మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో ఉండడం.. ఆర్థికంగా పరిపుష్టమైన వనరులు ఉండడం.. అన్ని వ్యవస్థల నుంచి సహకారం అందడం వంటి అంశాలు టీడీపీకి కలిసివచ్చాయి. టీడీపీ+జనసేన+బీజేపీల గెలుపునకు గల కారణాలను విశ్లేషిస్తే..
టీడీపీ ఎక్కువగా ప్రచారం చేసిన అంశాలు:
-
లాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల మీ భూములు కొట్టేస్తారని బాబు పదే పదే ప్రకటించడం
-
సూపర్ సిక్స్ పేరుతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏపీలో ప్రకటించడం
-
వైఎస్సార్సిపి ప్రకటించిన ప్రతీ హామీకి అదనంగా కలిపి తామిస్తామని చెప్పడం
-
వలంటీర్ల వ్యవస్థను ముందు తప్పుబట్టిన వాళ్లే.. తర్వాత వాలంటీర్లకు 5వేల వేతనం బదులు పదివేలిస్తామని ప్రకటించడం
-
అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా నిలబెడతామని చెప్పడం
-
మెగా డీఎస్సీతో పాటు ప్రతీ ఏటా జాబ్ కాలెండర్ ఇస్తామనడం
-
2014లో రైతు రుణమాఫీ తరహలో పెన్షన్ను ఏకంగా రూ.4000 చేస్తామనడం
-
50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించడం