పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్లో సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్కు చేరిన భారత నంబర్వన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ.. ప్రపంచ నంబర్వన్ చేతిలో పోరాడి ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ 10–12, 10–12, 8–11, 3–11తో సన్ యింగ్షా (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు గేమ్ల్లో మొదట ఆధిక్యం కనబర్చిన శ్రీజ.. చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయింది.
ADVERTISEMENT
ADVERTISEMENT