనే బడా టెక్ కంపెనీలు 7500 ఉద్యోగాలను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్వైఐ తాజా నివేదిక వెల్లడించింది. మరింత మందిని తొలగిస్తూ గూగుల్ ప్రకటన గూగుల్ తన వాయిస్ అసిస్టెంట్, హార్డ్వేర్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించిన వెంటనే సంస్థలో మరో వరుస ఉద్యోగాల కోత ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గురువారం ప్రకటించారు. కాగా, గత ఏడాది గూగుల్ పలు విభాగాల్లో 12,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించింది. ఫలితంగా గూగుల్లో భారీ మొత్తంలో తొలగించడం ఇదే తొలిసారి.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
Advertisement